-
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలోని ఇండోర్-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. #NewsWithR #MadhyaPradesh: Eight people killed and one injured in road accident.According to Additional Superintendent of Police (ASP) Rupesh Kumar Dwivedi, a jeep collided with an unidentified vehicle near Ghatabillod on the Indore-Ahmedabad National Highway.@MPPoliceDeptt pic.twitter.com/x994AFzsiq— Ravi Rana (@RaviRRana) May 16, 2024 ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది. -
ఓటర్లకు అల్పాహారం, ఐస్క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్క్రీమ్లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. -
ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం ‘నోటా’కే..
ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు. -
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
భోపాల్: లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్కు వరుస షాక్ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇండోర్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్ కాంతిని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బీజేపీలో చేరినట్లు మంత్రి విజయ్వర్గియ పేర్కొన్నారు. అక్షయ్తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇండోర్లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
ఎన్నికల డ్యూటీ వద్దంటూ వినతుల వెల్లువ
దేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరకాలేమంటూ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఒకరు అనారోగ్యం కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా, మరొకరు తమ ఇంటిలో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినప్పటి నుండి సెలవులకు సంబంధించిన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులలో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు. ఒకరు తమ కుమార్తె జపాన్లో డిగ్రీ అందుకోబోతున్నదని రాయగా, మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరికీ వెళ్లాలని రాశారు. ఇంకొకరైతే వివాహ శుభలేఖను కూడా జతచేశారు. ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ ఆనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు. నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఎంతో శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తారనే మాట వినిపిస్తుంటుంది. -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు. అసలేం జరిగిందంటే..ఇండోర్లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు. అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాంక్ బాలెన్స్లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆదాయపు లెక్కల ప్రకారం.. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బిచ్చగాళ్లల్లో రకాలు.. బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్. (చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా) -
అనాథశ్రమం ముసుగులో అరాచకాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మధ్య ప్రదేశ్లో అనాథాశ్రయం పేరుతో జరుగుతున్న అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నిర్వహిస్తున్న సిబ్బంది చిన్నారులను తీవ్ర వేధింపులకు గురిచేశారు. పసివాళ్లనే జాలి లేకుండా చిన్న చిన్న తప్పుల పేరుతో భయంకరంగా చిత్రహింసలకు గురిచేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇండోర్లోని అనాథ శరణాలయంలో సుమారు 21 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఆశ్రమంలో గతవారం సీడబ్ల్యూసీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దీంతో అనాథ బాలలు తమ బాధలను, వేధింపులను అధికారులకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న తప్పిదాలకే ఆశ్రమం సిబ్బంది తీవ్రంగా వేధించేవారని వాపోయారు. ‘చిన్నారులను తలకిందులుగా వేలాడదీయడం, వేడి ఐరన్ రాడ్తో కొట్టడం, బట్టలు తీసేసి ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. ఎర్ర మిరపకాయలను కాల్చడం వల్ల వచ్చే పొగను కూడా పీల్చుకునేలా చేశారు’ అని అధికారులు తెలిపారు. మరీ దారుణంగా నాలుగేళ్ల పిల్లవాడు ప్యాంట్లో బాత్రూం వెళ్లాడని అతడిని రెండు మూడు రోజులు వాష్రూమ్లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదు మేరకు అయిదుగురు అనాథాశ్రయం సిబ్బందిపై కేసు నమోదైంది. అనాథ శరణాలయాన్ని వెంటనే సీజ్ చేశారు. చిన్నారులను ప్రభుత్వం షెల్టర్కు తరలించినట్లు ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. చిన్నారులపై వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా హోంలోని పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనాథలుగా గుర్తించారు. అయితే ఆ అనాథశ్రమాన్ని వాత్సల్యపురం జైన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది, దీనికి బెంగళూరు, సూరత్, జోధ్పూర్, కోల్కతాలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. చదవండి: ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు -
కోచింగ్ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి
భోపాల్: ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు ఇటీవల అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సడెన్ హార్ట్ ఎటాక్ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటు మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 18 ఏళ్ల ఓ విద్యార్ధి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. చదవండి: Tammineni: వెంటిలేటర్పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం ఇండోర్లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్కు వెళ్లాడు. తరగతి గదిలో కూర్చొని క్లాస్లు వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలగడంతో టేబుల్పై ఒరిగాడు. గమనించిన పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్ వీపు మీద రుద్దడం ప్రారంభించాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్కు తెలియజేశాడు. ఆలోపే మాధవ్ పూర్తిగా కుప్పకూలి తన డెస్క్ నుంచి జారీ కింద పడిపోయాడు. అప్రమత్తమైన మిగతా విద్యార్ధులు మాధవ్కు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అయితే కొంత సేపటికే యువకుడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. Tragic news from #Indore MPPSC aspirant dies from fatal heart attack during coaching class. CCTV footage from classroom shows Raja Lodhi sitting upright focused... Suddenly begins clutching his chest, expressing visible distress. Loses balance within seconds & falls off. Hospital… pic.twitter.com/Xf3ni3fitC — Nabila Jamal (@nabilajamal_) January 18, 2024 -
మరోసారి సత్తా చాటిన ఇండోర్.. వరుసగా ఏడోసారి నెంబర్ వన్..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్తోపాటు గుజరాత్లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్ (9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 100 లిస్ట్లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం. Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw — President of India (@rashtrapatibhvn) January 11, 2024 విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది. -
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ.. ఇండోర్లో కోటి దీపాలు!
యూపీలోని అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సరిగ్గా అదే సమయానికి మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్లో స్థానికులు 1.11 కోట్ల దీపాలను వెలిగించనున్నారు. రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా స్థానికంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ విలేకరులకు తెలియజేశారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న ఇండోర్లో 1.11 కోట్ల దీపాలు వెలిగించనున్నామన్నారు. ప్రజాప్రతినిధులతోపాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. అయోధ్యలో ఉత్సవాల సందర్భంగా ఇండోర్ నగరంలోని 31 వేల మంది పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ ఘనత నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రామునితో పాటు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ఇతివృత్తం ఆధారంగా ఈ పెయింటింగ్ పోటీ ఉంటుందని తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రాంగణాన్ని అలంకరించేందుకు భోపాల్ నుంచి ప్రత్యేక రకాల పూలను తరలిస్తున్నారు. -
నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం: మోదీ
ఇండోర్: సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో హుకుంచంద్ మిల్లు కార్మికులకు రూ.224 కోట్ల మేర బకాయిలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. బకాయిల చెల్లింపుతో 4,800 మంది కారి్మకులకు లబ్ధి చేకూరనుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తో మధ్యప్రదేశ్లో అభివృద్ధి వేగం పుంజుకుందని హర్షం వ్యక్తం చేశారు. బిల్లు కారి్మకులకు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కరిపించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. మాలవీయ పుస్తకం ఆవిష్కరణ బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ రచనలు, లేఖలు, కరపత్రాలు, ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. మాలవీయ రచనలను ఆంగ్లం, హిందీ భాషల్లో 11 సంపుటాలుగా ప్రచురించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు సమాజానికి సరైన దశ దిశను చూపడంలో, ప్రజలకు సేవలందించడంలో క్రైస్తవుల పాత్ర పట్ల దేశం గరి్వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆయన క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో క్రైస్తవులతో సమావేశమయ్యారు. క్రైస్తవ వర్గం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేదలకు సేవలందించడంలో క్రైస్తవులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. యేసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. వాజ్పేయికి ముర్ము, మోదీ నివాళులు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం ‘సదైవ్ అటల్’ వద్ద సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి కోసం వాజ్పేయి అహరి్నశలూ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, హర్దీపుసింగ్ పురి, అర్జున్రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో మరణించిన 17 ఏళ్ల అమ్మాయి, ఆ లక్షణాలు కనిపిస్తే..
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుండెపోటు వల్ల చనిపోతున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా ఇండోర్లో 17 ఏళ్ల అమ్మాయి సంజనా యాదవ్ గుండెపోటుతో మరణించింది. రాత్రి భోజనం తిన్న అనంతరం ఒక్కసారిగా ఛాతిలో నొప్పితో విలవిల్లాడింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, విపరీతంగా చెమటలు పట్టి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజన కుటుంబంలో ఇదివరకు హార్ట్ ఎటాక్ హిస్టరీ కూడా లేదని, అయినా ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. సంజనాకు హైపర్టెన్షన్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వీటితో చలికాలంలో పరిస్థితి దిగజారిపోతుందని పేర్కొన్నారు. టైఫాయిడ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే.. 'సంజనకు నాలుగు నెలల క్రితం టైఫాయిడ్. వచ్చింది. ఆ సమయంలో ఆమె హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4 g/dlకి పడిపోయింది.కానీ ఆమె కుటుంసభ్యులు స్పెషల్ కేర్ తీసుకోవడంతో త్వరగానే కోలుకుంది. ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలి మెడికల్ హిస్టరీని కూడా ఓసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది' అని వైద్యులు తెలిపారు. ఈ మధ్యకాలంలో యువతలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్లోనే గత ఆరు నెలల్లో మొత్తం 1,052 మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య ఉన్నవారే అని ఓ నివేదికలో వెల్లడైంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గుండె జబ్బులు అంటే వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంగా పరిస్థితి మారింది. యువతలో హార్ట్ ఎటాక్కు ప్రధానంగా హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ హిస్టరీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండెపోటు లక్షణాలు ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు. గుండె వరకూ రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుతో కుప్పకూలినప్పుడు ఎంత త్వరగా సీపీఆర్ చేశామన్నది చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందంచగలిగితే బతికించే ఛాన్సులు మెరుగ్గా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. -
డిఫరెంట్ లవ్సోర్టీ.. చెల్లెలి ఫ్రెండ్ నచ్చడంతో..
ఓ ట్రాన్స్జెండర్ పురుషుడు తన ప్రేయసిని చట్టబద్దంగా వివాహం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి విళ్లేతే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అమ్మాయిగా పుట్టిన అల్కా సోని.. తనలో పురుష లక్షణాలు ఉన్నాయని గమనించారు. సుమారు 46 ఏళ్లు అలాగే ఉన్న అల్కా.. ఇటీవల లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకొని ‘అస్తిత్వ సోని’గా పేరు మార్చుకున్నారు. అనంతరం తాను ప్రేమించి అమ్మాయి ‘ఆస్తా’ను వివాహం చేసుకున్నారు. వీరు ఇద్దరు ప్రత్యేక వివాహా చట్టం ప్రకారం చట్టబద్ధంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఆస్తా.. అస్తిత్వ సోని సోదరికి స్నేహితురాలు కావటం గమనార్హం. తన కుటుంబ సభ్యుల సహాకారంతో శస్త్ర చికిత్స తర్వాత ఆస్తాతో వివాహం చేసుకోగలిగాని అస్తిత్వ సోని తెలిపారు. ప్రత్యేక వివాహం చట్టం కింద తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. ఇక వీరు డిసెంబర్ 11న సాంప్రదాయబద్ధంగా వావాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. పిళ్లికి ముందే ఇండోర్ డిప్యూటీ కలెక్టర్ రోషన్ రాయ్కి తమ పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. తమ అభ్యర్థనను ఆయన ఆమోదించినట్లు పేర్కొన్నారు. గురువారం వారికి ఫ్యామిలీ కోర్టు నుంచి వివాహా ధ్రువీకరణ పత్రం అందినట్లు తెలిపారు. ఈ వివాహంపై అస్తిత్వ సోని, ఆస్తా ఆనందం వ్యక్తం చేశారు. సోనీ తన ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య అని ఆస్తా తెలిపారు. అలాగే కొన్ని రోజులకు తమ మధ్య ప్రేమ చిగురించిందని అందుకే ఇరు కుంటుంబాల అంగీకారంతోనే తాము విహహాం చేసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఇక భిన్న లింగ లక్షణాలు కలిగి ఉండి.. అనంతరం ‘లింగమార్పిడి’ చేసుకున్న వ్యక్తులు వివాహం చేసుకునే హక్కును ఇటీవల సుప్రీంకోర్టు కల్పించిన విషయం తెలిసిందే. -
‘స్మార్ట్’ పోలింగ్ స్టేషన్ ప్రత్యేకతలేమిటంటే?
ఇండోర్: ఓటర్లు క్యూలో నిలబడే అవసరం లేకుండానే ఓటేయొచ్చు.., అక్కడే సిరా గుర్తున్న వేలు చూపుతూ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెమెరా ద్వారా సెల్ఫీ తీసుకోవచ్చు..! మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలింగ్ బూత్ ప్రత్యేకతలివీ. నంద నగర్ నియోజకవర్గంలోని ‘మా కనకేశ్వరి దేవి’గవర్నమెంట్ కాలేజీ బూత్లో ఈ ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ‘ఓటర్ల క్యూ పెద్దగా అవసరం లేకుండా చేసేందుకు ఆన్లైన్ టోకెన్ విధానాన్ని తీసుకొచ్చాం. పోలింగ్ బూత్కు వచ్చిన వెంటనే ఓటర్లకు టోకెన్లు అందజేశాం. దీంతో, తమ వంతు వచ్చే వరకు వారు పోలింగ్ బూత్ వద్దే కూర్చోవచ్చు’అని రాష్ట్ర ప్రభుత్వ ఇండోర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్కు చెందిన అసిస్టెంట్ ప్లానర్ రుపాల్ చోప్రా పీటీఐకి చెప్పారు. ‘పోలింగ్ స్టేషన్ ఆవరణలోనే ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేశాం. ఓటేసిన వారు ఆ పాయింట్ వద్ద నిలబడి ఇంక్ గుర్తున్న వేలిని చూపితే చాలు వెంటనే కెమెరా క్లిక్మనిపిస్తుంది’అని ఆమె వివరించారు. ‘అక్కడే ఉన్న స్క్రీన్పై బార్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఓటర్ తన ఫోన్తో స్కాన్ చేస్తే ఫొటో వెంటనే మొబైల్లోకి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలోకి సైతం షేర్ అవుతుంది’అని రుపాలి పేర్కొన్నారు. -
ఇది పగనా లేక అభిమానమా ?..ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎమ్మెల్యే షాక్..
-
వారిద్దరే మా కొంపముంచారు.. చాలా విషయాలు నేర్చుకున్నాం: స్మిత్
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 0-2 తేడాతో ఆసీస్ కోల్పోయింది. బ్యాటింగ్ , బౌలింగ్ రెండు విభాగాల్లో ఆస్ట్రేలియా విఫలమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్(105), శుబ్మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటరల్లో సీన్ అబాట్(54) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. "ఇండోర్ వికెట్ బ్యాటింగ్కు మంచిగా అనుకూలించింది. నిజంగా గిల్, శ్రేయస్ తమ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి దూరం చేశారు. కేఎల్, సూర్య బ్యాటింగ్ తీరు కూడా అత్యుత్తమం. అయితే వర్షం పడిన తర్వాత పిచ్కు అనుకూలించింది. బంతి అద్బుతంగా స్పిన్ అయింది. మేము దక్షిణాఫ్రికాపై కూడా అన్ని మ్యాచ్లను ఓడిపోయాం. ఇక్కడే అదే కొనసాగిస్తున్నాము. మేము గత కొన్ని ఓటములనుంచి చాలా విషయాలు నేర్చకున్నాం. మా తదుపరి మ్యాచ్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. వరల్డ్కప్కు ముందు మా రిథమ్ను తిరిగి పొందడం చాలా ముఖ్యమని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో స్మిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: రాహులా మజాకా.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్ -
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ సమావేశానికి ఇండోర్కు వచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ నగరంతో అతనికున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం భారీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యధిక జనాభా కలిగిన ఈ నగరంలో పారిశ్రామికీకరణ కూడా డెవలప్ అవుతోంది. ఆరు పదుల వయసులో కూడా ఎంతో హుందాగా.. మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. కాగా ఇండోర్కి వెళ్లడం ఎల్లప్పుడూ మంచిది. నేను నా భార్యను మొదటిసారి కలిసిన నగరం ఇది. మళ్ళీ ఇప్పుడు RBI బోర్డు సమావేశం కోసం అంటూ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం ఇండోర్ ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందింది. ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రోజు రోజుకి కొత్త రూపురేఖలు పొందుతోంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్లో ఇండోర్ ఉత్తమ 'నేషనల్ స్మార్ట్ సిటీ'గా ఎంపికైంది. Always good to get to Indore. It’s the city where I first met my wife. But here for a less romantic reason this time: The @RBI board meeting…😊 Indore still holds on to its title as India’s cleanest city. Right now it’s a bit like a giant construction site. But that’s to build a… pic.twitter.com/ocwIe6CRGB — anand mahindra (@anandmahindra) September 1, 2023 -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
కడుపులో కణితి..ప్రాణాంతకమా? కాదా?
ఇండోర్కి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 15 కిలోల భారీ కణితిని గుర్తించారు వైద్యులు. రెండు గంటలకు పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి మరీ ఆ కణితిని తొలగించారు ఇండెక్స్ ఆస్పత్రి వైద్యబృందం. ఆ మహిళ ఆ భారీ కణితితో చాలా ఇబ్బంది పడింది. తినాలన్నా నడవాలన్న చాలా ఆయాసపడేది. గత కొంతకాలంగా ఆ ఇబ్బంది పడలేక చివరికి ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా ఈకణితికి గురించి తెలిసింది. చాలా పెద్ద సైజులో ఉందని తొలగించకపోతే ఏ క్షణమైన పగిలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించకుందామె. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కణుతులు గురించి. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. అసలు ఎందువల్ల వస్తుంది? ఇది ప్రాణాంతకమా? తదితరాల గురించే ఈ కథనం. ఈ కణితి ఎందుకు ఏర్పడుతుందంటే.. శరీరం కొత్త కణాలను తయారు చేసేటప్పుడూ ఆటోమెటిక్గా పాత కణాలు చనిపోతాయి. కానీ ఒక్కొసారి ఆ కణాలు చనిపోకుండా పాతవాటి కంటే వేగంగా పెరగడం జరగుతుంది. అవన్నీ పోగులు మాదిరిగా ఏర్పడి పెరిగి కణితిలా ఏర్పడుతాయి. ఇది చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. కణితులు రావడానకి గల కారణాలు శరీరంలో పరివర్తన చెందిన బీఆర్సీఏ జన్యువుల వంటి జన్యు ఉత్పరివర్తనలు లించ్ సిండ్రోమ్ వంటి వారసత్వ పరిస్థితులు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కుటుంబ చరిత్రలో ఉన్నా ధూమపానం బెంజీన్ వంటి టాక్సిన్స్కు గురికావడం హెచ్పీవీ వంటి వైరస్లుస ఊబకాయం సంకేతాలు లేదా లక్షణాలు కణితులు సంకేతాలు లేదా లక్షణాలు ⇒త్వరితగతిన అలసటకు గురవ్వడం ⇒జ్వరం ⇒తొందరగా బరువు తగ్గడం ⇒ఆకలి లేకపోవడం ⇒రాత్రిపూట సడెన్గా చెమటలు పట్టడం ⇒భరించలేని ఒకవిధమైన కడుపు నొప్పి అన్ని రకాల కణితులు ప్రమాదకరమా? ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డలు లేదా పెరుగుదలలను ఏర్పరిచే అసాధారణ కణాల సమూహాలు. అవి మన శరీరంలోని ట్రిలియన్ల కణాలలో దేనిలోనైనా ప్రారంభమవుతాయి. ►కణితులు పెరుగుతాయి. కానీ కొన్ని భిన్నంగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ లేదా ప్రాణాంతకమైనవిగా కూడా ఉంటాయి. మరికొన్ని క్యాన్సర్ కానివి లేదా అపాయకరం కానివి అనే విధానాలపై ఉధారపడి ఉంటాయి కణితులు ►ఈ కణితులు శరీరంపై ఎముకలు, చర్మం, గ్రంథులు, ఇతర అవయవాలతో సహ శరీరం అంతటా ఎక్కడైనా రావచ్చు. ఐతే అది ఎక్కడ ఏర్పడింది అనే దానిపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ►ఇలాంటి కణితుల సమస్యను ఎదుర్కొనకూడదంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ తగినంతగా వ్యాయామం కూడా చేసి ఫిట్నెస్గా ఉంటే ఈ సమస్య తలెత్తకుండా చూడొచ్చు లేదా ఈజీగా బయటపడొచ్చు. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఆ రెండు చిత్రాలే స్పెషల్!
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement