-
షాకింగ్ ఘటన: అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి!
కళ్లు లేకుండా శిశువు జన్మించడం అంటే మాములుగా కొద్దిమందిలో జరిగేదేగా అనేకోకండి. ఎందుకుంటే కళ్లే ఏర్పడకుండా పుట్టడం వేరు. కళ్లు లేకపోవడం వేరు. అంటే.. చూపు కనిపించని అంధులకైనా కంటి నిర్మాణం ఉంటుంది. కాకపోతే దృష్టి లోపం ఉంటుంది. అసలు కంటి స్థానంలో కణజాలం లేదా ఆప్టికల్ నరాలే లేకుండా పుడితే వారిని కళ్లే ఏర్పడకుండా జన్మించిన శిశువు అంటాం. ఈ పరిస్థితి అరుదైనా జన్యు సమస్య కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మంది దాక ఉన్నారట. అలాంటి చిన్నారే యూఎస్లోని మిస్సౌరీలో ఓ ప్రవేటు ఆస్పత్రిలో జన్మించాడు. ఆ చిన్నారి పేరు రెన్లీ. ఆ శిశువు పుట్టుకతో అనోఫ్తాల్మియాతో జన్మించాడు. అందువల్ల ఆ చిన్నారికి కంటి కణజాలం లేదా ఆప్టిక్ నరాలు ఉండని ఒక విధమైన జన్యు పరిస్థితి అని చెప్పారు వైద్యులు. ఈ మేరకు సదరు చిన్నారి తల్లి మాట్లాడుతూ..సిజేరియన్ ద్వారా జన్మించిన తన చిన్నారి రోగ నిర్థారణ కోసం తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే వేచి ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యింది. చివరికి వైద్యలు కార్టిసాల్ లేకుండానే జన్మించాడని, అందువల్లే కళ్లు మూసుకుపోయాయని చెప్పారని తెలిపింది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే జన్యు మార్పు కొంతమందికి ఒక కన్ను మాత్రమే ప్రభావితమవుతుందని, కానీ చిన్నారి రెన్లీ విషయంలో అందుకు విరుద్ధంగా రెండు కళ్లు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి అతడి మేథస్సును, శారిరీక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రెన్లీకి భవిష్యత్తులో వచ్చే తన పిల్లలకు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేల్చి చెప్పారు వైద్యులు. ప్రస్తుతం రెన్లీకి కళ్లుని తెప్పించే చికిత్సలు ఏమీ లేనప్పటికీ కంటి సాకెట్ల చుట్టూ ఎముక, మృదు కణజాల పెరుగుదలకు సహాయపడటానికి ప్రొస్టెటిక్ కళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్ది వారాల్లో రెన్లీకి కృత్రిమ కళ్లు అమర్చడానికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు వైద్యులు. అనోఫ్తాల్మియాకు కారణం.. ఇది ఎందువల్ల వస్తుందనడానికి కారణాలు తెలియాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది శిశువుల్లో వారి జన్యువులు లేదా క్రోమోజోమ్లలో మార్పు కారణంగా ఈ పరిస్థితిని కలిగి ఉంటారు. అలాగే గర్భధారణ సమయంలో ఐసోట్రిటినోయిన్ వంటి మందులను తీసుకోవడం వల్ల కూడా అనోఫ్తాల్మియా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో ఎక్స్రేలు లేదా ఇతర రకాల రేడియేషన్లకు గురికావడం లేదా మందులు లేదా పురుగులమందుల రసాయానాలు తదితరాలు పిండంలో ఈ లోపం ఏర్పడటానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు.. ⇒ ప్రీ మెచ్చూర్ కంటి శుక్లం: కంటిపై మేఘావృతమైన ఫిల్మ్ కలిగి మబ్బుగా ఉంటుంది. దృష్టి బలహీనమై రంగులను గుర్తించడానికి కష్టమవుతుంది. ⇒ కోలోబోమా కణాజాలం కనిపించకుండా పోతుంది. ఎక్కువగా కనుపాపలో జరుగుతుంది. ⇒ వేరు చేసిన రెటీనా ఇది పూర్తి అంధత్వానికి దారితీసే పరిస్థితి ⇒ ప్టోసిస్ ప్టోసిస్ లేదా సైడోప్టోసిస్, అనేది కండరాలు, నరాలు ఉన్నప్పటికీ పడిపోతున్న కనురెప్పను సూచిస్తుంది. (చదవండి: మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!) -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
Funday: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?
సాగర్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవాడు. సేల్స్ టార్గెట్స్ అందుకోవడంలో ముందుండేవాడు. పెళ్లయ్యాక కూడా ఆ ఉల్లాసం, ఉత్సాహం కొనసాగింది. తర్వాతే మెల్లమెల్లగా దూరమవసాగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లే కారణమనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా తన మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రమోషన్ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, కార్ కొనుక్కున్నా, ఆఖరుకు బిడ్డ పుట్టినా సాగర్లో ఎలాంటి ఆనందం లేదా సంతృప్తి లేదు. క్రమంగా తన పనితీరు కూడా దెబ్బతినసాగింది. టార్గెట్స్ అందుకోలేక పోతున్నాడు. అలా నిరాశ, నిస్పృహలతో మూడేళ్లు తనలో తానే మథనపడ్డాడు. దానివల్ల భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండలేకపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న సాగర్ ఒంటరిగా మారిపోయాడు. దాంతో మరింత నలిగిపోయాడు. ఎప్పుడూ నిస్సత్తువగా అనిపించసాగింది. చిన్నపనికే అలసిపోతున్నాడు. మానసిక గందరగోళానికి లోనవుతున్నాడు. అతని మనసొక యుద్ధభూమిగా మారింది. నిరంతరం నెగటివ్ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు. వీటన్నింటివల్ల తనపై తనకు నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ లక్షణాలను బట్టి సాగర్ పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ)తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఏళ్ల తరబడి దిగులే దీని ప్రధాన లక్షణం. అనేక కారణాలు... మేజర్ డిప్రెసివ్ డిజార్డర్కు పీడీడీకి ఉన్న ప్రధానమైన తేడా.. కాలం. కనీసం రెండేళ్లపాటు డిప్రెషన్ ఉంటే దాన్ని పీడీడీగా పరిగణిస్తారు. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లానే వివిధ కారణాలుంటాయి. ♦ పీడీడీ ఉన్నవారి మెదడు నిర్మాణంలో, న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్ను నియంత్రించే సెరటోనిన్ తగ్గుదల దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ♦ కుటుంబ హిస్టరీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. డిప్రెషన్కు కారణమయ్యే జన్యువులను కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ♦ ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు లేదా అధికస్థాయి ఒత్తిడి వంటి బాధాకరమైన సంఘటనలు కొంతమందిలో పీడీడీని ప్రేరేపిస్తాయి. ♦ నిత్యం తనను తాను విమర్శించుకోవడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, ఎప్పుడూ చెడు జరుగుతుందని ఆలోచించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. నివారణ లేదు, నియంత్రణే మార్గం... పీడీడీని నివారించడానికి కచ్చితంగా మార్గం లేదు. ఇది తరచుగా బాల్యంలో లేదా యుక్తవయస్సులో మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించడం వారికి ముందస్తు చికిత్సను అందించడంలో సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడే వ్యూహాలు... ♦ ఒత్తిడిని నియంత్రించడానికి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి చర్యలు మొదలుపెట్టాలి ♦ సంక్షోభ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తీసుకోవాలి ♦ వాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి ♦ దిగులుగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు ♦ తమను తాము ఉత్సాహపరచుకునేందుకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్, జీవిత చరిత్రలు చదవాలి ♦ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ♦ మంచి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు శరీరాన్ని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేయాలి ♦ సమస్య ముదిరేవరకు ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే సైకాలజిస్ట్ను కలసి చికిత్స పొందాలి ♦ సైకోథెరపీ ద్వారా మీ ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి. నిరాశ, నిస్సహాయత... పీడీడీ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ లక్షణాలు పోవడానికీ సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాల తీవ్రత కాలక్రమేణా మారవచ్చు. ఆ లక్షణాలేంటంటే... ♦ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, విచారం, శూన్యత ♦ రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం. ♦ అలసట, శక్తి లేకపోవడం. ♦ తనను తాను గౌరవించుకోకపోవడం, తనను తాను విమర్శించుకోవడం ♦ ఫోకస్ చేయడంలో సమస్య, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది. ♦ పనులు సక్రమంగా లేదా సమయానికి పూర్తి చేయడంలో సమస్యలు. ♦ చిరాకు, అసహనం లేదా కోపం. ♦ సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం. ♦ గతం గురించి చింత, అపరాధ భావాలు ♦ ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం. ♦ నిద్ర సమస్యలు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?
జానకి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలసి పబ్కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది. అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. అలవాటు కాదు.. జబ్బు జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. తిడితే సరిపోదు.. చికిత్స అవసరం.. మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వివిధ దశల్లో చికిత్స మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. మద్యపాన వ్యసనం లక్షణాలు మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం · తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం కారణాలు.. మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్గ్రౌండ్ ఎయిర్పోర్టు..కానీ ఇప్పుడది..) -
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
భయాందోళనకు గురిచేసే జబ్బు.. మరి పరిష్కారం?
శివానీ మధ్య తరగతి మహిళ. గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ బస్సు లేదా మెట్రోలో వెళ్లాలంటే భయం ఏర్పడటంతో ఏడాది కిందట ఉద్యోగానికి రాజీనామా చేసింది. భర్త శివాజీ కూడా ఆమె సమస్యను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచాడు. అయితే ఆమె ఆందోళన రోజురోజుకూ పెరిగిపోసాగింది. తోడు లేకుండా కనీసం పక్క వీథిలోని కొట్టుకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అగ్రోఫోబియా లక్షణాలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేభయం జనం మధ్య ఉండాలన్నా లేదా క్యూలో వేచి ఉండాలన్నా భయం సినిమా థియేటర్లు, ఎలివేటర్లు, చిన్న దుకాణాలు వంటి మూసి ఉన్న ప్రదేశాలంటే భయం పార్కింగ్ స్థలాలు, వంతెనలు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలంటే భయం బస్సు, విమానం, రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలన్నా భయం బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడు రావాలని కోరుకోవడం భయాందోళనల నుంచి తప్పించుకునేందుకు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ లక్షణాలతో బాధపడటం. అనేక కారణాలు అగ్రోఫోబియాకు కారణమేమిటో కచ్చితంగా తెలియదు. అనువంశికంగా వస్తుందని వైద్యులు భావిస్తారు. జెనెటిక్స్, హెల్త్ కండిషన్, పర్సనాలిటీ, స్ట్రెస్, అనుభవాలు.. అన్నీ ఈ రుగ్మత అభివృద్ధిలో పాత్ర పోషిస్తాయి. సాధారణ జనాభాలో ఒక శాతం కంటే తక్కువమందిలో ఇది కనిపిస్తుంది. పురుషులకంటే స్త్రీలలో రెండు నుంచి∙ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. యువతలో ఇది సర్వసాధారణం. పానిక్ డిజార్డర్, ఇతర ఫోబియాలు ఉన్నవారిలో, అగ్రోఫోబియాతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, బాధాకరమైన అనుభవాలు ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స తీసుకోకుండా తాత్సారం చేస్తే.. డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలకు, ఆత్మహత్య ప్రయత్నాలకు దారితీస్తుంది. ఒకరోజు ధైర్యం చేసి బయటకు వెళ్లి.. అక్కడే కుప్పకూలింది. పక్కింటివారు చూసి ఇంటికి తీసుకువచ్చారు. ఏమైందని భర్త ప్రశ్నిస్తే.. ఒళ్లంతా వణుకు వచ్చిందని, శ్వాస ఆడలేదని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పింది. ఒక్కోసారి గుండె పట్టేసినట్టుగా ఉంటోందనీ చెప్పింది. శివాజీ వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించాడు. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉందని వైద్యుడు చెప్పాడు. శివానీ మానసికంగా భయపడుతోందని, వెంటనే సైకాలజిస్ట్ను సంప్రదించమని సూచించడంతో మా సెంటర్కి వచ్చారు. ఇంటికే పరిమితం చేసే జబ్బు శివానీతో అరగంట మాట్లాడాక ఆమె యాంగ్జయిటీ డిజార్డర్తో సతమతమవుతోందని అర్థమైంది. దాన్ని నిర్ధారించుకునేందుకు కొన్ని టెస్టులు ఇచ్చాను. వాటి ద్వారా ఆమె అగ్రోఫోబియాతో బాధపడుతోందని తేలింది. ఇది ఒక రకమైన ఆందోళన రుగ్మత. కొన్ని ప్రదేశాలకు వెళ్తే మైకం, మూర్ఛ, పడిపోవడం లేదా అతిసార వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతుంటారు. ఆయా ప్రదేశాలకు వెళ్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు చెమట పట్టడం, వణుకు, శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి రావచ్చు. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు అడుగు బయట పెట్టకుండా ఇంటికే పరిమితమవుతారు. సాధన, సహాయమే మార్గం.. అగ్రోఫోబియాను నివారించడానికి కచ్చితమైన మార్గం లేదు. భయపడే పరిస్థితులను తప్పించుకునే కొద్దీ ఆందోళన పెరుగుతుంది. జీవితం కష్టంగా మారుతుంది. దాన్నుంచి బయటపడాలంటే ముందుగా మీ ప్రయత్నాలు మీరు చేయాలి. వాటివల్ల ఫలితం కనిపించకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను కలవాలి. మీరు భయపడే ప్రదేశాలకు మళ్లీ మళ్లీ వెళ్లడం సాధన చేయాలి. దానివల్ల ఆయా ప్రదేశాల్లో మీకు సౌకర్యం పెరుగుతుంది. ఇలా స్వంతంగా చేయడం కష్టమైతే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలి· యోగా, ప్రాణాయామం, జాకబ్ సన్, మసాజ్, విజువలైజేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేయాలి· మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అలాగే కాఫీని కూడా మితంగానే సేవించడం మంచిది · తగినంత నిద్ర పోవాలి. ప్రతిరోజూ శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. కూరగాయలు, పండ్లతో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి· యాంగ్జయిటీ డిజార్డర్స్ ఉన్న వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన సపోర్ట్ గ్రూప్స్లో చేరడం వలన.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికీ ఆ గ్రూప్స్ సహాయపడతాయి· అప్పటికీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్ను కలవాలి. కన్సల్టెంట్.. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు· క్రమం తప్పకుండా థెరపీ సెషన్ ్సకు హాజరవ్వాలి. థెరపిస్ట్తో మాట్లాడాలి. చికిత్సలో నేర్చుకున్న టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయాలి· ఆందోళన తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: French Bubble Palace Facts: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ.. ) -
అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా?
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. (చదవడం: ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు. ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్షిప్ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది ∙ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
అత్యంత అరుదైన వ్యాధి..మెడిసిన్ ఖర్చే ఏకంగా రూ. 17 కోట్లు!
అత్యంత అరుదైన వ్యాధులు చాలానే ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్నింటికి చికిత్స లేకపోగ, మరికొన్నిటికి చికిత్సకు అయ్యే ఖర్చు చూస్తే అసలు సామాన్యుడు కాదు కదా ధనవంతుడైన ఖర్చుపెట్టలేనంతగా ఖరీదుగా ఉంటుంది. ఇక మరొకొన్నిటికి అసలు చికిత్స అనేది ఉండదు. అలాంటి అత్యంత ఖరీదైన వైద్యంతో కూడిన అరుదైన వ్యాధి బారిన పడ్డాడు ఓ చిన్నారి. అతడికోసం ముఖ్యమంత్రి కదిలివచ్చి పరామర్శించడమే గాక అత్యంత ఖరీదైన మెడిసిన్ను అందజేశారు. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఏడాదిన్నర చిన్నారి. అతడి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ చిన్నారిని పరామర్శించి చికిత్సలేని ఆ వ్యాధికి ఇచ్చే అత్యంత ఖరీదైన మందును ఆయనే స్వయంగా అందజేశారు. ఆ డ్రగ్ ఖరీదు ఏకంగా రూ. 17.5 కోట్లు. అని చెప్పారు. ఇంతకీ అసలు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుందంటే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే వెన్నెముక కండరాల క్షీణత(ఎస్ఎంఏ). దీని వల్ల వెన్నుపాములోని మోటారు న్యూరాన్లను కోల్పోతుంది. దీంతో కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీన్ని జన్యు నాడీ కండరాల రుగ్మత అని కూడా పిలుస్తారు. ఈ మేరకు ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీకి చెందిన అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ నంద్వానీ మాట్లాడుతూ..భారతదేశంలో ఎస్ఎంఏ అనేది చాలా అరుదు. ఇది వస్తే మాత్రం గణనీయమైన ప్రభావం ఉంటుంది. ప్రతి ఏడు వేల మంది జననాలలో మూడు వేలమంది శిశువులు దీని భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా పక్షవాతం వచ్చి క్రమంగా ఆరోగ్యం క్షీణిచడం తోపాటు మిగతా అవయవాలపై దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు. చికిత్స: దీనికి పూర్తి నివారణ లేదు. వెన్నుముక కండరాల క్షీణత కారణమైన జన్యవులను ప్రభావితం చేసేలా చికిత్స అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడం వంటివి మాత్రమే చేయగలం అని తెలిపారు. దీని కోసం జోల్జెన్స్మా అనే జన్యు పునఃస్థాపన చికిత్స తోపాటు న్యూసినెర్సెన్ (స్పిన్రాజా), రిస్డిప్లామ్ (ఎవిర్స్డ్) అనే రెండు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాధిత కుటుంబాల జన్యు క్రమాన్ని అధ్యయనం చేసి తత్ఫలితంగా చికిత్స అందించేలా వైద్య విధానాలు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. (చదవండి: మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!) -
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డివైస్ ఉంటే చాలు
ఈ హైటెక్ హెడ్బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు. ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940). -
అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్!
దియా హైదరాబాద్లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్. 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ముగ్ధలా కనిపించాలని తాపత్రయపడుతుంటుంది. ప్రతిరోజూ ఉదయమే బరువు చెక్ చేసుకుంటుంది. తన వయసుకు, ఎత్తుకు తగ్గ బరువే ఉన్నా ఆమెకు సంతృప్తిగా ఉండదు. తానింకా బరువు తగ్గాలని విపరీతంగా డైటింగ్ చేస్తుంది. ఎక్సర్సైజుల సంగతి సరేసరి. వీటన్నింటివల్ల ఆమె ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. రెండు నెలల కిందట రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయిస్తే గుండె క్రమరాహిత్యంగా కొట్టుకుంటోందని (అరిథ్మియా), రక్తపోటు కూడా తక్కువగా (హైపోటెన్షన్) ఉందని తేలింది. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి వర్పు రాలేదు. చివరకు మొన్న కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా డైటింగ్ గొడవే. దాంతో అది ఆరోగ్య సమస్య కాదని, మానసిక సమస్యని గుర్తింన డాక్టర్ సైకో డయాగ్నసిస్కి పంపించారు. దియా అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతోంది. ఇది తిండికి సంబంధింన ఒక మానసిక సమస్య. బరువు పెరుగుతామనే భయం దీని ప్రధాన లక్షణం. దాంతో విపరీతంగా డైటింగ్ చేస్తుంటారు. దానివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రావడంతోపాటు, మరణానికి కూడా దారి తీస్తుంది. సాధారణంగా టీనేజ్, తదుపరి వయసు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లలు, పురుషులు, వృద్ధుల్లో కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఒకటి నుంచి రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. రూపాన్ని బట్టి చెప్పలేం.. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అనోరెక్సియా ఉందో లేదో చెప్పలేం. మామూలు బరువు ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ రుగ్మత ఉండవచ్చు. అలాగే ఈ రుగ్మత లేకున్నా తక్కువ బరువుతో ఉండవచ్చు. కాబట్టి అనోరెక్సియాను గుర్తించడానికి శారీరక, వనసిక, భావోద్వేగ, ప్రవర్తనా సంకేతాలను గుర్తించాల్సి ఉంటుంది. భావోద్వేగ, మానసిక సంకేతాలు: బరువు పెరుగుతుందనే తీవ్రమైన భయం, తక్కువ బరువు ఉన్నప్పటికీ కొవ్వు ఉన్న ఫీలింగ్, విపరీతమైన డైటింగ్, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు. ప్రవర్తనా సంకేతాలు: ఆహారపు అలవాట్లు లేదా దినచర్యలలో మార్పులు, కొన్ని ఆహారాలను మానేయడం, ఆకలిని అణచివేసే మందులను ఉపయోగించడం, మితిమీరిన వ్యాయామం. శారీరక సంకేతాలు: కొన్ని వారాలు లేదా నెలల్లో గణనీయమైన బరువు తగ్గడం, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) లో వివరించలేని మార్పు, తరుచుగా అలసిపోయినట్లు అనిపించడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం (బ్రాడీకార్డియా), ఋతు క్రమం సక్రమంగా లేకపోవడం, ఆబ్సెంట్ పీరియడ్స్ (అమెనోరియా) ‘జీరో సైజ్’ కూడా కారణమే.. అనోరెక్సియాకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని జన్యుపరమైన అంశాలు, వనసిక లక్షణాలు, పర్యావరణ కారకాలు, ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక కారకాల కలయిక దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈటింగ్ డిజార్డర్స్ దాదాపు 50% నుంచి 80% జన్యుపరమైనవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ డిజార్డర్తో బాధపడే తోబుట్టువులు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ రుగ్మత అభివృద్ధి చెందడానికి 10 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. మెదడు రివార్డ్ సిస్టమ్, సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు. శారీరక వేధింపులు లేదా లైంగిక వేధింపులు కూడా ఈటింగ్ డిజార్డర్ రావడానికి కారణమవుతాయి. జీరోసైజ్ ఉన్నవారే అందమైనవారనే అవాస్తవ శరీర ప్రమాణాలు. తోటివారి టీజింగ్, అపహాస్యం, బెదిరింపులు.. · మానవ సంబంధాలు సరిగా లేకపోవడం, ఆత్మగౌరవం తగ్గడం! దీర్ఘకాల చికిత్స అవసరం.. మీరు అనోరెక్సియాతో బాధపడుతుంటే ముందుగా మీ కుటుంబ సభ్యులకు తెలపండి. దాని గురించి అవగాహన పెంచుకోండి. తగినంత నిద్ర పొందండి. మద్యం లేదా డ్రగ్స్కి దరంగా ఉండండి. దీనికి చికిత్స సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఓపిగ్గా ఉండాలి. · అయితే ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా తమకు సమస్య ఉందని గుర్తించరు, అంగీకరించరు. పరిస్థితి తీవ్రమై ప్రాణాంతకమైనప్పుడు మాత్రమే వారు కిత్సను కోరుకుంటారు. అందువల్ల కుటుంబ సభ్యులే దీన్ని ప్రారంభదశలోనే గుర్తిం చికిత్స చేయించడం చాలా ముఖ్యం. అనోరెక్సియా చికిత్సలో న్యూట్రిషన్ కౌన్సెలింగ్, సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, మందులు ఉంటాయి. అవసరమైతే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తులు ఇతర మానసిక సమస్యలను కూడా కలిగి ఉంటారు. వాటిని కూడా గుర్తిం సైకోథెరపీ అందించాల్సి ఉంటుంది. · ఆహారం, బరువు పట్ల ఆరోగ్యకరమైన వైఖరిని పెంపొందించడానికి అందించే మానసిక చికిత్సలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (cognitive behavior therapy), డైలెక్టిక్ బిహేవియర్ థెరపీ (pydialectic behavior therapy) , ఇంటర్పర్సనల్ సైకో థెరపీ ( interpersonal psychotherapy ), సైకోడైనమిక్ సైకోథెరపీ (psychodynamic psychotherapy), ఫ్యామిలీ బేస్డ్ థెరపీ (family based therapy) ముఖ్యమైనవి. -సైకాలజిస్ట్ విశేష్ -
ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన.. ఎందుకలా చేస్తున్నారు?
ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బతికి బట్టకట్టినవారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతున్నారు. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులకు నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రైలు ప్రమాదంలో గాయాలపాలైనవారిలో కొందరు తీవ్రమైన ఆందోళనలో ఉండగా, మరికొందరు ఏడుస్తున్నారు. ఇంకొందరు మౌనంగా కనిపిస్తున్నారు. తమకు భయానక కలలు వస్తున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగానే కోలుకుంటున్నారు. అయితే కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 105 మంది బాధితులలో సుమారు 40 మందిలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్డీ) లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరందికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బాధితులలోని భయాన్ని పోగొట్టేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. వైద్యులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. చదవండి: ఆ స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు.. ఎందుకంటే? బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం క్లినికల్ సైకాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జషొబంత్ మహాపాత్ర మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారి మానసిక పరిస్థితులను గమనించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇటువంటి ఘోర ప్రమాదాన్ని చూసినప్పుడు బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అటువంటప్పుడు భాధితులు తరచూ ఆందోళనకు గురికావడం, ఉన్నట్లుండి ఉలిక్కిపడటం, రోదించడం మొదలైనవి చేస్తుంటారన్నారు. మరికొందరు ఎవరితోనూ మాట్లాడక మౌనంగా ఉంటారన్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారికి తాము కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం నాలుగు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ బృందాలలో మానసిక నిపుణులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారన్నారు. నిద్రకు దూరమై.. ఈ సందర్భంగా ఆసుపత్రికి చెందిన ఒక నర్సు మాట్లాడుతూ బాధితులలో చాలామంది సరిగా నిద్రపోవడం లేదన్నారు. వారికి ఇంకా ప్రమాదంనాటి భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు. కాగా ఈ ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడొకరు చేతులు,కాళ్లు కోల్పోయాడు. అతను నిద్రపోవడంలేదు. వైద్యులు కళ్లుమూసుకుని పడుకోమని చెప్పినప్పుడు, కళ్లు మూసుకుంటే నాటి భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయని సమాధానిమిస్తున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఒక యువకుడు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయాడు. దీంతో ఇతను తరచూ తన స్నేహితుని పేరును గట్టిగా పలుకుతున్నాడు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఒక వైద్యుడు మాట్లాడుతూ బాధితులు తమ స్థితిని చూసుకుని ఏడుస్తున్నారని, మరికొందరు విచిత్రంగా నవ్వుతున్నారని తెలిపారు. బాధితులలోని ఇటువంటి లక్షణాలను గమనించి వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. చదవండి: మృతదేహాలను ఉంచిన స్కూల్ కూల్చివేత! -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
PTSD: సొంత తాతే తన పట్ల, తన చెల్లి పట్ల నీచంగా.. అందుకే ఆమె ఇలా..
రియాకు 15 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తనను తాను గాయపరచు కుంటోంది. ఎందుకలా చేస్తుందో పేరెంట్స్ అడిగినా, ఫ్రెండ్స్తో అడిగించినా ఏమీ చెప్పలేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్ సలహాపై పేరెంట్స్ ఆ అమ్మాయిని కౌన్సెలింగ్కి తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా కారణమేంటో చెప్పలేదు. రెండు మూడు సెషన్లతో ఆమె నమ్మకం సంపాదించుకున్న తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టింది. తన 8 నుంచి 12 ఏళ్ల వరకు సొంత తాతే తనను లైంగికంగా వేధించాడని బోరుమని ఏడ్చింది. ఆ విషయం ఎవరికైనాచెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఎవ్వరికీ చెప్పలేదంది. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని తన చెల్లీ చెప్పిందని, ఆయన ఏడాది కిందట చనిపోయాడని తెలిపింది. తాత తనతో, చెల్లితో ప్రవర్తించిన విధానం అమ్మానాన్నలకు చెప్తే నమ్మకపోగా... ఇద్దరినీ కలిపి తిట్టారనీ చెప్పింది. తాను ముందే చెప్పి ఉంటే చెల్లెలైనా సేఫ్గా ఉండేదని, చెల్లెలికి అలా జరగడానికి తానే కారణమని బాధపడింది. చెల్లెల్ని చూసినప్పుడల్లా తాత గురించి పేరెంట్స్కు చెప్పకుండా తప్పుచేశాననే గిల్టీ ఫీలింగ్ చంపేస్తోందని, తాను చేసిన తప్పుకు శిక్షగా చెయ్యి కోసుకుంటున్నానని తెలిపింది. తానలా శిక్ష అనుభవించినప్పుడే మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటోందని తెలిపింది. ∙∙∙ కుటుంబ సభ్యుల మరణం, రక్తసిక్తమైన చావుని కళ్లారా చూడటం, చంపేస్తామనే బెదిరింపులు, యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, తీవ్రమైన గాయం, లైంగిక హింసకు గురికావడం లాంటి అత్యంత బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారిని అవి జీవితాంతం వెంటాడుతుంటాయి. ఆ సంఘటన జరిగింది ఒకసారే అయినా దాన్ని మర్చిపోలేకపోతుంటారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్కు గురైన రియాకు ఆ జ్ఞాపకాలు పదేపదే గుర్తొచ్చి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీన్నే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అంటారు. పీటీఎస్డీ లక్షణాలు.. ►బాధాకరమైన సంఘటనలు పదేపదే గుర్తొస్తుంటాయి ∙దానికి సంబంధించిన పీడకలలు రోజూ భయపెడుతుంటాయి. ►ఆ సంఘటనకు సంబంధించిన ఆలోచనలు, ప్రాంతాలు తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తాయి ∙వాటిని నివారించేందుకు రోజూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ►కొందరిలో బాధాకరమైన సంఘటనలకు సంబంధించి మతిమరపు ఏర్పడుతుంది∙ ►ప్రపంచం, వ్యక్తులు ప్రమాదకరమైనవనే నమ్మకాలు ఏర్పడతాయి. ►ఒంటరిననే భావన కమ్మేస్తుంది. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గుతుంది నిరంతరం భయం, కోపం, అపరాధ భావన, అవమానాలతో కుమిలిపోతుంటారు∙ ►స్నేహం, ప్రేమ, దయ, కరుణలాంటి సానుకూల భావోద్వేగాలను అనుభవించలేకపోతారు చిరాకు, విధ్వంసకర ప్రవర్తన, నిద్రలేమి, ఏకాగ్రత లేమి, హైపర్ విజిలెన్స్ ఉంటాయి. ►రియాలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చెల్లెలిపై వేధింపులకు తాను చెప్పకపోవడమే కారణమనే అపరాధ భావన, తాను చెప్పినా పేరెంట్స్ నమ్మలేదనే బాధ ఆమె మనసును నిత్యం దహించివేస్తున్నాయి. ►లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో పీటీఎస్డీ ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, డిఫెన్స్ సిస్టమ్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమను తాము హింసించుకునేలా ప్రేరేపిస్తుంది. రియా చేసిందదే. తనకు తానే శిక్ష వేసుకుంటోంది. ఏం చెయ్యాలి? ►ప్రతి ఏడుగురిలో ఒకరు రియాలా బాల్యంలోనే లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లైంగిక వేధింపులకు గురైన వారిలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అది జీవితాంతం వేధించే పీటీఎస్డీగా మారుతుంది. దీన్ని డీల్ చేయడంలో ముందుగా పేరెంట్స్కి కౌన్సెలింగ్ అవసరం. ఆ తర్వాత క్వాలిఫైడ్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ల ద్వారా థెరపీ, చికిత్స అవసరం ఉంటుంది. ►లైంగిక హింసకు పాల్పడేవారిలో ఎక్కువమంది సన్నిహిత బంధువులో, తెలిసినవారో అయ్యుంటారు ∙తల్లిదండ్రులు నిత్యం జాగరూకతతో ఉండాలి. బాల్యంలోనే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి ∙తమపట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా పేరెంట్స్కి చెప్పవచ్చనే భరోసా కల్పించాలి ►పీటీఎస్డీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్ బాల్స్ ఉపయోగించవచ్చు ∙అనుచిత ఆలోచనలను తప్పించుకోవడానికి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది ►మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మైండ్ఫుల్ నెస్ ప్రాక్టీస్ సహాయపడుతుంది ∙ప్రతికూల ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు వచ్చినప్పుడు స్టాప్ అనే పదాన్ని మనసులో చూడండి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, ఐ మూవ్ మెంట్ డిసెన్సిటైజేషన్ అండ్ రిప్రాసెసింగ్((EMDR)), ట్రామా–ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (TF&CBT) లాంటి థెరపీ పద్ధతులు సహాయపడతాయి∙ న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీలోని VK Dissociation టెక్నిక్ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు సహాయపడుతుంది. ►సాధారణంగా 12 నుంచి 16 సెషన్లు కౌన్సెలింగ్కి హాజరవ్వాల్సి ఉంటుంది. ►యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగించేందుకు సైకియాట్రిస్ట్ని సంప్రదించి యాంటీ డిప్రసెంట్ పిల్స్ వాడవచ్చు. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా? -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
విచిత్రమైన అలవాటు! తన జుట్టును తానే తింటున్న బాలిక!
చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్ బాల్(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్ సిండ్రోమ్గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు. (చదవండి: డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...) -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
వింత వ్యాధి కలకలం.. పసుపు పచ్చగా మారిన బాలుడి నాలుక
ఈ భూమి ఓ వింత ప్రపంచం. అలాగే ఇక్కడ పుట్టే వింత జబ్బులు మనుషులను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. వందేళ్లకు ఓ సారి పుట్టుకొచ్చే జబ్బుల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాలకు గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోతే.. ఇప్పుడు కరోనా ప్రపంచ దేశాలకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ వస్తుందో.. ఏ కొత్త రకం వ్యాధి పుట్టుకొస్తుందో.. తెలియక ప్రపంచ జనులు హడలి చస్తున్నారు. ఒట్టావా: కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలిపారు. ఇది అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వెల్లడించారు. కాగా యూఎస్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది. -
Covid: ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తున్నారా? అయితే ఓసీడే
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా... ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియాగా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళనతో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపనిగా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. సెకండ్వేవ్లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1: డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొటుకున్నారు. యూఎస్లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2: మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ∙ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ∙ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) ∙విపరీతంగా చెమటలు పట్టడం ∙ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట ∙శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం ∙నోరు తడారిపోవడం ∙ఒళ్లు జలదరించడం ∙అయోమయం ∙కడుపులో గాభరా కడుపులో మంట ∙ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం ∙చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం ∙నిత్యం అలజడిగా ఉండటం ∙తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం... పై లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? ► మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్గా (అంటే మొబైల్ లేదా ఫేస్టైమ్తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. ► మీ దగ్గరివారు కూడా కోవిడ్ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. ► మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ► మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. ► మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. ► గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ► ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. ► ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: ► రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ► టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ► మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. ► ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. ► బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ► ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్తో లేదా సైకియాట్రిస్ట్తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. - డాక్టర్ చరణ్ తేజ కోగంటి కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ -
బాబుది ఏడీహెచ్డీ కావచ్చు..?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఏడేళ్లు. ఇతర పిల్లలో కలవడం చాలా తక్కువ. మేం ఏమి చెప్పినా వినిపించుకోడు. మాటలు కూడా కొంత ఆలస్యంగానే వచ్చాయి. కొన్నిసార్లు బాగానే ఆడుకుంటాడు గానీ ఒక్కోసారి దేనిమీదా దృష్టికేంద్రీకరించి కుదురుగా ఉండడు. పదే పదే కనురెప్పలు కొడుతుంటాడు. చూసినవాళ్లు... ‘ఇది చిన్నవయసు కదా. ఎదిగేకొద్దీ సర్దుకుంటాడు’ అని అంటున్నారు. అతడి సమస్య ఏమిటి? సరైన సలహా ఇవ్వగలరు. – ఆర్. మహేశ్వరి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి సమస్య ఇదే అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ మీ లేఖలోని అంశాలను విశ్లేషిస్తే ఇది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏ విషయంపైనా చాలాసేపు దృష్టి కేంద్రీకరించలేకపోవడం అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్తో పాటు హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివ్ బిహేవియర్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అటెన్షన్ డెఫిసిట్తో పాటుగా కొన్నిసార్లు కొద్దిమందిలో హైపర్ యాక్టివ్ లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ)’ అంటారు. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న పిల్లల్లో అకడమిక్గా వెనకబడటం, స్నేహితులతో పెద్దగా కలివిడిగా ఉండలేకపోవడం, నిర్లక్ష్యంగా తప్పులు చేస్తూ ఉండటం, ఒక అంశంపైనా లేదా ఒక ఆటపైనా చాలాసేపు ఏకాగ్రత చూపలేకపోవడం, చెప్పినమాట వినకపోవడం, స్కూల్లో ఇచ్చిన హోమ్వర్క్ వంటి టాస్క్లు గడువులోపల పూర్తి చేయకపోవడం, నిర్వహణశక్తిలోపం, పదే పదే వస్తువులను పోగొట్టుకోవడం, ఏదైనా అంశం నుంచి త్వరగా దారిమళ్లడం, ఎప్పుడూ విషయాలను మరచిపోవడం వంటివన్నీ నిత్యం చేస్తుండటం అన్నవి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ లక్షణాలు. అలాగే హైపర్ యాక్టివిటీకి సంబంధించి... బాగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఒకేచోట కుదురుగా కొంతసేపు కూడా కూర్చులేకపోవడం, ఎప్పుడూ గెంతుతూ, ఏదో ఎక్కుతూ ఉండటం, నెమ్మదిగా ఆడుకోలేకపోవడం, ప్రశ్నపూర్తిగా అడగకముందే జవాబిచ్చేలా స్పందించడం వంటివి అన్నీ హైపర్ యాక్టివ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ ‘ఏడీహెచ్డీ’ సమస్య ఉన్నవారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యాంగై్జటీ, డిప్రెషన్, కనురెప్పలు అదేపనిగా కొట్టుకోవడం (టిక్ డిజార్డర్), మలమూత్రాల మీద నియంత్రణ లేకపోవడం, నిద్రసంబంధ సమస్యలు వంటివి ఉండవచ్చు. ఇలాంటి పిల్లల్లో సమస్యను సరిగ్గా నిర్ధారణ చేయడం వల్లనే చికిత్స సరిగా జరిగినట్లవుతుంది. ఈ పిల్లలకు పూర్తిస్థాయి చికిత్స రెండు రకాలుగా జరగాలి. ఒకటి... ప్రవర్తనాపరమైన చికిత్స (బిహేవియరల్ థెరపీ), రెండోది మందులతో చేసే చికిత్స. సమాజం ఆమోదించేలాంటి ప్రవర్తనను తీసుకురావడమే థెరపీ లక్ష్యం. బిహేవియరల్ థెరపీలో చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, అంశాలదే కీలక భూమిక. సమస్యపై కుటుంబానికి అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యుల చేయూత, క్రమబద్ధమైన జీవితం, నిర్ణీత వేళకు నిద్రలేవడం, పడుకోవడం, వేళకు తినడం వంటి మార్పులతో పాటు స్కూల్లోనూ కొద్దిపాటి మార్పులు, పిల్లలపై టైమ్, పరీక్షల ఒత్తిడి లేకుండా చూడటం వంటి వాటితో సత్ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటు స్టిమ్యులెంట్ మెడిసిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బిహేవియర్ థెరపీపై అవగాహన కోసం ఇలాంటి పిల్లల పేరెంట్స్ అందరూ గ్రూప్గా ఏర్పడి నిర్వహించుకునే తరగతులతో ప్రయోజనం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే అతడికి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్తో పాటు టిక్స్ డిజార్డర్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీరు పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ను కలిసి చికిత్స తీసుకోండి. ఇక ఇది కొద్దిపాటి దీర్ఘకాలిక సమస్య కాబట్టి తల్లిదండ్రులూ ఓపిగ్గా ఉండాలి. ఈ మానసిక రుగ్మత విషయంలో మంచి సంగతి ఏమిటంటే... ఈ సమస్య ఉన్న పిల్లల శక్తియుక్తులను సరిగ్గా గాడిలో పెట్టగలిగితే వాళ్లు గొప్ప విజయాలు సాధించడానికి అవకాశాలున్నాయి. బాబు అదేపనిగా ఏడుస్తున్నాడు మా బాబు వయసు రెండు నెలలు మాత్రమే. వాడెప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాడు. . డాక్టర్కు చూపించినా ఏమీ లాభం లేదు. అసలు వాడి సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? మాకు తగిన సలహా చెప్పండి. – ఎల్. పవన్కుమార్, ఒంగోలు ఇంత చిన్న పిల్లలు తమ బాధలనైనా కేవలం ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధనం ఏడుపు మాత్రమే. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ∙ఆకలి వేసినప్పుడు ∙భయపడినప్పుడు ∙దాహం వేసినప్పుడు ∙బోర్ ఫీల్ అయినప్పుడు ∙పక్క తడిగా అయినప్పుడు ∙వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు ∙పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు ∙కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా ∙నొప్పులు ఉన్నప్పుడు ∙పళ్ళు వస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు ∙కడుపు నొప్పి (ఇన్ఫ్యాంటైల్ కోలిక్) ∙జ్వరం ∙జలుబు ∙చెవినొప్పి ∙మెదడువాపు జ్వరం ∙గుండె సమస్యలు ∙కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు. ఇన్ఫ్యాన్టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్ఫ్యాన్టైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ టైమ్లో పిల్లలు కొద్ది సేపు మొదలుకొని చాలా ఎక్కువసేపు ఏడుస్తుంటారు. ∙ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్ఫ్యాన్టైల్ కోలిక్కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. డా. రమేశ్బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మందుల కారణంగా మధుమేహ సమస్యలు తీవ్రం!
మధుమేహ చికిత్స కోసం వాడే కొన్ని రకాల మందులు... కీటో అసిడోసిస్ అనే రుగ్మతకు.. తద్వారా కాలి దిగువ భాగాలను తొలగించాల్సిన పరిస్థితులకు దారితీస్తున్టన్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించింది. మధుమేహ చికిత్సలో సోడియం గ్లూకోజ్ కోట్రాన్స్పోర్టర్ (ఎస్జీఎల్టీ2) బహుళ ప్రాచుర్యం పొందిందని, మూత్ర పిండాల ద్వారా చక్కెరలను శరీరం వెలుపలకు పంపేందుకు ఇవి సహకరిస్తాయి. అయితే ఈ మందులు సురక్షితమైనవేనా అన్న అంశంపై తొలి నుంచి సందేహాలు ఉన్నాయి. మూత్రపిండాలకు నష్టం మొదలుకొని ఎముకలు తొందరగా విరిగిపోవడం వల్లకు అనే దుష్ప్రభావాలకు ఇదికారణమని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అంతరాŠఝతీయ శాస్త్రవేత్తల బందం ఒకటి స్వీడన్, డెన్మార్క్లకు చెందిన వేల మంది మధుమేహులపై ఒక పరిశోధన చేపట్టింది. 2003 – 2016 మధ్యకాలంలో ఎస్జీఎల్టీ2 మందు వాడేవారిని, జీఎల్పీ1 మందు వాడేవారిని పోల్చి చూసింది. మిగిలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఎస్జీఎల్టీ2 మందు తీసుకునే వారికి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. -
స్త్రీలోక సంచారం
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దేషియాన్ (37), ఆమె మూడో భర్త, అమెరికన్ పాప్ సింగర్ అయిన కాన్యే వెస్ట్(41)ల ముద్దుల కుమార్తె నార్త్ వెస్ట్(5).. లాజ్ ఏంజిల్ సమీపంలోని పసిఫిక్ పాలిసైడ్లో జరిగిన ఫ్యాషన్ షో ర్యాంప్పై మోడల్గా అరంగేట్రం చేసింది. మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్లోని ‘థ్రిల్లా’ బొమ్మలా తయారైన ఈ చిన్నారి.. రెడ్ లెదర్ జాకెట్, మ్యాచింగ్ మినీ స్కర్ట్, జిప్–అప్ బ్లాక్ క్రాప్ టాప్, వైట్ సాక్స్, బ్లాక్ షూజ్, బ్లాక్ పర్స్, రెడ్ లిప్స్టిక్ ధరించి ర్యాంప్పై క్యాట్వాక్ చేస్తున్నప్పుడు అంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోగా ఆ తల్లి కిమ్ కర్దేషియాన్ మనసు ఉప్పొంగిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించి, అపోహల్ని పోగొట్టేందుకు యు.ఎస్.లో మొదలైన ‘పింక్ రిబ్బన్ క్యాంపైన్’లో భాగంగా హైదరాబాద్లో సోమవారం 10 ఎడిషన్ క్యాంపైన్ ప్రారంభమైంది. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్ తొలగింపు కేసులు తక్కువగా నమోదు అవడానికి కారణం తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించి తగిన చికిత్సను అందించడమేనని పిక్ రిబ్బన్ క్యాంపైన్ ద్వారా ఇది సాధ్యం అయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులతో పాటు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ సీఈవో, డైరెక్టర్ తమ ప్రసంగంలో తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఏ విధంగానైనా వదిలించుకోవాలని చూడడం, చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లలను ఆడపిల్లలు తప్పించుకోవాలని చూడడం ఆదివాసీ తెగల్లోని యువతులను మావోయిస్టుల పోరుబాటలోకి నడిపిస్తున్నాయనీ, ఈ పరిస్థితిని వామపక్ష తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులైన బాలికల్ని, యువతుల్ని తమ ఉద్యమంలోకి వలవేసి లాక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీస్, హోమ్శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల నియామకాల్లో మహిళల సంఖ్య 50 శాతానికి మించిపోయిందనీ, ఆదివారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.సోములను చంపడంలో మహిళా మావోయిస్టులే కీలక పాత్ర పోషించారనీ వారు తెలిపారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని జేన్ విల్లెన్బ్రింగ్ రిసెర్చి నిమిత్తం తన మెంటర్, జియాలజిస్టు అయిన డేవిడ్ మర్చంట్తో కలిసి అంటార్కిటా ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడు చెప్పినట్లు ఆమె వినకపోవడంతో అనేక విధాలుగా ఆమెను వేధించి, ఆమె శరీరాకృతిలోని ఒంపుసొంపుల గొప్పతనాన్ని వర్ణించి, అప్పటికీ ఆమె లొంగకపోవడంతో ఆమెను మంచు లోయల్లోకి తోసి, ఆమె కళ్లల్లోకి బూడిదను పోసి నానా తిప్పలు పెట్టడంతో.. గతంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా అక్కడి ఒక గ్లేసియర్కు పెట్టిన అతడి పేరును ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ‘‘డేవిడ్ మర్చెంట్పై యూనివర్సిటీ తీసుకున్న ఈరకమైన చర్య ద్వారా మీకు న్యాయం జరిగిందని సంతృప్తి చెందారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘దీనిని నేను న్యాయం జరగడం అనుకోవడం లేదు. మొత్తానికైతే ఏదో జరిగింది’’ అని బాధితురాలు జేన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్, సెల్ఫ్ హార్మ్, బుల్లీయింగ్లతో మనోవ్యాధి పీడితురాలై ప్రత్యేక చికిత్సా కేంద్రంలో గడిపిన అమెరికన్ పాప్ సింగర్ డెమీ లొవాటో (26).. ఈ ఏడాది జూన్ 21న మళ్లీ డిప్రెషన్ బారిన పడి, ఓవర్డోస్ మందులు వేసుకోవడంతో ప్రాణాంతక స్థితిలోకి జారిపోయిన రెండు నెలల తర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు! యు.ఎస్.లో ఆమె చికిత్స పొందుతున్న ఆశ్రయ కేంద్రం బయట ఆదివారం ఉదయం, కుక్కను నడిపించుకుంటూ వెళుతున్న ఒక మహిళతో డెమీ లొవాటో మాట కలుపుతూ కనిపించారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టి.ఎం.జడ్. (థర్టీ మైల్ జోన్) వెబ్సైట్ ఆమె తాజా ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ట్రంప్ పాలనా యంత్రాంగంలోని జాత్యహంకారాన్ని, లైంగిక వైపరీత్యాలను తట్టుకోలేక అక్కడ పని చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ మహిళ ఉజ్రా జేయా తన పదవికి రాజీనామా చేశారు. యు.ఎస్. విదేశాంగ శాఖలో పాతికేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగంలో రాణిస్తూ వస్తున్న ఉజ్రా.. ట్రంప్ వచ్చాక, పైస్థాయి పురుష అధికారుల్లో పెడధోరణులు పెచ్చరిల్లాయని, వాటి వల్ల మైనారిటీ మహిళలకు స్వేచ్ఛగా, సమర్థంగా పని చేసే వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు. హాలీవుడ్లో వచ్చిన ‘మీ టూ’ లాంటి శక్తిమంతమైన ఉద్యమం బాలీవుడ్లో ఏనాటికీ రాదని, వచ్చి ఉంటే 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగా చెప్పినప్పుడే నలుగురూ కలిసి వచ్చేవారని రెండేళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తనుశ్రీ దత్తా అన్నారు. ‘ఆ రోజు నా విషయంలో పెదవి విప్పని వారు కూడా ఇప్పుడు స్త్రీసాధికారత గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తోంది. ఎవరి స్వార్థం వారిదైపోయినప్పుడు కలికట్టు మహిళా ఉద్యమాలు ఎలా సాధ్యమౌతాయి?’ అని ‘న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్యానిక్ అటాక్ వెన్నులో వణుకు.. ఒళ్లంతా భయం
చీమంత సమస్యను చూసి పామంత భయపడటం....గోరంత కష్టానికి గొడ్డలంత అనుకొని బెంబేలు పడిపోవడం...ఏదో జరిగిపోతుందనే భయం...ఏదో అయిపోతుందనే భయం... సాధారణానికి మించిఅసాధారణంగాపానిక్!భయాన్ని అర్థం చేసుకుందాం ధైర్యంగా తరిమికొడదాం... మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్కు వెళ్లారు. అక్కడ థ్రిల్ కోసం జెయింట్వీల్ ఎక్కారు. బాగా పైకి వెళ్లాక మీరు ఎక్కిన చైర్ స్క్రూ కాస్త లూజ్ అయినట్లుగా మీకు అనిపించింది. ‘అమ్మో...!అకస్మాత్తుగా అది ఊడిపోయి అక్కణ్ణుంచి పడిపోతే?’ అని మీకు అనిపించింది. అప్పుడు మీకు కలిగే భావన ఏమిటి? భయమా? ఆందోళనా? అంతకు మించిన స్థాయి.భయాందోళనలతో నిండిన శూన్యస్థితి. దానినే ప్యానిక్ అటాక్ అంటారు. ప్యానిక్ అటాక్ అంటే...? తీవ్రమైన ఉద్విగ్నతకులోనైన పరిస్థితుల్లో వచ్చే ఒక రకం రుగ్మతే ప్యానిక్ అటాక్. మన సమాజంలోని 20 నుంచి 25 శాతం మందిలో ఏదో ఒక దశలో పానిక్ అటాక్కు లోనుకావడం మామూలే. మనం ఏదైనా అంశంపై ఆందోళన పడ్డ సమయంలో యాంగై్జటీకి గురవుతాం. అలా చూస్తే దీన్ని కూడా ఒక రకం యాంగై్జటీగానే పరిగణించవచ్చు. అయితే యాంగై్జటీకీ, ప్యానిక్ అటాక్కీ ఎంతో తేడా ఉంది. యాంగై్జటీ చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. కానీ ప్యానిక్ అటాక్ అన్నది అకస్మాత్తుగా వచ్చి కొద్ది వ్యవధిలోనే అంతులేని ఆందోళనకు గురిచేస్తుంది. ఆ సమయంలో అటాక్కు గురైనవారు పూర్తిగా అచేతనమైన స్థితికి వెళ్లిపోతారు. కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన లక్షణాలూ ఇందులో కనిపిస్తాయి. అందుకే ప్యానిక్ అటాక్ను గుండెపోటుగా పరిగణించిన సందర్భాలున్నాయి. కొన్ని రకాల గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు మొదటిసారి ప్యానిక్ అటాక్ రూపంలో కనిపించవచ్చు. ప్యానిక్ అటాక్... లక్షణాలు ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు కనిపించే శారీరక లక్షణాలు ఇవి. ∙చేతులు, కాళ్లు తీవ్రంగా వణుకుతాయి ∙గుండెదడ. అయితే ఈ గుండెదడ ప్యానిక్ అటాక్ కారణంగా అకస్మాత్తుగా మొదలవుతుంది. ∙కొందరిలో ఛాతీలో నొప్పి ∙తలలో నొప్పి ∙తలంతా తేలికైపోయినట్లుగా ఉండటం (లైట్హెడెడ్నెస్) ∙వికారం (నాసియా) ∙మూత్రం అర్జెంటుగా వస్తున్నట్లుగా ఉండటం ∙అస్థిమితంగా ఉండటం ∙అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్లుగా అనిపించడం ∙ మత్తుగా, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం (డిజ్జీనెస్), ఒళ్లంతా మొద్దుబారినట్లుగా అనిపించడం ∙ఏదో కలలో ఉన్నట్లుగా అనిపించడం ∙ ఎదుట ఉన్న దృశ్యాలనూ స్పష్టంగా చూడలేకపోవడం ∙తీవ్రమైన భయం (టెర్రర్) కారణంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎంతగా తప్పించుకోవాలనుకున్నా తప్పుకోలేనట్లుగా అనిపిస్తుండటం ∙తనకు సంభవిస్తున్న పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నందుకు లేదా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నందుకు తీవ్రమైన నిరాశగా ఉండటం ∙చనిపోతానేమోననే తీవ్రమైన ఆందోళన. ఎందుకు కలుగుతాయి ఈ ప్యానిక్ అటాక్స్ మన శరీరంలో ప్రకృతి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైన ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దానితో పోరాడు లేదా దాన్నుంచి పారిపో అనే సంకేతాలను మెదడు ఇస్తుంది. దీన్నే ‘ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. ఈ రెస్పాన్స్ కనబరచాల్సిన తీవ్ర విపత్కరమైన పరిస్థితుల్లో మన శరీరంలోకి ‘ఎపీనెఫ్రిన్’ అనే జీవరసాయనం అకస్మాత్తుగా వెలువడుతుంది. అప్పుడు అంతులేని యాంగై్జటీలో ఒక అచేతన స్థితిలో ప్యానిక్ అటాక్ కండిషన్ నెలకొంటుంది. కారణాలు: చాలా రకాల కారణాలు ప్యానిక్ అటాక్స్ వచ్చేందుకు దోహదం చేస్తాయి. మానసికమైన కారణాలతో పాటు భౌతికపరమైన జబ్బులు కూడా పానిక్ అటాక్స్ను కలిగిస్తాయి. ఉదాహరణకు ∙హైపర్ థైరాయిడిజమ్, హైపర్ పారా థైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ∙ఒంట్లో చక్కెర పాళ్లు తగ్గడం (హైపోగ్లైసీమియా) నెలకొన్నప్పుడు ∙గుండెకు సంబంధించిన రుగ్మతలైన లాంగ్ క్యూటీ సిండ్రోమ్, కేటకొలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులార్ టాకికార్డియా, వూల్ఫ్– పార్కిన్సన్– వైట్ సిండ్రోమ్ వంటి జబ్బులు ఉన్నవారికి కూడా ప్యానిక్ అటాక్స్ చాలా సాధారణం.కొందరిలో కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా పానిక్ అటాక్స్ కనిపించవచ్చు. ఉదాహరణకు ∙డయాబెటిస్ మందులైన మెట్ఫార్మిన్, ఇన్సులిన్ వంటివి వాడేవారిలో ∙యాంటీ మలేరియా మందులు వాడే వారిలోనూ పానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎలాంటి భౌతిక, మానసిక, భావోద్వేగ కారణాలు లేకపోయినా అకస్మాత్తుగా యాంగై్జటీ కలిగి ప్యానిక్ అటాక్ రావచ్చు. కొందరిలో తీవ్రంగా బాధించే ఏదైనా సంఘటన తర్వాత కలిగే రుగ్మతగా (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తర్వాత) గానీ, స్కీజోఫ్రీనియా తర్వాతగానీ ఇలాంటి ప్యానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా మద్యం తీసుకున్న తర్వాత ఇవి కనిపించవచ్చు. ఇంకొందరిలో తమకు ఉన్న చెడు అలవాట్లు వదిలేస్తున్నప్పుడు విత్డ్రావల్ సింప్టమ్స్ ప్యానిక్ అటాక్స్ రూపంలోనూ కనిపించవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్లు: మానసికమైన కారణాలైన తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్)తో పాటు కొన్ని రకాల మత్తుమందులు విచ్చలవిడిగా వాడటం, మాదకద్రవ్యాల తీసుకుంటుండటం, పొగతాగడం, మద్యం వంటి అంశాలు యాంగై్జటీని పెంచి ప్యానిక్ అటాక్స్కు ముప్పు (రిస్క్)ను పెంచుతాయి. ఎవరెవరిలో...? ప్యానిక్ అటాక్స్ రావడం సమాజంలోని ప్రజలందరిలోనూ కనిపించవచ్చు. అయితే ముఖ్యంగా పిల్లల్లో, టీనేజీవారిలో మరీ ముఖ్యంగా లేట్ టీన్స్లో ఉన్నవారు, అర్లీ అడల్ట్ దశలో ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. ఫోబియాగా మారే ప్యానిక్ అటాక్... పైన పేర్కొన్న శారీరక కారణాలతో పాటు కొన్ని మానసిక పరిస్థితులూ ప్యానిక్ అటాక్స్ను కలగజేస్తాయి. ఉదాహరణకు బాగా ఎత్తులకు ఎక్కినప్పుడు ప్యానిక్ అటాక్ కలిగితే... ఎత్తుల పట్ల భయం (ఫోబియా) వస్తుంది. అలాగే ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లిఫ్ట్లో, ఆటలాడుతున్నప్పుడు.... ఇలాంటి మరే సందర్భాల్లోనైనా ప్యానిక్ అయినప్పుడు... మనసులో దానికి సంబంధించిన ఫోబియా డెవలప్ అవుతుంది. ఇలా మనం మామూలుగా భయపడటానికి ఆస్కారం లేని సందర్భాల్లోనూ భయాలను కలిగించేలా ప్యానిక్ అటాక్స్ రావడాన్ని ఫోబియా అంటారు. ప్యానిక్ అటాక్స్లో రకాలు... ప్యానిక్ అటాక్స్ రెండు రకాలు. అవి... ∙ఫోబియాతో కూడిన ప్యానిక్ అటాక్. ∙ఫోబియా ఏదీ లేకుండానే కలిగే ప్యానిక్ అటాక్. ఫోబియాతో వచ్చే ప్యానిక్ అటాక్స్ ఎలా ఉంటాయంటే...? ఫోబియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సందర్భాన్ని రోగి ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి అది. ఉదాహరణకు ఒక రోగి చాలా ఎల్తైన భవనంలోని నలభైరెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ చాలామందే ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఫీలవుతున్నా అంత ఎత్తు మీద రోగి తాను సురక్షితంగా లేనని భావిస్తుంటాడు. అక్కణ్ణుంచి పడిపోతానేమో అని ఆందోళన పడతాడు. నిజానికి అది పేషెంట్ అభిప్రాయమే తప్ప... అలాంటి ఆందోళనకు కారణమైన పరిస్థితులేమీ అక్కడ ఉండవు. దాంతో అతడిలో చెలరేగే తీవ్రమైన భయాందోళనలతో అక్కడ నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచన అతడిలో బలంగా వస్తుంది. ఈ అలోచనను ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా అతడికి సాధ్యం కాదు. ఇలాంటివే రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు గుంపులుగా జనం ఉన్నచోట ఉండాలన్నా, ఆరుబయల్లా అనిపించే ప్రదేశాల పట్ల, ఎల్తైన ప్రదేశాల పట్ల... ఇలా అనేక భయాలు ఉంటాయన్నమాట. ఇక ఇలాంటి పరిస్థితులేమీ లేకుండానే ఏర్పడే భయాందోళనతో కూడిన మామూలు పానిక్ అటాక్స్ కూడా చాలామందిలో వస్తుంటాయి. అంతేకాదు... ప్యానిక్ అటాక్స్ అనేవి... కొన్నిసార్లు కొంతమందిలో సోషల్ యాంగై్జటీ డిజార్డర్, ప్యానిక్ డిజార్డర్ డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలనూ తెచ్చిపెడుతుంది. ఎంత సేపు కలుగుతుందీ ప్యానిక్ అటాక్...? ప్యానిక్ అటాక్తో బాధపడే వ్యవధి ఒక్కొక్కొరిలో ఒకలా ఉంటుంది. కొందరిలో దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువసేపే ఈ ప్యానిక్ అటాక్ కొనసాగుతుంది. ఆ సమయంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ కలగవచ్చు. చికిత్స ప్యానిక్ అటాక్స్కు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు బెంజోడయజపైన్స్ ఉండే మందులు కూడా మానసిక నిపుణులు ఇస్తుంటారు. ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ వంటి కొత్త మందులు ఈ సమస్య నుంచి బయటపడటానికి బాగా పనిచేస్తాయి. మందులతో పాటు కౌన్సెలింగ్ కూడా ప్యానిక్ అటాక్స్ నుంచి కొంతవరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. అధిగమించడం ఎలా? ప్యానిక్ అటాక్స్ను అధిగమించడం ఒకింత సులువే. తమకు ఆత్మవిశ్వాసం పెరిగేందుకు చేసే చర్యలతోనూ, మంచి జీవనశైలితో వీటిని అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ప్యానిక్ అటాక్స్ను నివారిస్తుంది. రోజూ ఎక్సర్సైజ్ చేసేవారిలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా యాంగై్జటీ కూడా తగ్గడం వల్ల ప్యానిక్ అటాక్స్/ ఒళ్లు బిర్ర బిగుసుకుపోయే పరిస్థితి నివారితమవుతాయి. కృత్రిమ రంగులు, అడెటివ్స్ కలిపిన ఆహారాలు తీసుకునే వారు తేలిగ్గా ప్యానిక్ అటాక్స్కు గురవుతారు. అలా కాకుండా స్వాభావికమైన సమతులాహారం తీసుకునేవారిలో ప్యానిక్ అటాక్స్ తక్కువ. పొగతాగే అలవాటు, మద్యం, కెఫిన్ వంటివి ప్యానిక్ అటాక్స్ను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండటం అవసరం. ఒత్తిడిని తగ్గించే మార్గాలైన యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్, కండరాలను హాయిగా ఉంచే మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి అన్నీ ప్యానిక్ అటాక్స్ను తగ్గిస్తాయి. డాక్టర్ ఐ. భరత్ కుమార్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్గూడ, హైదరాబాద్ -
మునిగిపోయే గొప్ప ఓడ కాదు, గమ్యం చేర్చే చిన్న దోనె చాలు
ఆనాటి యూదుమత ప్రముఖుడొకాయన యేసుప్రభువు వద్దకొచ్చి నేను నిన్ను వెంబడిస్తాను, నీవెక్కడికెళ్లితే అక్కడికొస్తానన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్లున్నాయి, కానీ తనకు మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ప్రభువాయనకు జవాబిచ్చాడు(మత్తయి 8:20). ఆయన ఏర్పర్చుకొన్న 12 మంది శిష్యులతో సహా ఎంతో మంది ప్రభువును అప్పటికే వెంబడిస్తున్నారు. అప్పటికి మూడేళ్ళుగా యేసు తన వాళ్ళతో కలిసి ప్రతిరాత్రి ఎక్కడో ఒక చోట బస చేస్తూనే ఉన్నాడు, రాత్రి పూట ఎక్కడో ఒకచోట తలవాల్చుతూనే ఉన్నాడు. మరి అతనితో ఈ మాటెందుకు అన్నాడు? ఆయన తన పేదరికాన్ని ప్రకటించుకొంటున్నాడా? ’భూమియు దాని సంపూర్ణతయు, లోకమును అందులో నివాసం చేసేవన్నీ ఆయనవే’ అంటుంది బైబిల్(కీర్తనలు 24:1). విశ్వమంతా తనదే అయినా యేసుప్రభువు ఈ లోకంలో జీవించిన ముప్పైమూడున్నరేళ్లలో తన పరలోకపు తండ్రి అభీష్టం మేరకు దైవత్వాన్ని సంతోషంగా పరిత్యజించి దిగి వచ్చిన పరిపూర్ణ మానవుడు. సకల భోగభాగ్యాలతో రాజప్రసాదంలో అనుభవిస్తున్న అత్యంత విలాసవంతమైన జీవితాన్ని వదిలి మారువేషంలో(లేదా మహిమశరీరం వదిలి మానవ శరీరంలో) తన ప్రజలతో కొంతకాలం సహజీవనం చేసేందుకు పూనుకొన్న మహాచక్రవర్తి ఆయన. ఈ దశలో ఆయనకంటూ సొంత ఆస్తులేవీ లేవు, ఉండవు కూడా. ఆపదలో సాయాన్ని, రుగ్మతలో స్వస్థతనిస్తూ, పడిపోయినపుడు పైకిలేపే స్నేహితుడిగా, కన్నీళ్లు, కష్టాల్లో ఓదార్చే సొంత మనిషిగా ఆయన దీనులు, నిరుపేదల కోసం నిరంతరం శ్రమించాడు. అంటే ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చి, వారితోనే వాళ్ళే తన సర్వంగా జీవించి ఏమీ లేని వారికి ఆయన ‘కొండంత అండ’ అయ్యాడు, వారి జీవితాల్లోనుండి విడదీయలేని భాగమయ్యాడు, వారి ’సొంత మనిషి లేదా సొంత ఆస్తి’గా మారాడు. తలవాల్చుకొనేందుకు కూడా తనకంటూ ఒక సొంత స్థలం లేనివాడే కాని అప్పుడూ ఇప్పుడూ కోట్లాదిమందికి యేసుప్రభువు ఆశ్రయదుర్గమయ్యాడు. ఈ రోజుల్లోలాగే, ఆ రోజుల్లో కూడా మతసంబంధమైన వ్యక్తులే అత్యంత ధనవంతులు. ఎంతో ఆస్థిపరుడైన ఒక శాస్త్రి తనను వెంబడిస్తానన్నపుడు అందుకే యేసుప్రభువు అతన్ని నిరాశపర్చే జవాబిచ్చాడు. నన్ను వెంబడించి నీవు కొత్తగా సంపాదించుకునేదేమీ ఉండదు సరికదా నీకిపుడున్నదంతా వదిలేయాల్సి వస్తుందని ప్రభువు అతనితో పరోక్షంగా అన్నాడు. ఊహించినట్టే అతను జడిసి వెనుదిరిగాడు. ఆస్తులు, విలాసాలు పొందే అవకాశం లేదనుకుంటే ఈనాటి చాలామంది బోధకులు కూడా అతని లాగే ప్రభువును వదిలేస్తారు. ఆస్తులు కాదు, మహిమైశ్వర్యవంతుడైన యేసే మాకు ’తిరుగులేని స్థిరాస్తి’ ఆనుకున్న ఇతర అనుచరులు మాత్రం ఆయన జీవనశైలినే అనుకరిస్తూ ఆయన్ను వెంబడించారు, అద్భుతమైన పరిచర్య చేశారు, పరలోకంలో ఆయనకు పాలిభాగస్థులయ్యారు. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్లో అక్కడి చేయితిరిగిన 16 మంది మెకానిక్ల సారధ్యంలో నిర్మించారు. వారి నైపుణ్యాన్ని మెచ్చి ఆ 16 మంది మెకానిక్లను ఓడ యజమాని ఫ్రీ టికెట్లిచ్చి తీసుకెళ్తుండగా ఓడతోపాటే వాళ్లంతా మునిగి చనిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ 16 మంది కుటుంబాల ఓదార్పు కోసం బెల్ఫాస్ట్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన గొప్ప సంస్మరణ సభలో ‘మునిగిపోని పడవ’ అనే అంశంతో ఒక దైవజనుడు ప్రసంగించాడు. భయంకరమైన తుఫానులో కూడా తిబెరియా సముద్రంలో యేసుప్రభువున్న ఒక చిన్న పడవ మునిగిపోలేదు. యేసులేని జీవితం ఎంత గొప్పదైనా అది మునిగే ఓడేనని, యేసే ఉంటే చిన్న దోనెలాంటి జీవితమైనా అది పెనుతుఫానులను కూడా జయిస్తుందని ఆయన వివరిస్తే ఆ రోజున ఆ మెకానిక్ల పిల్లలు చాలామంది ప్రభువు పరిచర్యకు తమ జీవితాలు అంకితం చేసుకున్నారు. యేసు ఉన్న మునిగిపోని ఓడలుగా వాళ్ళు తమ జీవితాలను నిర్మించుకోవడమే కాక, మరెన్నో వందల జీవితాలను అలా వాళ్ళు ప్రభువులో నిర్మించారు. అలా ఒక పెను విషాదంలో ఆనంద కెరటం ఎగిసిపడింది. ’యేసుప్రభువే నా నిజమైన ఆస్తి’ అని సగర్వంగా ప్రకటించుకోవడమే సజీవ క్రైస్తవం. ఆస్తులు, డబ్బు చుట్టూ తిరిగే క్రైస్తవం, పరిచర్య ఎన్ని హంగులు, ఆర్భాటాలున్నా మృతప్రాయమైనదే, ఒకనాడు మునిగిపోయేదే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చంటి... బంటి... యాంగై్జటీ
పుస్తకానికి ఉన్న అట్టలు రెండూ చెదిరిపోతే కాగితాలు కుదురుగా ఉంటాయా? గాలికి కొట్టుకుపోవూ! అట్టల్లా కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లల ముందు గొడవపడుతుంటే చిగురుటాకుల్లా పిల్లలు వణికిపోరా? పేరెంట్స్ మధ్య గొడవ చాలాసార్లు వారి బంధాలను బలపరచవచ్చేమోగానీ... పిల్లలు దాన్ని అర్థం చేసుకోగలరా? ‘అమ్మా నాన్నా విడిపోతారా?మనం చెదిరిపోతామా?’.. ఏ ఇంటి చంటీ బంటీలకైనా ఇదే ఆందోళన. పదేళ్ల బంటీ, ఎనిమిదేళ్ల చంటీ అన్నాచెల్లెళ్లు. వాళ్లిద్దరూ మూడు నాలుగు గంటల్నుంచి కనపడకుండా పోయారు. అప్పటికే కొన్ని గొడవల్లో ఉన్న వాళ్ల పేరెంట్స్కు ఇదో అశనిపాతం. పక్కింట్లోనూ, పిల్లల స్నేహితుల ఇళ్లలోనూ వాకబు చేసి, వాళ్లు అక్కడికి రాలేదని కన్ఫర్మ్ అయ్యాక... ఆందోళనగా, హడావుడిగా పోలిస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ కంప్లయింట్ ఇచ్చి... తామూ వెతకడానికి పూనుకున్నారు. ఎందుకో తండ్రి సుధాకర్కు డౌట్ వచ్చి బస్స్టాండ్కు వెళ్లి చూశాడు. అక్కడ ఒక ప్లాట్ఫారమ్ మీద బిక్కుబిక్కుమంటూ చంటీ, బంటీ! అప్పటివరకూ ఉన్న భారమంతా ఒక్కసారిగా తొలగిపోయినట్లు అయినట్లు అనిపించింది. కానీ అంతలోనే మళ్లీ ఆందోళన. పిల్లలు తల్లిదండ్రులతో ’ఇంటికి రానేరాం’ అన్నారు. సమూదాయించి తీసుకొచ్చాక కూడా సరిగా నిద్రపోలేదు. ఎలాగో నిద్రపట్టాక మళ్లీ ఉలిక్కిపడి లేస్తున్నారు. రెండు మూడు రోజులు ఇదే తంతు. పేరెంట్స్ ఇద్దరూ ఆందోళనతో పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్లిద్దరితోనూ మాట్లాడాక సైకియాట్రిస్ట్ అప్పుడు తల్లిదండ్రుల వైపునకు తిరిగి... ‘పిల్లలు వెళ్లిపోయిన రోజు ఏం జరిగింది?’ అంటూ అడిగాడు. ఆరోజు జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు సుధాకర్, అనుపమ. ఆనాడు ఏం జరిగిందంటే...‘‘ఎంత డబ్బని తగలేస్తారిలా’’ అరుస్తోంది అనుపమ.‘‘మాటలు తిన్నగా రానియ్. తగలేయడమేంటి? డబ్బులు పంపింది నా పేరెంట్స్కి’’ సుధాకర్ గొంతూ గట్టిగానే ఉంది. ‘‘అదే.. అస్తమానమూ మీరే ఎందుకు పంపాలి? మీరొక్కరనే కొడుకు? మీకో అన్న, తమ్ముడూ ఉన్నారుగా. వాళ్లకు లేదా బాధ్యత’’ భర్తకు ఎదురెళ్లి మాట్లాడుతోంది నరాలు చిట్లేంత ఆవేశంతో!‘‘నా బాధ్యత నాది.. పంపొద్దని చెప్పడానికి నువ్వెరివి?’’ భార్యను కొట్టడానికి వెళ్తాడా అన్నంత కోపంగా అతను. ‘‘ఏమన్నారు.. నేనెవర్నా’’ ఆమె అహం దెబ్బతిన్నది. ‘‘అవును.. నన్ను ఆపడానికి ను..వ్వు.. ఎ..వ..రి..వి’’ ఒత్తి పలుకుతూ అతను. ‘‘ఛీ.. ఇంత మాట అనిపించుకున్న ఈ బతుకు అవసరమా. ఇంకా ఈ భార్యాభర్తల బంధం ఎందుకు?’’ నిలదీసింది.‘‘అయితే డైవోర్స్ ఇచ్చేయ్’’ అన్నాడు.గంట నుంచి ఈ గోలంతా వింటున్న, చూస్తున్న పిల్లలిద్దరు కూడా షాక్ అయ్యారు. తేరుకున్న అనుపమ బెడ్రూమ్లోకెళ్లి తలుపేసుకుంది. అతను విసురుగా బయటకు వెళ్లిపోయాడు. ‘‘అన్నయ్యా.. అమ్మానాన్నా విడిపోతారా?’’ వెక్కిళ్ల మధ్య అడిగింది ఎనిమిదేళ్ల చంటి. ‘‘ఏమో చెల్లీ’’ అయోమయంగా చెప్పాడు పదేళ్ల బంటి. ‘‘నాకు భయంగా ఉందిరా అన్నయ్యా’’ అదే వెక్కిళ్లతో చంటి. గత కొద్ది రోజులుగా అమ్మానాన్న గొడవలను చూస్తున్నారు. ఈ రోజు తారస్థాయికి చేరుకున్నట్టు అర్థమైంది ఆ పిల్లలను. అభద్రత నిలువనీయడం లేదు వాళ్లను. ఇంట్లో నుంచి పారిపోయి అమ్మమ్మ దగ్గరకు వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు. కాని ఆ పని వల్ల వాళ్లు ప్రమాదంలో పడవచ్చు. పిల్లల ముందు తగువులాడుకునే పెద్దలు ఇవి ఆలోచిస్తారా? అటు బెడ్రూమ్లో ఉన్న అనుపమ పరిస్థితీ ఇంచుమించు ఇదే. ఇలాంటి వాడికోసమా తన వాళ్లందరినీ వదులుకొని వచ్చింది? ఈ రోజు నువ్వెవరు అని అడుగుతున్నాడు.. పైగా డైవోర్స్ కూడా ఇవ్వాలట? దేవుడా ఈ సిట్యుయేషన్ ఎక్కడికి వెళ్తుంది? నేను, నా పిల్లలు ఏమై పోవాలి?’’ భయం ఆమెను వణికిస్తోంది.బయటకెళ్లిన అతని మానసిక స్థితీ అదే. కోపంలో.. ఆవేశంలో నోరు జారాడు. తనెలా రియాక్ట్ అవుతుందో? నిజంగానే నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతుందా? అమ్మానాన్న రెస్పాన్స్బులిటీ నేనొక్కడినే తీసుకుంటే తప్పేంటి? వీళ్లనైతే నిర్లక్ష్యం చేయట్లేదు కదా? ఈ మాత్రం అర్థంచేసుకోలేదా? సహనం నశించి ఒక్క మాటన్నాడు. భగవంతుడా.. అనుపమ నన్ను విదిలేస్తే.. అమ్మో ఆ ఊహనే తట్టుకోలేకపోతున్నాడు. బాధ, భయం, ఆందోళన అతనిని ఉండనివ్వట్లేదు. ఇది ఒక రకం యాంగై్జటీ. చంటి, బంటీ అనుభవిస్తున్న ఆ మానసిక పరిస్థితిని ‘అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ’ అంటారు. తమకు ఇష్టంలేకపోయినా ఏదైనా కారణాల వల్ల జీవిత భాగస్వామిని వదులుకోవాల్సి వచ్చే పరిస్థితితో పెద్దలు కూడా ఈ తరహా అడ్జెస్ట్మెంట్ డిజార్డర్కు గురవుతారు. అయితే కేస్స్టడీలో పేర్కొన్న ఉదాహరణలోని సంఘటనలో మాత్రమే కాదు... ఇతరత్రా ఎలాంటి సందర్భాల్లోనైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ విధమైన యాంగై్జటీకి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటిప్పుడు అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ కి కారణమైన సంఘటనను బట్టి కౌన్సెలింగ్తో పాటు చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి. కొన్నిసార్లు శారీరక సమస్యలు కొంతమందిలో యాంగై్జటీ కారణంగా కడుపులోని జీర్ణస్రావాలు ఎక్కువగా స్రవిస్తూ కడుపు కండరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో స్టమక్ అల్సర్స్ వస్తాయి. అలా పిల్లల్లో కడుపునొప్పులు తరచూ కనిపిస్తాయి. యాంగై్జటీతో దురలవాట్లు తమలోని యాంగై్జటీని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు సిగరెట్, మరికొందరు మద్యం వంటి దురలవాట్లను ఆశ్రయిస్తుంటారు. వాటివల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం కలుగుతున్న భ్రాంతితో ఆ దురలవాట్లలో కూరుకుపోయి జీవితాలను నాశనం చేసుకున్న కేసులు ఎన్నో. చికిత్స పిల్లలకు... పిల్లలు చాలా సున్నిత మనస్కులు. వారి హృదయాలు తేలిగ్గా గాయపడతాయి. అందుకే అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అనే కండిషన్కు గురైన పిల్లలకు మొదట తల్లిదండ్రులు కల్పించాల్సింది భరోసా. తాము ఎప్పటికీ కలిసే ఉంటామన్న విశ్వాసాన్ని పిల్లల్లో పాదుగొలపాలి. ∙ పిల్లలకు సైతం నిత్యం వారితో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగవనే నమ్మకాన్ని తల్లిదండ్రులు కల్పించడం ఎంతో అవసరం ∙పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని భర్తీ చేయాలి పెద్దలకు... తల్లిదండ్రులకు మొదట ఫ్యామిలీ కౌన్సెలింగ్ థెరపీ అవసరమవుతుంది. ∙పిల్లల ముందు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ గొడవలు పడకూడదనే విధంగా పెరెంట్స్కు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ∙ కుటుంబ సభ్యులందరూ ఎదుర్కొన్న పరిస్థితులను పేరెంట్సకు ఉదాహరణగా చూపుతూ పిల్లలు పడిన మానసిక క్లేశాన్ని వారికి వివరించాలి. ఒకవేళ గొడవలు తీవ్రంగా ముదిరి నిజంగానే విడిపోయవాల్సి వస్తే పిల్లలకు కలిగే దురవస్థను వారికి వివరించడం ద్వారా ఆ స్థితి రాకుండా నివారించవచ్చు. అలా కుటుంబంలోని అందరి మానసిక వేదనను తొలగించడం సాధ్యమే. ్డ కారణాలు : భార్యాభర్తల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలలో సమస్యలు (రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్) వంటివి పిల్లల్లో, పెద్దల్లో ఈ తరహా యాంగై్జటీకి కారణమవుతాయి. రకాల యాంగై్జటీకి ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశం. దంపతుల్లో ఒకరు చేసింది మరొకరికి నచ్చకపోవడంతో పాటు భార్యభర్తల్లో తాము పనిచేసే చోట కనిపించే ఒత్తిళ్లు, కార్యక్షేత్రంలో ఇబ్బందులు, ఒడిదొడుకులు, బంధువుల్లో తగాదాలు ఇవన్నీ ఈ రకం డిజార్డర్కు, తద్వారా వారిలోని యాంగై్జటీకి కారణమవుతాయి. లక్షణాలు : అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ తో బాధపడే పిల్లల్లో ఈ తరహా లక్షణాలు కనిపించవచ్చు అవి... ∙పిల్లలు ఎప్పుడూ తీవ్రమైన ఆందోళనతో ఉండటం ∙సంతోషంగా ఉండాల్సినప్పుడూ ఆ సంతోషం కనిపించకపోవడం ∙స్థిమితంగా ఉండేలేకపోవడం ∙అరచేతులు, అరికాళ్లలో చెమటలు పట్టడం ∙తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతుండటం ∙నిద్ర సరిగా ఉండదు, ఈ తరహా లక్షణాలు కనిపించడానికి దాదాపు మూడు నెలల ముందు పిల్లలుగానీ లేదా పెద్దవాళ్లుగానీ అడ్జెస్ట్మెంట్ డిజార్డర్కు గురయ్యేంతగా తీవ్రస్థాయి ఒత్తిడికి గురై ఉంటారు. దాన్ని బట్టి పిల్లల్లోగానీ లేదా పెద్దల్లో గాని ఈ తరహా యాంగై్జటీకి గురయ్యారని నిర్ధారణ చేయవచ్చు. సూచనలు : కుటుంబాల్లో దంపతుల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉండనే ఉంటాయి. ఒక్కోసారి అవే ముదిరి తీవ్రస్థాయి వాగ్వాదాలుగా మారడం చాలా సహజం. అందుకే దంపతుల్లో ఆవేశాలు పెచ్చరిల్లినప్పుడు, వాగ్వాదాలు ముదురుతున్నప్పుడు పిల్లల ముందు వాటిని వ్యక్తపరచకూడదు. వాళ్ల పరోక్షంలోనే విషయాలు మాట్లాడుకోవడం మంచిది. అలాగని వాళ్లు లేనప్పుడు గొడవపడాలని కాదు. ఆవేశం క్షణికమనీ... కొద్దిసేపటి తర్వాత అది తగ్గుతుందని గ్రహించి, కాసింత సేపు గడువిచ్చి మాట్లాడుకుంటే... తల్లిదండ్రుల మధ్యా టెన్షన్ తొలగుతుంది. పిల్లలకూ ఆందోళన తప్పుతుంది. – డాక్టర్ పద్మ పాల్వాయి సీనియర్ ఛైల్డ్ సైక్రియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రికార్డులూ బద్దలు కొడతారు
కుండలో పట్టనంత ఎనర్జీ ఉంటుంది ఈ పిల్లల్లో! ఇవాళ వీళ్లు ఆగరు... రేపు వీళ్లను పట్టలేం. వీళ్లలో ఉన్న ఈ అత్యుత్సాహం, సూపర్ ఎనర్జీని కంట్రోల్ చేయడం తల్లిదండ్రుల తరం కాదు. కానీ... ఈ దూకుడును దారిలో పెడితే ఫ్యూచర్లో రికార్డులూ బద్దలు కొట్టగలరు. ముందుగా ఒక ఉపకథతో ఈ రుగ్మత గురించి మొదలుపెడదాం. ఇప్పుడతడి వయసు 33 ఏళ్లు. కానీ చిన్నప్పుడు అతడి పరిస్థితి వేరు. దేనిమీదా దృష్టి కేంద్రీకరించేవాడు కాదు. ఉన్నచోట కుదురుగా ఉండేవాడూ కాదు. ప్రతిరోజూ స్కూల్ టీచర్ నుంచి ఫిర్యాదులే ఫిర్యాదులు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే దేనిమీదా దృష్టి సారించలేని ఒక జబ్బు ఉందని తేలింది. దృష్టి కేంద్రీకరించ లేకపోవడం, అతిచురుగ్గా ఉండటం ఆ జబ్బులో భాగం. అతడి అతి చురుకుదనాన్ని ఎలా భరించాలో తల్లికి తెలియలేదు. ఆ అతిచురుకుదనాన్ని చానలైజ్ చేయాలనుకుని స్విమ్మింగ్పూల్ను పరిచయం చేసింది తల్లి. ‘ ముఖం తడిసిపోతుంది... ఈదను’ అన్నాడా పిల్లాడు. ‘సరే బ్యాక్స్ట్రోక్తో మొదలుపెట్టు’ అని మరో సలహా ఇచ్చింది. అంతే. 2016 ఒలింపిక్స్ నాటికి ఈతలో అతడు సాధించిన మొత్తం మెడల్స్ 28. వాటిలో 23 బంగారు పతకాలు. ఆ కుర్రాడి పేరు మైకెల్ ఫెల్ప్స్. అతడికి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆ జబ్బు పేరు ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్’. సంక్షిప్తంగా దాన్నే ఏడీహెచ్డీ అంటారు. అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) అంటే: పిల్లల వికాసంలో లోపాన్ని కలిగించే ఒక రుగ్మత ఇది. ఈ రుగ్మతలో దృష్టి కేంద్రీకరణ లోపంతో పాటు, ప్రమాదకరంగా పరిణమించే తీవ్రమైన అతిచురుకుదనం ఉంటుంది. ఈ రెండు లక్షణాల్లో ఒక్కోసారి ఒక్కొక్కటి బయట పడుతుంటాయి. గతంలో ఏడేళ్ల వయసులో బయటపడే ఈ రుగ్మత ఇప్పుడు నాలుగేళ్లకే కనిపిస్తోంది. విస్తృతి కూడా ఎక్కువే: మానసిక వైద్యశాస్త్రంలో దీనిని ఒక రుగ్మతగా పరిగణిస్తున్నారు. ఏడీహెచ్డీలో అనేక రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 శాతం పిల్లల్లో ఈ రుగ్మత కనిపిస్తోంది. ఇదొక దీర్ఘకాలిక సమస్య. పిల్లలుగా ఉన్నప్పుడు బయటపడ్డ ఈ రుగ్మత 30 నుంచి 50 శాతం మందిలో ఆ తర్వాత యుక్తవయసుకు వచ్చాక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల్లో ఏడీహెచ్డీ లక్షణాలు ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశాలు జన్యుపరంగా చాలా ఎక్కువ. ఏడీహెచ్డీకి కారణాలు ఏడీహెచ్డీకి కారణాలు ఇప్పటికీ నిర్దిషంగా తెలియదు. జన్యుపరమైన, వాతావరణపరమైన, ఆహారపరమైన, సామాజికమైన అనేక అంశాలు ఈ రుగ్మతకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటు న్నారు. జన్యుపరమైనవి: ఏడీహెచ్డీకి కారణమైన జన్యుపరమైన లోపాలను పెట్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. ఈ స్కాన్లో మెదడును పరీక్షించినప్పుడు డోపమైన్ ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ తక్కువ స్థాయిలో జరుగుతుందని గుర్తించారు. వాతావరణపరంగా: వాతావరణంలో సీసం (లెడ్) కాలుష్యం ఎక్కువగా ఉండేచోట ఉన్న పిల్లల్లోనూ ఇది ఎక్కువ. మద్యం, పొగాకు, పొగతాగడం వంటి నేపథ్యంలో పెరిగే పిల్లల్లో ఈ తరహా రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి సమస్యలు ఎదుర్కోవడం లేదా నెలలు నిండకముందే పుట్టడం వంటి కేసుల్లోనూ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ప్రసవం సమయంలో తలకు గాయం అయిన వారు ఏడీహెచ్డీకి గురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా టీవీ చూసే పిల్లలు, ఇంటర్నెట్, వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో ఏడీహెచ్డీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లలు చదువులపై, లక్ష్యసాధనపై నిమగ్నం చేయలేక త్వరగా తమ దృష్టిని వేరే అంశాల వైపునకు మళ్లిస్తారు. ఆహారం: స్వాభావిక ఆహారంపై పెరగకుండా కృత్రిమరంగులు వేసే ఆహారం, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారం తినే పిల్లల్లో ఏడీహెచ్డీ ఎక్కువ. దీనితోపాటు చక్కెర ఎక్కువగా విడుదలయ్యే ‘హై గ్లైసీమిక్ ఇండెక్స్’ ఉన్న ఆహారం... అంటే స్వీట్లు, చాక్లెట్లు తినే పిల్లల్లో ఇది ఎక్కువ. జంక్ఫుడ్, ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంతో వండిన పదార్థాలు తినే పిల్లల్లోనూ ఏడీహెచ్డీ అవకాశాలు ఎక్కువ. సామాజిక అంశాలు: కుటుంబ బాంధవ్యాలు సక్రమంగా లేని పిల్లల్లోనూ, సమస్యాత్మక కుటుంబ నేపథ్యం ఉన్న చిన్నారుల్లో ఈ రుగ్మత ఎక్కువ. ఇటీవలి పరిశోధనల ప్రకారం కుటుంబం పట్ల మంచి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలు, తాతా నాయనమ్మలతో మంచి సంబంధాలున్న పిల్లల్లో తమను తాము చక్కదిద్దుకునే సామర్థ్యం చాలా ఎక్కువ అని తెలిసింది. పిల్లలతో ఆరోగ్యవంతమైన మంచి సంబంధాలు నెరపుతూ, వారితో మంచిగా మసలుతుంటే ఏడీహెచ్డీ తీవ్రత తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. చక్కదిద్దడం ఎలా? ఏడీహెచ్డీ ఉన్న పిల్లలను సరిదిద్దడం అన్నది ఇటు ఇంట్లో, అటు స్కూల్లో... ఇలా రెండూచోట్లా ఒకేసారి (సైమల్టేనియస్గా) జరగాలి. ఈ రెండుచోట్లా పిల్లల ప్రవర్తనను చక్కదిద్దడం (బిహేవియర్ మాడిఫికేషన్), జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్, ధ్యానం వంటి వాటి ద్వారా ఏడీహెచ్డీని అదుపులో పెట్టవచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన సైతం ఇలాంటి పిల్లల్లో మంచి మార్పు తీసుకుని వస్తుంది. ఇలాంటి పిల్లల పట్ల కఠినంగా ఉండటం, శిక్షించడం సరికాదు. మొదట్లో ఇలాంటి చర్యలతో వెంటనే కొంత మెరుగుదల ఉన్నట్లు కనిపించినా దీర్ఘకాలిక ఫలితాలు చాలా తక్కువ. శాశ్వత మెరుగుదల కోసం చాలా ఓపిక, మంచి సంయమనం, పిల్లల పట్ల శ్రద్ధ చాలా అవసరం. విషయం వారికి తెలియనే తెలియదు... తనకు ఏదో లోపం ఉన్నట్లు పిల్లవాడికి తెలియనే తెలియదు. యుక్తవయసుకు వచ్చేవరకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. ఓరల్స్ విషయంలో వాళ్ల పని తీరు బాగున్నా ఇలాంటి పిల్లలు రాతపని చేయడానికి, హోమ్వర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఫలితంగా వాళ్ల గ్రేడ్స్ తగ్గుతాయి. దాంతో ఇలాంటి పిల్లలు అంత తెలివితేటలు ఉన్నవారు కాదనే ముద్ర పడుతుంది. నిజానికి వీళ్లు కూడా చాలా చురుకైన పిల్లలే. మంచి తెలివితేటలు ఉన్నవారే. అయితే తమ శక్తియుక్తులన్నీ చదువు మీద గాక, ఆటపాటలు, ఇష్టమైన హాబీల వంటి వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సమస్య నియంత్రణకు మార్గాలు ∙రోజూ జరిగినవి అడిగి తెలుసుకోవడం: పిల్లల రోజువారీ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని, ఆ రోజు చేసిన తప్పు పనుల వల్ల కలిగే అనర్థాలు వివరించాలి. మంచి విషయాలను ప్రోత్సహించాలి. మర్నాడు తప్పులు జరగకుండా చూడటంతో పాటు, మంచిపనులు చేసేలా ఉత్సాహపరచాలి. మెచ్చుకోవడం: పిల్లల్లోని మంచి విషయాలను మెచ్చుకుంటూ ఉండాలి. మరోమారు అవే చేసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. క్రమబద్ధంగా గడిపేలా చేయడం: వాళ్ల రోజువారీ కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో జరిగేలా ఒక నిర్దిష్టమైన టైమ్టేబుల్ రూపొందించాలి, ఆ ప్రకారం వాటిని చేసేలా చూడాలి. వారు చెడుగా ప్రవర్తించకుండా చూస్తూ ఎప్పుడూ బిజీగా ఉంచాలి. కథలు చెప్పడం: నీతిపాఠాలు హత్తుకునేలా కథలు చెప్పాలి. ఆ కథలకు సంబంధించిన ప్రశ్నలు అడిగిలా ప్రోత్సహించి, వాటిని నివృత్తి చేయాలి. శారీరక వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు ఆటల్లో, వ్యాయామంలో పాల్గొనేలా చూడాలి. తల్లిదండ్రుల శ్రద్ధ: పిల్లల చదువులతోపాటు అన్ని విషయాల్లోనూ పేరెంట్స్ మంచి శ్రద్ధ తీసుకోవాలి. మందులు: ఏడీహెచ్డీ ఉన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో స్టిమ్యులెంట్స్, నాన్స్టిమ్యులెంట్స్ అనే మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను ఆరేళ్లకు పైబడినవారిలో ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ మందులతో పాటు ఫిష్ ఆయిల్, ప్రోబయోటిక్ వంటి సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దృష్టి కేంద్రీకరణ లోపాలుండే పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇలాంటి పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ లోపాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి... ∙మతిమరపు. ∙ కమాండ్స్ను సరిగా స్వీకరించలేకపోవడం ∙ఇచ్చిన వ్యవధిలో తమక అప్పగించిన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం ∙స్పెల్లింగ్స్ చెప్పలేక సిల్లీ తప్పులు చేయడం ∙క్లాస్రూమ్లో జరుగుతున్న అంశంపై నుంచి త్వరగా దృష్టి మరల్చడం ∙చాలా ఎక్కువగా మాట్లాడుతుండటం. ∙పగటికలలు కనడం ∙ఇంట్లోంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయడం. ఇక దృష్టి నిలపలేకపోవడం అనే ముఖ్య లక్షణం ప్రతిసారీ అతిచురుకుదనం (హైపర్యాక్టివిటీ)తో కలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి పిల్లలను విధేయతా, క్రమశిక్షణా లేనివారిగానూ పరిగణిస్తారు. కానీ అది సరికాదు. దృష్టి కేంద్రీకరణ లోపాలు ఉన్న పిల్లల్లోనూ విధేయత, క్రమశిక్షణ ఉంటాయి. వారిలో తమపై తమకు కొంత నియంత్రణ ఉంటుంది. ఏడీహెచ్డీకి చికిత్స తప్పనిసరి... ఎందుకంటే... ఒక మోస్తరు (మాడరేట్) ఏడీహెచ్డీ నుంచి తీవ్రమైన (సివియర్) ఏడీహెచ్డీ ఉన్న పిల్లలకు చికిత్స అందించకపో 1. దృష్టి కేంద్రీకరణ శక్తి, ఏకాగ్రతా మరింతగా తగ్గిపోతాయి. చదువుల్లో బాగా వెనకబడిపోతారు. స్కూలు నుంచి పేరెంట్స్కు ఫిర్యాదులు ఎక్కువవుతాయి. అది పిల్లలపైనా, తల్లిదండ్రులపైనా తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులకు మనోవేదనగా పరిణమిస్తుంది. 2. పిల్లలు అతిచురుకుదనంతో చేసే అల్లరీ, వారు చేసే విధ్వంసకరమైన పనులు శ్రుతిమించి, ఒక్కోసారి అది పిల్లలకూ లేదా ఇతరులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇంతటి పరిస్థితుల్లోనూ దాన్ని పసితనపు అల్లరిగానే పరిగణించి అప్పటికీ తగిన చికిత్స అందించకపోతే యుక్తవయసు వచ్చే నాటికి అతడు తీవ్రమైన నిస్పృహకులోనై డిప్రెషన్లోకి వెళ్లవచ్చు. అందుకే ఏడీహెచ్డీ పిల్లలకు చికిత్సతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్లు అవసరం. తెలివైనవారు కాదనేది ఒక అపోహ మాత్రమే ఏడీహెచ్డీ ఉన్న పిల్లలు స్వతహాగా తెలివైనవారే అయినప్పటికీ వారు ఇంటెలిజెంట్ కాదనే దురభిప్రాయం ఉంది. ఆ అపోహ వల్ల వాళ్ల ప్రవర్తనలో మార్పులు (బిహేవియరల్ ప్రాబ్లమ్స్) వస్తాయి. పిల్లల్లో వచ్చే దృష్టి కేంద్రీకరణ లోపాలను కొద్దిపాటి ఓపికతో చాలా బాగా పరిష్కరించవచ్చు. సామాజిక బాధ్యతగల టీచర్లు ఉండే స్కూళ్లలో ఇలాంటి పిల్లలను తేలిగ్గా దారికి తేవచ్చు. అయితే కొద్దిగా మానసిక వైకల్యం ఉండి, ఇలాంటి దృష్టి కేంద్రీకరణ సమస్య వస్తే మాత్రం అలాంటి విద్యార్థులకు ప్రత్యేక (స్పెషల్) స్కూల్స్లో చేర్చాలి. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అవసరమవుతాయి. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. సోషల్ మీడియాలో పోస్ట్
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement