-
నేడే ‘ఫైనల్’ కూత...
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. గచ్చిబౌ లి ఇండోర్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ పోరుతో పదో సీజన్కు తెర పడనుంది. తొలిసారి తుది సమరానికి చేరుకున్న హరియాణా స్టీలర్స్తో గత ఏడాది రన్నరప్ పుణేరి పల్టన్ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ ఫైనల్కు సంబంధించి టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు జరగ్గా... పుణేరి పల్టన్ రెండోసారి... హరియాణా స్టీలర్స్ తొలిసారి ఫైనల్ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అంతిమ సమరంలో ఏ జట్టు గెలిచినా తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడుతుంది. ఈ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు పుణేరి పల్టన్, హరియాణా స్టీలర్స్ జట్లు ముఖాముఖిగా 14 సార్లు తలపడ్డాయి. 8 సార్లు పుణేరి జట్టు... 5 సార్లు హరియాణా జట్టు గెలుపొందాయి. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. తాజా సీజన్లో నిర్ణీత 22 లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న పుణేరి జట్టు 17 మ్యాచ్ల్లో నెగ్గి, రెండింటిలో ఓడి, మూడింటిని ‘టై’ చేసుకొని 96 పాయింట్లతో ‘టాపర్’గా నిలిచి నేరుగా సెమీఫైనల్ చేరుకుంది. మరోవైపు హరియణా 70 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్–2లో గుజరాత్ జెయింట్స్ను ఓడించి, సెమీఫైనల్ చేరిన హరియాణా ఈ కీలక పోరులో 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ను బోల్తా కొట్టించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. పుణేరి పల్టన్ తరఫున మోహిత్ గోయట్ ఈ సీజన్లో అత్యధికంగా 117 రెయిండింగ్ పాయింట్లు సాధించాడు. డిఫెన్స్ విభాగంలో మొహమ్మద్ రెజా 97 ట్యాకిల్ పాయింట్లు సంపాదించాడు. పుణేరి పల్టన్ జట్టు కెపె్టన్ అస్లమ్ ఇనామ్దార్ ఆల్రౌండ్ ప్రదర్శనతో 164 పాయింట్లతో అదరగొట్టాడు. మరోవైపు హరియాణా స్టీలర్స్ రెయిడర్ వినయ్ ఏకంగా 160 పాయింట్లు కొల్లగొట్టాడు. డిఫెండర్ రాహుల్ 71 పాయింట్లు, కెపె్టన్ జైదీప్ 69 పాయింట్లతో ఆకట్టుకున్నారు. -
ఆనంద ‘ఖేలి’
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లు టైటిల్ పోరుకు చేరువయ్యాయి. గ్రామ/వార్డు స్థాయి జట్లు ఐదు దశల్లో కొనసాగుతూ చివరిదైన రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. విశాఖ వేదికగా ఈ పోటీలు జరుగుతుండగా 26 జిల్లాల జట్లు తలపడుతున్నాయి. ఒక్క మెన్ క్రికెట్ టైటిల్ పోరు మినహా మిగిలిన వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారం జరగనున్నాయి. మహిళల కేటగిరీలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారమే నిర్వహించనున్నారు. విశాఖలోని ఆరు వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి. వైఎస్సార్ బీ గ్రౌండ్తో పాటు ఏఎంసీ, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్, కేవీకే గ్రౌండ్లలో క్రికెట్ పోటీలు జరుగుతుండగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ఏయూ, బ్యాడ్మింటన్ పోటీలకు జీవీఎంసీ ఇండోర్ ఎన్క్లేవ్లు వేదికలుగా నిలిచాయి. ఖోఖో పురుష, మహిళా విభాగాల్లో ఆదివారం ప్రీక్వార్టర్ ఫైనల్స్ ముగియగా విజయం సాధించిన జట్లు క్వార్టర్స్కు అర్హత సాధించాయి. మిగిలిన అన్ని పోటీలూ సోమవారం పూర్తికానున్నాయి. మహిళా క్రికెట్లో తొలి సెమీస్ ముగియగా రెండో సెమీస్ జరగనుంది. విజయం సాధించిన జట్లు ఫైనల్స్ సోమవారం ఆడనున్నాయి. పురుషుల క్రికెట్ విభాగంలో రెండు జట్లు సెమీస్కు చేరుకోగా మరో రెండు క్వార్టర్ఫైనల్స్ జరగాల్సి ఉంది. గెలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధించిన జట్లతో తలపడనున్నాయి. అనంతరం ఫైనల్స్ ఈనెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. బ్యాడ్మింటన్ పురుష, మహిళా విభాగాల్లో సెమీస్లో విజయం సాధించిన జట్లు సోమవారం ఫైనల్స్ ఆడనున్నాయి. వాలీబాల్ మహిళా, పురుష విభాగాల్లోనూ రెండేసి జట్లు ఇప్పటికే సెమీస్కు చేరుకోగా విజయం సాధించినవి ఫైనల్స్లో తలపడనున్నాయి. మొత్తమ్మీద పురుష క్రికెట్ మినహా.. మిగతా అన్ని క్రీడాంశాలను సోమవారంతో ముగించాలని నిర్వాహకులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఐదు క్రీడాంశాల్లో విజేతలతోపాటు రన్నరప్, సెకండ్ రన్నరప్ జట్లు ట్రోఫీలతోపాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. -
9 నుంచి ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ తుదిఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఐదుదశల పోటీల్లో దిగ్విజయంగా నాలుగింటిన దాటుకుని ఫైనల్స్కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయగీతిక మోగించనుంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజి్రస్టేషన్లతో ఆడుదాం ఆంధ్రా రికార్డు సృష్టించింది. గ్రామ/వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. 8 క్రీడా మైదానాల ఎంపిక ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ ఫైనల్స్ కోసం విశాఖలో ఎనిమిది క్రీడా మైదానాలను తాత్కాలికంగా గుర్తించారు. క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం, ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీవీఎంసీ ఇందిరాప్రియదర్శిని, డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని గ్రౌండ్–బి, బ్యాడ్మింటన్ పోటీలను జీవీఎంసీ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ అవుట్డోర్, కబడ్డీని ఏయూ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాల్స్, ఖోఖోను ఏయూ జిమ్నాజియం అవుట్డోర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులను ఇన్చార్జీలుగా నియమించింది. పారదర్శకంగా నగదు బహుమతుల ప్రదానం 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటీటివ్ క్రీడలతోపాటు నాన్–కాంపిటీటివ్లో సంప్రదాయ మారథాన్, టెన్నీకాయిట్, యోగాలోను పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు (23,81,621 మంది పురుషులు, 14,27,120 మంది మహిళలు) నమోదు చేసుకున్నారు. ఇందులో గ్రామ/వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు (13,92,764 మంది పురుషులు, 10,53,774 మంది మహిళలు) పాల్గొన్నారు. వారిలో మండల స్థాయికి 17,10,456 మంది క్రీడాకారులు (8,55,228 మంది పురుషులు, 8,55,228 మంది మహిళలు) పోటీపడ్డారు. వారిలో 85,842 మంది క్రీడాకారులు (42,921 మంది పురుషులు, 42,921 మంది మహిళలు) నియోజకవర్గస్థాయిలో సత్తాచాటారు. నియోజకవర్గస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన జట్లకు (51,164 మంది క్రీడాకారులు పాల్గొంటే 28,513 మంది విజేతలు) నగదు బహుమతులు పొందారు. జిల్లాస్థాయి పోటీల అనంతరం ఫైనల్స్కు 1,482 మంది పురుషులు, 1,482 మంది మహిళలు.. మొత్తం 2,964 మంది అర్హత సాధించారు. ఆయా క్రీడల్లో తొలి మూడుస్థానాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పారదర్శకంగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బహుమతులను జమచేసేందుకు శాప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
ISSF World Cup 2024: ప్రపంచ రికార్డుతో పసిడి పతకం
భారత షూటర్ దివ్యాంశ్ సింగ్ పన్వర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్స్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కైరోలో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోరీ్నలో ఆదివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల దివ్యాంశ్ 253.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం నెగ్గాడు. గత ఏడాది ఆసియా క్రీడల్లో చైనా షూటర్ షెంగ్ లిహాయో 253.3 పాయింట్ల తో నెలకొల్పిన ప్రపంచ రికార్డును దివ్యాంశ్ బద్దలు కొట్టాడు. -
జొకోవిచ్ రికార్డు విజయం
టురిన్ (ఇటలీ): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్లో సెర్బియా దిగ్గజం, ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా 36 ఏళ్ల జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–3తో నెగ్గి ఈ టోర్నీని రికార్డుస్థాయిలో ఏడోసారి సొంతం చేసుకున్న తొలి ప్లేయర్గా ఘనత సాధించాడు. గతంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు ఏటీపీ ఫైనల్స్ టైటిల్ను గెల్చుకున్నాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు విన్నర్స్ ట్రోఫీతోపాటు 44,11,500 డాలర్ల (రూ. 36 కోట్ల 77 లక్షలు) ప్రైజ్మనీ, 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015, 2022లలో కూడా ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో చాంపియన్ గా నిలిచాడు. ఓవరాల్గా ఈ ఏడా ది జొకోవిచ్ ఏడు టైటిల్స్ను దక్కించుకున్నాడు. అడిలైడ్ ఓపెన్లో విజేతగా నిలిచిన జొకోవిచ్ ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, యూఎస్ ఓపెన్, పారిస్ ఓపెన్ మాస్టర్స్ టోర్నీ, ఏటీపీ ఫైనల్స్లో టైటిల్ సాధించాడు. కెరీర్లో 98వ సింగిల్స్ టైటిల్తో జొకోవిచ్ టెన్నిస్ చరిత్రలో 400 వారాలు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో నిలిచిన తొలి ప్లేయర్గా గుర్తింపు పొందాడు. -
World Cup 2023: సారీ సఫారీ... ఆసీస్ ఎనిమిదోసారి
ఎన్ని మలుపులు... ఎంత ఒత్తిడి... గడియారపు లోలకంలా చేతులు మారుతూ వచ్చిన ఆధిపత్యం... కుప్పకూలిపోతున్న దశ నుంచి కోలుకున్న జట్టు... అయినా సరే తక్కువ స్కోరుతో కట్టడి చేశామనే సంబరం... మెరుపు ఆరంభంతో సునాయాసం అనుకున్న విజయం... కానీ ఆపై ప్రతీ బంతి ప్రమాదకరంగా మారి వికెట్ కాపాడుకుంటే చాలనే స్థితి... టెస్టు మ్యాచ్ తరహా సీమ్ బౌలింగ్... టెస్టుల్లాగే ఫీల్డింగ్ ఏర్పాట్లు... ఒక వన్డే మ్యాచ్లో ఇవన్నీ కనిపించాయి... పేరుకే తక్కువ స్కోర్ల మ్యాచే కానీ తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలు... అదీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఆ లెక్కే వేరు... అది కూడా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ అంటే అనూహ్యానికి లోటుండదు... తొలి ఇన్నింగ్స్ స్కోరుతో 1999 ప్రపంచకప్ సెమీస్ను గుర్తుకు తెచి్చన పోరు చివరకు ఆసీస్ పరమైంది... ప్రమాదాన్ని తప్పించుకొని ఎట్టకేలకు గట్టెక్కిన ఆ్రస్టేలియా ఆదివారం అహ్మదాబాద్లో జరిగే తుది పోరులో భారత్తో ‘ఢీ’కి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్... 11.5 ఓవర్లలోనే స్కోరు 24/4... ఇక ఆట ముగిసినట్లే అనిపించింది... కానీ ఆసీస్ పట్టు విడిచింది. మిల్లర్ అద్భుత సెంచరీతో స్కోరు 212 వరకు చేరింది... ఎలా చూసినా సునాయాస లక్ష్యమే... ఆసీస్ అంచనాలకు తగినట్లుగా 6 ఓవర్లలో 60/0... ఇలాంటి తరుణంలో సఫారీ బౌలర్ల జోరు మొదలైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు ఒక్క సింగిల్ తీయడానికి కూడా ఆసీస్ బ్యాటర్లు బెదిరే స్థితి వచి్చంది... స్పిన్తో కేశవ్ మహరాజ్, షమ్సీ భయపెట్టించేశారు. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్పై పరుగులు చేయలేక కంగారూలపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు స్మిత్ కూడా కీలక స్థితిలో చెత్త షాట్తో పరిస్థితిని దిగజార్చాడు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో చివరి వరుస బ్యాటర్లు సాహసాలు చేయలేదు. ఆఖరికి మరో 16 బంతులు మిగిలి ఉండగా మాజీ చాంపియన్ విజయ తీరం చేరింది. చివరి వరకూ పోరాడినా... కీలకదశలో క్యాచ్లు వదిలేసి... మరోసారి దురదృష్టాన్ని భుజాన వేసుకొని తిరిగిన దక్షిణాఫ్రికా సెమీస్కే పరిమితమై నిరాశగా ని్రష్కమించింది. కోల్కతా: ఐదుసార్లు వరల్డ్కప్ విజేత ఆ్రస్టేలియా మరో టైటిల్ వేటలో ఫైనల్కు చేరింది. ఆదివారం భారత్తో తుది సమరంలో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో ఆ్రస్టేలియా 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ (116 బంతుల్లో 101; 8 ఫోర్లు, 5 సిక్స్లు) ఒంటరి పోరాటంతో శతకం సాధించగా... హెన్రీ క్లాసెన్ (48 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు...హాజల్వుడ్, ట్రవిస్ హెడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (48 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడైన ఆటతో ఆసీస్ విజయానికి పునాది వేయగా... స్టీవ్ స్మిత్ (62 బంతుల్లో 30; 2 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (18 బంతుల్లో 29; 1 ఫోర్, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆదివారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. మిల్లర్ మినహా... ఈడెన్ గార్డెన్స్లోనే భారత్తో మ్యాచ్లో లక్ష్యాన్ని ఛేదిస్తూ కుప్పకూలిన అనుభవంతో కావచ్చు దక్షిణాఫ్రికా బ్యాటింగ్కు మొగ్గు చూపింది. అయితే మబ్బులు పట్టిన వాతావరణంలో ఈ నిర్ణయం కలిసి రాలేదు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని ఆసీస్ బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీ జట్టు 12 ఓవర్ల లోపే 4 వికెట్లు కోల్పోయింది. బవుమా (0), డి కాక్ (3), మార్క్రమ్ (10), డసెన్ (6) విఫలమయ్యారు. ఈ స్థితిలో జట్టు కుప్పకూలుతుందేమో అనిపించినా... క్లాసెన్, మిల్లర్ కలిసి ఆదుకున్నారు. కొద్దిసేపు మ్యాచ్కు వాన అంతరాయం కలిగించినా... ఆట కొనసాగిన తర్వాత వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 70 బంతుల్లో మిల్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఐదో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం తర్వాత పార్ట్టైమ్ బౌలర్ ట్రవిస్ హెడ్ సఫారీలను దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో క్లాసెన్, జాన్సెన్ (0)లను పెవిలియన్ పంపడంతో జట్టు వెనకడుగు వేసింది. ఆ తర్వాత మిల్లర్ ఒక్కడే బాధ్యతను తీసుకున్నాడు. జంపా బౌలింగ్లోనే అతను నాలుగు సిక్సర్లు బాదటం విశేషం. మిల్లర్కు కొయెట్జీ (19) కొద్దిసేపు సహకరించాడు. కమిన్స్ వేసిన 48వ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్గా మలచిన మిల్లర్ 115 బంతుల్లో శతకం సాధించగా, ఇదే షాట్తో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. కలిసొచి్చన శుభారంభం... స్వల్ప లక్ష్యమే అయినా ఆ్రస్టేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అదే చివరకు ఆ జట్టు విజయానికి పునాది వేసింది. హెడ్, వార్నర్ పోటీపడి పరుగులు సాధించడంతో 6 ఓవర్లలోనే స్కోరు 60 పరుగులకు చేసింది. రబడ బౌలింగ్లోనే వార్నర్ 3 సిక్స్లు బాదాడు. అయితే వరుస ఓవర్లలో వార్నర్, మార్‡్ష (0)లను అవుట్ చేసి సఫారీ కాస్త పైచేయి ప్రదర్శించింది. కొయెట్జీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు బాది హెడ్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. హెడ్ క్రీజ్లో ఉన్నంతసేపు ఆసీస్ ధీమాగానే ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఇద్దరు స్పిన్నర్లు షమ్సీ, మహరాజ్లతో బౌలింగ్ మొదలు పెట్టిన తర్వాత కంగారూల్లో తడబాటు మొదలైంది. ఈడెన్ పిచ్పై అనూహ్యంగా టర్న్ అవుతున్న బంతి బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టింది. ఆసీస్ ఒక్కో పరుగు తీయడానికి తీవ్రంగా శ్రమించింది. తన తొలి బంతికే హెడ్ను మహరాజ్ బౌల్డ్ చేయగా... షమ్సీ బౌలింగ్లో లబుõÙన్ (18), మ్యాక్స్వెల్ (1) అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్లు సమరి్పంచుకున్నారు. దాంతో సఫారీలు పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇన్గ్లిస్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్కు 37 పరుగులు జోడించి స్మిత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే కొయెట్జీ అద్భుత బౌలింగ్తో తక్కువ వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్ పంపడంతో పరిస్థితి మళ్లీ మారింది. అయితే స్టార్క్ (16 నాటౌట్), కమిన్స్ (14 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ అభేద్యంగా 22 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) కమిన్స్ (బి) హాజల్వుడ్ 3; బవుమా (సి) ఇన్గ్లిస్ (బి) స్టార్క్ 0; డసెన్ (సి) స్మిత్ (బి) హాజల్వుడ్ 6; మార్క్రమ్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 10; క్లాసెన్ (బి) హెడ్ 47; మిల్లర్ (సి) హెడ్ (బి) కమిన్స్ 101; జాన్సెన్ (ఎల్బీ) (బి) హెడ్ 0; కొయెట్జీ (సి) ఇన్గ్లిస్ (బి) కమిన్స్ 19; కేశవ్ మహరాజ్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 4; రబడ (సి) మ్యాక్స్వెల్ (బి) కమిన్స్ 10; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–1, 2–8, 3–22, 4–24, 5–119, 6–119, 7–172, 8–191, 9–203, 10–212. బౌలింగ్: స్టార్క్ 10–1–34–3, హాజల్వుడ్ 8–3–12–2, కమిన్స్ 9.4–0–51–3, జంపా 7–0–55–0, మ్యాక్స్వెల్ 10–0–35–0, హెడ్ 5–0–21–2. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) మహరాజ్ 62; వార్నర్ (బి) మార్క్రమ్ 29; మార్‡్ష (సి) డసెన్ (బి) రబడ 0; స్మిత్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 30; లబుõÙన్ (ఎల్బీ) (బి) షమ్సీ 18; మ్యాక్స్వెల్ (బి) షమ్సీ 1; ఇన్గ్లిస్ (బి) కొయెట్జీ 28; స్టార్క్ (నాటౌట్) 16; కమిన్స్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 17; మొత్తం (47.2 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–60, 2–61, 3–106, 4–133, 5–137, 6–174, 7–193. బౌలింగ్: జాన్సెన్ 4.2–0–35–0, రబడ 6–0–41–1, మార్క్రమ్ 8–1–23–1, కొయెట్జీ 9–0–47–2, షమ్సీ 10–0–42–2, మహరాజ్ 10–0–24–1. 8: వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరడం ఆస్ట్రేలియా జట్టుకిది ఎనిమిదోసారి. గతంలో ఆ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో ఏడుసార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఐదుసార్లు చాంపియన్గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. 5: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఐదో సెమీఫైనల్ ఆడిన దక్షిణాఫ్రికా ఐదుసార్లు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. 1992లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999లో ఆ్రస్టేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ను దక్షిణాఫ్రికా ‘టై’ చేసుకుంది. అయితే ‘సూపర్ సిక్స్’ దశలో ఎక్కువ పాయింట్లు సాధించినందుకు ఆ్రస్టేలియా ఫైనల్ చేరింది. దక్షిణాఫ్రికాకు నిరాశ ఎదురైంది. 2007లో ఆ్రస్టేలియా చేతిలోనే సెమీఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా... 2015లో న్యూజిలాండ్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. తాజాగా ఆస్ట్రేలియా చేతిలో మరోసారి ఓడిపోయింది. 1: భారత గడ్డపై వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ఆ్రస్టేలియాకిదే తొలిసారి కావడం విశేషం. 1996లో భారత్ వేదికగా జరిగిన టైటాన్ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో మూడుసార్లు ఓడిన ఆస్ట్రేలియా.. తాజా ప్రపంచకప్లో లీగ్ దశలో ఓటమి పాలైంది. అయితే కీలకమైన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆ్రస్టేలియా ఓడించింది. 2: వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్స్ జరగనుండటం ఇది రెండోసారి. 1996, 2007 ప్రపంచకప్ టోర్నీల్లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా... ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
‘ఫినిషింగ్ టచ్’ ఎవరిదో?
కాన్కున్ (మెక్సికో): మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా టాప్–8లో నిలిచిన క్రీడాకారిణులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించారు. నవంబర్ ఐదో తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి మెక్సికోలోని కాన్కున్ నగరం ఆతిథ్యమిస్తోంది. ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ సబలెంకా (బెలారస్), రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), మూడో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా), నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్), ఐదో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా), ఆరో ర్యాంకర్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఏడో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఎనిమిదో ర్యాంకర్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) గాయం కారణంగా వైదొలగడంతో సాకరికి ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ‘బాకలార్ గ్రూప్’లో సబలెంకా, రిబాకినా, పెగూలా, సాకరి... ‘చెటుమల్ గ్రూప్’లో స్వియాటెక్, కోకో గాఫ్, జబర్, వొండ్రుసోవా ఉన్నారు. గ్రూప్ దశ మ్యాచ్లు ముగిశాక రెండు గ్రూప్ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు. గత ఏడాది రన్నరప్ సబలెంకా ఈసారి ఫైనల్ చేరితే ఆమె ఈ ఏడాదిని నంబర్వన్ ర్యాంక్తో ముగిస్తుంది. ఈ సంవత్సరం సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టైటిల్ గెలిచి, యూఎస్ ఓపెన్లో రన్నరప్గా నిలిచింది. వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో సెమీఫైనల్ చేరుకుంది. స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్లో, వొండ్రుసోవా వింబుల్డన్ టోర్నీలో, కోకో గాఫ్ యూఎస్ ఓపెన్లో టైటిల్స్ సాధించారు. మొత్తం టోర్నీ ప్రైజ్మనీ 90 లక్షల డాలర్లు (రూ. 75 కోట్లు). పార్టిసిపేషన్ ఫీజు రూపంలో ఎనిమిది మందికి 1,98,000 డాలర్ల (రూ. కోటీ 65 లక్షలు) చొప్పున లభిస్తాయి. లీగ్ దశలో ఒక్కో విజయానికి అదనంగా 1,98,000 డాలర్లు (రూ. కోటీ 65 లక్షలు) అందజేస్తారు. ఈ టోర్నీలో అజేయంగా విజేతగా నిలిచిన క్రీడాకారిణి 30,24,000 డాలర్లు (రూ. 25 కోట్ల 21 లక్షలు) ప్రైజ్మనీగా అందుకుంటుంది. -
Asia cup : 11వ సారి ఫైనల్లోకి.. టైటిల్ కోసం టీమిండియాతో పోరు
కొలంబో: ఆసియా కప్ ఫైనల్ మరోసారి భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. గురువారం హోరాహోరీగా సాగిన ‘సూపర్–4’ మ్యాచ్లో లంక 2 వికెట్ల తేడాతో పాక్ను ఓడించి ఈ టోర్నీలో 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో చివరకు లంకదే పైచేయింది. వర్షం కారణంగా మ్యాచ్ను ముందుగా 45 ఓవర్లకు, ఆ తర్వాత 42 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (73 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు), అబ్దుల్లా షఫీక్ (69 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఇఫ్తికార్ అహ్మద్ (40 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఒకదశలో జట్టు స్కోరు 130/5 కాగా... రిజ్వాన్, ఇఫ్తికార్ ఆరో వికెట్కు 108 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం లంక లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ ద్వారా 42 ఓవర్లలో 252 పరుగులుగా నిర్దేశించారు. లంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు సాధించి గెలిచింది. కుశాల్ మెండిస్ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), సదీరా సమరవిక్రమ (51 బంతుల్లో 48; 4 ఫోర్లు), అసలంక (47 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో శ్రీలంక నాలుగు పాయింట్లతో ‘సూపర్–4’ దశలో రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) మదుషన్ (బి) పతిరణ 52; ఫఖర్ (బి) మదుషన్ 4; బాబర్ (స్టంప్డ్) మెండిస్ (బి) వెలలాగె 29; రిజ్వాన్ (నాటౌట్) 86; హారిస్ (సి అండ్ బి) పతిరణ 3; నవాజ్ (బి) తీక్షణ 12; ఇఫ్తికార్ (సి) షనక (బి) పతిరణ 47; షాదాబ్ (సి) మెండిస్ (బి) మదుషన్ 3; షాహిన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం (42 ఓవర్లలో 7 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–9, 2–73, 3–100, 4–108, 5–130, 6–238, 7–243. బౌలింగ్: మదుషన్ 7–1–58–2, తీక్షణ 9–0–42–1, షనక 3–0–18–0, వెలలాగె 9–0–40–1, పతిరణ 8–0–65–3, ధనంజయ 6–0–28–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి అండ్ బి) షాదాబ్ 29; పెరీరా (రనౌట్) 17; మెండిస్ (సి) హారిస్ (బి) ఇఫ్తికార్ 91; సమరవిక్రమ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) ఇఫ్తికార్ 48; అసలంక (నాటౌట్) 49 ; షనక (సి) నవాజ్ (బి) ఇఫ్తికార్ 2; ధనంజయ (సి) వసీమ్ (బి) షాహిన్ 5; వెలలాగె (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 0; మదుషన్ (రనౌట్) 1; పతిరణ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (42 ఓవర్లలో 8 వికెట్లకు) 252. వికెట్ల పతనం: 1–20, 2–77, 3–177, 4–210, 5–222, 6–243, 7–243, 8–246. బౌలింగ్: షాహిన్ 9–0–52–2, జమాన్ 6–1–39–0, వసీమ్ 3–0–25–0, నవాజ్ 7–0–26–0, షాబాద్ 9–0–55–1, ఇఫ్తికార్ 8–0–50–3. -
వావ్...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!
ఆసియా రికార్డు బద్దలుకొట్టిన భారత పురుషుల అథ్లెటిక్స్ బృందంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్పందించారు. సైన్స్, విజ్ఞాన విషయాలపైనే కాదు తరచుగా క్రీడా వార్తులు విశేషాలపై తరచుగా స్పందించే ఆయన తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ 4X400 మీటర్ల విభాగంలో భారత పురుషుల రిలే జట్టు ఫైనల్కు క్వాలిఫై కావడంపై తన సంతోషాన్ని ఎక్స్(ట్విటర్) ప్రకటించారు. కానీ అయితే ఈ ఆదివారం జరిగిన ఫైనల్లో మనవాళ్లు ఐదో స్థానాన్ని మాత్రమే సాధించగలిగారు. ఈ విభాగంలో అమెరికా స్వర్ణం, ఫ్రాన్స్ రజతం, గ్రేట్ బ్రిటన్ కాంస్య పతకాలను గెల్చుకున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కు అర్హత సాధించిడం, ఆసియా రికార్డుపై స్పందించిన ఆనంద్ మహీంద్ర వావ్.. చూస్తోంటే.. అందరూ ఇప్పుడు మూన్ వైపే గురి పెట్టినట్టున్నారు. చిరుతల్లా దూసుకుపోతున్న మన అథ్లెటిక్స్ని చూడండి అంటూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేశారు. మరోవైపు ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియా తొలి బంగారు పతకాన్ని దక్కించుకుంది. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మరో ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో పురుషుల 4X400 మీటర్ల విభాగంలో ఇంటియన్ టీం మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్ చిరుతల్లా విజృంభించి కేవలం 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి ఫైనల్కు అర్హత సాధించి అందరిదృష్టినీ ఆకర్షించారు. అంతేకాదు వరల్డ్ అథ్లెటిక్స్లో ఈ విభాగంలో భారత్ ఫైనల్స్కు క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. What? When? Where? An Indian men’s 4x400 relay team qualifying for the finals in the World Athletics Championship? Looks like everyone is shooting for the moon now… Look at them run…Our Cheetahs…. pic.twitter.com/K0Il2UEXpR — anand mahindra (@anandmahindra) August 27, 2023 Who saw this coming 😳 India punches its ticket to the men's 4x400m final with a huge Asian record of 2:59.05 👀#WorldAthleticsChamps pic.twitter.com/fZ9lBqoZ4h — World Athletics (@WorldAthletics) August 26, 2023 -
విదిత్ సంచలనం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్మాస్టర్ ఇయాన్ నిపోమ్ని షితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విదిత్ 4–2తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లను ఆడించగా ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్లను ఆడించారు. ఈ రెండింటిలో విదిత్ గెలుపొందడం విశేషం. తొలి గేమ్లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్ రెండో గేమ్లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఈ టోర్నీలో నాలుగో భారత ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్ చేరారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్లలో కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో విదిత్; ప్రజ్ఞానందతో అర్జున్; కరువానా (అమెరికా)తో లీనియర్ (అమెరికా) తలపడతారు. హారిక ఓటమి మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో హారిక 3.5–4.5తో అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. వీరిద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లు నిర్వహించారు. తొలి గేమ్లో గోర్యాచ్కినా, రెండో గేమ్లో హారిక గెలిచారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం నిర్వహించిన రెండు గేమ్లు ‘డ్రా’ కావడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి రెండు గేమ్లు నిర్వహించగా... తొలి గేమ్లో గోర్యాచ్కినా 43 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్ను 95 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. -
అల్కరాజ్తో జొకోవిచ్ ‘ఢీ’
లండన్: రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం నొవాక్ జొకోవిచ్... కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం కార్లోస్ అల్కరాజ్... ఆదివారం జరిగే వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తలపడనున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్) గంటా 50 నిమిషాల్లో 6–3, 6–3, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై... డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 2 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 7–6 (7/4)తో ఆరో సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ)పై విజయం సాధించారు. జొకోవిచ్ తన కెరీర్లో 35వసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... అల్కరాజ్కిది రెండో గ్రాండ్స్లామ్ ఫైనల్ కానుంది. అల్కరాజ్ గత ఏడాది యూఎస్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సినెర్తో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 11 ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 25 సార్లు దూసుకొచ్చి 17 సార్లు పాయింట్లు గెలిచాడు. 33 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్విస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొమ్మిదోసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్ చేరిన జొకోవిచ్ ఏడుసార్లు విజేతగా నిలిచాడు. మెద్వెదెవ్తో జరిగిన మ్యాచ్లో అల్కరాజ్ నాలుగు ఏస్లు సంధించాడు. నెట్ వద్దకు 36 సార్లు దూసుకొచ్చి 28 సార్లు పాయింట్లు నెగ్గాడు. తన సర్విస్ను రెండుసార్లు కోల్పోయిన ఈ స్పెయిన్ స్టార్ మెద్వెదెవ్ సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. -
గుజరాత్ గ్రేట్ చెన్నై తోపు ...
-
గిల్ దున్నేస్తున్నాడు .. ఇక ఛాంపియన్ CSK
-
చెన్నైVS గుజరాత్
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
IPL Final: వాన వచ్చె... వాయిదా పడె
ఐపీఎల్–2023 విజేత ఎవరో తేలేందుకు మరో రోజు వేచి చూడాల్సిందే. ఫైనల్ కోసం మైదానంలో లక్షకు పైగా ఉన్న అభిమాన సందోహం సరిపోదన్నట్లుగా నేనూ ఉన్నానంటూ వరుణ దేవుడు వచ్చేయడంతో అంతా మారిపోయింది. టాస్ సమయానికి అరగంట ముందు మొదలైన వాన నిరంతరాయంగా కురవడంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. ఎంత ఎదురు చూసినా వర్షం తెరిపినివ్వలేదు. దాంతో ఆదివారం జరగాల్సిన తుది పోరును సోమవారానికి వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్ డే అయిన నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కోసం తలపడతాయి. అన్నట్లు సోమవారం కూడా 10 శాతం వర్ష సూచన ఉంది. అయితే ఏమాత్రం వర్షసూచన లేని ఆదివారమే ఇలా జరిగితే సోమవారం ఏం జరుగుతుందనేది ఆసక్తికరం! అహ్మదాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో మొత్తం 73 మ్యాచ్లు జరిగాయి. ఒక మ్యాచ్ వర్షం బారిన పడి రద్దు కాగా, మరో మ్యాచ్లో వర్షం ఆటంకం కలిగించినా ఒక్క బంతి కూడా వృథా కాలేదు. కానీ అసలైన అంతిమ సమరం సమయానికి మాత్రం వరుణుడు పూర్తి ప్రతాపం చూపించాడు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫైనల్ పోరుకు అడ్డుగా నిలిచాడు. మండు వేసవిలో అహ్మదాబాద్లో వర్షం అంటే అలా కొద్దిసేపు వచ్చి పోయే చినుకుల్లా అందరూ భావించినా ఆదివారం మాత్రం అలా జరగలేదు. చివరకు ఫైనల్ మ్యాచ్ నేటికి వాయిదా పడింది. సాయంత్రం 6.30 సమయంలో స్వల్పంగా వాన మొదలైంది. ఆ తర్వాతి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వచ్చింది. కవర్లు కప్పడం, తొలగించడం మళ్లీ మళ్లీ జరిగాయి. 9 గంటల సమయంలో మాత్రం వాన పూర్తిగా తగ్గిపోయింది. దాంతో అంపైర్లతో పాటు ఇరుజట్ల ఆటగాళ్లు, కోచ్లు మైదానంలోకి వచ్చారు. అంతా పిచ్ను, అవుట్ఫీల్డ్ను పరిశీలించడంతో పాటు వామప్ కూడా మొదలైంది. అయితే ఒక్కసారిగా వాన జోరందుకోవడంతో అంతా పరుగెడుతూ గ్రౌండ్ వీడారు. ఆ తర్వాత దాదాపు రెండు గంటల పాటు వేచి చూసినా ఫలితం కనిపించలేదు. రాత్రి 9.30కి ఆట ఆరంభమైతే పూర్తి ఓవర్లు సాగేవి. ఆపై ఓవర్ల కోతతోనైనా మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు ప్రయత్నించారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలన్నా అర్ధరాత్రి 12.06కు ఆట ఆరంభం కావాలి. దానికి కనీసం గంట ముందుగా వాన ఆగిపోవాలి. అయితే అనుకున్న సమయానికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఇరు జట్ల కోచ్లు స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆశిష్ నెహ్రాల ‘షేక్ హ్యాండ్’తో అధికారికంగా ఖాయమైంది. నేడు వాన కురిస్తే... ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎలాగైనా ఫైనల్ మ్యాచ్ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 20 ఓవర్ల నుంచి 15 ఓవర్ల లేదా 10 ఓవర్ల లేదా 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరపాల్సిందే. చివరకు అదీ సాధ్యం కాకపోతే రాత్రి. గం. 1.20 సమయంలో ‘సూపర్ ఓవర్’తోనైనా ఫలితాన్ని తేలుస్తారు. అయితే దానికీ అవకాశం లేకపోతే మాత్రం లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చాంపియన్గా నిలుస్తుంది. -
‘ఫైనల్’ ధమాకా.. సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఈ ఐపీఎల్కు ఎవరు శుభం కార్డు వేస్తారో ఈ రాత్రే తేలుతుంది. ఈ సీజన్కు శ్రీకారం చుట్టిన జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరుగనుండటం ఆసక్తికరం.డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ‘డబుల్ ధమాకా’కు సన్నద్ధం కాగా... నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ‘ఫైవ్ స్టార్’ ముంబై సరసన నిలవాలని ఆశిస్తోంది. రెండూ మేటి జట్లే! ఈ సీజన్ అసాంతం గట్టి పోరాటాలే చేశాయి. ఓపెనర్ల మెరుపులే ఇరు జట్లను శాసిస్తున్నాయి. మరి ఈ ఫైనల్లో ఎవరి మెరుపులు విజయాన్నిస్తాయో ఈ ‘సూపర్ సండే’ రోజు చూసేయండి. అహ్మదాబాద్: తొలి క్వాలిఫయర్ చూశాం కదా... మళ్లీ చూద్దాం ‘ఫైనల్’గా! ఎందుకంటే ఆ మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), గుజరాత్ టైటాన్స్ మధ్యే టైటిల్ పోరు జరుగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఆల్రౌండ్ సమతూకంతో ఉన్న జట్ల మధ్యే అమీతుమీ జరగనుండటం... టాపార్డర్లో హిట్టర్లుండటంతో నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల విందు ఖాయం. టైటాన్స్ తమ సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకునేందుకు తహతహలాడుతోంది. శుబ్మన్ గిల్ సంచలన శతకాలు, బౌలర్ల వెన్నుదన్ను జట్టును మరో మెట్టుపై నిలబెడుతోంది. అలాగని సూపర్ కింగ్స్ను తక్కువ చేయలేం. కీలకమైన మ్యాచ్ల్లో ధోని మార్క్ సారథ్యం జట్టుకు అదనపు ‘ఇంపాక్ట్’ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫైనల్ ఫైనలే! ఎవరూ తగ్గేదేలే! ధోని అనుభవం గెలిపిస్తుందా? ధోని... ధోని... ఇప్పుడంతా ఇదే ఫీవర్. వచ్చే సీజన్ ఆడేది లేనిది ఇప్పుడైతే చెప్పలేదు కానీ. ట్రోఫీ గెలిస్తే మాత్రం విజయంతో నిష్క్రమించే అవకాశాలైతే ఉన్నాయి. అందుకేనేమో ఇర్ఫాన్ పఠాన్లాంటి గుజరాతీలు సైతం దిగ్గజ కెప్టెన్ ఉన్న సూపర్ కింగ్సే గెలవాలని మనసారా కోరుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేల శుభారంభమిస్తే... దీనికి అజింక్య రహానే, శివమ్ దూబే మెరుపులు తోడయితే చెన్నై భారీస్కోరుకు ఢోకానే ఉండదు. డెత్ ఓవర్లను కాచుకునేందుకు మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ఉండనే ఉన్నారు. బౌలింగ్లో తీక్షణ, పతిరణ తుషార్ దేశ్పాండే, దీపక్ చహర్లు ధోని నమ్మకాన్ని నిలబెడుతున్నారు. ధోనికిది 11వ ఐపీఎల్ ఫైనల్. (చెన్నై తరఫున పదోది) అయితే చెన్నైకిది మింగుడు పడని వేదిక అహ్మదాబాద్. ఇక్కడ ఆడిన మూడుసార్లూ చెన్నై ఓడిపోయింది. ఇదొక్కటే జట్టుకు మైనస్! అచ్చొచ్చే సొంతగడ్డపై... ప్లే ఆఫ్స్లో గుజరాత్... చెన్నైతో వెనుకబడినప్పటికీ రెండో క్వాలిఫయర్లో ఐదుసార్లు చాంపియన్ ముంబైని మట్టికరిపించింది. శుబ్మన్ గిలే జట్టు బలం. ఈ సీజన్లో మూడు సెంచరీలతో జోరుమీదున్నాడు. కలిసొచ్చే అహ్మదాబాద్ వేదికపై మళ్లీ చెలరేగినా ఆశ్చర్యమైతే లేదు. ఎందుకంటే ఇక్కడే గుజరాత్ తొమ్మిదింట ఆరు మ్యాచుల్లో గెలిచింది. సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిల్లర్లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే... షమీ (28 వికెట్లు), రషీద్ ఖాన్ (27 వికెట్లు), మోహిత్ శర్మ (24 వికెట్లు)లతో బౌలింగ్ దళం కూడా దీటుగా ఉంది. పర్పుల్ క్యాప్ రేసులో ఈ ముగ్గురే ఉన్నారు. 9 ఇప్పటి వరకు జరిగిన 15 ఐపీఎల్ ఫైనల్స్లో తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఆరుసార్లు ఛేజింగ్ చేసిన జట్టు చాంపియన్గా అవతరించింది. 3 నేటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) జట్ల తర్వాత వరుసగా రెండేళ్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది. 0 ఇప్పటి వరకు 15 ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ల్లో ఏ జట్టు కూడా ఒక్కసారీ ఆలౌట్ కాలేదు. 5 మొత్తం ఐపీఎల్ ఫైనల్స్లో ఐదుసార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేశాయి. రూ. 20 కోట్లు ఐపీఎల్ విజేత జట్టుకు లభించే ప్రైజ్మనీ. రూ. 13 కోట్లు ఐపీఎల్లో రన్నరప్గా నిలిచే జట్టుకు లభించే మొత్తం. తుది జట్లు (అంచనా) గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, మిల్లర్, తెవాటియా, విజయ్ శంకర్/జోష్ లిటిల్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, శివమ్ దూబే/పతిరణ, రహానే, రాయుడు, జడేజా, మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్, తీక్షణ. పిచ్, వాతావరణం ఈ సీజన్లో నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల మోత మోగింది. 8 మ్యాచ్ల్లో సగటు స్కోరు 193. ఇందులో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసి జట్లే గెలిచాయి. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పు లేదు. -
ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్.. సింధు కథ ముగిసే
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మహిళల సింగిల్స్లో పతకంపై ఆశలు రేపిన ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి పట్టింది. శనివారం జరిగినసెమీఫైనల్లో ఆమె జార్జియా మరిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓటమిపాలైంది. అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ షట్లర్ హెచ్హెస్ ప్రణయ్(HS Prannoy) మలేషియా మాస్టర్స్ సూపర్ 500 ఫైనల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అతడికి ఇదే తొలి ఏటీపీ ఫైనల్ కావడం విశేషం. ఫామ్లో ఉన్న ప్రణయ్ సెమీఫైనల్లో క్రిస్టియన్ ఆదినాథ(ఇండేనేషియా)తో తలపడ్డాడు. అయితే.. క్రిస్టియన్ మోకాలి గాయంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. 19-17 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియన్ మ్యాచ్ మధ్యలో జంప్ చేసి వెనక్కి తిరుగుతుండగా మోకాలి నొప్పితో విలవిలలాడాడు. దాంతో, వెంటనే ప్రణయ్, భారత కోచ్ అతడి వద్దకు పరుగెత్తుకెళ్లారు. ఆట కొనసాగించేందుకు క్రిస్టియన్ సిద్ధంగా లేకపోవడంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బయటకు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహకులు ప్రణయ్ని విజేతగా ప్రకటించారు. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్నర్తో అతడు తలపడనున్నాడు. sportsmanship 👏🏻 hopefully it’s nothing serious ;( have a good recovery cea! pic.twitter.com/sEVL2eP8Di— bobe (@bobeside) May 27, 2023 Former champion Pusarla V. Sindhu 🇮🇳 faces Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #MalaysiaMasters2023 pic.twitter.com/sbDIsKZ1lq— BWF (@bwfmedia) May 27, 2023 #BWF | Komentar dan pesan menyentuh dari Prannoy H.S. yang jadi saksi tumbangnya Christian Adinata karena cedera. Prannoy juga yang pertama datang untuk menenangkan CeA setelah terjatuh di lapangan. Respect Prannoy! Good luck for the final!! 🙏🏼❤️ pic.twitter.com/JP2LZSwVwo— SPOTV Indonesia (@SPOTV_Indonesia) May 27, 2023 చదవండి: 'త్వరలో మిమ్మల్ని కలుస్తా'.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్ -
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
#MI: క్వాలిఫయర్-2లోనే ఆపండి.. ఫైనల్కు వచ్చిందో అంతే!
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్ను గెలిచి కానీ వెళ్లలేదు. అత్యధికసార్లు ఫైనల్ చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించినా.. ఆ జట్టు నాలుగుసార్లు ఛాంపియన్గా.. ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. కానీ ముంబై అలా కాదు.. నిష్క్రమిస్తే లీగ్ స్టేజీ.. లేదా ప్లేఆఫ్స్లో.. కానీ ఒక్కసారి ఫైనల్కు వచ్చిందా కప్ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్గా.. ఐపీఎల్లో ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ది ఒకేరకమైన ఆటతీరు. తొలి రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపని ముంబై 2010లో మాత్రం తొలిసారి ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2011, 2012ల్లో ప్లేఆఫ్స్కు పరిమితమైంది. 2013లో తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా అవతరించిన ముంబై ఇండియన్స్ ఆటతీరు అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. అలా 2015, 2017, 2019 ఇలా బేసి సంఖ్య విధానంలో నాలుగుసార్లు ఛాంపియన్గా అవతరించిన ముంబై ఇండియన్స్.. ODD Yearsలోనే కప్ కొడుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం కరెక్ట్ కాదని చెబుతూ 2020లో ఐదోసారి ఛాంపియన్గా నిలిచింది ముంబై ఇండియన్స్. ఆరంభంలో వరుస ఓటములు.. తర్వాత ఫుంజుకొని ఛాంపియన్గా ఏ సీజన్ అయినా ముంబై ఇండియన్స్ తొలి అంచె పోటీల్లో ఎక్కువగా ఓటములను చవిచూస్తూనే వచ్చింది. ఛాంపియన్గా నిలిచిన ఐదు సందర్భాల్లో నాలుగుసార్లు సీజన్ను ఓటములతోనే ఆరంభించింది. మొదట వరుసగా ఓటములు.. మధ్యలో ఫుంజుకొని విజయాలతో బలంగా తయారవుతుంది. ప్రతీ సీజన్లో ఇదే స్ట్రాటజీతో కనిపించే ముంబై ఇండియన్స్ ఈసారి కూడా అదే ఆటతీరు కనబరిచింది. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆర్సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్ఆర్హెచ్పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్లో అడుగుపెట్టింది. ప్లేఆఫ్కు వస్తే చాలు ఎక్కడలేని బలం.. ప్లేఆఫ్కు వచ్చిందంటే ముంబైలో ఎక్కడలేని బలం వస్తోంది. ప్రత్యర్థి జట్టు బలహీనతను ఆసరాగా చేసుకొని వారిని కోలుకోలేని దెబ్బతీసి విజయం సాధించడం ముంబై స్ట్రాటజీ. లక్నోతో ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై అదే చేసింది. క్వాలిఫయర్-2లో గుజరాత్ను ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరిందో ఆరోసారి టైటిల్ కొట్టేందుకు శతవిధాల ప్రయత్నిచడం ఖాయం. అందుకే ముంబై ఇండియన్స్ను క్వాలిఫయర్-2లోనే గుజరాత్ ఆపాలని సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నట్లు తెలిసింది. A MI-ghty special victory! 😎 The Mumbai Indians win by 81 runs and progress to the #Qualifier2 of #TATAIPL 2023 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/CVo5K1wG31#TATAIPL | #Eliminator | #LSGvMI pic.twitter.com/77zW6NmInn — IndianPremierLeague (@IPL) May 24, 2023 📍Next Stop: Ahmedabad ✈#LSGvMI #TATAIPL #IPLonJioCinema #MumbaiIndians | @mipaltan pic.twitter.com/TRp8f0vugT — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: జాఫర్కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్కార్డ్; భలే దొరికాడు కోహ్లితో కదా వైరం.. రోహిత్ ఏం చేశాడు! -
ITF Womens Open: ఫైనల్లో అంకితా రైనా
బెంగళూరు: ఐటీఎఫ్ మహిళల ఓపెన్ టోర్నీలో భారత అమ్మాయి, నాలుగో సీడ్ అంకితా రైనా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అంకిత 6–1, 6–1 స్కోరుతో భారత్కే చెందిన రుతుజ భోస్లేపై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన టాప్ సీడ్ బ్రెండా ఫ్రుహ్విర్టోవాతో తలపడుతుంది. సెమీస్లో 15 ఏళ్ల ఫ్రుహ్విర్టోవా 7–6 (7/2), 6–2 తేడాతో దలీలా జకుపోవిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో భాగంగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది. -
Sakshi Premier League 2023: ఫైనల్లో ఎస్ఆర్ఆర్, గౌతమ్ కాలేజీ జట్లు
ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జూనియర్ విభాగంలో ఎస్ఆర్ఆర్ కాలేజి (మంచిర్యాల), గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల), భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్పురి) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫైనల్స్ నేడు జరుగుతాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలోని బాబురావు సాగర్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది. సోమవారం జరిగిన జూనియర్ విభాగం తొలి మ్యాచ్లో ఎస్ఆర్ఆర్ కాలేజి తొమ్మిది వికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)పై గెలిచింది. ముందుగా పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్ఆర్ కాలేజి 7.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసి గెలుపొందింది. ఎస్ఆర్ఆర్ ప్లేయర్ కృష్ణతేజ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి 67 పరుగుల తేడాతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)ను ఓడించింది. ముందుగా గౌతమ్ కాలేజి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 52 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. సీనియర్ విభాగం తొలి మ్యాచ్లో వాగ్దేవి డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజి (ఖమ్మం)పై నెగ్గింది. ముందుగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయగా... వాగ్దేవి కాలేజి 6 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసి గెలిచింది. సాయి 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సీనియర్ విభాగం రెండో మ్యాచ్లో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి ఐదు వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజిని ఓడించింది. మొదట ఎస్ఆర్బీజీఎన్ఆర్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్ వివేకానంద కాలేజి 6.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. భవాన్స్ ప్లేయర్ కృతిక్ 17 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. -
రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్
బెంగళూరు: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మాజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బెంగళూరులో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును... ఇండోర్లో జరిగిన మరో సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్పై గెలుపొందాయి. ఈనెల 16 నుంచి కోల్కతాలో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ తలపడతాయి. ఆట చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 123/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 234 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌరాష్ట్ర 115 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు బెంగాల్ నిర్దేశించిన 548 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్లో 241 పరుగులకు ఆలౌటైంది. -
Novak Djokovic: వరుసగా 27వ విజయం.. పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో
సెర్బియా టెన్నిస్ స్టార్.. వరల్డ్ నెంబర్ ఐదో ర్యాంకర్.. నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ఫైనల్కు దూసుకెళ్లాడు. కాగా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో ఫైనల్స్కు వెళ్లడం ఇది పదోసారి. శుక్రవారం అమెరికాకు చెందిన 35వ ర్యాంకర్ టామీ పాల్ను 7-5, 6-1,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. తొలి సెట్ నుంచే జొకోవిచ్ బలమైన సర్వీస్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని జొకోవిచ్ మ్యాచ్ మొత్తంలో ఏడు బ్రేక్ పాయింట్స్ సాధించడం విశేషం. ఇప్పటికే రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్స్లామ్ కొల్లగొట్టిన జొకోవిచ్ 10వ టైటిల్పై కన్నేశాడు. అంతేకాదు 21 కెరీర్ గ్రాండ్స్లామ్స్తో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(22 గ్రాండ్స్లామ్ టైటిల్స్) సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫైనల్ చేరిన ప్రతీసారి జొకోవిచ్ టైటిల్ కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో జొకోవిచ్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్లుగా ఓటమనేదే లేకుండా జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో దూసుకెళ్తున్నాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో గ్రీక్ టెన్నిస్ స్టార్ సిట్సిపాస్తో జొకోవిచ్ అమితుమీ తేల్చుకోనున్నాడు. #AusOpen semifinals: ✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️✔️#AusOpen finals: 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆❓ Will X mark the spot for @DjokerNole on Sunday?@wwos • @espn • @eurosport • @wowowtennis • #AO2023 pic.twitter.com/lcx6Wnm3dT — #AusOpen (@AustralianOpen) January 27, 2023 ఇంటిబాట పట్టిన కచనోవ్.. ఫైనల్కు సిట్సిపాస్ అంతకముందు జరిగిన మరో సెమీస్ పోరులో గ్రీక్ టెన్నిస్ స్టార్ స్టెపానోస్ సిట్సిపాస్(ప్రపంచ నాలుగో ర్యాంకర్).. రష్యాకు చెందిన కచనోవ్పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్లో సిట్సిపాస్.. కచనోవ్ను 7-6(7-2), 6-4,6-7(8-6), 6-3 తేడాతో మట్టికరిపించాడు. A sizzling semifinal ends in Greek glory 🇬🇷 @steftsitsipas overcomes a valiant Karen Khachanov to reach his first #AusOpen final. It ends 7-6(2) 6-4 6-7(6) 6-3 👏#AO2023 pic.twitter.com/jsik2uaovL — #AusOpen (@AustralianOpen) January 27, 2023
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement