-
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై మహిళా ఉద్యోగి వేధింపుల అభియోగం మోపిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ, ఆమె పోలీసులు మినహా 100 మందికి సంబంధిత సీసీటీవీ ఫుటేజీని చూపుతామని రాజ్ భవన్ అధికారిక ప్రకటన చేసింది.రాజ్భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రజలు తమ అభ్యర్థనలు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా పంపాలని కోరింది. మొదటి 100 మంది వ్యక్తులు గురువారం ఉదయం గవర్నర్ హౌస్ లోపల ఫుటేజీని చూడటానికి అనుమతిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ రాజ్భవన్ అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్గవర్నర్సీవీ ఆనందబోస్ తననువేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. -
సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ: టీచర్ల నియామకాలకు సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 24 వేల టీచర్ల నియామకాన్ని పూర్తిగా రద్దు చేసి, సీబీఐ విచారణ చేపట్టాలని కోల్కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీఎంసీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఈ కేసులో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు చెందిన ప్రభుత్వ అధికారులపై లోతుగా దర్యాప్తు చేయాలన్న సీబీఐకి ఇచ్చిన ఆదేశాలపై తాజాగా స్టే విధించింది.2016 నాటి టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అప్పటి మొత్తం రిక్రూట్మెంట్ను రద్దు చేయాలని... ఇప్పటివరకు టీచర్లు తీసుకున్న జీతాలను వడ్డీతో సహా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియపై పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ను మరింత దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. కోల్కత హైకోర్టు తీర్పుపై దీదీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తాజాగా సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసుపై సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 6 తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ వ్యవహరంలో సీబీఐ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థా చటర్జీ, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్లోని పలువురు అధికారులను సీబీఐ అరెస్ట్ చేయటం గమనార్హం. -
టీచర్లపై వేటు.. ఆ పార్టీలకు ఓటు వేయొద్దన్న సీఎం మమత
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయద్దని తెలిపారు. లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఉద్యోగాలు రద్దైన టీచర్లకు ఓ సందేశాన్ని పంపారు. హైకోర్టు తీర్పు అనంతరం తొలిసారి సీఎం మమతా స్పందించారు. ‘బీజేపీ హైకోర్టు కోర్టును కోనుగోలు చేసింది. సుప్రీం కోర్టును కాదు. నాకు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నా. బీజేపీ హైకోర్టును, సీబీఐ, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, సీఏపీఎస్ వంటి ప్రభుత్వం సంస్థలను కొనుగోలు చేసింది. దూరదర్శన్ ఛానెల్ కలర్ మార్చింది. ఛానెల్ వాళ్లు కేవలం బీజేపీ, మోదీ గుర్చించి మాత్రమే ప్రసారాలు చేస్తారు. దూరదర్శన్ ఛానెల్ చూడకండి. ఆ ఛానెల్ను బాయ్కాట్ చేయండి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు.. టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇక.. 2019లో మొత్తం 42 స్థానాల్లో 18 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీచర్లు తీవ్ర నిరసన తెలిపారు. అవినీతికి పాల్పడిన కొంతమంది వల్ల వేలాది మంది అమాయక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు.2016 నాటి స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ (SLST) చట్టబద్ధం కాదని జస్టిస్ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్ రషీదిలతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఎల్ఎస్టీ 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని కూడా కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో ఎస్ఎల్ఎస్టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం.. ఐదుగురి మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం సృష్టించటంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. సుమారు 500 మందికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ భారీ తుపాను, వడగళ్లతో జలపాయిగురి జిల్లాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. తీవ్ర తుపాను కారణంగా రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. తుపాను పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీ బాగ్దోగ్రా ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. తుపాను సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని సీఎం తెలిపారు. Several homes damaged, trees uprooted due to storm in West Bengal's Jalpaiguri pic.twitter.com/3wBeikxOHJ — NDTV (@ndtv) March 31, 2024 జిల్లా ఉన్నతాధికారులు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు. బాధితులకు వైద్యసిబ్బంది చికిత్స అందిస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలపాయిగురితో పాటు పక్కనే ఉన్న అలియుపుర్దువార్ కూచ్ బెహార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుపాను, వడగళ్ల ప్రభావం స్వల్పంగా చూపిందని కానీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Sad to know that sudden heavy rainfall and stormy winds brought disasters today afternoon in some Jalpaiguri-Mainaguri areas, with loss of human lives, injuries, house damages, uprooting of trees and electricity poles etc. District and block administration, police, DMG and QRT… — Mamata Banerjee (@MamataOfficial) March 31, 2024 -
‘సందేశ్ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితురాలు, బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆమెతో ఫోన్లో స్వయంగా మాట్లాడారు. సందేశ్ఖాలీలో షాజహాన్ షేక్ ఆకృత్యాలను బయటపెట్టిన రేఖా పత్రను శక్తి స్వరూపిణి ( శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతల) తో పోల్చారు. ప్రధాని మోదీ: సందేశ్ఖాలీ ప్రజలు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది? రేఖ పత్ర : తృణమూల్ కాంగ్రెస్ షాజహాన్ షేక్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి. ప్రధాని మోదీ : బసిర్హట్ నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యతను మీకే అప్పగించాం. రేఖపత్ర : సందేశ్ఖాలీ మహిళల పట్ల మీరు దేవుడిలాంటి వారు. ఆ రాముడే మాతో ఉన్నట్లు భావిస్తున్నాం. ప్రధాని మోదీ: వారి ఆశీసులు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళామణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపిక పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? రేఖ పత్ర : మొదట మీరు నన్ను లోక్సభ అభ్యర్ధిగా ప్రకటించడంపై పలువురు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే వాళ్లల్లో చైతన్యం కలిగింది. తృణముల్ కాంగ్రెస్ నేతల సూచనల మేరకే తాము ఇలా ఆందోళన చేశామని, ఇకపై ఇలా చేయబోమని హామీ ఇచ్చారు. వారితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తా. ప్రధాని మోదీ : మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి బాగు కోసం పని చేప్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం. రేఖ పత్ర : నాకు ప్రజా మద్దతు లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ‘నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పనిచేస్తున్నారు. మేం బతకడానికి చాలా కష్టపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు పని లభించేలా, వారు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ : మీ గెలుపు ఖాయం. ‘మీరు శక్తి స్వరూపిణి. శక్తివంతమైన నేతను జైలుకే పంపారు. బసిర్హట్లోనే కాదు, వెస్ట్ బెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడుదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంది’. ‘బెంగాల్ దుర్గా మాత నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్ఖాలీ మహిళలు గొంతు ఎత్తడం అంత సులభం కాదు. ఈసారి బెంగాల్లోని నారీశక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం’ అంటూ ప్రధాని మోదీ బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో సంభాషణ ముగించారు. -
పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ.. ఎవరీ ‘రాజమాత’
కోల్కతా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణా నగర్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మరి ఈసారి మహువా గెలుస్తారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే.. ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రాజమాత అమ్రితా రాయ్కి గురించి పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతకీ ఈ రాజమాత ఎవరు? కృష్ణా నగర్ లోక్సభ నియోజవర్గంలో మొత్తం 14 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో బీజేపీ 1999 ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఆ నియోజకవర్గంలో కమలం గెలుపు కత్తిమీద సాములా మారింది. అయితే ఈ సారి లోక్సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న కమలం.. మహువా మొయిత్రా మీద ఏరికోరి అమ్రితా రాయ్ని నిలబెట్టింది. బీజేపీ 111 అభ్యర్ధులతో ఐదువ జాబితాను విడుదల చేసింది. అందులో కృష్ణా నగర్ లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్ధిగా రాజమాత అమ్రితా రాయ్ని ఖరారు చేసింది. అమ్రితా రాయ్ ఎవరు? అమ్రితా రాయ్ కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందినవారు. నియోజకవర్గానికి చెందిన 'రాజ్బరీ రాజమాత' (రాచరికపు రాణి తల్లి) గా ప్రసిద్ధి మొయిత్రాకు పోటీగా బీజేపీ రాజ మహారాజా కృష్ణచంద్ర కుటుంబ సభ్యులను పోటీకి దించవచ్చని ఊహాగానాలు ఊపందుకున్న తర్వాత బీజేపీ ఢిల్లీ అధిష్టానం అమ్రితారాయ్ని కృష్ణానగర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 20న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, సువేందు అధికారి సమక్షంలో రాయ్ అధికారికంగా బీజేపీలో చేరారు. పలు నివేదికల ప్రకారం.. కృష్ణా నగర్ జిల్లా నాయకత్వమే మొదట అమ్రితా రాయ్ను లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఆ తర్వాతే కమలం పెద్దలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా, కృష్ణనగర్ లోక్సభ అభ్యర్థిగా మహారాజా కృష్ణ చంద్ర రాయ్ రాజమహల్ నుంచి తొలిసారి రాజకీయాలతో అనుసంధానించారు. రాష్ట్రంలో వీరి వారసత్వం హవా నేటికీ కొనసాగుతుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత రాయ్ మాట్లాడుతూ “నాడియా చరిత్రకు రాజు కృష్ణచంద్ర చేసిన కృషి గురించి అందరికి తెలుసు. చరిత్రలో కృష్ణానగర్ రాజకుటుంబం పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. నేను ఎన్నికల రంగంలోకి రాచరికపు కోడలుగా కాకుండా సాధారణ ప్రజల గొంతుకగా నిలిచాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలకు బీజేపీ మొత్తం 38 మధ్య అభ్యర్ధులను ఖరారు చేసింది. ఐదవ జాబితాలో 19 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. -
ఏంటి హీరో.. నువ్వే ఇలా చేస్తే ఎలా? షారుక్పై సెటైర్లు
ఐపీఎల్కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్ ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమైంది. శనివారం సన్రైజర్స్ - కోల్కతా నైట్ రైజర్స్ మధ్య పోటీ జరిగింది. తన జట్టుకు మద్దతు తెలిపేందుకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. కోల్కతాలోని స్టేడియంలో అడుగుపెట్టాడు. ఇతడిని చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఇదిలా ఉంటే మ్యాచ్ వీక్షించేటప్పుడు షారుక్ పొగ తాగాడంటూ చిన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ, స్టేడియంలో ఇలాంటి పాడుపనులేంటని విమర్శిస్తున్నారు. కనీసం అక్కడ ఉన్నంతసేపైనా దమ్ము కొట్టకుండా ఉండొచ్చుగా.. అంత బానిసైపోయాడా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షారుక్ సినిమాల సంగతికొస్తే.. గతేడాది పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో వరుస బ్లాక్బస్టర్లు కొట్టాడు. టైగర్ 3 మూవీలో అతిథి పాత్రలో మెరిశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠగా జరిగిన పోరులో సన్ రైజర్స్ను ఓడించి కేకేఆర్ విజయం సాధించింది. Cameraman ki timing 😂😭 What a timing Bakra 😂😂#ShahRukhKhan #IPL2024 #KKRvSRH https://t.co/JUYnHKIdwd — Our darling (@Our_darling___) March 24, 2024 చదవండి: విరూపాక్ష సినిమా హీరోగా నన్నే అనుకున్నారు.. కానీ! -
Kolkata: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
క్రైమ్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందిని ఇప్పటిదాకా రక్షించగలిగారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయక్కడ. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం రంగంలోకి దిగిన 50 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. #UPDATE : 10 rescued, search underway for survivors as under-construction building collapses in Kolkata#Kolkata #GardenReach #BuildingCollapse #KolkataNews #India #WestBengal pic.twitter.com/LvpdkbC8Yj — upuknews (@upuknews1) March 18, 2024 Video Credits: upuknews #WestBengal | 10 Rescued As Under-Construction Building Collapses In Kolkata, Search On For Survivors#Kolkata #BuildingCollapse More Here: https://t.co/Tzpr6kK6Qe pic.twitter.com/NgJsWYSOf4 — NDTV (@ndtv) March 18, 2024 Video Credits: NDTV ఇదిలా ఉంటే.. నిబంధనలకు విరుద్ధంగా ఆ భవన నిర్మాణం సాగుతోందని.. కనీసం మూడు ఫీట్ల వెడల్పు కూడా లేని ఇరుకుగల్లీలో ఈ భవన నిర్మాణం జరుగుతోందని.. ప్రమాదం తర్వాత సహాయక చర్యలు కూడా చాలా ఆలస్యంగా మొదలయ్యాయని మీడియా ముందు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. -
‘సందేశ్ఖాలీ’ ఘటనలో కీలక పరిణామం
సాక్షి, కోల్కతా : పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫిబ్రవరి 29న సందేశ్ఖాలీ గ్రామంలో దుర్మార్గాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ను పశ్చిమ్ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా షాజహాన్ తమ్ముడు షేక్ అలంగీర్తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సందేశ్ఖాలీలో ఏం జరిగింది? 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలీ గ్రామం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ పెద్ద ఎత్తున రేషన్ కుంబకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు, షాజహాన్ షేక్ యథేచ్ఛగా స్థానికుల భూమల కబ్జాకు, దళిత మహిళలపై లైంగిక దాడులు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రేషన్ కుంబకోణం గురించి సీఎం మమతా బెనర్జీకి తెలిసినా పట్టించుకోలేదంటూ బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు తమ నిరసన గళం విప్పాయి. దీంతో పశ్చిమ్ బెంగాల్ గవర్నర్గా ఉన్న సమయలో జగ్దీప్ ధన్ఖడ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 2వేల మంది ప్రైవేట్ సైన్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కేసులో గత ఏడాది రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న షాజహాన్ షేక్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నించింది. ఆ సమయంలో రెండు వేల మంది షాజహాన్ షేక్ ప్రైవేట్ సైన్యం ఈడీ అధికారులపై కత్తులు, కర్రలతో దాడులు చేయడంతో ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. సీబీఐ అదుపులో షాజహాన్ తమ్ముడు ఈడీ అధికారులపై జరిగిన దాడిపై షాజహాన్ను సీబీఐ అధికారులు విచారించాలని కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు ఫిబ్రవరి 29న పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి సీబీఐకి అప్పగించారు. తాజాగా, షాజహాన్ తమ్ముడు షేక్ అలంగీర్తో పాటు మరో ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ సందేశ్ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. -
అండర్ వాటర్ మెట్రోకు అనూహ్య ఆదరణ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మెట్రోలో తాజాగా సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోల్కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘వందే భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. #CommercialServices on #KaviSubhash-#HemantaMukhopadhyay stretch begins this morning.... pic.twitter.com/6bCxoz5oO9 — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 కోల్కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లోని హౌరా మైదాన్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 7 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి మరో మెట్రో బయలుదేరింది. కోల్కతా మెట్రోపాలిటన్ రవాణా నెట్వర్క్లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నదికి దిగువన ఉంది. నది కింద ఉన్న ఈ సొరంగం పొడవు 520 మీటర్లు. Regular service on Howrah Maidan - Esplanade, Kolkata Metro started today! pic.twitter.com/Rp2ofTHFS9 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 15, 2024 కోల్కతా మెట్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు ఫొటోలలో ప్రయాణికులు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. ప్రయాణ సమయంలో, ఒక ప్రయాణికుడు ప్లకార్డుపై ‘భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మోడీ జీ’ అని రాశారు. కాగా హుగ్లీ నది దిగువ భాగాన్ని గుర్తించే సొరంగ భాగాన్ని నీలిరంగు ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ వాటర్ మెట్రో మార్గంలో ప్రతి 12 నుండి 15 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి. #Metro passengers queuing up at #Esplanade Metro station this morning to be a part of the history..... pic.twitter.com/smVgUQX9uJ — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 -
మమతా బెనర్జీ గాయంపై వైద్యుల అనుమానాలు
సాక్షి, కోల్కతా : తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడలేదని, గుర్తు తెలియని అంగతకులు వెనుక నుంచి నెట్టడం వల్ల ఆమె తల, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు ఎస్కేఎం ప్రభుత్వ ఆస్పత్రి డైరెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 7.30 గంటలసమయంలో మమతా బెనర్జీ కాళీగట్లో తన నివాసంలో కింద పడ్డారు. అయితే సిబ్బంది అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలోని వుడ్బర్న్ వార్డ్లో చేర్చారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీదీ నుదిటిపై 3కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేశారు. మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సిఫార్సు మేరకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. రాత్రి 9:45 గంటలకు, ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ సీఎం ఇంట్లో పడిపోవడం వల్లే గాయమైందని అందరూ అనుకున్నారు. కానీ మమతా బెనర్జీ తీవ్ర గాయాలు పాలు కావడం వెనుక కోట్ర దాగినట్లు సమాచారం. ఎస్ఎస్కేఎం డైరెక్టర్ మణిమోయ్ బంద్యోపాధ్యాయ ఈ సంఘటనకు గల కారణాల్ని వెల్లడించారు. సీఎం తనకు తానుగా పడిపోవడం వల్ల జరిగే గాయాలకంటే.. ఆమె వెనుక నుంచి ఎవరో బలవంతంగా నెట్టడం వల్లే నుదిటికి, ముక్కుకి గాయాలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణాల్ని నిర్ధారించలేదు. ఈ సందర్భంగా ఈసీజీ, సిటిస్కాన్ చేసినట్లు చెప్పిన ఆయన.. వైద్యుల పర్యవేక్షణ కోసం ఆస్పత్రిలో ఉండాలని సూచించామని, కానీ ఆమె ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడినట్లు తెలిపారు. ఇక శుక్రవారం వరకు ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. మరోవైపు మమత కోడలు, తృణమూల్ కౌన్సిలర్ కజారీ బెనర్జీ దీదీకి గాయాలు కావడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీదీ పడిపోయింది అని విన్నాను. ఎవరో నెడితేనే తీవ్రగాయాయ్యాయని అన్నారు. కాగా, గురువారం సాయంత్రం, దివంగత తృణమూల్ నాయకుడు సుబ్రతా ముఖర్జీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆమె కాళీఘాట్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న దక్షిణ కోల్కతాలోని గరియాహట్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆమె కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. -
CAA: ‘బెంగాల్లో నిర్బంధ శిబిరాలను అనుమతించం’
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజల మధ్య విభజన సృష్టించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తోందని మండిపడ్డారు. అస్సాంలో ఉన్న విధంగా పశ్చిమ బెంగాల్కు నిర్బంధ శిబిరాలు అవసరం లేదని అన్నారు. ‘సీఏఏ అనేది ఎన్ఆర్సీ వంటిదే. అందుకే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్సాం ఉన్నట్లు మాకు నిర్బంధ కేంద్రాలు అవసరం లేదు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాము భూస్వాములం కాదని.. అప్రమత్తంగా ఉండే సంరక్షకులమని తెలిపారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరినీ వెళ్లగొట్టమని అన్నారు. శరణార్థులంతా ఇక్కడే శాశ్వతంగా స్థిరపడవచ్చని సీఎం మమత అన్నారు. బీజేపీ హిందూ మతాన్ని వక్రీకరిస్తోందని.. స్వామి వివేకనంద బోధనలు నుంచి హిందుత్వాన్ని వేరు చేస్తోందని మండిపడ్డారు. సీఏఏతో భారత ప్రజల మధ్య విభజన తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సీఎం మమత దుయ్యబట్టారు. ఇక.. 2019లో విదేశీయులతో కూడిన నిర్బంధ కేంద్రాలను అస్సాం ప్రభుత్వ నోటీఫై చేసిన విషయం తెలిసిందే. వారికి శాశ్వత కేంద్రాల ఏర్పాటు చేసే వరకు జైళ్లను కూడా ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజధాని దిస్పూర్కు సుమారు 130 కిలోమిటర్ల దూరం మాటియా అనే అతిపెద్ద నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నిర్బంధ కేంద్రంపై గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
‘సోదరుడిపై సీఎం మమత ఫైర్.. అన్ని బంధాలు తెంచుకున్నా’
కోల్కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు -
నీటి అడుగున నడిచే మెట్రో
-
స్వామీ స్మరణానంద ఎవరు? ప్రధాని మోదీ ఎందుకు పరామర్శించారు?
కోల్కతా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్మామీ స్మరణానందను పరామర్శించారు. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడు స్వామీ స్మరణానంద కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోల్కతా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రిని సందర్శించారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ, పలు ఫొటోలను పంచుకున్నారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామీ స్మరణానంద మహరాజ్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి తాను ఆసుపత్రికి వెళ్లానని పీఎం మోదీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఆసుపత్రి సందర్శన సమయంలోప్రధాని మోదీ నోటికి మాస్క్ ధరించారు. అలాగే చెప్పులు లేకుండా ఆసుపత్రి గదిలోనికి వెళ్లారు. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడు స్వామీ స్మరణానంద... స్వామి ఆత్మస్థానానంద పరమపదించిన అనంతరం 2017 జూలై 17న అధ్యక్ష పదవిని చేపట్టారు. స్వామి స్మరణానంద తమిళనాడులోని తంజావూరులోని అందమి గ్రామంలో 1929లో జన్మించారు. 20 ఏళ్ల వయస్సులో ఆయనకు రామకృష్ణ మఠంతో పరిచయం ఏర్పడింది. 1952లో తన 22 ఏళ్ల వయసులో ఆయన సన్యాసం స్వీకరించారు. Upon reaching Kolkata, went to the hospital and enquired about the health of the President of Ramakrishna Math and Ramakrishna Mission, Srimat Swami Smaranananda ji Maharaj. We are all praying for his good health and quick recovery. pic.twitter.com/2jammDbWsH — Narendra Modi (@narendramodi) March 5, 2024 -
Kolkata: అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని
కలకత్తా: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలు లైన్ను పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. కొత్త లైన్పై రైలుకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మెట్రో రైలులో మోదీ ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. రైలు బయట స్టేషన్లలో వేచిచూస్తున్న వారికి కిటికీల్లో నుంచి అభివాదం చేశారు. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi welcomed by a huge crowd gathered at Esplanade metro station, in Kolkata PM Modi inaugurated India's first underwater metro rail service, a short while ago. pic.twitter.com/5rMfUWHQ0f — ANI (@ANI) March 6, 2024 అండర్ వాటర్ మెట్రోతో పాటు పాటు మొత్తం రూ.15 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కలకత్తాలోని హౌరామైదాన్-ఎస్ప్లాండే సెక్షన్లోని 4.8కిలోమీటర్ల మెట్రో ఈస్ట్ వెస్ట్ కారిడార్లో హూగ్లీ నదిపై అండర్వాటర్ మెట్రోను నిర్మించారు. #WATCH | West Bengal: Prime Minister Narendra Modi interacts with school students as they travel in India's first underwater metro train, in Kolkata. pic.twitter.com/lQye0OnuqP — ANI (@ANI) March 6, 2024 భూమికి 30 మీటర్ల దిగువన మెట్రో రైల్ స్టేషన్ ఉంటుంది. ఈ కారిడార్ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్తో అనుసంధానిస్తుంది. బుధవారం ఈ కారిడార్ను ప్రధాని అధికారికంగా ప్రారంభించినప్పటికీ ప్రయాణికులకు కొద్దిరోజుల తర్వాత అండర్ వాటర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. అండర్ వాటర్ మెట్రో ప్రారంభోత్సవంలో మోదీ వెంట బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్, అసెంబ్లీలో ప్రతిపక్షనేత సువేందు అధికారి తదితరులు పాల్గొన్నారు. ఐదురోజుల్లో పశ్చిమబెంగాల్లో పర్యటించడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ.. బీజేపీపై ‘దీదీ’ ఫైర్ -
జలాంతర మెట్రో.. హూగ్లీ నదిపై నేడే ప్రారంభం
ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్ వాటర్ మెట్రో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు కోల్కతాలోని ఈస్ట్–కోస్ట్ మెట్రో కారిడార్ వేదికగా మారనుంది. ఈ కారిడార్లోని హౌరా మైదాన్– ఎస్ప్లానేడ్ సెక్షన్లో ఈ అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అండర్వాటర్ మెట్రో సేవలను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హూగ్లీ నది జలాల కింద ఈ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. విశేషాలు ఇవే... ► ఈస్ట్–వెస్ట్ మెట్రో మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా అందులో 10.8 కిలోమీటర్లమేర విస్తరించిన కారిడార్లో రైలు భూగర్భంలో ప్రయాణించనుంది. ► ఇందులో పూర్తిగా నదీజలాల కింద నుంచి 520 మీటర్లమేర రైలు పరుగులుపెట్టనుంది. 45 సెకన్లపాటు సాగే ఈ నదీగర్భ ప్రయాణం మెట్రో రైలు ప్రయాణికులకు అనిర్వచనీయ అనుభూతి ఇవ్వనుంది ► దేశంలో తొలిసారిగా నది అడుగున నిర్మించిన తొలి రవాణా టన్నెల్ కూడా ఇదే కావడం విశేషం. ► కోల్కతా పరిధిలోని జంట నగరాలుగా పేరొందిన హౌరా, సాల్ట్ లేక్లను కలుపుతూ ఈ మెట్రో రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ► 16.6 కిలోమీటర్లలో 4.8 కిలోమీటర్ల మార్గం కోల్కతాలోని సాల్ట్ లేక్ సిటీ ఐదో సెక్టార్, సెల్డాలోని కీలకమైన ఐటీ హబ్కు ఎంతో దోహదపడనుంది. ► హూగ్లీ నది అడుగున నిర్మించిన తొలి మెట్రో సొరంగ మార్గంగా ఇది రికార్డులకెక్కనుంది. ► ‘కోల్కతా మెట్రో’కు సంబంధించి 2023 ఏప్రిల్ నెల ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ నెలలో నదీ అడుగున 32 మీటర్ల మేర ప్రయోగాత్మక మెట్రో రైలును విజయవంతంగా నడిపి చూశారు. ► నేడు ( బుధవారం) ప్రధాని మోదీ ఈ రైల్వే సేవలను లాంఛనంగా ప్రారంభించాక గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణాలకు అనుమతిస్తామని కోల్కతా మెట్రో అధికారి కౌశిక్ మిత్రా చెప్పారు. కవి సుభాష్ –హిమంత ముఖోపాధ్యాయ్, తారాతలా–మాజెర్హాట్ మెట్రో సెక్షన్లను మోదీ ప్రారంభిస్తారు. ► ఈ మెట్రో సెక్షన్లో మొత్తంగా ఆరు స్టేషన్లు ఉంటాయి. వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు. అయినా సరే ప్రయాణికులు భూగర్భం లోపలికి, బయటకు వేగంగా వచి్చపోయేందుకు వీలుగా నిర్మించారు. ► అత్యంత రద్దీ, కాలుష్యమయ కోల్కతాలో పర్యావరణ అనుకూల ప్రయాణానికి భరోసానిస్తూ ఈ మెట్రోను ఇలా భూగర్భంలో డిజైన్చేశారు. దీంతో కాలుష్య తగ్గడంతోపాటు ప్రయాణికులకు ప్రయాణసమయమూ కలిసిరానుంది. ► ఈస్ట్–వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లోనే మొదలయ్యాయి. హూగ్లీ నది అంతర్భాగ పనులు మాత్రం 2017లో ఊపందుకున్నాయి ► 2019 ఆగస్ట్లో భూగర్భంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఉబికిరావడం, భూమి కుంగడం వంటి ఘటనలతో అండర్వాటర్ మెట్రో పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. 2022లో వాటర్ లీకేజీ ఘటనలూ ఎదురైనా అన్ని బాలారిష్టాలను దాటుకుంటూ ఎట్టకేలకు ఈ మెట్రో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో ఎన్నెన్నో 19వ శతాబ్దిలోనే ఇంగ్లిష్ ఇంజనీర్లు భూగర్భ రైల్వే సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే పురాతన భూగర్భ రైల్వే నెట్వర్క్గా థేమ్స్ టన్నెల్ను చెప్పుకోవచ్చు. 1843లోనే రోథర్హీట్, ర్యాపింగ్ పట్టణాల మధ్య ఈ మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడిది లండన్లో కీలక రైలు మార్గాల్లో ఒకటి. దీని పొడవు కేవలం 400 మీటర్లు. జపాన్లోని సీకెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్వాటర్ రైల్వే టన్నెల్గా పేరొందింది. దీని పొడవు ఏకంగా 53.85 కిలోమీటర్లు. హోన్షూ, హోకైడో ద్వీపాల మధ్య సుగారు జలసంధి కింద దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే లోతైన, పొడవైన రైల్వే టన్నెల్గా రికార్డుసృష్టించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్లో బోస్ఫోరస్ జలసంధి కింద అండర్వాటర్ టన్నెల్ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్లోని ఆసియా, యూరప్ భూభాగాలను కలుపుతుంది. ఈ రైల్వే టన్నెల్ పొడవు దాదాపు 14 కి.మీ.లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కడే ఆరంభం.. రేపు మరో అద్భుతం ఆవిష్కృతం!
ఢిల్లీ: దేశంలోనే తొలిసారి నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ చారిత్రక ఘట్టానికి కోల్కతా(పశ్చిమ బెంగాల్) మెట్రో వేదిక కానుంది. బుధవారం పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గం మెట్రో సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మరి దీని ప్రత్యేకలు ఓసారి చూద్దాం.. ఈస్ట్వెస్ట్ మెట్రో కారిడార్లో.. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ స్టేషన్ల మధ్య ఈ రివర్ అండర్ గ్రౌండ్ కారిడార్ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మూడు స్టేషన్లు ఉన్నాయి. హౌరా మైదాన్, హౌరా స్టేషన్ కాంప్లెక్స్, బీబీడీ బాగ్ (మహాకరణ్). హూగ్లీ నదీ కింద భాగంలో కోల్కతా నుంచి నదీకి అవతలివైపు హౌరా మధ్య సుమారు 4.8 కిలోమీటర్ల దూరంతో ఈ అండర్గ్రౌండ్ ప్రయాణం సాగనుంది. నీటి ఉపరితలం నుంచి 32 మీటర్ల లోతున మెట్రో టన్నెల్ ఏర్పాటు చేయగా.. ప్రయాణానికి 45 సెకన్ల టైం పట్టనుంది. ఈ ఫీట్ను మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా కోల్కతా మెట్రో అధికారులు అభివర్ణిస్తున్నారు. ఏడు నెలలపాటు ట్రయల్ రన్స్ జరిపారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రయాణాలకు అనుమతికి రెడీ చేశారు. ఈస్ట్వెస్ట్ మెట్రో కారిడార్కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్ను బ్రిటన్కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. తాజా అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుతో.. రోజూ ఈ మార్గంలో ఏడు లక్షల మంది ప్రయాణిస్తారని కోల్కతా మెట్రో రైల్ సీపీఆర్వో అంచనా వేస్తున్నారు ప్రధాని మోదీ మార్చి 6న మెట్రో సర్వీసులను ప్రారంభించగా.. మరుసటి రోజునుంచి ప్రయాణికులను అనుమతిస్తారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నాలుగేళ్లకు పైనే పట్టింది. టన్నెల్ నిర్మాణాల వల్ల సమీప ప్రాంతాల్లోని నివాసాలు దెబ్బ తినగా.. అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు.. స్థానికులను ఒప్పించి, పరిహారం చెల్లించి నిర్మాణం పూర్తి చేసింది మెట్రో రైల్ కోల్కతా. హౌరా మెట్రో స్టేషన్.. నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. తద్వారా భారతదేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్గా రికార్డుల్లోకి ఎక్కనుంది. దేశంలో తొలిసారి 1984 అక్టోబర్ 24వ తేదీన కోల్కతాలోనే మెట్రో సేవలు ప్రారంభం అయ్యాయి. సుమారు 3.4 కిలోమీటర్ల దూరంలో ఐదు స్టేషన్లతో తొలి మెట్రో పరుగులు తీసింది నాడు. అదే నగరంలో ఇప్పుడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. కోల్కతా ఈస్ట్వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా.. దీంట్లో 10.8 కి.మీ.లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో కొంతభాగం హుగ్లీ నది కింద సొరంగంలో ఉండగా.. మిగిలినదంతా భూ ఉపరితలంపైనే. సొరంగం లోపల అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా, బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లు. లండన్ప్యారిస్ కారిడార్లోని యూరోస్టార్ సర్వీసు మాదిరిగా రూపొందించిన సొరంగమార్గం ఇది. ఈ తరహా మెట్రో రూట్ ద్వారా.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించినట్లు అవుతుందని మెట్రో అధికారులు అంటున్నారు. India's first underwater metro rail service - Howrah Maidan to Esplanade Metro Station will be inaugurated by PM Modi in Kolkata tomorrow. This will be the Deepest Metro Station and Metro line in India. pic.twitter.com/jRooRVvLMg — Rishi Bagree (@rishibagree) March 5, 2024 -
అయోధ్యపై టీఎంసీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన రామాలయాన్ని అపవిత్ర ప్రదేశంగా అభివర్ణించారు. హిందువులెవరూ ఇలాంటి అపవిత్ర ప్రదేశంలో పూజలు చేయకూడదని కూడా అన్నారు. హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్కు చెందిన తృణమూల్ ఎమ్మెల్యే రామేందు సిన్హా రాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తృణమూల్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సువేందు తన ట్విట్టర్ హ్యాండిల్లో తృణమూల్పై విరుచుకుపడ్డారు.. అధికార పార్టీ నేతల మాటలు హిందువులపై జరుగుతున్న దాడులకు నిదర్శనం అని అన్నారు. శ్రీరాముని ఆలయాన్ని ‘అపవిత్రం’ అని అభివర్ణించేంతలా వారి వైఖరి మారిపోయిదన్నారు. ఇది తృణమూల్ నేతల భావజాలాన్ని వెల్లడిస్తుందన్నారు. Simply Outrageous. TMC MLA of Tarakeswar Assembly Constituency - Ramendu Sinha Roy, who is also the TMC President of Arambagh Organizational District has labeled the Grand Ram Mandir as 'UNHOLY'. He has also stated that no Indian Hindu should offer Puja at such unholy site.… pic.twitter.com/xBBQuqpTzn — Suvendu Adhikari (Modi Ka Parivar) (@SuvenduWB) March 4, 2024 -
రసవత్తరంగా కోల్కతా రాజకీయాలు..
సాక్షి,కోల్కతా : దేశంలో ఎన్నికల రణరంగంలో ఆసక్తికర పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమం కోసం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అనంతరం జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ త్వరలో రాజకీయాల్లోకి అడుగపెట్టనున్నారు. బీజేపీ లోక్సభ అభ్యర్ధిగా పోటీ చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జస్జిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమ్ బెంగాల్ స్కూళ్లలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టారు. సీబీఐ, ఈడీలకు సైతం దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ అంశం కోల్కతాతో పాటు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. తమ్లుక్ లోక్సభ అభ్యర్ధిగా.. ఇప్పుడు ఆయనే స్వయంగా రాజకీయాల్లో అడుగు పెడుతుండడంతో కోల్కతా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్లోని తమ్లుక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆయనను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. ఒకప్పుడు ఈ స్థానంలో పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షనేత, బీజేపీ నేత సువేందు అధికారి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సువేందు అధికారి తమ్ముడు, టీఎంసీ నేత దిబ్యేందు అధికారి ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీల కోసం.. మరోవైపు కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ రాజీనామాపై ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.‘హైకోర్టు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీలు రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అంటే న్యాయం చేయడం లేదు. పార్టీ కోసం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
సందేశ్ఖాలీ కేసు: షాజహాన్ ఖాన్కు షాక్ ఇచ్చిన టీఎంసీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సందేశ్ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్ఖాలీ కేసులో షాజహన్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత ఎన్నిరోజులుగా పరారీలో ఉన్న షాజహన్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సందేశ్ఖాలీలోని భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్ ఖాన్తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు సందేశ్ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం. ఇక.. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, మంత్రి బ్రత్య బసు మీడియా సమావేశంలో తమ పార్టీ నేత షాజహన్ ఖాన్పై సస్పెన్షన్ విధించినట్లు మీడియాకు తెలిపారు. ‘సందేశ్ఖాలీ కేసు విషయంలో మేం చట్టప్రకారం నడుచుంటాం. కానీ.. ఈ విషయంలో బీజేపీ కావాలని మాకు అడుగడుగునా అడ్డుపడుతోంది. బీజేపీకి మేము సవాల్ విసురుతున్నాం. మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం సందేశ్ఖాలీ విషయం మాకు కేంద్రానికి మధ్య.. బీజేపీకి టీఎంసీ మధ్య విషయం. ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి మాటలు చెప్పేదైతే.. టీఎంసీ చెప్పిన మాటలను ఆచరిస్తుంది’అని డెరెక్ ఓబ్రియన్ అన్నారు. -
Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి
‘అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది’ ‘అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది’ ‘అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం’ ‘అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి’... ఇలాంటి కామెంట్స్ అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డా. అపర్ణ బుజర్ బారువా బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తీసిన ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ను అందుకుంది... సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్పూర్లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్గా తన ఉద్యోగప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒకవైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీuŠ‡ నుంచి సితార్లో విశారద్ డిగ్రీ పొందింది. ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్గా అరుదైన ఘనతను దక్కించుకుంది. 2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ ‘ఇది విశ్రాంతి సమయం’ అనుకోలేదు. ‘ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది’ అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది. గువహటిలోని గీతానగర్లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది. కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది. 26 నిమిషాల నిడివి ఉన్న ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. ‘దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ. దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూవాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది. దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే.... కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్లో కామ్రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో డాక్యుమెంటరీ ప్రారంభించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా ‘అంతా మంచే జరుగుతుంది’ అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం. నా వయసు జస్ట్ 78 ప్లస్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ‘మీ వయసు ఎంత?’ అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే ‘మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి’ అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – డా.అపర్ణ బుజర్ బారువా -
సందేశ్ఖాలీ కేసు: టీఎంసీ నేత అరెస్టుపై హైకోర్టు క్లారిటీ
కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సందేశ్ఖాలీ నిరసనలకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత షేక్ షాజాహాన్పై కోల్కతా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షాజహాన్ అరెస్టుపై ఎలాంటి తాము ఎలాంటి స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. సుమోటోగా స్వీకరించిన ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ, పశ్చిమ బెంగాల్ హోం శాఖ కార్యదర్శిలను కోర్టు ఆదేశించింది. రేషన్ స్కామ్లో షాజహాన్ ఇంట్లో సోదాల కోసం వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై జనవరి 5న దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పటి నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. కాగా, షాజాహాన్ అరెస్టు హైకోర్టు పరిధిలో ఉందని, పోలీసుల చేతులను హైకోర్టు కట్టేసిందని టీఎంసీ ప్రధానకార్యదర్శి అభిషేక్ బెనర్జీ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు క్లారిటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి.. మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ మంటలు -
సర్వర్ డ్రోన్ సుందరం
కాఫీ హోటల్ ఏదైనా సర్వర్ గారు సుందరమే అయి ఉంటాడని గతంలో అనుకునేవారు. ఎందుకంటే టిఫిన్ హోటల్స్ తమిళులే నడిపేవారు కాబట్టి. ఇప్పుడు సర్వర్ గారి అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది. మనుషులకు జీతాలు ఇవ్వడం కంటే ఒక డ్రోన్తో మేనేజ్ చేయొచ్చని కోల్కతా రెస్టరెంట్ డిసైడ్ అయ్యింది. వాన కోసం ఆకాశం వైపు చూడొచ్చుగాని కాఫీ కోసం కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఆకాశం నుంచి కాఫీ ఎగిరొచ్చి చేతికి అందుతుంది. ఇది కోల్కతా సాల్ట్లేక్ సిటీ ఏరియాలోని ‘కోల్కతా 64’ అనే రెస్టరెంట్ వారు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వేసిన సాంకేతిక ఎత్తుగడ. ఆకర్షణ. రెస్టరెంట్ లోపల కూచున్న వారికి సర్వర్లు కాఫీ అందించినా బయట తమకు తోచిన చోటులో కూచుని కాఫీని ఆస్వాదించాలంటే డ్రోన్ సుందరం గారే కాఫీని అందిస్తారు. ఈ వీడియో ఇన్స్టాలో ప్రత్యేక్షం కాగానే ‘ఇదేదో బాగానే ఉంది’ అని చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యంత్రం మనిషిని మాయం చేస్తున్నట్టే. మన దేశంలో మధ్యతరగతి జీవులకు కాఫీ హోటళ్లు, అందులో పని చేసే సర్వర్లు జీవితంలో భాగం. అందుకే సినిమాల్లో, సాహిత్యంలో సర్వర్లు కనపడతారు. కె.బాలచందర్ తీసిన ‘సర్వర్ సుందరం’లో నగేశ్ నటించి పేరు గడించాడు. ‘శుభలేఖ’లో చిరంజీవి కూడా ‘వెయిటర్’ అనబడు ‘సర్వరే’. ఇటీవలి కాలంలో ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ టిఫిన్ సెంటర్ నేపథ్యంలో ఓనర్ కమ్ సర్వర్గా హీరో చేసే స్ట్రగుల్ను చూపుతుంది. ఏమైనా ఈ డిజిటల్ ఏజ్లో ‘మాయమవుతున్నాడమ్మ మనిషి’ అనుకోక తప్పదు. -
‘సందేశ్ఖాలీ నిరసన: ఒక్క మహిళా ఫిర్యాదు చేయలేదు’
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఉత్తర పరగణాల జిల్లాలో ఉన్న సందేశ్ఖాలీ ప్రాంతంలోని మహిళలు తమపై టీఎంసీకి చెందిన నాయకులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని నిరసన తెలపుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలు బెంగాల్లో దుమారం రేపుతున్నాయి. సందేశ్ఖాలీ ఘటనపై పోలీసులు బుధవారం కీలక వివరాలు వెల్లడించారు. సందేశ్ఖాలీ ప్రాంతంలో పలు పోలీసులు బృందాలతో విచారణలు జరిపించామని పోలీసు ఉన్నతధికారులు వెల్లడించారు. అయితే పోలీసులు చేపట్టిన విచారణలో ఎక్కడ కూడా ఒక మహిళ తనపై లైంగిక వేధింపులు జరినట్లు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. సందేశ్ఖాలీలో చోటుచేసుకున్న నిరసనలకు కారణం తప్పడు సమాచారమని తెలిపారు. ‘రాష్ట్ర మహిళా కమిషన్, పది మంది నిజనిర్ధారణ బృందం, జిల్లా పోలిసు యాంత్రాంగం నిర్వహించిన విచారణలో మహిళలపై టీఎంసీ నాయకులు లైంగికంగా వేధించినట్లు చెప్పడానికి ఒక్క మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు’ అని బెంగాల్ పోలీసులు ‘ఎక్స్’ (ట్విటర్)లో వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ మహిళా కమిషన్ ప్రతినిధులు ఇటీవల సందేశ్ఖాలీ పర్యటించారు. వారి విచారణలో స్థానిక మహిళల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు రాలేదన్నారు. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం కూడా పెద్ద ఎత్తున సందేశ్ఖాలీలో మహిళలు నిరసన తెలిపారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, తన అనుచరులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమ భూములు లాక్కోడానికి బెదిరింపులగు దిగుతున్నారని, తమ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రేషన్ కుంభకోణానికి సంబంధించిన కేసులో షాజహాన్ షేక్ ఇంటిపై ఈడీ అధికారులు సోదాలకు ప్రయత్నించగా.. అతని అనుచరులు ఈడీ అధికారుల కారు అద్దాలు పగులగొట్టి దాడికి యత్నించారు. ఈ ఘటన జరినప్పటి నుంచి టీఎంసీ నేత షాజహాన్ షేక్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ.. రాష్ట్ర అధ్యక్షుడికి గాయాలు
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
చీరలో ప్రేమలు బ్యూటీ హుయలు
వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
గ్లామర్తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్
ప్రధాని మోదీ వయస్సుపై.. అమిత్ షా క్లారిటీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement