-
ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన భారత వైమానిక దళం కాన్వాయ్పై దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఘటనలో విక్కీ పహాడే అనే కార్పొరల్ మృత్యువాతపడగా ఆయన సహచరులు మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాక్కే చెందిన ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ అబూ హమ్జా(30) అని తేలింది. కాల్పుల సమయంలో వీరివద్ద అత్యాధునిక అసాల్ట్ రైఫిళ్లయిన అమెరికా తయారీ ఎం4, రష్యా తయారీ ఏకే–47 ఉన్నట్లు తేలింది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురి పోలికలున్న చిత్రాలతో అధికారులు పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 29 మంది మావోయిస్టుల మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మంగళవారం(ఏప్రిల్16) భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లా మాడ్లో మావోయిస్టులకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కళ్యాణ్ ఎల్లిసెల తెలిపారు. చొట్టేబెటియా పోలీస్స్టేషన్ పరిధిలోని బినాగుండ-కోరగుట్ట జంగిల్స్ సమీపంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తొలుత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయన్నారు. ఎదురు కాల్పుల తర్వాత జరిగిన సోదాల్లో నాలుగు ఏకే 47 తుపాకులు, మూడు మెషీన్ గన్లు సహా మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు ఉన్నారు. ఈయన మీద రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 29 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ను బీఎస్ఎఫ్ జవాన్లు, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. -
కెనడాలో కాల్పులు
ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్ నుంచి చిరాగ్ కెనడాకు వచ్చారు. విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 12వ తేదీన చిరాగ్ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్చేయలేదు. చిరాగ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు భారత సర్కార్ సాయపడాలంటూ చిరాగ్ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్కు విజ్ఞప్తిచేసింది. -
స్కూలు బస్సు బోల్తా... ఎనిమిదిమంది చిన్నారులు దుర్మరణం!
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్కు కూడా సెలవు ఇవ్వలేదు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు. -
UP Encounter: పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హంతకుడి ఎన్కౌంటర్
ఉత్తరప్రదేశ్లోని సంచలనం సృష్టించిన బుదౌన్ చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అప్పు పేరిట ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారుల్ని కిరాతకంగా చంపేయగా.. ఆపై జరిగిన ఎన్కౌంటర్లో ఒక నిందితుడు హతమయ్యాడు. అయితే పాత కక్షలతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారుల హత్య నేపధ్యంలో బుదౌన్ నగరంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పలు చోట్ల నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న బుదౌన్ డీఎం మనోజ్ కుమార్, బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా కాలనీలోని ఒక ఇంటిలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు ఆయుష్, యువరాజ్, అహాన్ అలియాస్ హనీలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయుష్ (12), అహాన్ అలియాస్ హనీ(8) అక్కడికక్కడే మృతి చెందారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి యువరాజ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ చిన్నారులు ఇంటి టెర్రస్పై ఆడుకుంటున్నారని బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని వెంబడించారు. అయితే నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్కౌంటర్లో హతమైన నిందితుని వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు పిల్లల హత్య నేపధ్యంలో బుదౌన్లో ఉద్రిక్తత నెలకొంది. కోపోద్రిక్తులైన జనం పలుచోట్ల బీభత్సం సృష్టించి నిప్పు పెట్టారు. ఒక దుకాణాన్ని, బైక్ను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఘటన తీవ్రత దృష్ట్యా బదౌన్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. చిన్నారుల హత్య వెనుక... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్బర్ షాప్ నడుపుతున్న సాజిద్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో తన దుకాణాన్ని మూసివేసి, ఎదురుగా ఉంటున్న వినోద్ ఇంటికి వెళ్లి, అతని భార్యను టీ కావాలని అడిగాడు. తరువాత సాజిద్.. టెర్రస్పై ఆడుకుంటున్న వినోద్ ముగ్గురు పిల్లలైన ఆయుష్, అహాన్, పీయూష్లపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. బాధితుడు వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సాజిద్ తమ ఇంటిలోనికి వచ్చి, ఐదువేల రూపాయలు కావాలని తన భార్యను డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె ఫోన్లో తెలిపింది. తరువాత ఆమె టీ చేయడానికి వంటగదిలోకి వెళ్లింది. ఈలోపు సాజిద్.. వినోద్ పిల్లలపై దాడి చేశాడు. ఘటన అనంతరం నిందితుడు అతని స్నేహితుడు జావేద్తో కలిసి బైక్పై అక్కడి నుంచి పరారయ్యాడు. సాజిద్ దాడిలో ఇద్దరుచిన్నారులు మృతి చెందారు. ఘటన తరువాత సాజిద్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి, సాజిద్ను ఎన్కౌంటర్లో హతమార్చారు. దీనికి ముందు నిందితుడు జరిపిన కాల్పుల్లో సివిల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గౌరవ్ బిష్ణోయ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాజిద్కు వినోద్కు చాలాకాలంగా వైరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘోరానికి సాజిద్ పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. -
గడ్చిరోలి: మావోయిస్టులకు భారీ దెబ్బ
సాక్షి, గడ్చిరోలి: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి.. ప్రాణం పోస్తారనుకుంటే తీశారు -
ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అందరూ మహిళలు, చిన్న పిల్లలే. ఇవి బాధ్యత రహితమైన దాడులని ఆప్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఖోస్ట్, పక్టికా ప్రావిన్సుల్లోని పౌరుల నివాసాలపై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ వైమానిక దాడులు జరిగినట్లు తాలిబన్లు తెలిపారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇవి ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించే దాడులని పేర్కొన్నారు. కాగా, ఆదివారం ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి పాక్ భూభాగంలోనే పాకిస్తాన్ సైన్యంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైనికులు పలువురు చనిపోయారు. వీటికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అధ్యకక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు జరగడం గమనార్హం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే మిలిటెంట్ గ్రూపునకు గట్టి పట్టుంది. ఈ మిలిటెంట్లు పాకిస్తాన్ సైనికులపై దాడి జరిపి లెఫ్టినెంట్ కల్నల్తో సహా పలువురు జవాన్లను హతమార్చారు. వీరి అంత్యక్రియల సమయంలోనే ప్రతీకారం తీర్చుకుంటామని జర్దారీ ప్రకటించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదీ చదవండి.. అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్ -
గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్కు.. అంతలోనే
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రయెల్పై సోమవారం ఓ క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడి.. లెబనాన్కు చెందిన హెజ్జుల్లా మిలిటెంట్ గ్రూప్ పనిగా తేలింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఓ భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురే కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. మరణించిన వ్యక్తిని కేరళలోని కొల్లంకు చెందిన పాట్ నిబిన్ మాక్స్మెల్గా గుర్తించగా.. గాయపడిన ఇద్దరిని జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్లుగా గుర్తించారు, ఇద్దరు ఇడుక్కికి చెందగా..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా 31 ఏళ్ల పాట్ నిబిన్ రెండు నెలల కిత్రమే ఇజ్రాయెల్ వెళ్లారు. అతడి భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. వీరికి అయిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే తన భర్త, తండ్రికి అవే చివరి చూపులు అవుతాయని ఇద్దరూ ఊహించి ఉండరేమో.. ఈ దాడిపై నిబిన్ తండ్రి పాథ్రోస్ మాట్లాడుతూ.. తన పెద్ద కొడుకు ఇజ్రాయెల్ వెళ్లడంతో చిన్న కుమారుడైన నిబిన్ కూడా వారం రోజుల వ్యవధిలోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ముందు మస్కట్, దుబాయ్ వెళ్లి ఇంటికి వచ్చిన అతడు అనంతరం రెండు నెలల కిత్రం ఇజ్రాయెల్ వెళ్లినట్లు తెలిపారు. తన కోడలు ద్వారా కొడుకు మృతి చెందినట్లు తెలిసినట్లు చెప్పారు. ‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి, నిబిన్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. తరువాత అర్ధరాత్రి 12.45 గంటలకు, అతను మరణించినట్లు మాకు సమాచారం వచ్చింది. నిబిన్ నాలుగున్నరేళ్ల కుమార్తెను, అతని భార్య(ఏడు నెలల గర్భవతి)ని వదిలి ఇజ్రాయెల్ వెళ్లాడు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక నిబిన్ మృతదేహాన్ని నాలుగు రోజుల్లో కేరళకు తీసుకురానున్నారు’ అని పేర్కొన్నారు. భారత్ అడ్వైజరీ జారీ ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో తొలిసారి భారతీయ వ్యక్తి మరణించడంతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయ పౌరులు.. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరిపి.. భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఖండించిన ఇజ్రాయెల్ ఈ దాడిని భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఖండించింది. పండ్లతోటను సాగు చేస్తున్న వ్యవసాయ కార్మికులపై షియా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా జరిపిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలోన్ మాక్స్వెల్ సోదరుడితో మాట్లాడి, అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. -
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి!
బీహార్లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్ను ఢీకొని, మరో లేన్లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్ 2లోని దేవ్కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్ను ఢీకొని, డివైడర్ను దాటి.. మరో లేన్లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు. -
ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్గఢ్లో కాంకేర్ జిల్లా కోయిల్బెడా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ముగ్గురు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసులు తారçసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోందని ఎస్పీ చెప్పారు. మందుపాతర పేలి జవాను దుర్మరణం ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం మందుపాతర పేలి హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ జరుపుతుండగా ఆయన పొరపాటున మందుపాతరపై కాలు వేశారని పోలీసులు తెలిపారు. -
రష్యాకు ఎదురుదెబ్బ
కీవ్: ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యాకు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక కమాండర్ రాక కోసం శిక్షణాప్రాంతం వద్ద గుమిగూడిన సైనికులపై రెండు క్షిపణిలు వచ్చి పడ్డాయి. దీంతో 60 మంది రష్యా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రి సెర్గియో షొయిగూ నోరు మెదపలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి కొద్దిసేపటికి ముందే ఈ దాడి జరగడం గమనార్హం. ఇతర ప్రాంతాల్లో రష్యా సైన్యం విజయాలను పుతిన్కు వివరించిన సెర్గియో ఈ దాడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం డొనెట్కŠస్ రీజియన్లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. సెర్బియా ప్రాంతంలో ఉండే 36వ రైఫిల్ బ్రిగేడ్ ట్రుడోవ్స్కే గ్రామంలో ఒక మేజర్ జనరల్ రాకకోసం వేచి చూస్తుండగా ఈ దాడి జరిగింది. ఒకే చోట డజన్లకొద్దీ జవాన్లు విగతజీవులుగా పడి ఉన్న వీడియో ఒకటి అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. అమెరికా తయారీ హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్ సిస్టమ్(హిమార్స్) నుంచి దూసుకొచి్చన మిస్సైళ్లే ఈ విధ్వంసం సృష్టించాయని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా వ్యతిరేకంగా సైనిక వార్తలు రాసే బ్లాగర్ ఆండ్రీ మొరజోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన టెలిగ్రామ్ చానెల్కు లక్ష మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో చాలా ప్రాంతాల్లో రష్యా తోకముడిచిందంటూ, వేల మంది సైనికులు చనిపోయారని తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలను వెంటనే తొలగించాలంటూ రష్యా సైన్యం నుంచి ఈయన చాన్నాళ్లుగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాడు. ఇంకెవరో వచ్చి చంపే బదులు తానే కాల్చుకుని చస్తానని తన బ్లాగ్లో రాశాడని వార్తలొచ్చాయి. ఇప్పటిదాకా యుద్ధంలో రష్యా 45వేలకుపైగా సైన్యాన్ని కోల్పోయిందని ‘బీబీసీ రష్యా’ తెలిపింది. -
Israel-Hamas war: గాజా ఆస్పత్రిని చుట్టుముట్టిన ఐడీఎఫ్
రఫా: ప్రాణాలతో మిగిలి ఉన్న బందీలను హమాస్ మిలిటెంట్లు నాసిర్ ప్రాంగణం అడుగునున్న సొరంగాల్లో దాచినట్లు ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్)అనుమానిస్తున్నాయి. దీంతో, వారం రోజులుగా ఆస్పత్రిని దిగ్బంధించి అణువణువూ శోధిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ దాడితో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆస్పత్రిలోని 460 మందికి పైగా సిబ్బంది, రోగులను ఎలాంటి సౌకర్యాలు లేని ఆ పక్కనే ఉన్న పాతభవనంలోకి తరలివెళ్లాలని ఆర్మీ ఆదేశించింది. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఆక్సిజన్ నిల్వలు అడుగంటడంతో ఐసీయూలోని ఆరుగురు రోగుల్లో ఐదుగురు చనిపోయినట్లు గాజా అధికారులు శుక్రవారం తెలిపారు. -
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
Pakistan General Elections 2024: ఇంటర్నెట్ బంద్..ఉగ్ర దాడులు
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనల మధ్య సాధారణ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. మొత్తం 12.8 కోట్ల మంది ఓటర్ల కోసం 6.50 లక్షల మంది భద్రతా సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఆ వెంటనే అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టారు. శుక్రవారం ఉదయాని కల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ఆరుగురు మృతి ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. డేరా ఇస్మాయిల్ ఖాన్లోని కలాచి వద్ద భద్రతా సిబ్బంది వాహనాన్ని బాంబుతో పేలి్చన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. మరో ఘటన..బలోచిస్తాన్లోని ఖరాన్లో మందుపాతర పేలి ఇద్దరు పోలీసులు చనిపోగా మరో ఏడుగురు గాయపడ్డారు. భద్రతా కారణాలు చూపుతూ అధికారులు ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దులను గురువారం మూసివేశారు. సరుకు రవాణా వాహనాలతోపాటు పాదచారులను సైతం అనుమతించలేదు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మొబైల్, ఇంటర్నెట్ సరీ్వసులను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. అయితే, రిగ్గింగ్ను యథేచ్ఛగా కొనసాగించేందుకే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై ఎన్నికల కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా స్పందిస్తూ ఉగ్రదాడులు జరిగితే బాధ్యతెవరిదని ప్రశ్నించారు. ఎన్నికలకు, ఇంటర్నెట్తో ఎటువంటి సంబంధం లేదన్నారు. మద్దతుదారుల మధ్య ఘర్షణ అటోక్ నియోజకవర్గంలో రెండు చోట్ల పీఎంఎల్–ఎన్, పీటీఐ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణతో పోలింగ్ 5 గంటలపాటు ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది విధులకు రాకపోవడం, బ్యాలెట్ పేపర్లు చాలినన్ని అందకపోవడం, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వంటి కారణాలతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. బలోచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్ల్లో వర్షం, అతిశీతల వాతావరణ పరిస్థితుల మధ్య చాలా చోట్ల ఓటేసేందుకు జనం బయటకు రాలేదు. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సోధి గజేంద్ర తదితర సుమారు 20 మంది మావోయిస్టులతో కూడిన కుంటా ఏరియా కమిటీ సమావేశమవుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా భేజీ పోలీస్స్టేషన్ పరిధిలోని నగరం, పంటాభేజీ గ్రామాల మధ్య ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి
నారాయణ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. -
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని సిన్సినాటిలో భారతీయ విద్యార్థి ఒకరు చనిపోయారు. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇండియానా రాష్ట్రంలోని పర్డూ యూనివర్సిటీలో చదువుకుంటున్న నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. ఇతడు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం ధ్రువీకరించారు. వారం రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన ఇది రెండోది కావడం గమనార్హం. మూడు రోజుల క్రితం ఎంబీఏ చదువుకుంటున్న వివేక్ సైనీ(25) అనే భారతీయ విద్యార్థిని జూలియన్ ఫాక్నర్ అనే డ్రగ్స్ బానిస సుత్తితో కొట్టి దారుణంగా పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మంగళవారం(జనవరి 30) ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్టట్లు బస్తర్ జిల్లా పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లో రాయ్పూర్కు చికిత్స నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన వారిని కోబ్రా కానిస్టేబుళ్లు సి. దేవన్, పవన్ కుమార్, సీఆర్పీఎఫ్ జవాను లాంధర్ సిన్హాగా గుర్తించారు. సుఖ్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టేకులగూడెం గ్రామంలో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సోమవారమే పారామిలిటరీ సిబ్బందితో బేస్ క్యాంపుకు ఏర్పాటు చేశారు. టేకులగూడెం సమీపంలోని జోనగూడ, అలిగూడ గ్రామాల మధ్య కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం ఉదయం కూంబింగ్కు వెళ్లాయి. ఈ సమయంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం 2021లో టేకులగూడెం అడవుల్లోనే మావోయిస్టులు, భద్రతాబలగాలకు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో అప్పట్లో 21 మంది జవాన్లు మృతి చెందారు. మళ్లీ తిరిగి ఇప్పుడు అదే ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించడంతో పాటు భారీ సంఖ్యలో జవాన్లు గాయపడటం పోలీసులను కలవరపెడుతోంది. ఇదీచదవండి.. అజ్ఞాతం వీడిన సోరేన్ -
సూడాన్లో హింస.. 52 మంది మృతి!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం (యూఎన్ఐఎస్ఎఫ్ఏ) శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్ఐఎస్ఎఫ్ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. 2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి. -
ఆస్ట్రేలియా బీచ్లో ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ బీచ్లో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్ దీవిలోని ఎటువంటి కాపలా ఉండని ఈ బీచ్లో 20 ఏళ్లలో జరిగిన మొదటి ప్రమాదం ఇదేనని అధికారులు చెప్పారు. మృతులను జగ్జీత్ సింగ్ ఆనంద్(23), సుహానీ ఆనంద్(20), కీర్తి బేడి(20), రీమా సోంధి(43)గా గుర్తించారు. పంజాబ్కు చెందిన రీమా సోంధి రెండు వారాల క్రితం క్లైడ్లో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఫిలిప్ దీవికి వచ్చి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యారు. -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి
రఫా: గాజా్రస్టిప్పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్–జజీరా సీనియర్ కరస్పాండెంట్ వాయిల్ దాహ్దౌ కుమారుడు హమ్జా దాహ్దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో వాయిల్ దాహ్దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు. దాహ్దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్ దాహ్దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. -
అత్తను హత్య చేసి... అడ్డువచ్చిన భార్యపై..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అత్తను హత్య చేసి అడ్డుపడ్డ భార్య గొంతు కోశాడు. ఈ ఘటన సంగారెడ్డిలోని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలోని ఓ ఇంట్లో జరిగింది. రుద్రారంకు చెందిన సాయిబాబా.. తన భార్య సత్యవతిని సంసారానికి రాకుండా అత్త శాంతమ్మ అడ్డుపడుతోందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అత్త శాంతమ్మ(40) ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. శాంతమ్మపై దాడి చేస్తున్న సమయంలో సాయబాబాను భార్య సత్యవతి అడ్డుకుంది. మరింత కోపంతో సాయిబాబా తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు పోలీస్స్టేషన్కు వచ్చి నిందితుడు సాయిబాబా లొంగిపోయియాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్లో కి‘లేడీ’: లిఫ్ట్ అడిగి, బట్టలు చించుకుని కేకలేస్తూ.. -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్ను భారత్ వాంటెడ్గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి. చదవండి: గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్! ఇంతకీ నేపథ్యం ఏంటంటే..
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్
పెన్సిల్ లెడ్పై వాసవీ చరిత్ర
మామిడిలో పండు ఈగ ఉధృతి
హెచ్ఐవీ రోగులకు సత్వర వైద్యం
ఆధ్యాత్మికతతో విరాజిల్లిన పెనుగొండ
ఏడుగురిపై విద్యుత్ చౌర్యం కేసుల నమోదు
పశుపక్ష్యాదుల దాహం తీరుస్తూ..
రైల్వే పురస్కారాలు ప్రదానం
164 ఏళ్ల కట్టడం నేలమట్టం
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
తప్పక చదవండి
- దాడిచేసింది వారు.. మాపై కేసులా?
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
Advertisement