-
రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
టీమిండియా లెజండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య బాలివుడ్ నటి అనుష్క శర్మలకు షేర్ మార్కెట్లో లాభాల పంట పండింది. వారు పెట్టుబడి పెట్టిన షేర్లు భారీ లాభాలను తీసుకొచ్చాయి.స్టాక్ మార్కెట్లో మే 23న అరంగేట్రం చేసిన గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్.. 2020 ఫిబ్రవరిలో ఈ బీమా సంస్థలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ షేరు ధర రూ.300 మార్కును దాటడంతో, కంపెనీలో తమ వాటాలను కొనసాగిస్తూనే దంపతుల పెట్టుబడి నాలుగు రెట్లు పెరిగింది.బీమా కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం.. విరాట్ కోహ్లీ గో డిజిట్లో ఒక్కొక్కటి రూ. 75 చొప్పున 2,66,667 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అనుష్క శర్మ 66,667 షేర్లను రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈ జంట మొత్తం పెట్టుబడి రూ.2.5 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్ ధర రూ.300 దాటడంతో విరాట్ కోహ్లీ రూ.2 కోట్ల పెట్టుబడి రూ.8 కోట్లకు చేరుకోగా, అనుష్క శర్మ పెట్టుబడి రూ.2 కోట్లకు చేరుకుంది. వీళ్ల షేర్ల విలువ ఇప్పుడు రూ.10 కోట్లు. -
రూ.12000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన మహీంద్రా: ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది. -
అక్కడ రాహుల్ గాంధీ ఇన్వెస్టింగ్.. వంద నుంచి వెయ్యి రెట్ల లాభాలు!
కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' కేరళలోని వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. ఈయన దగ్గర ఉన్న మొత్తం విలువ రూ. 20.4 కోట్లుగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు.. జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు ఉన్నట్లు ఉన్నట్లు తెలిపారు. ఈయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు గత పదేళ్లలో మంచి వృద్ధిని పొందాయి. రాహుల్ గాంధీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు & పదేళ్లలో ఆ సంస్థల వృద్ధి ఆల్కైల్ అమీన్స్ కెమికల్స్ లిమిటెడ్: +3625.00 శాతం ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్: +467.38 శాతం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్: +4028.06 శాతం దీపక్ నైట్రేట్ లిమిటెడ్: +3510.21 శాతం దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్: +443.78 శాతం డా. లాల్ పాత్లాబ్స్ లిమిటెడ్: +215.04 శాతం ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: 434.64 శాతం గార్వేర్ టెక్నికల్ ఫైబర్స్ లిమిటెడ్: +3454.00 శాతం జీఎంఎం Pfaudler లిమిటెడ్: +469.09 శాతం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్: +291.49 శాతం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్: +363.68 శాతం ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్: +868.50 శాతం ఇన్ఫోసిస్ లిమిటెడ్: +275.39 శాతం ఐటీసీ లిమిటెడ్: +78.80 శాతం ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్: +636.42 శాతం మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్: +595.35 శాతం నెస్లే ఇండియా లిమిటెడ్: +434.42 శాతం పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్: +816.51 శాతం సుప్రజిత్ ఇంజినీరింగ్ లిమిటెడ్: +475.14 శాతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్: +263.04 శాతం టైటాన్ కంపెనీ లిమిటెడ్: +1123.42 శాతం ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్: +1226.25 శాతం వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్: +1276.81 శాతం వినైల్ కెమికల్స్ (ఇండియా) లిమిటెడ్: +2101.45 శాతం బ్రిటానియా ఇండస్ట్రీస్: +1007.61 శాతం -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
‘రియల్’ మోసాలు రూ.10 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తక్కువ ధరకే ఇళ్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్ ఆఫర్ అంటూ వంద శాతం వసూలు పేరిట రియల్ ఎస్టేట్ మోసాలు ఇటీవలి కాలంలో నగరంలో ఎక్కువ అయ్యాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు అడియాసలు చేస్తున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న సొమ్ము, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి సర్వసాధారణమయ్యాయి. కస్టమర్ల సొమ్మే యజమానికి.. నగరానికి నలువైపులా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపు రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కూడా లేని ప్రాంతాల్లో రియల్ ప్రాజెక్టుల పేరిట ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్నారు. భూమి యజమానులతో ఒప్పందం చేసుకొని, ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, ప్రీలాంచ్లో కొనుగోలు చేస్తే తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి రూ.కోట్లలో వసూలు చేస్తున్నారు. ఆ డబ్బే భూమి యజమానికి కట్టి, ఆ తర్వాత అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అనుమతులు రాకపోయినా, భూ యజమానితో వివాదం తలెత్తినా ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రీలాంచ్లో బుక్ చేసుకున్నవారు రోడ్డున పడుతున్నారు. మోసాల విలువ రూ.10 వేల కోట్లు.. సాహితీ, భువనతేజ, జేజే ఇన్ఫ్రా, జేవీ బిల్డర్స్, జయ గ్రూప్ వంటి చిన్నా, పెద్ద కంపెనీలు ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు చేపడుతున్నాయి. కోకాపేట, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్పేట, ఆదిబట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఇలాంటి వెంచర్లు కనీసం వంద వరకు ఉంటాయని, నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే రియల్ మోసాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లు ఉంటుందని పరిశ్రమవర్గాల అంచనా. రియల్ మోసాలకు గురైన వారంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రియల్ఎస్టేట్ మోసాలపై పోలీసులు దృష్టి సారించారు. నిందితులపై డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ (టీపీడీఎఫ్ఈఏ) చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు సంబంధిత బిల్డర్, కంపెనీ పూర్వాపరాలు పరిశీలించాలి. ప్రాజెక్ట్ను పూర్తి చేసే ఆర్ధిక స్తోమత ఆ సంస్థకు ఉందా? లేదా? అని ఆరా తీయాలి. దీనికి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ విభాగాల నుంచి అనుమతులు ఉన్నాయా..లేదా, రెరాలో నమోదైందా లేదా తనిఖీ చేయాలి. ఏజెంట్ చెప్పినవన్నీ నమ్మకుండా, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో లావాదేవీలు జరిపితేనే ఉత్తమం. – నరేంద్రకుమార్, ప్రణీత్ గ్రూప్ ఎండీ -
ఈఎఫ్టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: యూరప్లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్ కొంత చౌకగా లభించగలవు. లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్ల్యాండ్, లీచ్టెన్స్టెయిన్ దేశాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి. ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. -
డిస్నీ, రిలయన్స్ ఒప్పందం?
న్యూఢిల్లీ: వాల్ట్ డిస్నీ భారత వ్యాపార విభాగ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగం కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన మీడియా విభాగం, ఇతర అనుబంధ సంస్థలకు 61 శాతం వాటా ఉంటుందని, మిగతా వాటాలు డిస్నీకి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ వారం వెల్లడయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టాటా ప్లే సంస్థలో డిస్నీకి ఉన్న మైనారిటీ వాటాలను కూడా రిలయన్స్ కొనుగోలు చేయొచ్చని వివరించాయి. సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైతే పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు గతేడాది నుంచి డిస్నీ కసరత్తు చేస్తోంది. డిస్నీ, రిలయన్స్ ఒప్పందం? -
ఇందులో పెట్టుబడులు పెడితే..‘గుండె మీద చెయ్యేసుకుని బతకొచ్చు’!
మిడ్క్యాప్, స్మాల్క్యాప్లో రిస్క్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో రాబడులు కూడా మెరుగ్గా ఉంటాయి. అస్థిరతలు చూసి చలించకుండా, సహనంతో ఉండే వారికి స్మాల్క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. లార్జ్క్యాప్తో పోలిస్తే దీర్ఘకాలంలో పెట్టుబడులపై అధిక ప్రతిఫలాన్ని మిడ్క్యాప్, స్మాల్క్యాప్ పథకాలు అందిస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. కనుక పిల్లల వివాహం, ఉన్నత విద్య, రిటైర్మెంట్ తదితర దీర్ఘకాల లక్ష్యాల కోసం స్మాల్క్యాప్ ఫండ్స్కు తమ పోర్ట్ఫోలియోలో తప్పకుండా చోటు కల్పించుకోవడం ఎంతైనా అవసరం. ఈ విభాగంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం దీర్ఘకాలంలో మంచి పనితీరుతో ఆకట్టుకుంటోంది. రాబడులు ఏడాది, మూడేళ్ల కాలంలో సూచీలతో పోలిస్తే రాబడుల విషయంలో ఎస్బీఐ స్మాల్క్యాప్ ఫండ్ వెనుక బడింది. కానీ, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో సూచీలకు మించి అధిక రాబడిని ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం ఇన్వెస్టర్లకు 37 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఇక మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 25 శాతం చొప్పున ఉంది. ఐదేళ్లలో 26 శాతం, ఏడేళ్లలో 21 శాతం, పదేళ్ల కాలంలో 27 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో కనిపిస్తుంది. దీర్ఘకాలంలో స్మాల్క్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే ఎక్కువగా ఉంది. పెట్టుబడుల విధానం 2011, 2013, 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఎస్బీఐ స్మాల్క్యాప్ పథకం నష్టాలను తగ్గించింది. 2014, 2017, 2020–21 బుల్ ర్యాలీల్లోనూ మంచి పనితీరు చూపించింది. పెట్టుబడుల్లో 65 శాతం వరకు స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంటుంది. అయితే, అన్ని సమయాల్లోనూ స్మాల్క్యాప్ కంపెనీలకు ఇదే స్థాయిలో కేటాయింపులు చేయదు. ఒకవేళ స్మాల్క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు మరీ ఖరీదుగా మారాయని భావించినప్పుడు, మిడ్క్యాప్, లార్జ్క్యాప్నకు కేటాయింపులు పెంచుతుంది. అలాగే, డెట్కు కూడా కొంత కేటాయిస్తుంటుంది. పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.24,862 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో జనవరి చివరికి 93.13 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 6.87 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించినట్టయితే, 59.23 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. స్మాల్క్యాప్ కంపెనీల్లో 40.77 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్క్యాప్ ఫండ్ అయినప్పటికీ, ప్రస్తుతం అధిక భాగం పెట్టుబడులు మిడ్క్యాప్ కంపెనీల్లోనే ఉండడం గమనార్హం. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఆయా స్మాల్క్యాప్ కంపెనీలు మంచి పనితీరుతో మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలుగా మారే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎక్కువ పెట్టుబడులు మిడ్క్యాప్లో కనిపిస్తున్నాయి. పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 55 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్లోనూ పెట్టుబడులు 28 శాతం మించలేదు. అంటే ఈ పథకంలో ఎక్కువ వైవిధ్యం కనిపిస్తోంది. సేవల రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, 18 శాతం కేటాయింపులు చేసింది. ఆ తర్వాత కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీలకు 12 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 12 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు 9.49 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
డైరెక్ట్ ప్లాన్లలో ఎస్డబ్ల్యూపీ, ఎస్టీపీ ఎలా..?
డైరెక్ట్ ప్లాన్లలో నేను ఇన్వెస్ట్ చేస్తే.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసుకునే సేవలను ఫండ్ సంస్థ అందిస్తుందా? – విజయ్ కుమామ్ డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు స్వయంగా నిర్వహించుకునేవి. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ఇన్వెస్టర్ రెండు మూడు మార్గాల్లో నిర్వహించుకోవచ్చు. సిప్ లేదా ఎస్డబ్ల్యూపీ లేదా మరే ఇతర లావాదేవీ అయినా బ్రిక్స్ అండ్ మోర్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించి చేసుకోవాలి. అంటే ఫండ్ హౌస్ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అయిన కేఫిన్టెక్, క్యామ్స్ ద్వారా ఈ లావాదేవీలు చేసుకోవచ్చు. సమీపంలోని ఇన్వెస్టర్ సర్వీస్ సెంటర్కు స్వయంగా వెళ్లి సిప్ లేదా ఎస్డబ్ల్యూపీ లేదా ఎస్టీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫండ్ హౌస్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. కొన్ని ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు సైతం డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి ఈ సేవలు అందిస్తున్నాయి. ఈ సదుపాయాల ద్వారా ఇన్వెస్టర్లు సొంతంగా ఈ లావాదేవీలు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండ్ హౌస్ సంస్థ నేరుగా సాయం అందించదు. నేను కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్ యుటిలిటీస్ అనే ప్లాట్ఫామ్ను ఇందుకోసం వినియోగిస్తున్నాను. ఇది ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్లో లావాదేవీలను ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ తెలిసిన అందరికీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీల నిర్వహణ సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే మొదట కేవైసీ, ఇతర అవసరాలను ఇచ్చే సమయంలో కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. వీటిని సైతం ఇంటి నుంచే చేసుకునే సౌలభ్యం ఉంది. డైరెక్ట్ ప్లాన్లకు సంబంధించి సేవలను ఇన్వెస్టర్లు సులభంగా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. నేను ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా వయసు 54 ఏళ్లు. ఈక్విటీలకు 50 శాతం, ప్రభుత్వం బాండ్లకు 25 శాతం, కార్పొరేట్ బాండ్లకు 25 శాతం చొప్పున నా పెట్టుబడుల కేటాయింపులు (అస్సెట్ అలోకేషన్) ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నా ప్రభుత్వ బాండ్ల పెట్టుబడులను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించుకుని.. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులను 40 శాతానికి పెంచుకోవడం సరైనదేనా..? – మనోరంజన్ గిల్ట్ ఫండ్స్ లేదా ప్రభుత్వ బాండ్లలో అస్థిరతలు.. షార్ట్ డ్యూరేషన్ లేదా కార్పొరేట్ బాండ్ ఫండ్స్తో పోలిస్తే సహజంగా ఎక్కువే. ఎందుకంటే గిల్ట్ ఫండ్స్ అన్నవి ప్రధానంగా మధ్య కాలం నుంచి దీర్ఘకాల వ్యవధితో కూడిన ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి వడ్డీ రేట్ల మార్పులకు ఎక్కువ ప్రభావితమవుతూ ఉంటాయి. అదే సమయంలో కార్పొరేట్ బాండ్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో క్రెడిట్ రిస్క్ దాదాపు ఉండదనే చెప్పుకోవాలి. స్వల్పకాలంలో ప్రభుత్వ బాండ్లు మరింత అస్థిరతలను ఎదుర్కొంటాయి. దీర్ఘకాలంలో ఇవి కనుమరుగు అవుతాయి. మూడు, ఐదేళ్లు అంతకుమించిన కాలాల్లో కార్పొరేట్ బాండ్ ఫండ్స్ మాదిరే గిల్ట్ ఫండ్స్ కూడా రాబడులు ఇచ్చాయి. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో మీ పెట్టుబడులు 60 ఏళ్ల వరకు లాకిన్ అయి ఉంటాయి. అంటే మరో ఆరేళ్ల సమయం మీకు మిగిలి ఉంది. మీరు డెట్కు కేటాయించిన మొత్తంలో సగాన్ని ప్రభుత్వ బాండ్లలో పెట్టినా.. అవి మొత్తం పెట్టుబడుల్లో 25 శాతమే. వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను తగ్గించుకోవాలని అనుకుంటే.. తర్వాత ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవాల్సి రావచ్చు. దీనివల్ల పెట్టుబడుల విషయంలో యాక్టివ్గా పనిచేయాల్సి రావచ్చు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు. కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడులు పెంచుకోవడం అంటే రిస్క్ కొంచెం తీసుకున్నట్టే అవుతుంది. కనుక మీ పెట్టుబడులను యథాతథంగా కొనసాగించుకోవచ్చు. -
రూ.వేలల్లో ఇచ్చి రూ.కోట్లల్లో కొట్టేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: ‘పిగ్ బుచ్చరింగ్’... తరహాకు చెందిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయాయని నగర సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ స్కామ్స్లో మోసపోతున్న వారిలో చార్టెడ్ అకౌంటెంట్లు, ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తున్న నిపుణులతో పాటు విద్యాధికులు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ప్రతి రోజూ కనిష్టంగా నాలుగు కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ జరుగుతున్న విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అదే పంథా ఇక్కడ అమలు... మాంసం వ్యాపారులు పంది బక్కపలుచగా ఉన్నప్పుడు దాన్ని వధించరు. కొన్నాళ్లపాటు దానిని మేపడం ద్వారా బలిష్టంగా చేసి ఆపై మాంసంగా మారుస్తారు. పిగ్ బుచ్చరింగ్గా పిలిచే ఈ విధానాన్నే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ చేసే నేరగాళ్లు అనుసరిస్తున్నారు. ట్రేడింగ్ పేరుతో వివిధ రకాలైన సోషల్మీడియా ప్లాట్ఫామ్స్పై ప్రకటనలు గుప్పిస్తున్న నేరగాళ్లు పలువురిని ఆకర్షిస్తున్నారు. ఇలా తమ వల్లోపడిన వారికి పూర్తి నమ్మకం కలగడం కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. వీటి ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వారికి సభ్యులుగా చేస్తున్నారు. ఆపై ప్రత్యేక లింకుల ద్వారా తమ యాప్స్ టార్గెట్ చేసిన వారి ఫోన్లలో డౌన్లోడ్ చేయిస్తున్నారు. దీని డ్యాష్బోర్డ్లో సదరు వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత లాభం వచి్చంది? మొత్తం ఎంతకు పెరిగింది? తదితరాలు కనిపిస్తూ ఉంటాయి. తొలినాళ్లల్లో వాళ్లు పెట్టిన పెట్టుబడికి రూ.వేలల్లో లాభాలు ఇచ్చి పూర్తిగా నమ్మిస్తారు. ఆపై పెట్టుబడి మొత్తాన్ని రూ.లక్షలు, రూ.కోట్లకు పెంచేలా చేస్తారు. ఆ గ్రూపుల నిండా ‘లాభాలే’... ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్కు సంబంధించిన యాప్ల్లో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లతో, వాటి లోగోలతో ఉంటుండటంతో బాధితులు తేలిగ్గా మోసపోతున్నారు. వీరు సభ్యులుగా ఉండే గ్రూపులకు ప్రీమియం, వీఐపీ లాంటి పేర్లు పెడతారు. వీటిలో అత్యధికులు సైబర్ నేరగాళ్ల అనుచరులే సభ్యులుగా ఉంటారు. వారు ప్రతి రోజూ తనకు ఇంత మొత్తం లాభం వచి్చంది, అంత మొత్తం లాభం వచి్చంది అంటూ కామెంట్స్ పోస్టు చేస్తారు. దీంతో పాటు తమ యాప్స్కు సంబంధించి డ్యాష్బోర్డులు, నగదు తమ ఖాతాల్లో మళ్లినట్లు చూపించే కలి్పత సందేశాలను ఈ గ్రూపుల్లో పొందుపరుస్తారు. ఇవి చూసిన బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు వీళ్లు పెట్టే పెట్టుబడులను తమ సొంత ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తారు. ప్రతి దశలోనూ భారీ లాభాలు వచ్చాయంటూ సందేశాలు పంపడంతో పాటు యాప్ల డ్యాష్ బోర్డుల్లోనూ ఆ మొత్తాన్ని చూపిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత వాటిలోని విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ చేసేసి బాధితులు తమ నగదు వెనక్కు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. అప్పటికే వీరి నుంచి భారీ మొత్తం పెట్టుబడిగా తీసేసుకుని ఉంటారు. దీంతో ఈ మొత్తం అది నష్టపోతామనే ఉద్దేశంతో బాధితులు నేరగాళ్లు చెప్పినట్లు చేయడానికి సిద్ధమవుతారు. అసలు కథ మొదలెట్టి వీలైనంత... దీనిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు డ్యాష్బోర్డులో కనిపిస్తున్న వర్చువల్ ఖాతాల్లో నగదు డ్రా చేసుకోవాలంటే నిరీ్ణత మొత్తం పెట్టుబడి పెట్టాలని మరికొంత డిపాజిట్ చేయించుకుంటారు. చివరకు ఆదాయపు పన్ను, జీఎస్టీ తదతర చెల్లింపుల పేరుతో మిగిలిన మొత్తం కాజేసి... ఆ యాప్, గ్రూపులు పని చేయకుండా చేస్తారు. ఇలా భారీ మొత్తాలు స్వాహా చేస్తున్న ఈ యాప్స్ వెనుక చైనీయులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా కేసుల్లో బాధితుల నుంచి కాజేసిన మొత్తం క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిపోతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ మోసాల నేపథ్యంలో కేవలం సెబీ అనుమతి ఉన్న సంస్థలు, యాప్ల ద్వారానే ట్రేడింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. డీమ్యాట్ ఖాతాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని, బ్రోకర్ల సహా ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోని నగదు బదిలీ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. అపరిచిత గ్రూపుల్లోని పోస్టులు నమ్మడం, లింకుల ద్వారా వచ్చే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కూడదని ఆయన పేర్కొన్నారు. -
వృద్ధికి కార్పొరేట్ పెట్టుబడుల దన్ను
ముంబై: కార్పొరేట్ రంగం తాజా మూలధన వ్యయాలు తదుపరి దశ వృద్ధికి దోహదపడే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన రూపొందించిన తాజా బులెటిన్ పేర్కొంది. స్థిరంగా, 4 శాతం వద్ద తక్కువ ద్రవ్యోల్బణం జీడీపీ పురోగమనానికి కీలక అంశంగా ఉంటుందని వివరించింది. 2024లో గ్లోబల్ ఎకానమీ ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొంది. సవాళ్లు ఉన్నప్పటికీ, సానుకూలతలో వాటిని సమతౌల్యం చేస్తున్నట్లు వివరించింది. భారత ఆరి్థక వ్యవస్థ 2023–24 ప్రథమార్థంలో మంచి పురోగతి సాధించిందని, ఇదే ధోరణిని ఇప్పటికీ కొనసాగిస్తోందని పేర్కొంది. మొత్తంమీద, ప్రైవేట్ కార్పొరేట్ రంగం పెట్టుబడి ధోరణులు ఈ సంవత్సరం ఇప్పటివరకు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. 2023 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ప్రధాన బ్యాంకులు, ఆరి్థక సంస్థలు (ఎఫ్ఐ) రుణాలు మంజూరు చేసిన ప్రాజెక్ట్ల మొత్తం వ్యయం రూ. 2.4 లక్షల కోట్లని పేర్కొంటూ, ఇది వార్షికంగా 23 శాతంకంటే ఎక్కువని తెలిపింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో మూలదన పెట్టుబడులు, పబ్లిక్ ఆఫర్లు, వాణిజ్య రుణ సేకరణలు.. ఎకానమీ సానుకూలతలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వార్షిక సగటును 4.5 శాతంగా పేర్కొంది. బులెటిన్ కథనంలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలు సంబంధిత రచయితలవితప్ప భారతీయ రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించరాదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ బులెటిన్ను రూపొందించింది. భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై ఐఎంఎఫ్ వాదనలు సరికాదు... ఇదిలావుండగా, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన మరో ఆరి్టకల్ భారత్ రుణ–జీడీపీ నిష్పత్తిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయాలను త్రోసిపుచి్చంది. రుణ–జీడీపీ నిష్పత్తి అంచనా వేసిన దానికంటే గణనీయంగా తక్కువగా ఉండవచ్చని ఉద్ఘాటించింది. ‘‘ఈ సందర్భంలో తీవ్ర పరిస్థితులు ఏదైనా సంభవిస్తే... భారతదేశ సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో మధ్య కాలికంగా 100 శాతం మించిపోతుందన్న ఐఎంఎఫ్ వాదనను మేము తిరస్కరిస్తున్నాము’’ అని ఆర్టికర్ పేర్కొంది. 2030–31 నాటికి ప్రభుత్వ సాధారణ రుణ–జీడీపీ నిష్పత్తి 78.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేయగా, ఐదు శాతం తక్కువగా 73.4 శాతానికి పరిమితం అవుతుందని ఆర్టికల్ పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు సంబంధించి నికర వ్యత్యాసం ద్రవ్యలోటును భారత్ పటిష్ట రీతిలో కట్టడి చేయగలుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 2024–25లో వృద్ధి 7 శాతం: ఆరి్థకశాఖ కాగా, భారత ఆర్థిక వ్యవస్థ అవుట్లుక్ ప్రకాశవంతంగా’ కనిపిస్తుందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆరి్థక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందని ఆరి్థకశాఖ నెలవారీ ఆరి్థక సమీక్షా నివేదిక పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు– అంతర్జాతీయ ఆరి్థక మార్కెట్లలో అస్థిరత నుండి ప్రతికూలతలపై దేశం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నివేదిక ఉద్ఘాటించింది. గృహ వినియోగం మెరుగుపడుతుందని నివేదిక అంచనా వేసింది. ప్రైవేటు రంగంలో తిరిగి పెరుగుతున్న పెట్టుబడులు, మెరుగైన వ్యాపార సెంటిమెంట్లు, బ్యాంకులు– కార్పొరేట్ల ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లు, మూలధన వ్యయం పెంపునకు ప్రభుత్వ నిరంతర ప్రయత్నం ఎకానమీని సుస్థిరంగా నడుపుతోందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వాణిజ్యం మెరుగుపడ్డం, సరఫరాల చైన్ స్థిరీకరణ అంతర్జాతీయ డిమాండ్ పురోగమనానికి దారితీసే అంశాలని వివరించింది. -
రెన్యూ సిస్ పెట్టుబడులు రూ. 6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్/మహేశ్వరం: సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్, ఫొటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థ ‘రెన్యూసిస్’తెలంగాణలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో రెన్యూసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో రెన్యూసిస్తో జరిగిన ఒప్పందంపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో తయారీ యూనిట్లు కలిగిన రెన్యూసిస్ తమ అతిపెద్ద తయారీ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పేందుకు ముందుకు రావడంపై మంత్రి శ్రీధర్బాబు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందజేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్గా మారుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ పరికరాల ఉత్పత్తి రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని, అందుకు అనువుగా ఉండే సమగ్ర ఇంధన విధానాన్ని రూపొందిస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహం : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని హార్డ్వేర్ పార్కు–2లో అపోలో మైక్రో సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ ఎల్రక్టానిక్ పరికరాల కంపెనీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్షరింగ్ హబ్గా మారిందన్నారు. ఏరోస్పేస్ పరికరాల తయారీలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామని స్పష్టం చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ ఎండీ బద్దం కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్టార్టప్ల్లో రూ. 200 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్ బన్సల్ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్టెక్ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్ పెట్టుబడులని బన్సల్ పేర్కొన్నారు. గతేడాది సగటున 61 శాతం మేర రాబడులతో 14 సంస్థల నుంచి వైదొలిగినట్లు చెప్పారు. 2023లో ఒక మీడియా స్టార్టప్, కూవర్స్, స్పోర్టిడో మొదలైన వాటి నుంచి ఐపీవీ పూర్తిగా నిష్క్రమించింది. మీడియా వెంచర్లో పెట్టుబడులపై దాదాపు 200 శాతం రాబడి అందుకున్నట్లు బన్సల్ వివరించారు. -
ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం..!
-
బంగారం ఇలా కొంటే రూ.16 వేలు ఆదా..!
-
నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ఆసియా మార్కెట్లు
-
తాడేపల్లి: సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం
-
సీఎం జగన్ ఎస్ఐపీబీ మీటింగ్ విజువల్స్
-
దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి
ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగంగా అందుబాటులోకి వచ్చే కొత్త అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఇన్వెస్ట్ చేయడం సాధారణ ఇన్వెస్టర్లకు సాధ్యమయ్యేది కాదు. నిపుణులైన ఫండ్ మేనేజర్లు ఇలాంటి అవకాశాలను ముందుగానే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకని ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్ను పరిగణనలోకి తీసుకోవచ్చు. పెట్టుబడుల విధానం ఆర్థిక వ్యవస్థలో భాగంగా వివిధ వ్యాపార సైకిల్స్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. అంటే ఒక్కో కాలంలో కొన్ని రంగాల్లోని కంపెనీలకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. అలా లాభపడే రంగాలు, స్టాక్స్ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీన్నే బిజినెస్ సైకిల్ ఆధారిత పెట్టుబడుల విధానం అంటారు. ఆయా ఆర్థిక వృద్ధి దశల్లో భాగంగా ఎక్కువ లాభపడే కంపెనీలను గుర్తించడంలోనే పథకం రాబడులు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం సమయంలో చాలా రంగాలు సమస్యలను ఎదుర్కొంటాయి. కానీ, అదే సమయంలో కొన్ని రంగాలకు వృద్ధి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి వాటిని ఫండ్ మేనేజర్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ సైతం ఈ పథకంలో భాగంగా ఉంటుంది. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 36 శాతం రాబడులను అందించింది. ఇదే కాలంలో బెంచ్ మార్క్రాబడులు 28 శాతంగానే ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఏటా 24 శాతం చొప్పున రాబడులను ఈ పథకం తెచ్చిపెట్టింది. 2021 జనవరి 18న ఈ పథకంలో ఏక మొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, రూ.1.93 లక్షలుగా మారేది. అంటే ఏటా 25 శాతం సీఏజీఆర్ రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఈ విభాగంలో ముందు నుంచీ ఉన్న పథకంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఫండ్ మేనేజర్లు అనీష్ తవాక్లే, లలిత్ కుమార్, మనీష్ బంతియా తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10,000 సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, 2024 జనవరి 1 నాటికి రూ.5.23 లక్షలు సమకూరి ఉండేది.. ఇందులో పెట్టుబడి భాగం రూ.3.6 లక్షలు. అంటే 26.8 సీఏజీఆర్ రాబడులను అందించింది. పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో రూ.7,616 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 54 శాతం పెట్టుబడులు దేశీయ రంగాలపై దృష్టి సారించే కంపెనీల్లోనే ఉన్నాయి. పోర్ట్ఫోలియోలో ఎక్కువ భాగం పెట్టుబడులు బ్యాంక్లు, ఆటోలు, నిర్మాణ రంగ కంపెనీలు, ఇంధన కంపెనీల్లోనే ఉన్నాయి. నిర్వహణ ఆస్తుల్లో 94.34 శాతం ఈక్విటీలకు కేటాయించగా, డెట్లో 0.85 శాతం, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 85 శాతం మేర పెట్టుబడులు లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. అంటే రిస్క్ చాలా తక్కువగా భావించొచ్చు. మిడ్క్యాప్ కంపెనీల్లో 12.52 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 1.84 శాతం చొప్పున ఉన్నాయి. -
ఎన్పీఎస్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమెలా?
నేను 2019లో పన్ను ఆదా కోసం ఎన్పీఎస్ సాధనంలో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుందామని అనుకుంటున్నాను. ఎలా ఉపసంహరించుకోవాలి? – కల్పేష్ వర్మ ఎన్పీఎస్ టైర్–1 పెట్టుబడులకు 60 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ ఉంటుంది. ఈ లోపే ఎన్పీఎస్ నుంచి బ్యాలన్స్ను ఉపసంహరించుకోవాలంటే, అందుకు కొన్ని షరతులు వరిస్తాయి. ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు వంటి అవసరాలకు ఎన్పీఎస్ నిధి నుంచి కేవలం 25 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. అది కూడా ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి మూడేళ్లు పూర్తి కావాలి. మీరు 2019లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు. మూడేళ్ల కాలం పూర్తయింది. కనుక సమకూరిన నిధి నుంచి 25 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ ఖాతాను శాశ్వతంగా మూసివేయదలిస్తే, ఆరంభించి పదేళ్లు ముగిసిన తర్వాతే అది సాధ్యపడుతుంది. పదేళ్లలో ఏర్పడిన నిధి నుంచి 20 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో నెలవారీ పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎన్పీఎస్ ఖాతాలో పదేళ్ల తర్వాత కూడా మొత్తం నిధి రూ.5 లక్షల్లోపే ఉంటే, అప్పుడు నూరు శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఎన్పీఎస్ నుంచి వైదొలిగేందుకు సీఆర్ఏ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఉపసంహరణకు కారణాన్ని పేర్కొనాలి. బ్యాంక్ అకౌంట్, కాంటాక్ట్ వివరాలను ధ్రువీకరించాలి. మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పటి నుంచి ఐదు పనిదినాల్లో మీ ఉపసంహరణ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది. ఇతర మార్గాలు లేకపోతే తప్ప, ముందస్తు ఉపసంహరణను ఎంపిక చేసుకోవద్దన్నదే మా సలహా. విశ్రాంత జీవనం కోసం ఉద్దేశించిన నిధిని ఉపసంహరించుకోకుండా నిరాశ పరచడమే ఈ పథకంలోని షరతుల ఉద్దేశ్యం. ఎన్పీఎస్ పెట్టుబడుల్లో గరిష్టంగా 75 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు సహేతుకమేనని చెప్పుకోవాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
రియల్టీలోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి గతేడాది (2023లో) 2.73 బిలియన్ డాలర్ల మేర విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గాయి. 2022లో 3.96 బిలియన్ డాలర్లు వచ్చాయి. మరోవైపు, దేశీ సంస్థల పెట్టుబడులు రెట్టింపై 687 మిలియన్ డాలర్ల నుంచి 1.51 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొత్తం మీద 2023లో రియల్ ఎస్టేట్లోకి సంస్థాగత పెట్టుబడులు 12 శాతం క్షీణించి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. విదేశీ ఫండ్స్ ఆచితూచి వ్యవహరించడం వల్ల పెట్టుబడులు మందగించినట్లు వెస్టియన్ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. ‘రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ 2023లో పెట్టుబడులు భారీగానే వచ్చాయి. భారత వృద్ధి గాథపై దేశీ ఇన్వెస్టర్లలో నెలకొన్న విశ్వాసం, వారి ఆశావహ దృక్పథం మార్కెట్ను నిలబెట్టింది‘ అని ఆయన పేర్కొన్నారు. 2023లో పెట్టుబడులు అయిదేళ్ల కనిష్టానికి తగ్గినా.. దేశీ ఎకానమీ మెరుగైన పనితీరు, ఇన్ఫ్రా రంగంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల ఊతంతో 2024లో ఇన్వెస్ట్మెంట్లు మరింత పుంజుకోగలవని శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. కొత్త పెట్టుబడి సాధనాల రాకతో భారతీయ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోందని, దీంతో నిధుల అవసరం కూడా పెరుగుతోందని చెప్పారు. ఇలా పెట్టుబడులకు డిమాండ్ అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్లపై కూడా అధిక రాబడులు రావొచ్చని, అదే ఆలోచనతో ఇన్వెస్టర్లు రియల్టీలో మరిన్ని పెట్టుబడులు పెట్టొచ్చని శ్రీనివాస రావు వివరించారు. 2019లో దేశీ రియల్ ఎస్టేట్లోకి సంస్థాగత పెట్టుబడులు 6.5 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. 2020లో 5.9 బిలియన్ డాలర్లు, 2021లో 4.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఫండ్స్
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చే సరికి ప్రణాళిక మేరకు పెట్టుబడులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఆశించిన మేర పన్ను ఆదాకు మార్గం సుగమం చేసుకోవచ్చు. అయితే, ప్రతి నెలా ప్రణాణళికాబద్ధంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా, ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా సాధనాల్లో ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అలాంటి వారు ఈ తరుణంలో ఈక్విటీ పెట్టుబడులతోపాటు, పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇచ్చే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ ట్యాక్స్ సేవర్ ఒకటి. మూడేళ్ల లాకిన్ ఉండే ఈ పథకంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపులు సొంతం చేసుకోవచ్చు. రాబడులు ఈ పథకం 2015 డిసెంబర్లో ప్రారంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా 18.73 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. గడిచిన ఆరు నెలల కాలంలో రాబడులు 14.51 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడి 17.30 శాతంగా ఉంది. మూడేళ్లలో 18 శాతం, ఐదేళ్లలో 19.21 శాతం, ఏడేళ్లలో ఏటా 18.55 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిగణించే బీఎస్ఈ 500 టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఆన్ ఇండెక్స్)తో పోలిస్తే ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ పథకంలో రెండు శాతం అధిక రాబడులు ఉన్నాయి. ఈక్విటీ ఎల్ఎస్ఎస్ విభాగం కంటే కూడా ఇవే కాలాల్లో ఈ పథకమే మెరుగ్గా పనిచేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 20431 కోట్ల ఆస్తులు ఉన్నాయి. పెట్టుబడిపై ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే ఎక్స్పెన్స్ రేషియో 1.58 శాతంగా ఉంది. 2017 నుంచి ఈక్విటీల్లో పూర్తి మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తన నిర్వహణలోని ఆస్తుల్లో 98.35 శాతం ఈక్విటీలకు కేటాయించింది. మిగిలిన 1.65 శాతం నగదు నిల్వల రూపంలో ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 67 శాతం లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీలకు 25 శాతం కేటాయించగా, స్మాల్క్యాప్ కంపెనీల్లో 8.41 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్ఫోలియోలో మొత్తం 72 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు పెద్ద పీట వేసింది. 30.50 శాతం మేర పెట్టుబడులు ఈ రంగానికి చెందిన కంపెనీలకే కేటాయించింది. మొదటి నుంచి ఈ పథకం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. సేవల రంగ కంపెనీలకు 10 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 9 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 8.57 శాతం, హెల్త్కేర్ కంపెనీలకు 6.40 శాతం చొప్పు పెట్టుబడుల్లో కేటాయింపులు చేసింది. -
Vibrant Gujarat: తొలిరోజే రూ.2.35 లక్షల కోట్లు!
గాంధీనగర్: గత రెండు దశాబ్దాలుగా వైబ్రంట్ గుజరాత్ సదస్సు అంతర్జాతీయ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్గా ఆవిర్భవించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచం నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. తాజాగా 10వ వైబ్రంట్ గుజరాత్(2024) సదస్సులో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ, సుజుకీ మోటార్ కార్ప్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తదితరులు పెట్టుబడులకు ఆసక్తిని ప్రదర్శించారు. వెరసి తొలి రోజే రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించారు. దేశ, విదేశీ దిగ్గజాల నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటున్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వివరాలు చూద్దాం.. రిలయన్స్.. కార్బన్ ఫైబర్ ప్లాంట్ హజీరాలో దేశంలోనే తొలి కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్ కేంద్రంగా రిలయన్స్ కార్యకలాపాలు కొనసాగనున్నట్లు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయి ఆస్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో దేశవ్యాప్తంగా 150 బిలియన్ డాలర్లు(రూ. 12 లక్షల కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. వీటిలో మూడో వంతు పెట్టుబడులను గుజరాత్లోనే చేపట్టినట్లు తెలియజేశారు. తద్వారా ఈ ప్రాంతానికి తామిస్తున్న ప్రాధాన్యతను ప్రస్తావించారు. టాటా.. సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఈ ఏడాది(2024) చివరిలో నూతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దేశీయంగా చిప్స్ తయారీకి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సాణంద్లో లిథియమ్ అయాన్ బ్యాటరీల తయారీ కేంద్రానికి తెరతీయనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక దశలో 20 గిగావాట్ స్టోరేజీ బ్యాటరీ సామర్థ్యంతో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఎలక్ట్రిక్ వాహనా (ఈవీ)లకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు వివరించారు. రెండు దశలలో చేపట్టనున్న ప్రాజెక్ట్ పనులు రెండు నెలల్లోగా ప్రారంభంకానున్నట్లు తెలియజేశారు. ఆర్సెలర్మిట్టల్.. అతిపెద్ద స్టీల్ప్లాంట్ ప్రపంచంలోనే ఒకే ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని హజీరాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్సెలర్మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ పేర్కొన్నారు. జేవీ ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ద్వారా 2029కల్లా ప్లాంటు నిర్మాణం పూర్తికాగలదని తెలియజేశారు. ప్లాంటును వార్షికంగా 2.4 కోట్ల టన్నుల స్టీల్ తయారీ సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. 2026లో తొలి దశ ప్రారంభంకావచ్చని తెలియజేశారు. మైక్రాన్.. రూ. 6,760 కోట్లు సెమీకండక్టర్ల తయారీలో భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా నిలపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా ప్రశంసించారు. ఈ యూఎస్ చిప్ తయారీ దిగ్గజం సాణంద్లో 2.75 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంటు నిర్మాణాన్ని సెప్టెంబర్లోనే ప్రారంభించింది. పెట్టుబడుల్లో మైక్రాన్ 82.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6,760 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. మిగిలిన నిధులను ప్రభుత్వం రెండు దశలలో సబ్సిడీ రూపంలో సమకూర్చనుంది. -
రూ.3000 కోట్లకు జర్మన్ కంపెనీ పెట్టుబడులు?
న్యూఢిల్లీ: నూతన ఉత్పత్తులు, తయారీ కార్యకలాపాలు, డిజిటలీకరణకు ఈ ఏడాది రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. దీంతో సంస్థ భారత్లో పెట్టుబడి రూ.3,000 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2023లో కంపెనీ భారత్లో రికార్డు స్థాయిలో 10 శాతం వృద్ధితో 17,408 యూనిట్లను విక్రయించింది. 2024లో మూడు ఎలక్ట్రిక్ వెహికిల్స్తో కలిపి 12 కొత్త మోడళ్లు, వేరియంట్లను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రూ.1.5 కోట్లకుపైగా ఖరీదు చేసే టాప్ ఎండ్ మోడళ్లు సగం ఉంటాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘2024లో రెండంకెల వృద్ధి సాధిస్తాం. ఆర్డర్ బుక్ 3,000 యూనిట్లు ఉంది. అమ్మకాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతం. ఈవీల వాటా నాలుగేళ్లలో 20–25 శాతానికి చేరుకుంటుంది. ఎస్యూవీల వాటా 55 శాతం ఉంది. 10 నగరాల్లో కొత్తగా 20 వర్క్షాప్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు. భారత్లో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్లాంట్ను నెలకొల్పడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కోరుతున్నట్లు వచ్చిన నివేదికలపై అయ్యర్ స్పందిస్తూ.. ప్రభుత్వం ఏదైనా పాలసీని ప్రకటిస్తే అది భారత్లో పెట్టుబడి పెట్టిన ప్రస్తుత తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని మాకు చాలా నమ్మకం ఉంది. ఈవీ విభాగంలోకి కొత్త కంపెనీని స్వాగతిస్తున్నాం. మార్కెట్లో ఈవీల స్వీకరణను ఇది మరింత తీవ్రతరం చేస్తుంది’ అని అన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్ వర్షన్స్లో రూ.1.32 కోట్ల ప్రారంభ ధరతో జీఎల్ఎస్ లగ్జరీ ఎస్యూవీని మెర్సిడెస్ విడుదల చేసింది. -
ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్
బంగారమంటే ఇష్టపడని స్త్రీలు దాదాపు ఉండరనేది వాస్తవం.. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వర్కింగ్ ఉమెన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది తమ సంపాదనను గోల్డ్ కొనడం కంటే కూడా మంచి లాభాలను అందించే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 23 నుంచి 45 సంవత్సరాల మహిళలలో 40 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, మరో 40% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపుతున్నారని బ్యాంక్ బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ అధ్యయనంలో వెల్లడించింది. కొందరు మహిళలు బంగారం కొనడం వంటివి పక్కన పెట్టి రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసి తమ పోర్ట్ఫోలియోలను విస్తరించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. వర్కింగ్ ఉమెన్స్ ఆర్థిక రంగంలో మంచి అవగాహన పొందుతున్నారని, ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులను గురించి ఆరా తీస్తూనే ఉన్నారని స్పష్టమవుతోంది. నిజానికి బంగారంలో పెట్టె పెట్టుబడి కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరింత లాభాలను అందిస్తాయని, అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తాయి. ఇదీ చదవండి: ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టినప్పుడు 12 నుంచి 15 శాతం పొటెన్షియల్ రిటర్న్స్ లభిస్తాయి. అయితే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, తప్పకుండా వాటిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్లోకి డైరెక్టర్గా ఎంట్రీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
తప్పక చదవండి
- ప్రజ్వల్కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
- ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- ‘కవిత అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement