-
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్.. ఐపీఎల్లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్కతా నైట్ రైడర్స్కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్ ఎన్నో రికార్డులు సాధించాడు.అంతేకాదు కెప్టెన్గా కేకేఆర్ను రెండుసార్లు చాంపియన్గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్లో మళ్లీ కేకేఆర్ గూటికి చేరాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టుకు మెంటార్గా ఉన్నాడు.ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.‘‘క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదు... ఐపీఎల్లో కెప్టెన్గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్ రోహిత్ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.ఎందుకంటే రోహిత్ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్తో కేకేఆర్ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ప్రస్తుత సీజన్లో కేకేఆర్ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. -
కోహ్లి స్ట్రైక్రేటుపై గంభీర్ వ్యాఖ్యలు.. వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. మీడియా అత్యుత్సాహం వల్లే తమ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు.అదే విధంగా ఐపీఎల్-2024లో ఆర్సీబీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్న కోహ్లి స్ట్రైక్రేటు గురించి కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి- అప్పటి లక్నో మెంటార్ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తాజా సీజన్లో కేకేఆర్ మెంటార్గా అవతారమెత్తిన గంభీర్.. ఇటీవలి మ్యాచ్ సందర్భంగా కోహ్లిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.గొడవ పడితే చూడాలనిఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘‘మేము ఇద్దరం గొడవ పడితే చూడాలని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు. వాళ్లను ఈ వీడియోలు నిరాశపరిచి ఉంటాయి’’ అని చమత్కరించాడు.ఈ విషయంపై తాజాగా స్పందించిన గౌతం గంభీర్ కోహ్లి వ్యాఖ్యలతో ఏకీభవించాడు. టీఆర్పీ రేటింగ్ల కోసమే మీడియా ఇలాంటివి ఎక్కువగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, విరాట్ కోహ్లి ఎలాంటి వాళ్లమో, తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో వారికి తెలియదన్న గౌతీ.. వీలైతే పాజిటివిటీని పెంచే అంశాలను చూపించాలన్నాడు.ఎవరికి వారే ప్రత్యేకంతాను, కోహ్లి పరిణతి చెందిన వ్యక్తులం కాబట్టి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోమని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి స్ట్రైక్రేటు గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు భిన్నంగా ఉంటాడు.మాక్స్వెల్ ఆడినట్లు కోహ్లి ఆడకపోవచ్చు. కోహ్లి తీరుగా మాక్స్వెల్ షాట్లు బాదలేకపోవచ్చు. పదకొండు మంది సభ్యులున్న జట్టులో ఎవరికి వారే ప్రత్యేకం. బ్యాటింగ్ ఆర్డర్లో 1- 8 వరకు విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో ఉంటే స్కోరు 300 కావొచ్చు లేదంటే 30 పరుగులకే ఆలౌట్ కావచ్చు.జట్టును గెలిపించినపుడు స్ట్రైక్రేటు 100 ఉన్నా బాగానే అనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 180 స్ట్రైక్రేటు కూడా మన కంటికి కనిపించదు. మ్యాచ్ జరిగే వేదిక, పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు.. ఇలా భిన్న అంశాలపై స్ట్రైక్రేటు ఆధారపడి ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు’’ అంటూ విరాట్ కోహ్లికి గంభీర్ మద్దుతుగా నిలిచాడు. కాగా ఈ సీజన్లో కోహ్లి ఆడిన 9 మ్యాచ్లలో కలిపి 145.76 స్ట్రైక్రేటుతో 430 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. -
సహనం కోల్పోయిన గంభీర్... అంపైర్తో గొడవ! ఆఖరికి..
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ సహనం కోల్పోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం పంజాబ్ కింగ్స్తో తలపడింది. సొంతగడ్డపై టాస్ ఓడిన కోల్కతా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓవర్ త్రో.. ఓ సింగిల్అయితే, కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ సందర్భంగా గౌతం గంభీర్ తీవ్ర అసహానికి గురయ్యాడు. పద్నాలుగో ఓవర్లో పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఆఖరి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా షార్ట్బాల్గా సంధించాడు. అప్పుడు క్రీజులో ఉన్న ఆండ్రీ రసెల్ ఆ బంతిని కవర్స్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో ఫీల్డర్ అశుతోష్ శర్మ ఇన్సైడ్ సర్కిల్లోనే బంతిని ఆపేసి.. వికెట్ కీపర్ జితేశ్ శర్మ వైపునకు విసిరాడు. అయితే, అది ఓవర్ త్రో అయింది. దీంతో మరో ఎండ్లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ను పిలిచి రసెల్ సింగిల్ తీశాడు. పరుగు ఇవ్వడం కుదరదుకానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి ఈ సింగిల్ను పరుగుల ఖాతాలో చేర్చేందుకు నిరాకరించాడు. అశుతోశ్ బంతిని ఆపేసిన తర్వాత.. తాను తాను ఓవర్ పూర్తైందని కాల్ ఇచ్చానని.. కాబట్టి ఈ ఓవర్ త్రో కారణంగా వచ్చిన పరుగు లెక్కలోకి రాదని స్పష్టం చేశాడు.ఇందుకు రసెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, డగౌట్లో ఉన్న కేకేఆర్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి వారికి సమీపంలో ఉన్న ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గంభీర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫోర్త్ అంపైర్తో వాదించాడు.pic.twitter.com/eICqVXG8kE— Nihari Korma (@NihariVsKorma) April 27, 2024అంపైర్తో గంభీర్ వాదనఅయితే, అతడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో గౌతీ ముఖం మాడ్చుకుని అసంతృప్తిగా పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉంటే.. కేకేఆర్ విధించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జానీ బెయిర్ స్టో అజేయ విధ్వంసకర శతకం(48 బంతుల్లో 108)తో పంజాబ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.చదవండి: KKR vs PBKS: టీ20లలో సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో ఇదే తొలిసారి.@PunjabKingsIPL are roaring again 🦁A special victory at the Eden Gardens for #PBKS who secure the highest successful run chase in the IPL and T20s ❤️Scorecard ▶️ https://t.co/T9DxmbgIWu#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/FNxVD8ZeW6— IndianPremierLeague (@IPL) April 26, 2024 -
భారత కెప్టెన్గా అతడి స్థాయిని ఎవరూ అందుకోలేరు: గంభీర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టు కెప్టెన్గా ధోని సాధించిన ఘనతలను అందుకోవడం ఇక ముందు ఎవరికీ సాధ్యం కాదనడంలో సందేహం లేదన్నాడు. టీమిండియా కెప్టెన్గా ఎవరెన్ని విజయాలు సాధించినా ధోని మూడు ఐసీసీ ట్రోఫీల ముందు దిగదుడుపేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్)- చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటార్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కేతో పోరును తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. అప్పుడు కెప్టెన్గా.. ఇప్పుడు మెంటార్గా ఇందులో ఎటువంటి మార్పులేదన్నాడు. సీఎస్కేపై పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); ఇక ధోని గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘నేను ఈ మ్యాచ్ గెలవాలనే కోరుకుంటున్నాను. నేనే కాదు.. నా స్థానంలో ధోని ఉన్నా తన జట్టే గెలవాలని కోరుకుంటాడు. స్నేహితులుగా ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. అంతమాత్రాన పోటీ పడటంలో ఎవరూ తగ్గరు కదా!.. ఏదేమైనా టీమిండియా కెప్టెన్గా ధోని మాదిరి మరెవరూ విజయవంతం కాలేదన్నది నిజం. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం మామూలు విషయం కాదు. కొంతమంది భారత కెప్టెన్లు విదేశాల్లో చారిత్రక విజయాలు సాధించవచ్చు.. మరికొందరు టెస్టు మ్యాచ్లలో గెలిపించవచ్చు. అయినా మూడు ఐసీసీ ట్రోఫీల కంటే అవేమీ పెద్దవి కావు’’ అని గంభీర్.. ధోని నాయకత్వ నైపుణ్యాలను కొనియాడాడు. కాగా ధోని కెప్టెన్సీలో టీ20 వరల్డ్కప్-2007, వన్డే ప్రపంచకప్-2011 గెలిచిన భారత జట్టులో గంభీర్ సభ్యుడన్న విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్ ఫైనల్లో 75, వన్డే ఫార్మాట్ ఫైనల్లో 97 పరుగులు చేసి ఈ ట్రోఫీలు గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఎల్లప్పుడూ ధోనిని ఏదో రకంగా విమర్శించే ఈ కేకేఆర్ మెంటార్ ఈసారి ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. కాగా కేకేఆర్ సారథిగా సీఎస్కేతో 11సార్లు పోటీపడ్డ గంభీర్ ఐదుసార్లు గెలిచాడు. 2012 ఫైనల్లో సీఎస్కేను ఓడించి టైటిల్ గెలిచాడు కూడా! View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
IPL 2024, DC VS KKR: కేకేఆర్ తొలిసారి ఇలా..!
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోల్కతా నైట్రైడర్స్ తొలిసారి సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించి రికార్డుల్లోకెక్కింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్పై బంపర్ విక్టరీతో కేకేఆర్ ఈ ఘనత సాధించింది. గతంలో ఏ సీజన్లోనూ కేకేఆర్ సీజన్ తొలి మూడు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించలేదు. ప్రస్తుత సీజన్లో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కేకేఆర్.. సన్రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీపై వరుస విజయాలు సాధించి అజేయ జట్టుగా కొనసాగుతుంది. ఈ సీజన్లో సన్రైజర్స్తో ఆడిన తొలి మ్యాచ్లో 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడిన కేకేఆర్.. ఆతర్వాత ఆర్సీబీ (7 వికెట్ల తేడాతో), ఢిల్లీపై (106 పరుగుల తేడాతో) ఘన విజయాలు సాధించింది. ఈ సీజన్లో అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీలను వారి సొంత మైదానాల్లో ఓడించి శభాష్ అనిపించుకుంది. ప్రస్తుత సీజన్లో కేకేఆర్.. శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో, గంభీర్ మెంటార్షిప్లో, చంద్రకాంత్ పండిట్ శిక్షణలో టైటిల్ రేసులో దూసుకుపోతుంది. ఐపీఎల్ అరంగేట్రం నుంచి కొనసాగుతున్న కేకేఆర్.. రెండు సార్లు (2012, 2014) ఛాంపియన్గా, ఓ సారి రన్నరప్గా (2021) నిలిచింది. గౌతమ్ గంభీర్ (ప్రస్తుత మెంటార్) కేకేఆర్ను రెండుసార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. 2021 సీజన్లో కేకేఆర్ రన్నరప్గా నిలిచినప్పుడు ఆ జట్టుకు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించాడు. కేకేఆర్ ఛాంపియన్స్ లీగ్లోనూ ఓసారి రన్నరప్గా (2014) నిలిచింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ ఇది రెండో అతి భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, 106 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం.సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన.క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి.వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా?శుభారంభం లభించినాముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది.ఊహించని షాకులుఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్!ఊపిరులూదిన గంభీర్ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు.ధనాధన్ ధోనిమిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా?ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts— Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగాReliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg— Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
WC 2011: ఊహించని షాకులు.. ఆ మధుర జ్ఞాపకాలు మరువగలమా?!
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యులైన సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ భావోద్వేగం. సరిగ్గా పదమూడేళ్ల క్రితం ఇదే రోజున.. ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ జట్టు జగజ్జేతగా అవతరించింది. సొంత గడ్డపై ప్రఖ్యాత వాంఖడే మైదానంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ధోని సేన. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ చిరకాల కలను నెరవేర్చి.. అపూర్వ విజయాన్ని అతడికి బహుమతిగా అందించింది. నాడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిక్స్ బాదగానే కోట్లాది మంది భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. వాంఖడేలో ఉన్న దాదాపు 33 వేల మంది మా తుజే సలాం అంటూ జట్టును ఉత్సాహపరిచారు. మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు యావత్ భారతావని ఆనందంతో పులకించిపోయింది. ఆ అపురూప క్షణాన్ని చెరగని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరచుకున్నారు అభిమానులు. వారిలో మీరూ ఒకరా?!.. మరి ఆనాటి మ్యాచ్ విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందామా? శుభారంభం లభించినా ముంబైలోని వాంఖడే స్టేడియం.. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుమార్ సంగక్కర తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత పేసర్ జహీర్ ఖాన్ ఆరంభంలోనే ఓపెనర్ ఉపుల్ తరంగ(2)ను పెవిలియన్కు పంపాడు. అనంతరం హర్భజన్ సింగ్ మరో ఓపెనర్ తిలకరత్రె దిల్షాన్(33)ను అవుట్ చేయగా.. యువరాజ్ సింగ్.. కెప్టెన్ కుమార్ సంగక్కర(48) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస వికెట్లు తీసిన టీమిండియా ఆనందాన్ని ఆవిరి చేస్తూ.. నాలుగో నంబర్ బ్యాటర్ మహేళ జయవర్ధనే అజేయ శతకం(103)తో విరుచుకుపడ్డాడు. అయితే, మిగతా వాళ్లలో మళ్లీ ఒక్కరు కూడా కనీసం 35 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. ఊహించని షాకులు ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఊహించని షాకిచ్చాడు లసిత్ మలింగ. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(0)ను డకౌట్ చేశాడు. మైదానమంతా నిశ్శబ్దం. ఆ తర్వాత కాసేపటికే సచిన్ టెండుల్కర్(18) కూడా అవుట్! ఊపిరులూదిన గంభీర్ ఆ సమయంలో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత శిబిరంతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వన్డౌన్ బ్యాటర్ గౌతం గంభీర్. 122 బంతులు ఎదుర్కొని 97 పరుగులు సాధించాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. అంతకంటే విలువైన ఇన్నింగ్సే ఆడాడు. ధనాధన్ ధోని మిగిలిన వాళ్లలో విరాట్ కోహ్లి 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టాడు కెప్టెన్ ధోని. యువరాజ్ సింగ్(21 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. ఆ క్షణాన్ని మర్చిపోగలమా? ఇక నలభై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి అతడు కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్షణంగా నిలిచిపోతుందనడం అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్లో మొత్తంగా 79 బంతులు ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 91 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించిన భారత జట్టు రెండోసారి వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో వాంఖడేతో పాటు దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి. Probably the greatest ever night for any Indian fan which came under MS Dhoni's captaincy. The atmosphere and feeling were unmatched. pic.twitter.com/bzrIKRbsts — Mufaddal Vohra (@mufaddal_vohra) July 7, 2022 చదవండి: IPL 2024: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా Reliving this feeling ❤️🇮🇳🏆#CWC2011 pic.twitter.com/zT9C0FSusg — Yuvraj Singh (@YUVSTRONG12) April 2, 2024 -
IPL 2024: కోహ్లి, గంభీర్కు ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం
ఐపీఎల్-2024.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి- కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. దశాబ్దకాలంగా కోహ్లి- గంభీర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గౌతీ కేకేఆర్ ఆటగాడిగా ఉన్న సమయంలోనే కోహ్లి ఓసారి మైదానంలో అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది. ఇక గతేడాది లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న గంభీర్.. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా కోహ్లి- నవీన్ ఉల్ హక్(లక్నో బౌలర్) గొడవలో తలదూర్చాడు. దీంతో కోహ్లి సైతం దీటుగా బదులిస్తూ గంభీర్కు కౌంటర్ వేశాడు. క్రికెట్ వర్గాలను విస్మయపరిచిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కోహ్లి- గంభీర్ తప్పొప్పులను ఎంచుతూ మాజీ క్రికెటర్లు,. అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్దరు ఇలా కలిసిపోవడం గమనార్హం. విరామ సమయంలో కోహ్లి వద్దకు వెళ్లి గంభీర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా.. అనంతరం ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ హగ్ కారణంగా కేకేఆర్కు ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఇందుకు బదులిస్తూ మరో కామెంటేటర్ సునిల్ గావస్కర్ షాకింగ్ కామెంట్ చేశాడు. ‘‘ఫెయిర్ ప్లే అవార్డు ఒక్కటే కాదు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి’’ అని ఈ టీమిండియా దిగ్గజం పేర్కొన్నాడు. గావస్కర్ వ్యాఖ్య నెట్టింట వైరల్ కాగా.. ‘‘వీరిద్దరు కేవలం ఇలా నటించారని మాత్రమే అంటున్నారా?’’ అని నెటిజన్లు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సొంతమైదానంలో కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్(59 బంతుల్లో 83 రన్స్) వృథాగా పోయింది. తదుపరి ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్తో.. కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనున్నాయి. Our favourite strategic timeout ever 🫂#IPLonJioCinema #RCBvKKR #TATAIPL #JioCinemaSports pic.twitter.com/A50VPhD6RI — JioCinema (@JioCinema) March 29, 2024 -
IPL 2024 RCB Vs KKR Pics: ఆర్సీబీపై నైట్రైడర్స్ అలవోక విజయం (ఫొటోలు)
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు (ఫొటోలు)
-
కేకేఆర్ ఆటగాళ్లకు గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్!
IPL 2024: కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఆ జట్టు ఆటగాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ అంటే బాలీవుడ్ తారలు, మ్యాచ్ తర్వాత జరిగే పార్టీలు కాదని.. ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. కాగా గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మార్గ నిర్దేశకుడిగా వ్యవహరించిన టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సొంతగూటికి చేరుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్గా కేకేఆర్కు 2012, 2014లలో టైటిల్ అందించిన అతడు.. ఈసారి మెంటార్గా కొత్త పాత్ర పోషించనున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా దృష్టిలో ఐపీఎల్ అంటే ఏదో సరదాగా తీసుకునే అంశం కాదని మొదటిరోజే స్పష్టం చేశా. ఐపీఎల్ అంటే బాలీవుడ్, వాళ్లతో కలిసి చేసుకునే పార్టీలు, విందులు, వినోదాలు కాదు.. పోటాపోటీగా సాగే క్రికెట్ టోర్నమెంట్. ప్రపంచంలోని క్రికెట్ లీగ్లన్నింటిలో ఈ టోర్నీ మాత్రమే సరైన దిశలో వెళ్తోందని నా విశ్వాసం. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు ఏమాత్రం తక్కువ కాకుండా విజయవంతంగా కొనసాగుతున్న లీగ్ ఇది. అందుకు తగ్గట్లుగానే మైదానంలో మన ప్రవర్తన కూడా ఉండాలి. ముఖ్యంగా అభిమానులు మనపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి పట్ల నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మన ఆట తీరుతో వాళ్ల ముఖాలపై చిరునవ్వులు పూయించే బాధ్యత కూడా మనదే. అందరితో పోలిస్తే కోల్కతా అభిమానులే మరింత విశ్వాసపాత్రులుగా ఉంటారని నా అభిప్రాయం. తొలి మూడు సీజన్లలో గడ్డు పరిస్థితులు ఎదురైనా వారు జట్టుకు అండగా నిలిచారు. అలాంటి వాళ్లకు మనం తప్పక సంతోషాన్నిచ్చేలా ముందుకు సాగాలి’’ అని కేకేఆర్ ఆటగాళ్లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చాడు. కాగా కేకేఆర్కు సహ యజమానులు బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బీజేపీ తరఫున తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న గౌతం గంభీర్.. రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతీ వెల్లడించాడు. చదవండి: కోహ్లి, గిల్ కాదు!.. ఈసారి ఆరెంజ్ క్యాప్ అతడిదే! పర్పుల్ క్యాప్ నాది! -
Lok Sabha elections 2024: గౌతమ్ గంభీర్ అస్త్ర సన్యాసం
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గం ఎంపీ గౌతమ్ గంభీర్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంకేతాలిచ్చారు. క్రికెట్కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ కానున్నందున తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలంటూ శనివారం ఆయన బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గంభీర్ శనివారం ‘ఎక్స్’లో.. ‘నాకు రాజకీయ బాధ్యతల నుంచి విరామం ఇవ్వాలంటూ గౌరవ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాను. దీనివల్ల రానున్న క్రికెట్ సీజన్లో ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా జీలకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. గంభీర్ను ఈసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి మార్చొచ్చంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. జార్ఖండ్లోని హజారీబాగ్ బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా కూడా గౌతమ్ గంభీర్ బాటలోనే నడుస్తున్నారు. తనకు క్రియాశీల రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలంటూ పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. -
గౌతమ్ గంభీర్ స్థానంలో అక్షయ్ కుమార్?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో హుషారు పెరిగిపోతోంది. తూర్పు ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఒక ట్వీట్లో తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను బీజేపీ ఇక్కడి నుంచి ఎన్నికల రంగంలోకి దించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ తాను ఇకపై తన క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెడతానని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ను బీజేపీ.. ఢిల్లీలోని ఒక స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయమని కోరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయనతో కొందరు పార్టీ నేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్షయ్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. అతని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ సీటు నుంచి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. నాటి ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ 6,96,156 ఓట్లతో విజయం సాధించారు. -
గంభీర్ సంచలన నిర్ణయం- రాజకీయాలకు గౌతమ్ గంభీర్ దూరం
-
గంభీర్ సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్బై!
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కీలక ప్రకటన చేశాడు. తాను రాజకీయ విధుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా గంభీర్ విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంభీర్ వెల్లడించాడు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు ‘‘దయచేసి రాజకీయ విధుల నుంచి నాకు విముక్తి కల్పించగలరని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి నాదొక విన్నవించాను. తద్వారా నా ప్రణాళికలకు అనుగుణంగా నేను పూర్తి స్థాయిలో క్రికెట్పై దృష్టి సారించే వీలు కలుగుతుంది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్’’ అని గౌతం గంభీర్ ట్వీట్(ఎక్స్) చేశాడు. కాగా గంభీర్ తూర్పు ఢిల్లీ నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. విధ్వంసకర ఓపెనర్గా కాగా ఢిల్లీకి చెందిన గౌతం గంభీర్ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే విధ్వంసకర ఓపెనర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 147 వన్డేలు, 58 టెస్టులు, 37 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 5238, 4154, 932 పరుగులు సాధించాడు గంభీర్. 2016లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 2019లో రాజకీయాల్లో ప్రవేశించాడు. అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో బీజేపీలో చేరాడు. 2019 సాధారణ ఎన్నికల్లో తుర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి 695109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు గంభీర్. బీజేపీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి ఇక అప్పటి నుంచి బీజేపీ తరఫున బలంగా గొంతు వినిపిస్తున్న గంభీర్.. క్రికెట్ కామెంటేటర్గా, ఐపీఎల్ ఫ్రాంఛైజీలా మెంటార్గానూ సేవలు అందిస్తున్నాడు. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా వ్యవహరించిన గంభీర్.. తాజా ఎడిషన్లో కోల్కతా నైట్ రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఈసారి కేకేఆర్ మెంటార్గా గతంలో తాను రెండుసార్లు చాంపియన్గా నిలిపిన కేకేఆర్కు ఈసారి మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక కేకేఆర్ సహ యజమానులు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, జూహీ చావ్లా అన్న విషయం తెలిసిందే. అయితే, గంభీర్ హఠాత్తుగా రాజకీయాల నుంచి.. ముఖ్యంగా బీజేపీ నుంచి దూరంగా జరగటానికి కారణాలు ఏమిటన్న అంశంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. I have requested Hon’ble Party President @JPNadda ji to relieve me of my political duties so that I can focus on my upcoming cricket commitments. I sincerely thank Hon’ble PM @narendramodi ji and Hon’ble HM @AmitShah ji for giving me the opportunity to serve the people. Jai Hind! — Gautam Gambhir (@GautamGambhir) March 2, 2024 -
IPL: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ ఫిక్స్!
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, అతడి కుటుంబం ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలిపోతోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ రంజీ వీరుడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడమే ఇందుకు కారణం. అంతేకాదు అరంగేట్రంలోనే అదిరిపోయే ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో సర్ఫరాజ్ ఖాన్ ప్రతిభపై ఇంటా బయటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసే వార్త తెరమీదకు వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఈ 26 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ పునరాగమనం చేయనున్నాడనేది అందులోని సారాంశం. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. ఇంగ్లండ్తో మూడో టెస్టు సందర్భంగా.. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సర్ఫరాజ్ తండ్రి, కోచ్, మెంటార్ నౌషద్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే ఉండి మ్యాచ్ను కూడా వీక్షించాడు. ఈ క్రమంలో తండ్రి పుత్రోత్సాహంతో పొంగిపోయేలా సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్తో ఇరగదీశాడు. 48 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అయితే, రవీంద్ర జడేజా రాంగ్కాల్ కారణంగా పరుగుకు వెళ్లి దురదృష్టవశాత్తూ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో మాత్రం 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా సర్ఫరాజ్ బ్యాటింగ్కు ఫిదా అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడిని కోల్కతా నైట్ రైడర్స్కు ఆడించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2024 సీజన్కు గానూ గంభీర్ కేకేఆర్ మెంటార్గా నియమితుడైన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈసారి జరిగిన మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సర్ఫరాజ్ ఖాన్ను రిలీజ్ చేయగా అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈ క్రమంలో అతడి సేవలను వినియోగించుకోవాలని గంభీర్ కేకేఆర్ యాజమాన్యానికి సూచించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వేలం ముగిసిన తర్వాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకునే వీలులేదు. అయితే, ఎవరైనా ఆటగాడు గాయపడితే మాత్రం అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ శిబిరంలోని ఏ ఆటగాడైనా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిస్తే వెంటనే సర్ఫరాజ్ను పిలిపించేందుకు ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు బెంగాల్ వార్తా పత్రిక ఆనంద్బజార్ కథనం ప్రచురించింది. కాగా సర్ఫరాజ్ ఖాన్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 37 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన అతడు 22.5 సగటుతో 585 పరుగులు సాధించాడు. చదవండి: మార్చి 22న ఐపీఎల్ 2024 ప్రారంభం.. సంకేతాలు ఇచ్చిన లీగ్ చైర్మన్ -
జైస్వాల్ను హీరో చేయకండి: గంభీర్ ఘాటు విమర్శలు
India vs England, 2nd Test: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైజాగ్ స్టేడియంలో ఇంగ్లండ్తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ డబుల్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు జైస్వాల్. 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు యశస్వి జైస్వాల్ ప్రతిభను కొనియాడుతున్నారు. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అయితే సర్ బ్రాడ్మన్ కంటే ఎక్కువంటూ ఆకాశానికెత్తాడు. ఇక అభిమానులేమో.. యశస్వి స్వస్థలం ఉత్తరప్రదేశ్లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. #WATCH | Uttar Pradesh | People burst crackers and distributed sweets in Bhadohi - the hometown of cricketer Yashasvi Jaiswal as he hit a double-century today in the second test match against England. pic.twitter.com/kwB68wxQcc — ANI (@ANI) February 3, 2024 అదే విధంగా సోషల్ మీడియా వేదికగా అతడి పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్హైప్ క్రియేట్ చేసి అతడిపై ఒత్తిడి పెంచవద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మనకు ఓ అలవాటు ఉంది ఈ మేరకు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘చిన్న వయసులోనే అరుదైన రికార్డులు సాధిస్తున్న యశస్వికి శుభాకాంక్షలు. అతడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తనను స్వేచ్ఛగా ఆడనివ్వండి. భారత్లో అందరికీ ఓ పాత అలవాటు ఉంది. హీరోలను చేసి ఒత్తిడి పెంచుతారు ముఖ్యంగా మీడియా.. ఆటగాళ్ల విజయాలను అతి చేసి చూపించి.. వారికి ఏదో ఒక ట్యాగ్ అంటగట్టి... హీరోలను చేస్తుంది. ఇలాంటి ప్రచారం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగిపోతుంది. కాలక్రమంలో వాళ్లు సహజమైన, తమదైన ఆటను మర్చిపోతారు. అంచనాలు తట్టుకోలేక ఒత్తిడిలో కూరుకుపోతారు’’ అని గౌతం గంభీర్ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా వైజాగ్లో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన కారణంగా రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఆధిపత్యం సంపాదించింది. ఇంగ్లండ్ కంటే 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: Ind vs Eng: అఫీషియల్.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం -
T20 WC: పాక్ ప్రమాదకర జట్టు.. యువీ వ్యాఖ్యలకు గంభీర్ రిప్లై ఇదే
రానున్న ఆరు నెలల్లో మరో క్రికెట్ మెగా టోర్నీకి తెరలేవనుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 ఈవెంట్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్ సందర్భంగానైనా టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న కల తీరాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదేళ్లుగా భారత జట్టు ఒక్క మెగా టైటిల్ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా ఆ కరువు తీరుతుందనుకుంటే ఆఖరి మెట్టుపై రోహిత్ సేన బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకుంది. అయితే, ఆరు నెలల వ్యవధిలోనే టీ20 వరల్డ్కప్ రూపంలో టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్-2024లో టీమిండియాకు గట్టి పోటీనిచ్చే జట్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అక్కడి పిచ్లపై అఫ్గనిస్తాన్ మరింత ప్రమాదకారిగా మారుతుంది. ఆస్ట్రేలియా కూడా సవాల్ విసురుతుంది. ఆ జట్టులో ఎంతో మంది ఇంపాక్ట్ ప్లేయర్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టు విజయావకాశాలను ఒంటి చేత్తో మార్చగల సత్తా ఉన్న వాళ్లు ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కూడా టీ20 క్రికెట్లో కచ్చితంగా బలమైన ప్రత్యర్థే’’ అని గంభీర్ పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. ‘‘ఈసారి సౌతాఫ్రికా ప్రపంచకప్ గెలుస్తుందనుకుంటున్నాను. వరల్డ్కప్-2023 సందర్భంగా.. ఆ జట్టు పురోగతిని చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం ఏర్పడింది. పాకిస్తాన్ కూడా డేంజరస్ జట్టు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన గంభీర్.. ‘‘50 ఓవర్ల ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎలా ఉందో చూశాం కదా! అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్తగా ఫీల్డింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఇక టీ20 ఫార్మాట్లో పోటీ పడాలంటే అలా చెత్తగా ఆడితే మాత్రం వారికి అసలు అవకాశాలు ఉండవు. గత ఐదారేళ్లలో టీమిండియా ఆఖరి వరకు పట్టుదలగా పోరాడిన తీరు చూశాం. ఈసారి భారత్ ఆ అవరోధాన్ని దాటుతుందనుకుంటున్నా’’ అని కుండబద్దలు కొట్టాడు. ఓ క్రీడా చర్చలో పాల్గొన్న గౌతీ- యువీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Thums Up (@thumsupofficial) -
Ind vs SA: వాళ్లిద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. షమీ స్థానంలో అతడే!
Gautam Gambhir's XI for 1st Test Against South Africa: ప్రపంచ నంబర్ వన్ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు సన్నద్ధమైంది. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని మరిపించేలా చరిత్రాత్మక విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పేస్కు అనుకూలించే విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA దేశాల(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై టెస్టు సిరీస్ గెలిస్తే ఆ మజానే వేరు! ‘సఫారీ’లో సాధ్యం కాలేదు అయితే, టీమిండియా ఈ నాలుగు దేశాల్లోని మూడు ఆతిథ్య జట్లను మాత్రమే టెస్టు సిరీస్లో ఓడించగలిగింది. సౌతాఫ్రికాలో మాత్రం ఇంతవరకు భారత జట్టుకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఈసారైనా ఆ అపవాదును చెరిపివేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఒక్క స్పిన్నర్ చాలు ఈ నేపథ్యంలో సఫారీ టీమ్తో తలపడే తుదిజట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా గౌతం గంభీర్ తన అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు. బౌన్సీ పిచ్లు ఉన్న సౌతాఫ్రికాలో టీమిండియా ఒక్క స్పిన్నర్తో బరిలోకి దిగితే చాలని ఈ సందర్భంగా గౌతీ అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లలో ఒకరిని మాత్రమే ఆడించాలని సూచించాడు. షమీ స్థానంలో అతడే అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో శార్దూల్ ఠాకూర్కు చోటిచ్చిన గంభీర్.. మహ్మద్ షమీ స్థానంలో ప్రసిద్ కృష్ణను ఆడిస్తే బాగుంటుందని సూచించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైశ్వాల్ను ఎంచుకున్న ఈ మాజీ ఓపెనర్.. శుబ్మన్ గిల్ వన్డౌన్లో వస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మరోవైపు.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ మాత్రం.. సఫారీలతో టెస్టుకు భారత్ ఇద్దరు స్పిన్నర్లు జడేజా, అశ్విన్లతో బరిలోకి దిగాలని సూచించడం గమనార్హం. అదే విధంగా పేస్ దళంలో ప్రసిద్కు కాదని ముకేశ్ కుమార్కు చోటిచ్చాడు గావస్కర్. మరి మీ ప్లేయింగ్ ఎలెవన్ ఏదో కామెంట్లలో తెలియజేయండి. సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు గంభీర్ ఎంచుకున్న భారత తుదిజట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా/ రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్. చదవండి: WFI: మంచో చెడో.. రిటైర్ అయ్యా.. నాకేం సంబంధం లేదు! డబ్ల్యూఎఫ్ఐ మంచికి నాంది -
Ind vs SA: అతడి నుంచి ఎక్కువగా ఆశించొద్దు: మాజీ ఓపెనర్
IND vs SA Test Series 2023: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్పై అంచనాలు పెంచుకోవద్దని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. సఫారీ పిచ్లపై బ్యాటింగ్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని.. గత ప్రదర్శన ఆధారంగా యశస్విపై ఆశలు పెట్టుకోవద్దని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్తో తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్.. సెంచరీతో చెలరేగాడు. అరంగేట్రంలోనే సెంచరీ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా బరిలోకి దిగి 171 పరుగులు సాధించి అనేక రికార్డులు సృష్టించాడు. విండీస్పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రెండో టెస్టులోనూ అర్ధ శతకం(57)తో ఆకట్టుకున్న యశస్వి.. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ సందర్బంగా మొత్తంగా 266 పరుగులతో సత్తా చాటాడు. రెగ్యులర్ ఓపెనర్ శుబ్మన్ గిల్ వన్డౌన్లో ఆడటంతో ఓపెనర్గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదిలా ఉంటే.. యశస్వి టీమిండియాతో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు.. ఎందుకంటే ప్రొటిస్తో టీ20 సిరీస్ అనంతరం డిసెంబరు 26 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా అతడు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వెస్టిండీస్.. సౌతాఫ్రికా పరిస్థితులు పూర్తి భిన్నమైనవి. సఫారీ పిచ్లపై భారత బ్యాటర్లకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. నిజానికి వెస్టిండీస్ పిచ్లు కాస్త ఉప ఖండపు పిచ్లను పోలి ఉంటాయి. ప్రొటిస్ పేసర్లను ఎదుర్కోవడం కష్టం కానీ సఫారీ గడ్డపై పేస్ దళం అటాకింగ్ను తట్టుకోవడం కష్టం. ముఖ్యంగా మార్కో జాన్సెన్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ వేసే బంతులను ఎదుర్కోవడం అత్యంత కష్టం. యశస్వి ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్లు అద్భుతంగా ఆడతాడనడంలో సందేహం లేదు. అయితే, సౌతాఫ్రికాలో అతడికి అంత ఈజీ కాదు. మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది. అతడు ఇంకా యువకుడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్. అతడిపై భారీగా అంచనాలు పెట్టుకోవద్దు. సౌతాఫ్రికాతో మ్యాచ్లోనూ సెంచరీ, డబుల్ సెంచరీ బాదాలని కోరుకోకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ind W vs Aus W: ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర -
BCCI: అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు: గంభీర్
That would have been the worst decision made by BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఎంతో మంది దేశీ, విదేశీ యువ క్రికెటర్ల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన టోర్నీ. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన నూనుగు మీసాల కుర్రాళ్లు.. అప్పటికే టీమిండియా తరఫున స్టార్లుగా వెలుగొందుతున్న అనుభవజ్ఞులైన క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం కల్పిస్తున్న మెగా ఈవెంట్. ఐపీఎల్ ద్వారా కాసుల వర్షంలో తడవడంతో పాటు ఆటకు పదునుపెట్టి.. అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసేందుకు దోహదం చేస్తున్నారు చాలా మంది. తిలక్ వర్మ, రింకూ సింగ్ తదితరులు ఇందుకు తాజా ఉదాహరణలు. ఈసారి కనక వర్షం కురిసింది వీరిపైనే కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి నేతృత్వంలో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ఇప్పటికి పదహారు ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జరుగనున్న పదిహేడో సీజన్కు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైపోయింది. ఇందుకు సంబంధించి.. దుబాయ్ వేదికగా ఇప్పటికే వేలం కూడా పూర్తైపోయింది. ఈ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ప్లేయర్గా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(రూ. 24.75 కోట్లు) నిలవగా.. ఈ సీజన్ వేలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడు పోయిన భారత క్రికెటర్గా పేసర్ హర్షల్ పటేల్(రూ. 11.75 కోట్లు) ఘనత దక్కించుకున్నాడు. మరోవైపు.. సమీర్ రజ్వీ అత్యధిక మొత్తం(రూ. 8.4 కోట్లు) దక్కించుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. ఇలా ఎంతో మంది ఆటగాళ్లకు ఆర్థికంగా.. కెరీర్ పరంగా దన్నుగా నిలుస్తున్న ఐపీఎల్ గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు తాజాగా స్పోర్ట్స్కీడాతో మాట్లాడిన గంభీర్కు.. ‘‘ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్ ప్రవేశపెట్టి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేది?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘బీసీసీఐ గనుక అలా చేసి ఉంటే(ప్రవేశపెట్టకపోతే) అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు. రెండుసార్లు ట్రోఫీ గెలిచిన ఘనత ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో జరిగిన గొప్ప మార్పునకు నాంది ఐపీఎల్’’ అంటూ గౌతీ తనదైన శైలిలో ఐపీఎల్ ప్రాధాన్యాన్ని ఒక్క మాటలో తేల్చిపడేశాడు. కాగా కోల్కతా నైట్ రైడర్స్ సారథిగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఘనత గౌతం గంభీర్కు ఉంది. 2012, 2014 సీజన్లలో కేకేఆర్కు గౌతీ ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్గా, విశ్లేషకుడిగా కొనసాగుతున్న ఈ మాజీ ఓపెనర్.. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా పనిచేశాడు. ఐపీఎల్-2024 సీజన్తో తిరిగి కేకేఆర్ గూటికి చేరుకున్న గంభీర్.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు. చదవండి: MS Dhoni: ధోని అభిమానులకు శుభవార్త! IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్! -
సఫారీ పిచ్లపై బ్యాటింగ్ కష్టం.. కోహ్లి, రోహిత్ కూడా: గంభీర్
India's biggest challenge in Test series vs South Africa: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తప్పక రాణించాలని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రొటిస్ గడ్డపై భారత్ జయకేతనం ఎగురువేయాలంటే వీరిద్దరే ప్రదర్శనే కీలకం కానుందని పేర్కొన్నాడు. కాగా సఫారీ పిచ్లపై బ్యాటింగ్ చేయడం టీమిండియా బ్యాటర్లకు అంత సులువుకాదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో ప్రొటిస్ బౌలర్లను ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్న పని. అందుకే భారత జట్టు ఇంత వరకు ఒక్కసారి కూడా అక్కడ టెస్టు సిరీస్ గెలిచిందే లేదు. వరల్డ్కప్ తర్వాత తొలిసారి ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో ఈ ఫీట్ నమోదు చేయగలిగింది కానీ.. సౌతాఫ్రికాలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి తిరిగి ఈ సిరీస్తోనే మైదానంలో అడుగుపెట్టనున్నారు. బాక్సింగ్ డే(డిసెంబరు 26) నుంచి మొదలు కానున్న తొలి టెస్టుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ గౌతం గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సౌతాఫ్రికా డేంజరస్ పేసర్లు ‘‘పేస్, బౌన్స్, సీమ్. ఇలాంటి పిచ్లపై ఇండియా ప్లేయర్లకు బ్యాటింగ్ చేయడం తేలికకాదు. సౌతాఫ్రికా గడ్డపై.. ఎంతటి మేటి బ్యాటర్ అయినా ఒత్తిడిలో కూరుకుపోతాడు. 2011 నాటి పరిస్థితులు ఇప్పుడు అక్కడ లేవు. కగిసో రబడ, గెరాల్డ్ కొయెట్జీ, నండ్రే బర్గర్, మార్కో జాన్సెన్ వంటి పేసర్లు పదునైన బంతులతో దూసుకువస్తారు. ఇక ఇప్పుడు అక్కడ ఆడబోయే అనుభవజ్ఞులు ఎవరైనా ఉన్నారా అంటే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి. అలా అయితేనే గెలుస్తాం మిగతా వాళ్లతో పోలిస్తే వీరిద్దరికే ఎక్స్పీరియన్స్ ఎక్కువ. మన బౌలర్లు చెలరేగితే కచ్చితంగా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవొచ్చు. కానీ.. అంతకంటే ముందు మన బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. స్కోరు బోర్డు మీద తగినన్ని పరుగులు ఉంచాలి. లేదంటే.. బౌలర్లు ఒత్తిడిలో కూరుకుపోతారు’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారమంతా రోహిత్, కోహ్లిలపైనే ఉందని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ, రుతురాజ్ గాయాల కారణంగా.. ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు బీసీసీఐ తొలుత ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీ*. -
చిత్తైన గంభీర్ జట్టు.. ఫైనల్లో హర్భజన్ టీమ్
లెజెండ్స్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరింది. ఫైనల్లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. క్వాలిఫయర్-1లో విజయం సాధించడం ద్వారా అర్బన్రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరింది. నిన్న (డిసెంబర్ 7) జరిగిన క్వాలిఫయర్-2లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా టైగర్స్ను ఓడించడం ద్వారా హర్భజన్ సింగ్ సారథ్యంలోని మణిపాల్ టైగర్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్-2లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. కెవిన్ పీటర్సన్ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మెక్క్లెనెగన్, తిసార పెరీరా తలో 3 వికెట్లు తీసి క్యాపిటల్స్ పతనాన్ని శాశించారు. అనంతరం బరిలోకి దిగిన మణిపాల్ టైగర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అసేల గుణరత్నే (39 నాటౌట్), కొలిన్ డి గ్రాండ్హోమ్ (38 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి టైగర్స్ను విజయతీరాలకు చేర్చారు. టైగర్స్ ఇన్నింగ్స్లో చాడ్విక్ వాల్టన్ (33), ఏంజెలో పెరీరా (35) కూడా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్, ఇసురు ఉడాన, దిల్హర ఫెర్నాండో, ఈశ్వర్ పాండే తలో వికెట్ పడగొట్టారు. టోర్నీ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 9న జరుగనుంది. టైటిల్ కోసం అర్బన్ రైజర్స్ హైదరాబాద్, మణిపాల్ టైగర్స్ తలపడతాయి. -
గంభీర్ నన్ను ఫిక్సర్ అన్నాడు.. దూషించాడు: శ్రీశాంత్ ఆరోపణ
గౌతమ్ గంభీర్...ఎస్.శ్రీశాంత్...భారత జట్టు తరఫున కలిసి 49 మ్యాచ్లు ఆడారు. 2007 టి20, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో భాగస్వాములు. రిటైర్మెంట్ తర్వాత ‘సీనియర్లు’గా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ)లో ఆడుతున్నారు. కానీ ఆవేశకావేశాలకు మారుపేరైన వీరిద్దరు ఇలాంటి వెటరన్ టోర్నీలో కూడా గొడవ పడ్డారు. గంభీర్ తనను పదే పదే ‘ఫిక్సర్’ అంటూ దూషించాడని శ్రీశాంత్ ఆరోపించాడు. బుధవారం ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ తర్వాత ఒక వీడియో విడుదల చేసిన శ్రీశాంత్ ‘నా తప్పు ఏమీ లేకపోయినా గంభీర్ నన్ను అనరాని మాటలు అన్నాడు. అది సరైంది కాదు’ అని అన్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే మరో వీడియోలో దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. S Sreesanth on Gautam Gambhir: "He kept calling me a fixer".pic.twitter.com/qPtSdEXTjp — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023 ‘ఫిక్సర్, ఫిక్సర్, నువ్వు ఫిక్సర్వి అంటూ పదే పదే గంభీర్ అన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా అతను మాత్రం అలాంటి దూషణలు కొనసాగించాడు. నేను ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. అసలు అతనికి ఎందుకు కోపం వచి్చందో, ఎందుకు అలా అన్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు’ అని వివరించాడు. ఈ ఘటనపై గంభీర్ వైపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు కానీ తాను చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ట్విట్టర్లో పెట్టాడు. Smile when the world is all about attention! pic.twitter.com/GCvbl7dpnX — Gautam Gambhir (@GautamGambhir) December 7, 2023 ఎల్ఎల్సీలో తగిన నిబంధనలు, ప్రమాణాలు పాటిస్తున్నామని, ఘటనపై విచారణ చేస్తామని మాత్రం టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత దీనిని కొనసాగించిన శ్రీశాంత్... ‘నువ్వు అందరితో ఇలాగే ఉంటావు, సీనియర్లను కూడా గౌరవించవు. నన్ను అలా అనే హక్కు నీకు లేదు. అయినా నువ్వు సుప్రీం కోర్టుకంటే ఎక్కువా’ అని ప్రశ్నించాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించగా... సుప్రీం కోర్టు ఆదేశాలతో దానిని ఏడేళ్లకు తగ్గించడంతో 2020లో అతని నిషేధం ముగిసింది. -
బాహాబాహీకి దిగిన గంభీర్-శ్రీశాంత్
లెజెండ్స్ లీగ్ 2023లో భాగంగా గుజరాత్ జెయింట్స్-ఇండియా క్యాపిటల్స్ మధ్య నిన్న (డిసెంబర్ 6) జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్ (ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్), శ్రీశాంత్ (గుజరాత్ జెయింట్స్) గొడవపడ్డారు. క్యాపిటల్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ సందర్భంగా ఈ ఇద్దరు బాహాబాహీకి దిగినంత పని చేశారు. శ్రీశాంత్ బౌలింగ్లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అనంతరం గొడవ మొదలైంది. వరుస బంతుల్లో 10 పరుగులు రావడంతో సహనం కోల్పోయిన శ్రీశాంత్.. ఆమరుసటి బంతిని డాట్ బాల్గా మలిచి గంభీర్ను కవ్వించాడు. అసలే ముక్కోపి అయిన గంభీర్.. శ్రీశాంత్ కవ్వింపుకు నోటితో సమాధానం చెప్పాడు. మ్యాచ్ మధ్యలో కొద్ది సేపు ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సహచర ఆటగాళ్లు ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంపైర్లు ఈ ఇద్దరూ బాహాబాహీకి దిగకుండా వారించారు. ఓ దశలో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. గంభీర్-శ్రీశాంత్ కొట్టుకుంటారేమోనని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. గొడవ సద్దుమణిగిన అనంతరం మ్యాచ్ సాఫీగా సాగింది. గొడవ తర్వాత గంభీర్ మరింత చెలరేగి ఆడాడు. ఈ మ్యాచ్లో అతను 30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్ సాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. Heated conversation between Gautam Gambhir and S Sreesanth in the LLC. pic.twitter.com/Cjl99SWAWK — Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023 ఈ మ్యాచ్లో గంభీర్తో పాటు మిగతా బ్యాటర్లు కూడా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 3 ఓవర్లు వేసిన శ్రీశాంత్ వికెట్ పడగొట్టి 35 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్..క్రిస్ గేల్ (55 బంతుల్లో 84; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయిన్ (33 బంతుల్లో 57ప 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో లక్ష్యానికి దగ్గర వరకు వెళ్లి ఓటమిపాలైంది. గేల్, ఓబ్రెయిన్ మినహా మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో గుజరాత్ లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కాగా, గంభీర్, శ్రీశాంత్లకు గొడవలేమీ కొత్త కాదు. ఈ ఇద్దరూ మైదానంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఆటగాళ్లతో బాహాబాహీకి దిగారు. గంభీర్.. విరాట్ కోహ్లి, షాహిద్ అఫ్రిది లాంటి వారితో గొడవపడగా. శ్రీశాంత్ సహచరుడు హర్భజన్ సింగ్ చేతిలో చెంపదెబ్బ తిని వార్తల్లో నిలిచాడు. గంభీర్ ఇటీవలి ఐపీఎల్ సీజన్ సందర్భంగానూ విరాట్ కోహ్లితో గొడవపడ్డాడు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
ఓటరన్నా.. ఆలోచించు!
తాగునీటికి 2.25 టీఎంసీల నీళ్లు
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
పాప్లెట్ చేపలతో పరేషాన్!
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement