-
డబ్బింగ్ డన్
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ద్వారా హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘కల్కి 2898 ఏడీ’లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ని పూర్తి చేశారట దీపికా పదుకోన్. హిందీ, కన్నడ భాషల్లో ఆమె డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. హీరో రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్లకు 2018 నవంబర్ 14న వివాహం అయింది.ప్రస్తుతం దీపిక గర్భవతి. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి జూన్ నెల నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమై ఆమె విశ్రాంతి తీసుకోనున్నారని టాక్. ఈ కారణంగానే ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో తన పాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారట ఆమె. అదే విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దీపిక స్పెషల్ ఇంటర్వ్యూలని కూడా ముందుగానే ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్... ఇలా పలు భాషల్లో విడుదల కానుంది. హిందీ, కన్నడ వెర్షన్లకు దీపిక డబ్బింగ్ చెప్పారు. ఇతర భాషల్లో ఆమె పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పిస్తారా? లేక దీపికానే చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది. -
భైరవకి మహేశ్బాబు వాయిస్ ఓవర్?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో మహేశ్బాబు భాగం కానున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్లో మహేశ్బాబు నటించరట. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఓ ఎపిసోడ్కి మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ‘జల్సా’, ‘బాద్ షా’, ‘ఆచార్య’ వంటి చిత్రాలకు మహేశ్బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి.. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మహేశ్ వాయిస్ వినిపిస్తుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సగటు సీనీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా సంచలనాలను క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నాగ్ అశ్విన్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు.అలాగే ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటిస్తున్నారు . ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపఠాని లాంటి స్టార్స్ను ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కనిపించబోతున్నాడట. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ మహేశ్ బాబును సంప్రదించారట. అయితే ఇందులో మహేశ్ కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు అవతారంలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పాత్రను పరిచయం చేసేందుకు మహేశ్ని రంగంలోకి దించబోతున్నాడట నాగ్ అశ్విన్. ప్రభాస్ ఇంట్రో, ఎలివేషన్ కు మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలోనూ మహేశ్ పలువురు స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. పవన్ కల్యాణ్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’, చిరంజీవి ‘ఆచార్య’సినిమాలకు మహేశ్ తన గాత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం మళ్లీ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
'కల్కి' కాపీ సినిమా కాదు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి నిత్యం ఏదొ ఒక వైరల్ న్యూస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా జూన్ 27న విడుదలవుతుందని తాజాగా ప్రకటన కూడా వచ్చేసింది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసిన ప్రేక్షకులు పలు కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన 'డ్యూన్'ను కాపీ కొట్టారంటూ నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఇదే విషయంపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగ్అశ్విన్.. కల్కిని కొందరు హాలీవుడ్ సినిమా డ్యూన్తో పోలుస్తున్నారు.. అందులో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. బహుశా అలా పోల్చే వారందరూ కూడా సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికే చాలాసార్లు 'కల్కి' చిత్రాన్ని ఇలా వేరే హాలీవుడ్ చిత్రాలతో పోల్చారని ఆయన తెలిపారు. ఇందులో ఏ సినిమా రెఫరెన్స్లు లేవు. సినిమా విడుదల తర్వాత ఆ విషయంపై అందరికీ క్లారిటీ వస్తుంది. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రభాస్ కల్కి.. ఆ పోస్టర్ కూడా కాపీనేనా?
యంగ్ రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్లో డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న ఈ పోస్టర్ వైరల్గా మారింది.అయితే తాజా పోస్టర్ చూసిన నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ మూవీ డూన్ను పోలి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ సినిమా నుంచే కాపీ కొట్టారా? సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా పోస్టర్పై వస్తున్న విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అలాంటిదేం లేదంటూ ఆయన కొట్టిపారేశారు. ఈ పోస్టర్లో ఇసుక కనిపిస్తున్న కారణంగా అలా పోల్చడం సరైంది కాదని అన్నారు. కేవలం ఇసుక ఉండటం వల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయని ప్రేక్షకులు భావించొద్దని ఆయన సూచించారు.కాగా.. కల్కి 2898 ఏడీ మహాభారతంతో ముడిపడి ఉంటుందని గతంలోనే నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ సినిమా మహాభారతంలో మొదలై 2898 ఏడీలో ముగుస్తుందని తెలిపారు. గతంలోనూ కాన్సెప్ట్, మేకింగ్, క్రాప్ట్ , విజువలైజేషన్ సైతం హాలీవుడ్ సినిమాలను పోలి ఉన్నాయంటూ విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూన్ 27న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024 -
శక్తులన్నీ ఏకమయ్యాయి
థియేటర్స్లో ‘కల్కి’ రాక ఖరారైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ ఈ ఏడాది జూన్ 27న విడుదల కానుంది. ‘‘మెరుగైన భవిష్యత్ కోసం అన్ని శక్తులు ఏకమయ్యాయి’’ అనే క్యాప్షన్తో ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు మేకర్స్.మహాభారతం కాలంలో ఆరంభమై 2898 ఏడీలో ఈ సినిమా ముగుస్తుందనీ, ఆరువేల ఏళ్ల కాలమానంలో ఈ కథ సాగుతుందనీ సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్. -
ప్రభాస్ 'కల్కి' కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? కానీ అదే టెన్షన్
డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి'. లెక్క ప్రకారమైతే మే 9న థియేటర్లలో రిలీజ్ కావాలి. వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థకు అచ్చొచ్చిన తేదీ ఇది. కానీ ఓ వైపు గ్రాఫిక్స్ పనులు ఆలస్యం, మరోవైపు ఏపీలో ఎన్నికల హడావుడి వల్ల తప్పని పరిస్థితిల్లో వాయిదా వేశారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఏమై ఉంటుందా అని అభిమానుల మధ్య డిస్కషన్. సరిగ్గా ఇలాంటి టైంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ 'కల్కి' రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేశారు? సంగతేంటి?'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ రిలీజ్ విషయంలో వాయిదాలు పడుతూనే ఉన్నాయి. 'కల్కి' కూడా ఇందులో మినహాయింపు కాదు.మే 9న పక్కాగా వస్తామని నిర్మాతలు ఫిక్సయ్యారు. కానీ పలు కారణాల వల్ల మార్చుకోక తప్పలేదు. జూన్, జూలై అని రెండు ఆప్షన్స్ అనుకున్నారు. ఫైనల్గా జూన్ 27న రావాలని అందరూ ఫిక్సయ్యారట. శనివారం సాయంత్రం కొత్త పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయం చెప్పబోతున్నారట. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో కూడా జూన్ 27నే రిలీజ్ అవుతుందన్నట్లు చూపించేస్తుంది.జూన్ 27న 'కల్కి' రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లస్సులతో పాటు మైనస్సులు కూడా ఉన్నాయి. ప్లస్సుల విషయానికొస్తే.. సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరైన మూవీ పడటం లేదు. 'కల్కి'పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే వసూళ్లు మోత గ్యారంటీ. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ ఇమేజ్ కూడా 'కల్కి'కి ప్లస్ అవుతుంది. మైనస్సుల విషయానికొస్తే.. జూన్ చివర్లో పండగలు, సెలవులు అంటూ ప్రత్యేకంగా లేవు. స్కూల్, కాలేజీలు అప్పటికే తెరిచేస్తారు. దీని వల్ల కలెక్షన్లపై కొంతమేర ఎఫెక్ట్ ఉండొచ్చు. కమల్ 'ఇండియన్ 2' కూడా ఇదే నెలలో రిలీజ్ ఉండొచ్చు. ఇదే జరిగితే సౌత్లో 'కల్కి' వసూళ్లు కాస్త తగ్గే ఛాన్సులు ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో? -
స్వాతంత్య్రం రాక ముందు...రజాకార్ నేపథ్యంలో ప్రభాస్ చిత్రం
ఇప్పటికే ‘సలార్ 2’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు అంగీకరించిన ప్రభాస్ తదుపరి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చేయనున్నారు. అరవై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, డిసెంబరులో షూటింగ్ ఆరంభిస్తామని సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక తాజాగా ప్రభాస్ సైన్ చేసిన మరో సినిమా ప్రకటన వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ మూవీ అని మేకర్స్ పేర్కొన్నారు. కాగా స్వాతంత్య్రం రాక పూర్వం రజాకార్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. చిత్రసంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ చేశామని దర్శకుడు హను తెలిపారు. -
'కల్కి' కొత్త రిలీజ్ డేట్..? ప్రభాస్ ఫ్యాన్స్కు శుభవార్త
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నారని చిత్రి యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. కానీ పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. ఆ సమయంలో ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో కల్కి తెరకెక్కుతున్న సినిమా కావడం.. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండటంతో దాదాపు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వాయిదా వేస్తారని సమాచారం. కల్కి వాయిదా పడుతుందని భారీగానే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశచెందుతున్నారు. ఇంతలో వారికి ఒక శుభవార్త నెట్టింట వైరల్ అవుతుంది. మే 9న విడుదల కావాల్సిన కల్కి.. మే 30న విడుదల కానున్నట్లు నెట్టింట ఓ వార్త ట్రెండ్ అవుతుంది. ఈమేరకు చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారకంగా ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. అది డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేయున్నారట. అదే సమయంలో కల్కి విడుదల తేదీని కూడా ఫైనల్ చేస్తారట. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
సరికొత్త ప్రయత్నం చేయనున్న కల్కి
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడే అవకాశం ఉందట. కాగా ఈ చిత్రం యూనిట్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తోందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. ఈ వీడియో నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందని భోగట్టా. ఈ వీడియోలోని తన పాత్రకు ప్రభాస్ ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అయితే ఈ యానిమేటెడ్ వీడియో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ కానుంది? వీడియో నిడివి ఎంత? అసలు వార్తల్లో ఉన్నట్లు యానిమేటెడ్ వీడియో షూట్ జరిగిందా? లేదా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
'కల్కి'లో నా పాత్ర ఇంతవరకే: కమల్ హాసన్
సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రాబోయే మూడు సినిమాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి 2898 AD గురించి తాజాగా ఆయన అప్డేట్ ఇచ్చారు. ఈ మూడు ప్రాజెక్టుల షూటింగ్ వివరాలతో పాటు పలు వివరాలను తెలిపారు. శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 పనులు పూర్తి అయ్యాయని చెప్పిన కమల్.. ఇండియన్ 3 షూటింగ్ కూడా పూర్తి అయిందని షాకిచ్చాడు. ప్రస్తుతం ఇండియన్ 2 విడుదలకు రెడీగా ఉందని చెప్పారు. ఈ సినిమా విడుదల తర్వాత దాని సీక్వెల్ పోస్ట్ ప్రోడక్షన్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కల్కి చిత్రంలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కమల్ పంచుకున్నాడు. 'కల్కి' సినిమాలో కేవలం అతిథి పాత్రలో మాత్రమే నటించినట్లు ఆయన రివీల్ చేశారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమం కూడా పూర్తి అయిందని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంతమేరకు షాక్ అయ్యారు. ఇకపోతే ఎన్నికల హడావిడి అయ్యాక మణిరత్నం 'థగ్ లైఫ్' చిత్రీకరణ మొదలుపెడతామని కమల్ ప్రకటించారు. కల్కిలో కమల్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఆయన ప్రకటించగానే ఫ్యాన్స్ కొంతమేరకు నిరాశచెందారు. మరికొందరు మాత్రం డైరెక్టర్ నాగ్ అశ్విన్ టాలెంట్ను గుర్తు చేస్తూ కల్కిలో కమల్ 5నిమిషాలు కనిపించినా తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే పాత్రనే డిజైన్ చేసుంటారని నెటిజన్లు చెబుతున్నారు. కమల్ హాసన్ నేరుగా తెలుగు చిత్రంలో నటించి 29 ఏళ్లైంది. ఆయన నేరుగా టాలీవుడ్లో నటించిన చివరి చిత్రం.. ‘శుభ సంకల్పం’ (1995). కానీ చాలా రీమేక్, డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సుమారు రెండేళ్ల క్రితం విక్రమ్తో మెప్పించిన కమల్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 1976లో వచ్చిన ‘అంతులేని కథ’లో అతిథి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆయన ఆ తర్వాత మళ్లీ కల్కితో అతిథి పాత్రలో కనిపించనున్నారు. -
వెండితెరపై కాలచక్రం.. సమయంతో ప్రయాణం చేస్తున్న టాప్ హీరోలు
వెండితెరపై కాలచక్రం తిరుగుతోంది. ప్రేక్షకలను విభిన్న కాలాలకు తీసుకుని వెళ్లేందుకు కొందరు హీరోలు సిద్ధం అవుతున్నారు... కాలాన్ని కదిలిస్తున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇలా వెండితెరపై సమయంతో ప్రయాణం చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం. ఆరువేల సంవత్సరాలు... ఆరువేల సంవత్సరాల టైమ్ లైన్ తో సోషియో ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898ఏడీ’ కథనం సాగుతుందని తెలుస్తోంది. ‘‘ఈ సినిమా కథ మహాభారతం కాలంలో మొదలై, 2898తో పూర్తవుతుంది. అందుకే ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్ను ఖరారు చేశాం’’ అని ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ , కమల్హాసన్ ఇతర లీడ్ రోల్స్లో కనిపిస్తారు. రాజమౌళి, మలయాళ నటి అన్నా బెన్ , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్ కనిపిస్తారని తెలిసింది. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ‘కల్కి 2898ఏడీ’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్నగర్ సమాచారం. ఐదువందల సంవత్సరాలు... టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో సూర్య కెరీర్లో రూపొందిన చిత్రం ‘24’. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2016లో విడుదలై హిట్ సాధించింది. ఈ జానర్లోనే తాజాగా సూర్య నటించిన చిత్రంగా ‘కంగువ’ను చెప్పుకోవచ్చు. ఐదువందల (1700 – 2023) సంవత్సరాల టైమ్ పీరియడ్లో ఈ చిత్ర కథనం సాగుతుంది. పద్దెనిమిదో శతాబ్దంలో తాను మొదలుపెట్టిన ఓ పనిని పూర్తి చేయలేక మరణించిన ఓ వీరుడు... పునర్జన్మలో ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తాడు? అన్నదే ‘కంగువ’ సినిమా కథనం అని కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించగా, హీరోయిన్ గా దిశా పటానీ, ఓ కీలక పాత్రలో యోగిబాబు, విలన్ గా బాబీ డియోల్ కనిపిస్తారు. స్టూడియోగ్రీన్ , యూవీ క్రియేషన్స్ పతాకాలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే విడుదల కానుందని తెలిసింది. మూడు తరాల నేపథ్యంలో... మలయాళ నటుడు టొవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అజయంతే రందం మోషణం’. ఈ సినిమాలో మణియన్ , అజయన్ , కుంజికేలు.. ఇలా మూడు పాత్రల్లో నటిస్తున్నారు టొవినో థామస్. పాత్రలకు తగ్గట్లే కథ కూడా మూడు తరాల హీరోల నేపథ్యంలో సాగుతుంది. కథ రీత్యా మూడు తరాల్లోనూ హీరోగా టొవినో థామస్నే కనిపిస్తారని తెలుస్తోంది. ఇలా మూడు డిఫరెంట్ టైమ్ లైన్స్లో టైమ్ ట్రావెల్గా ఈ సినిమా కథనం సాగుతుంది. కృతీ శెట్టి, ఐశ్వర్యా రాజేష్, సురభిలక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా కృతీ శెట్టికి ఇది తొలి మలయాళ చిత్రం. మ్యాజిక్ ఫ్రేమ్స్, యూజీఎమ్ ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. త్రీడీలోనూ రిలీజ్ చేయాలని ఈ చిత్రం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని మాలీవుడ్ సమాచారం. ఆధునిక అశ్వత్థామ మహాభారతంలో అమరవీరుడిగా చెప్పుకునే అశ్వత్థామ ఇప్పటి ఆధునిక యుగంలోకి వస్తే ఎలా ఉంటుందనే ఇతివృత్తంతో తెరకెక్కుతున్న సినిమా‘అశ్వత్థామ: ది సాగా కంటిన్యూస్’. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ చేస్తున్నారు. కన్నడ దర్శకుడు సచిన్ రవి ఈ సినిమాకు దర్శకుడు. కాగా ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్తోనే ఉంటుందని బాలీవుడ్ సమాచారం. జాకీ భగ్నానీ, వసుభగ్నాని, దీప్షికా దేశ్ముఖ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఇలా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మహా శివరాత్రి కానుకగా ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ... ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరు 'భైరవ' అని పేర్కొని, ఆయన లేటెస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'భైరవ' పాత్ర గురించి నిర్మాత స్వప్న దత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. హైదరాబాద్లోని నోవాటెల్లో జరిగిన ‘సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్’ వేదికపై కల్కి చిత్రం గురించి ఆమె ఇలా మాట్లాడారు. 'ప్రభాస్ పోషిస్తున్న 'భైరవ' పాత్ర చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది' అంటూ స్వప్న పేర్కొన్నారు. అందుకు సంబంధిత విజువల్స్ నెట్టింట వైరల్గా మారాయి. ప్రొడ్యూసర్ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కల్కి సినిమా కథ గురించి గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇలా వ్యాఖ్యానించారు. 'మహాభారతంతో కథ మొదలై.. క్రీస్తుశకం 2898లో ముగుస్తుంది. కల్కి కథ మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా సినిమా విలువలు ఉంటాయి. గతం, భవిష్యత్తు ప్రపంచాలను క్రియేట్ చేయడంలో భారతీయతని ప్రతిబింబించేలా ఉంటాయి. అందరూ అనుకున్నట్లు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'బ్లేడ్ రన్నర్' చిత్రంతో కల్కికి పోలికలు ఉండవు. అని అశ్విన్ తెలిపాడు. మే 9న విడుదల కానున్న కల్కి సినిమా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. Bhairava is gonna stay in hearts for a very long time -#Prabhas 💥🫶 pic.twitter.com/w00j7uF7JL — Ace in Frame-Prabhas (@pubzudarlingye) March 22, 2024 -
కల్కి వచ్చి పుష్ప రాజ్ డేట్ ని కబ్జా చేస్తే.. అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి..?
-
కల్కి వాయిదా పడితే.. ఆ సినిమాతో బిగ్ఫైట్ గ్యారెంటీ
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ చిత్రానికి సంబంధించిన మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ కల్కి వాయిదా పడితే ఏ తేదీలో విడుదల కావచ్చో అని వారు లెక్కలేసుకుంటున్నారు. కల్కి మే 9న విడుదల అవుతుందని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసి ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది. ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించింది. ఒకవేళ కల్కి వాయిదా పడి.. పుష్ప చిత్రంతో పోటీపడితే బాక్సాఫీస్ వద్ద బిగ్ఫైట్ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నుంచి మరో ప్రాంచైజీ చిత్రం 'సింగం ఎగైన్' కూడా రానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, కరీనా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న 'పుష్ప 2' చిత్రానికి గట్టి పోటీ తగలనుంది. పుష్ప సినిమా కలెక్షన్లకు అడ్డుగా కన్నడలో శివరాజ్ కుమార్ సినిమా 'భైరతి రంగల్' ఉంటే.. బాలీవుడ్లో భారీ స్టార్స్తో వస్తున్న సింగం ఎగైన్ చిత్రం ఉంది. ఈ రెండు చిత్రాలతో పాటు కల్కి కూడా ఆగష్టు 15న వస్తే పుష్ప గాడు ఎంతమేరకు తట్టుకుని నిలబడుతాడో వేచి చూడాలి. కల్కి వాయిదా అంశం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. -
ప్రభాస్ 'కల్కి' సినిమా వాయిదా..?
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో 'కల్కి 2898 ఎ.డి' చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ కల్కి సినిమా వారు ప్రకటించిన సమయానికి విడుదల కాకపోవచ్చని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. మే 7న కూడా 12 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న కల్కి చిత్రానికి ఎన్నికలు అడ్డుపడే అవకాశం ఉంది. దీంతో మే 9న విడుదల కానున్న కల్కి సినిమా దాదాపు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ మార్కెట్ ఎక్కువ.. అలాంటిది ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు కల్కి సినిమాను విడుదల చేస్తే పలు ఇబ్బందులు ఎదురు కావచ్చు. అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఉండటం వల్ల రాత్రి సమయాల్లో గుంపులుగా తిరిగేందుకు ఆవకాశం ఉండదు. దీంతో సినిమాకు వెళ్లే వారికి అనేక అడ్డంకులు ఎదురుకావచ్చు. దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలు కాబట్టి ప్రతి రాష్ట్రంలో కల్కి చిత్రానికి కలెక్షన్స్ విషయంలో పలు ఇబ్బందులు రావచ్చని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. కల్కి కలెక్షన్స్పై కూడా భారీగా ఎన్నికల ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా మే 9న కల్కి చిత్రం విడుదల కావడం దాదాపు కష్టమేనని సమాచారం. కల్కి వాయిదా విషయంలో అధికారికంగా వైజయంతీ మూవీస్ వారి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మే 9వ తేదీతో వైజయంతీ మూవీస్కీ ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. దీంతో కల్కి 2898 AD చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తామని వైజయంతీ మూవీస్ గతంలో ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠానీ కీలక పాత్రలు పోషించారు. -
పేరు భైరవ
మహా శివరాత్రి కానుకగా ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రభాస్పాత్ర పేరు భైరవి అని పేర్కొని, ఆయన లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలకపాత్ర ధారులు. వైజయంతీ మూవీస్పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మహా శివరాత్రి సందర్భంగా భైరవపాత్రని పరిచయం చేసి, కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందుతోంది. మహాభారత పురాణ ఘటనల నుండి మొదలై క్రీస్తు శకం 2898లో పూర్తయ్యే కథ ఇది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ చిత్రకథ నడుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అక్కడి అందమైన ప్రదేశాల్లో ప్రభాస్, దిశా పటానీలపై ఒకపాటను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. -
ప్రభాస్ కల్కి.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
సలార్ తర్వాత వస్తోన్న ప్రభాస్ మరో చిత్రం 'కల్కి 2989 ఏడీ'. ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తోంది. కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్.. భైరవగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ పోస్టర్ను షేర్ చేస్తూ రివీల్ చేశారు. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్పై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ప్రభాస్తో ఆయన తొలిసారి నటిస్తున్నారు. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. #BHAIRAVA 💥💥💥#Prabhas #Kalki2898AD pic.twitter.com/5QR4icF6w7 — Kalki 2898 AD (@Kalki2898AD) March 8, 2024 -
పాన్ ఇండియా హీరో ఫోటో షేర్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?
ప్రభాస్ కల్కి 2898 AD సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈమేరకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయింది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. హీరో ప్రభాస్, హీరోయిన్ దిశా పటానీ కాంబినేషన్లో ఆ పాటను చిత్రీకరించారు. అందుకు సంబంధించిన తన షూట్ ముగించుకుని ఢిల్లీ వచ్చినట్లుగా బాలీవుడ్ బ్యూటి దిశా పటానీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసింది. విమానంలో డార్లింగ్ ప్రభాస్ను ఫోటోను తీయడం ఆ ఫోటోలో కనిపిస్తుంది. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్ను ఇటలీలో చిత్రీకరించారని సమాచారం. ఈ షెడ్యూల్తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తి అయిందని తెలిసింది. ఇక కల్కి మూవీ టీమ్ కూడా ఇటలీ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో ప్రభాస్, దిశా పటానీతోపాటు నాగ్ అశ్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు. మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Kalki 2898 - AD (@kalki2898ad) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
డ్యాన్సింగ్ మూడ్లో స్టార్ హీరోలు.. 1997 తర్వాత 'చిరు' మళ్లీ ఇలా
ఫ్యామిలీ సాంగ్ ఆనందోత్సాహలతో ఫ్యామిలీ పాట పాడుతున్నాడట ‘విశ్వంభర’. చెల్లెళ్లు, ప్రేయసితో కలిసి హాయిగా డ్యాన్స్ చేస్తున్నాడట. ఈ ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్కు కారణమైన హ్యాపీ మూమెంట్స్ ఏంటో ‘విశ్వంభర’ సినిమాలో చూడాలి. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ‘స్టాలిన్’ తర్వాత అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’ కోసం చిరంజీవితో జోడీ కట్టారు త్రిష. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర భీమవరం దొరబాబు అని, కథ రీత్యా దొరబాబుకు ఐదుగురు చెల్లెళ్లు ఉంటారనే ప్రచారం సాగుతోంది. చిరంజీవి చెల్లెళ్లుగా మీనాక్షీ చౌదరి, మృణాల్ ఠాకూర్, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి కనిపిస్తారని భోగట్టా. కాగా ‘విశ్వంభర’ తాజా షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ముందుగా కొంత టాకీ పార్ట్ చిత్రీకరించారు. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ చిత్రీకరణ ఆరంభించారని తెలిసింది. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి స్వరకర్త. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘హిట్లర్’ (1997) సినిమాలో హీరో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు. ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇన్నేళ్లకు చిరంజీవి మళ్లీ ఐదుగురు చెల్లెళ్లతో ‘విశ్వంభర’ చేస్తున్నారు. రొమాంటిక్ కల్కి ఇటలీ బీచ్లో ప్రేమ పాట పాడుతున్నారు ప్రభాస్. ఈ రొమాంటిక్ పాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఇందులో దీపికా పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రధారులు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో ప్రారంభమైంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. పుష్పరాజ్ పాట మంచి ఫైర్ మీద ఉన్నాడు పుష్పరాజ్. తన సత్తా ఏంటో పాట రూపంలో మరోసారి చెబుతున్నాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటూ ఓ మాస్ సాంగ్ ఉంటుంది. ఈ తరహా సాంగ్ ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ ఉందట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ను హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడి యోలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ పాటకు ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిన్నారు. తొలి భాగంలో శ్రీవల్లి పాత్రలో ప్రేయసిగా నటించిన హీరోయిన్ రష్మికా మందన్నా మలి భాగంలో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఇలా ప్రస్తుతం సెట్స్లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
ఇటలీ బీచ్లో ప్రభాస్, దిశాపటానీ
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణెతో పాటు దిశాపటానీ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా కల్కి సినిమాకు సంబంధించిన ఒక పాటను ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ప్రభాస్, దిశాపటానీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అద్భుతమైన లోకేషన్లలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. బీచ్లో వారిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారట. అందుకు సంబంధించిన పలు విషయాలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాను అనుకున్న సమయంలోపు విడుదల చేయాలన్ని పక్కా ప్లాన్తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పనిచేస్తున్నారట. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
ప్రభాస్ కల్కిలో దీపికా పదుకోన్ తెలుగు పలుకులు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షనల్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ , కమల్హాసన్ , దిశాపటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించి ఇప్పటికే దీపిక పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలిసింది. అయితే ఈ సినిమాలోని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని దీపిక అనుకుంటున్నారని టాక్. సొంత డబ్బింగ్ అయితే తన పాత్రకు మరింత బలం వచ్చినట్లు అవుతుందని ఆమె భావిస్తున్నారట. అతి త్వరలోనే దీపిక వాయిస్కు ప్రాథమిక డబ్బింగ్ టెస్ట్ నిర్వహించి, తుది నిర్ణయం తీసుకోనున్నారట నాగ్ అశ్విన్ . ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోందని తెలిసింది. ప్రభాస్, దిశాపటానీలపై ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మే 9న విడుదల కానుంది. -
కల్కి ప్రాజెక్ట్లో టాలీవుడ్ సీనియర్ నటుడు.. ప్రభాస్తో తొలి సినిమా
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా కమల్హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్కు చెందిన ఓ సీనియర్ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్లో ఇప్పటికే టాప్ నటీనటులు భాగమయ్యారు. కల్కిలో టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయనే ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి టాప్ యాక్టర్ ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆయనకు ఎలాంటి పాత్ర ఇచ్చుంటారనే వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో పరకాయప్రవేశం చేయగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి నటుడ్ని నాగ్ అశ్విన్ ఎలా ఉపయోగించుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రభాస్తో కూడా రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపకా పదుకొణె, దిశా పటానీ, గౌరవ్ చోప్రా వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
కల్కి వర్సస్ భారతీయుడు-2..రిలీజ్ గ్యాప్ రెండు వారాలే
-
కల్కి 6 వేల సంవత్సరాల కథ: హను రాఘవపూడి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement