-
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది. -
రాహుల్ అవుట్
రాజ్కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్లతో పాటు పార్ట్టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
ఆస్పత్రి పాలైన 'దేవర' విలన్.. ఇంతకీ కారణం ఏంటంటే?
'దేవర' సినిమాలో విలన్గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యాడు. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. గతేడాది 'ఆదిపురుష్' విలన్గా నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే షూటింగ్లో భాగంగా ఈ మధ్య సైఫ్కి గాయాలయ్యాయని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇతడు ఆస్పత్రిలో చేరడంతో అది నిజమని తేలింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) ప్రస్తుతం 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే కొన్నాళ్ల ముందు యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు విలన్గా చేస్తున్న సైఫ్.. మోకాలి, భూజానికి గాయాలయ్యాయట. అయితే అప్పుడు పెద్దగా తెలియలేదు గానీ ఇప్పుడు ఆ గాయాలు సీరియస్ కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు. అయితే గతంలో సైఫ్కి గాయమైందట. తాజాగా అది తిరగబెట్టడంతో ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాల్సి వచ్చిందట. అలా ఇప్పుడు ఆ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో హీరోగా అప్పట్లో హిట్స్ కొట్టిన సైఫ్.. ఇప్పుడు సరైన సినిమాలు పడకపోయేసరికి రూట్ మార్చాడు. ప్రతినాయక పాత్రలైనా సరే ఒప్పుకొంటున్నాడు. అలా గతేడాది ప్రభాస్ 'ఆదిపురుష్'లో రావణుడిగా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' చిత్రంలో భైరా అనే పాత్రలో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
ఆస్ట్రేలియన్ ఓపెన్కు నాదల్ దూరం
స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్కు నాదల్ దూరం నుంచి వైదొలిగాడు. కెరీర్లో 22 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల నాదల్ గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తుంటి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో నాదల్ పునరాగమనం చేశాడు. ఈ టోర్నీ లో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన నాదల్ ఈ మ్యాచ్ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్రౌండర్గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్కు దిగలేదు. దీంతో అతను కేప్టౌన్లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా: మెగాస్టార్ ట్వీట్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ సార్కు గాయమైందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇప్పటికే సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా 156 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్తో చిరంజీవి కోసం కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Deeply pained to learn about the injury suffered by Sri KCR garu! Wishing him a successful surgery and a very speedy recovery. — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2023 -
గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!
లియో మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్లో అదరగొడుతోంది. ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా ఫ్యాన్స్ని కలవడానికి వెళ్లిన లోకేశ్ గాయపడటం కాస్త కలవరపాటుకి గురిచేసింది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) 'లియో'తో కలిపి లోకేశ్ కనగరాజ్ తీసింది జస్ట్ ఐదు సినిమాలే. కానీ దక్షిణాదిలో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తమిళ హీరోలందరినీ కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తీస్తుంటడమే ఇందుకు కారణం. లోకేశ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు.. ఈ యూనివర్స్లో భాగమే. ఇకపోతే 'లియో' సక్సెస్లో భాగంగా కేరళలోని పాలక్కాడ్ వెళ్లాడు లోకేశ్. పాలక్కాడ్లోని అరోమా థియేటర్కి వెళ్లి ఫ్యాన్స్తో కలిసి లియో సినిమా చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిమానులతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువమంది జనాలు వచ్చేసరికి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో తనకు గాయమైందని లోకేశ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మరోసారి త్వరలో కేరళ వస్తానని అన్నాడు. అతడి ట్వీట్ బట్టి చూస్తుంటే గాయం చిన్నదే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను: రేణు దేశాయ్) Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️ Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023 Director lokesh at palakkad,aroma theatre 🤩 " Thalapathy enna sonnaru nu kettaralama when lokesh said he is going to kerala "🤩😍 @actorvijay na come here one time na 🙂 #Leo #LeoIndustryHit pic.twitter.com/87TQJd9kDf — Hari Vj Fanatic (@Vijayfanzh) October 24, 2023 -
హార్దిక్ పాండ్యాకు గాయం
ప్రపంచకప్ వేటలో ఉన్న భారత శిబిరంలో కాస్త ఆందోళన పెంచే ఘటన మైదానంలో జరిగింది. బంగ్లాతో మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్ మూడో బంతిని బ్యాటర్ దాస్ నేరుగా ఆడగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును బాగా ముందుకు జరిపాడు. ఈ క్రమంలో అతని చీలమండ భాగం మడత పడింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ప్రాథమిక చికిత్స చేసినా లాభం లేకపోవడంతో అలాగే మైదానం వీడాడు. కొద్ది సేపటికే ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ చేయడని బీసీసీఐ ప్రకటించింది. అతని కాలికి స్కాన్ నిర్వహించినట్లు తెలిసింది. దాని ఫలితాలపై పూర్తి సమాచారం లేకున్నా మ్యాచ్ తర్వాత రోహిత్ ‘పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం మాకు ఊరట. అయితే ప్రతీ రోజు గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని స్పష్టతనిచ్చాడు. పాండ్యా తప్పుకోవడంతో ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లి బౌల్ చేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి ముందు 2017లో శ్రీలంకపై చివరిసారిగా కోహ్లి బౌలింగ్ చేశాడు. -
ప్రపంచకప్కు నసీమ్ షా దూరం!
వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు యువ పేస్ బౌలర్ నసీమ్ షా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నసీమ్ షా భుజానికి గాయమైంది. ఈ గాయానికి స్కాన్లు నిర్వహించారు. గాయం తీవ్రతదృష్ట్యా నసీమ్ షా మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని తెలిసింది. 20 ఏళ్ల నసీమ్ పాక్ తరఫున 14 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు. -
కాజోల్కు ఏమైంది?.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కాజోల్ ఇటీవలే ది ట్రయల్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో లాయర్ పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ది గుడ్ వైఫ్ అనే అమెకరిన్ సిరీస్కు రీమేక్గా తెరకెక్కించారు అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ను పెళ్లాడిన భామ.. ఇటీవలే 49వ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా కాజోల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్! ) ఆమె మోచేతికి కర్ర (ఎల్బో క్రచ్) సాయంతో నడుస్తూ వీడియో కనిపించింది. కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాజోల్కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీడియోలో గమనిస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంతే కాకుండా గాయంతోనే షూటింగ్కు వెళుతున్నట్లు సమాచారం. కాగా.. కాజోల్ మిస్టరీ థ్రిల్లర్ దో పట్టిలో కృతి సనన్తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా) View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్కి తిరిగి వచ్చి షూటింగ్ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్లాండ్లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
Yadamma Raju Leg Injury Video: నడవలేని స్థితికి చేరుకున్న ఏదమ్మరజు
-
స్టార్ హీరో షారుక్ ఖాన్కి యాక్సిడెంట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) షారుక్కి యాక్సిడెంట్ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు. 'జవాన్' కోసం వెయిటింగ్ దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్తో!) -
షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఈ షో షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తాజాగా జరిగిన షూటింగ్లో అర్చనా గౌతమ్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను పంచుకుంది నటి. (ఇది చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) అర్చన గడ్డం కింద బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె గాయానికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో ధైర్యవంతులైన కంటెస్టెంట్లలో అర్చన గౌతమ్ ఒకరు. డేరింగ్ స్టంట్ చేస్తుండగానే తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. షూటింగ్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే రోహిత్ బోస్ రాయ్, అంజుమ్ ఫకీ అర్జిత్ తనేజా, ఐశ్వర్య శర్మ, నైరా బెనర్జీ పలువురు విన్యాసాలు చేస్తూ గాయపడ్డారు. కాగా.. అర్చన గౌతమ్ ఇటీవల హర్ష్ లింబాచియా షో ఎంటర్టైన్మెంట్ కా రాత్-హౌస్ఫుల్లో కనిపించింది. రాజకీయ నాయకురాలైన అర్చనా 'బిగ్ బాస్- 16'లో మరింత గుర్తింపు సాధించింది. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) View this post on Instagram A post shared by khatron ke khiladi 13 Khabri (@kkk13_biggbossott2.tazakhabar) -
WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు రోజు ఓ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇన్ని రోజులు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండిన భారత ఆటగాళ్లు, మ్యాచ్కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉందనగా దెబ్బలు తగిలించుకున్నారు. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ స్వల్పంగా గాయపడగా.. తాజాగా (ఇవాళ) జట్టు సారధి రోహిత్ శర్మ చేతి వేలికి దెబ్బతగిలించుకున్నాడు. గాయం తీవ్రత తదితర విషయాలపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రోహిత్ ఎడమ చేతి వేలికి బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటూ కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫైనల్ మ్యాచ్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడా లేదా అని విచారించుకుంటున్నారు. రోహిత్ గాయంపై పూర్తి సమాచారం కొరకు గూగుల్ చేస్తున్నారు. రోహిత్ గాయం వార్త నిజమా లేక ఫేక్ న్యూసా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనంతరం హిట్ మ్యాన్ ప్రాక్టీస్కు రాకుండా రెస్ట్ తీసుకున్నాడు. రోహిత్ చేతి వేలికి స్కానింగ్ కూడా చేసినట్లు సమాచారం. కాగా, రేపటి (జూన్ 7) నుంచి జూన్ 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చాలా రోజులుగా కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లలోని ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఆసీస్ తరఫున హాజిల్వుడ్, తాజాగా టీమిండియా తరఫున రోహిత్ శర్మ గాయపడ్డారు. మరి హిట్మ్యాన్ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటాడా లేక గాయం వార్త ఫేక్ న్యూసా తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్ చదవండి: WTC Final: ఆస్ట్రేలియా తుది జట్టులో నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్ -
WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాకి కోలుకోలేని దెబ్బ స్టార్ పేసర్ అవుట్
-
ధోని సర్జరీ, అసలు విషయం చెప్పిన CSK సీఈఓ..!
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
జైలు బాత్రూమ్లో కుప్పకూలిన సత్యేంద్ర జైన్.. ఆసుపత్రి తరలింపు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గురువారం ఉదయం తీహార్ జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, జైలు అధికారులు సత్యేంద్ర జైన్ను వెంటనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా, జైన్ గడచిన వారం రోజుల్లో అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. తీహార్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సత్యేంద్ర జైన్ తన వార్డులోని బాత్రూమ్లో పడిపోయారు. దీనికిముందు మే 22న అనారోగ్యం కారణంగా సత్యేంద్ర జైన్ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. అయితే, బాత్రూమ్లో పడిపోవడంతో ఆయన వెన్నముకకు గాయమైనట్టు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి జైన్ మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్నారు. అందులో భాగంగానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Jailed AAP leader Satyendar Jain admitted to hospital after slipping in washroom#satyendrajain #AAP https://t.co/6L82iMxk83 — Kalinga TV (@Kalingatv) May 25, 2023 ఇది కూడా చదవండి: పార్లమెంట్: రాజ్యసభలో రెడ్, లోక్సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా? -
షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా సల్మాన్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలిపారు. ఎడమ భుజానికి గాయమైనట్లుత తెలుపుతూ ఓ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.దీంతో గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్-3’షూటింగ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీలో సల్మాన్పై భారీ యాక్షన్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా సల్మాన్ భుజానికి గాయమైంది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీన్ కూడా ఉండనుందట. ఇటీవలె కిసీకా భాయ్ కిసీకి జాన్తో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో టైగర్-3 కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు ఈ కండల వీరుడు. Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3 pic.twitter.com/nyNahitd24 — Salman Khan (@BeingSalmanKhan) May 18, 2023 -
#Rafael Nadal: తిరగబెట్టిన గాయం.. ఫ్రెంచ్ ఓపెన్కు దూరం
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్కు దూరమయ్యాడు. దీనికి తుంటి ఎముక గాయం తిరగబెట్టడమే కారణమని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో తుంటి గాయంతో టోర్నీ మధ్యలోనే నాదల్ వైదొలిగాడు. అప్పటినుంచి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడంతో గురువారం తాను ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం లేదని నాదల్ స్వయంగా స్పష్టం చేశాడు. కాగా 2004 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఆడుతూ వస్తున్న నాదల్ తనకు అచ్చొచ్చిన గ్రాండ్స్లామ్కు దూరమవ్వడం ఇదే తొలిసారి. క్లేకోర్టు రారాజుగా అభివర్ణించిన నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్ కొల్లగొడితే.. అందులో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లే కావడం విశేషం. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్లో 115 మ్యాచ్లు ఆడిన నాదల్ 112 మ్యాచ్లు గెలిచి కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు. దీన్నిబట్టే ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ ఆధిపత్యం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 ఏడాదిలో నాదల్ టెన్నిస్ కెరీర్కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నట్లు AFP ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 22 గ్రాండ్స్లామ్స్ కొల్లగొట్టిన నాదల్.. అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ విషయంలో జొకోవిచ్తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. -
'కెరీర్ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం!
పాకిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది. బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్కు 2011 తర్వాత న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్లు తలా రెండు వికెట్లు తీశారు. Yaar ye kya hogya 😭 The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔 Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i — 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023 చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
బిగ్షాక్.. ఐపీఎల్కు కేఎల్ రాహుల్ దూరం!
లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు బిగ్షాక్ తగిలింది. గాయంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ టోర్నీకి మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీలైన్ వద్ద బంతిని ఆపేందుకు పరిగెడుతూ.. మైదానంలో కుప్పకూలాడు. దీంతో తొడ కండరానికి గాయం కావడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఫిజియోలు వచ్చి స్ట్రెచర్పై రాహుల్ను తీసుకెళ్లారు. అయితే లక్నో బ్యాటింగ్ సమయంలో ఆఖర్లో వచ్చిన రాహుల్ పరిగెత్తడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పీటీఐ సమాచారం మేరకు.. ''కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో జట్టుతో ఉన్నప్పటికి సీఎస్కేతో మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు. సీఎస్కేతో మ్యాచ్ పూర్తవ్వగానే జట్టును వీడనున్న రాహుల్ ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో వైద్యులు స్కానింగ్ నిర్వహించనున్నారు. రిపోర్ట్స్ ద్వారా వచ్చే ఫలితంపై కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. ''ఒకవేళ రాహుల్ గాయంలో తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్ టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడు. ఐపీఎల్ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేది కూడా అనుమానమే.కాగా ఆర్సీబీతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్లో గాయపడిన లక్నో బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు.'' అని పేర్కొంది. లక్నోకు ఎదురుదెబ్బే? ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన లక్నో ప్రస్తుతం ఓటములతో సతమతమవుతోంది. ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు ఉనాద్కట్ దూరమవ్వడం లక్నోకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుతం లక్నోకు స్టాండిన్ కెప్టెన్గా ఉన్న కృనాల్ పాండ్యా.. కేఎల్ రాహుల్ దూరమైతే మిగతా మ్యాచ్ల్లోనే అతనే జట్టును నడిపించనున్నాడు. రాహుల్ దూరమైతే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశం ఎవరికి? ఇక జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. గాయంతో కేఎల్ రాహుల్ దూరమైతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ దూరమైతే.. సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, హనుమ విహారిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అభిమానులు పేర్కొన్నారు. We didn't win on the night, but one man won hearts everywhere. 💙 KL, we love you. Get well soon, skip! 🫶 pic.twitter.com/1x896mj9dF — Lucknow Super Giants (@LucknowIPL) May 2, 2023 చదవండి: 'నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా?'
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫలితాల సంగతి దేవుడెరుగు.. ఈసారి ఎలాగయినా డిపాజిట్లు దక్కించుకోవాలి!
RR vs PBKS: రాజస్తాన్ ఇలా అయితే.. ఎలా?
దరఖాస్తుల ఆహ్వానం
గోదావరినదిలో పూడికతీత పనుల పరిశీలన
ఆర్టీసీ డిపోలో వైద్యపరీక్షలు
కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు రానివ్వొద్దు
No Headline
పనుల్లో నాణ్యత పాటించాలి
ట్రబుల్ బూత్ నంబర్ 227
● ఆరువారాలు దాటినా అందని ఇంటర్ మూల్యాంకనం డబ్బులు ● నిరీక్షిస్తున్న 500 మంది ఏఈలు ● జిల్లాకు రావాల్సింది రూ.90లక్షలు
తప్పక చదవండి
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
- అద్దెకివ్వడమే శాపమయ్యింది! ఏకంగా ప్రియుడితో కలిసి..
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement