-
'పుష్ప' విలన్ క్రేజీ మూవీ.. 'ఆవేశం'తో హిట్ కొట్టాడు
సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజయ్యాయి. చాలావరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్ గా నిలిచింది మాత్రం 'టిల్లు స్క్వేర్'నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరసపెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా సినిమా? దీని సంగతేంటి? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్.. రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజైతే చూసి ఆదరించడంతో పాట కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో 'పుష్ప' విలన్ ఫహాద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. 'ఆవేశం' అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. తాజాగా మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 'ఆవేశం' కథ విషయానికొస్తే.. బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరుమోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫహాద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే రిలీజైన ఈ చిత్రంపై ఆల్రెడీ తెలుగు నిర్మాతల దృష్టి పడిందట. 'పుష్ప'తో ఫహాద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఉంది కాబట్టి త్వరలో 'ఆవేశం' రిలీజ్ పక్కా ఉంటుందట. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు.. తెలుగులోనూ వస్తోన్న థ్రిల్లర్ మూవీ!
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళంలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. మలయాళంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో టాలీవుడ్ అభిమానుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. తెలుగు వర్షన్ను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. కాగా.. 2006లో కొడైకెనాల్లోని గుణకేవ్లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తెలుగులోనూ అదే టైటిల్తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 𝐓𝐡𝐞 𝐡𝐢𝐠𝐡𝐞𝐬𝐭 𝐠𝐫𝐨𝐬𝐬𝐢𝐧𝐠 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐚𝐦 𝐟𝐢𝐥𝐦 - #ManjummelBoys is now coming to 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧 𝐭𝐡𝐞 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐚𝐮𝐝𝐢𝐞𝐧𝐜𝐞 ❤️🔥 Grand release worldwide on April 6th. Telugu release by @MythriOfficial, @Primeshowtweets & @SukumarWritings ✨… pic.twitter.com/xDULaAgbVx — Mythri Movie Makers (@MythriOfficial) March 26, 2024 -
బ్లాక్ బస్టర్ సినిమా పరువు తీసిన ప్రముఖ రచయిత
ఈ మధ్య కాలంలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ అయిన మలయాళ సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. అందరూ ఈ సినిమా గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీని డబ్బింగ్ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందా అని చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ రచయిత జయమోహన్ ఏకిపారేశారు. ఇదో చెత్త సినిమా, కేరళ వాళ్లంతా లోఫర్స్ అని దారుణమైన విమర్శలు చేశారు. ఇంతకీ ఏమైంది? 2006లో తమిళనాడులోని కొడైకెనాల్ గుహలో కేరళ కుర్రాడు పడిపోయాడు. అప్పుడు కూడా వచ్చిన స్నేహితులు అతడిని రక్షించారు. ఇదే కథతో 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా తీశారు. ఇప్పటివరకు దీనికి రూ.150 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన కుర్రాళ్లంతా మందు తాగుతూ, జల్సా చేస్తూ ప్రమాదానికి గురవుతారు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని, రచయిత జయమోహన్ ఘోరమైన విమర్శలు చేశారు. (ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?) రచయిత ఏమన్నారు? 'కేరళ అడవుల్లో, అక్కడి యువకులు తాగి పడేసిన మందు బాటిల్స్ విరగ్గొడుతున్నారు. ఆ పెంకులు గుచ్చుకుని చాలా ఏనుగులు చనిపోతున్నాయి. మలయాళ టూరిస్టులు ఎక్కడికెళ్లినా అలాంటి పనులే చేస్తారు. తాగి నిషేధిత ప్రాంతంలోకి వెళ్లి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పని. అదో చెత్త సినిమా. నా దృష్టిలో 'మంజుమ్మల్ బాయ్స్'.. ఓ పనికిమాలిన మూవీ' అని జయమోహన్ విమర్శించారు. రైటర్ జయమోహన్ వ్యాఖ్యలపై సగటు కేరళ ప్రేక్షకుడు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఎవరో కొందరు చేసిన పనికి ఇలా అందరినీ ఆపాదించి చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనా అందరూ హిట్ అని తెగ మురిసిపోతున్న 'మంజుమ్మల్ బాయ్స్'పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి జయమోహన్ వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం? (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు. సస్పెన్షన్లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్లో ఉంటుంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. ఎవరెలా చేశారు? అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
100 కోట్ల కలెక్షన్ సూపర్ హిట్ సినిమా.. ఏ ఓటీటీ సంస్థ కొనట్లేదు!
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీ సంస్థల లెక్కలు మారిపోయాయి. అప్పట్లో ఎగబడిపోవట్లేదు. కోట్లు పెట్టి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోవట్లేదు. ఇప్పుడు దీని వల్ల కొన్ని హిట్ చిత్రాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. కొన్నిరోజుల ముందు థియేటర్లలోకి వచ్చిన మలయాళ చిత్రం 'మంజుమ్మల్ బాయ్స్' సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కానీ దీని ఓటీటీ లెక్క మాత్రం ఇంకా తెగట్లేదట. ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్' రచ్చ లేపింది. ఫిబ్రవరిలో మాత్రం టాలీవుడ్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు ఇదే ఫిబ్రవరిలో మలయాళంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నాయి. వీటిలో ఒకటే 'మంజుమ్మల్ బాయ్స్'. కేరళలోని మంజమ్మల్ అనే ఊరిలోని కొందరు కుర్రాళ్లు.. కొడైకెనల్ ట్రిప్కి వెళ్తారు. ఇందులో ఒకడు అనుకోకుండా ఓ గుహలో పడిపోతాడు. మిగతా వాళ్లందరూ కలిసి ఈ ఒక్కడిని ఎలా కాపాడారు ఏంటనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) స్టోరీ సింపుల్గా అనిపిస్తున్నప్పటికీ.. సర్వైవల్ డ్రామా సినిమాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంంటోంది. కేరళ, తమిళనాడులో దీనికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ వసూళ్లు, ఓవరాల్గా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఓటీటీ డీల్ మాత్రం ఇంకా తెగలేదట. మూవీ టీమ్ ఏమో రూ.20 కోట్ల వరకు అడుగుతుంటే.. పలు ఓటీటీ సంస్థలు మాత్రం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే థియేటర్లలో 'మంజుమ్మల్ బాయ్స్'ని చాలామంది చూసేశారు. కాబట్టి ఓటీటీలో ఓ మాదిరి రీచ్ ఉంటుందని ఆయా సంస్థలు కారణాన్ని చెబుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో మార్చి 15న రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. కానీ సౌండ్ పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్ విడుదలపై, అలానే ఓటీటీ స్ట్రీమింగ్పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) -
'అమీర్పేట్లో అలాంటి కోచింగ్ కూడా ఉంటే బాగుండు'..!
మలయాళంలో హిట్గా సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ప్రేమలు'. కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ట్రైలర్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలాంటి రొమాంటిక్ ప్రేమకథ యూత్ను అలరించండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమాలు రానున్నాయి. ప్రేమలు సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్తో కలిసి హైదరాబాద్కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ. -
ఓటీటీకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, జయరాం, అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అబ్రహాం ఓజ్లర్. ఈ చిత్రానికి మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మార్చి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ తాజాగా రివీల్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జయరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. pic.twitter.com/zMSmETJMBw — Disney+ Hotstar (@DisneyPlusHS) March 1, 2024 -
ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో క్రేజీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మూవీ లవర్స్ కోసమా అన్నట్లు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెబుతూ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏ సినిమా? '2018' ఫేమ్ టొవినో థామస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిజ జీవిత సంఘటనలతో 90స్ బ్యాక్డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు తెగ ఆకట్టుకున్నాయి. (ఇదీ చదవండి: శివరాత్రికి ఓటీటీలో హనుమాన్ సినిమా) సినిమా కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) సబ్ ఇన్స్పెక్టర్. హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లిన లవ్లీ అనే అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసుని ఆనంద్కి అప్పగిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో ఇతడిని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో కేసు. ఇది ఓ అమ్మాయి పరువు హత్య కేసు. ఇలా రెండు డిఫరెంట్ కేసుల్ని ఎస్ఐ ఆనంద్, తన బృందంతో కలిసి ఎలా డీల్ చేశాడు? చివరకు ఏమైందనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా స్టోరీ. ఓటీటీలో ఎప్పుడు? మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మధ్యే సరైన థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. కాబట్టి ఇది తెలుగు ఆడియెన్స్కి నచ్చే ఛాన్సులున్నాయి. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
మలయాళ బ్లాక్బస్టర్ హిట్ సినిమా.. తెలుగు రిలీజ్కి రెడీ
మరో మలయాళ హిట్ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ప్రేమలు'.. కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. దీంతో డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు వెర్షన్ రిలీజ్కి రెడీ అయింది. (ఇదీ చదవండి: లండన్లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ.. 'ప్రేమలు' సినిమా తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారట. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే అదే రోజున గోపీచంద్ 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్స్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. 'ప్రేమలు' సినిమా కథ విషయానికొస్తే.. ఇంజినీరింగ్ చేసిన సచిన్కి(నస్లేన్) యూకే వెళ్లాలనేది ప్లాన్. కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంతూరిలో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్తో కలిసి హైదరాబాద్కి వస్తాడు. ఇక్కడ ఓ పెళ్లిలో రీనూ(మమిత బైజు)ని చూసి ప్రేమలో పడతాడు. ఈ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా జాజ్ చేస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ చివరకు ఒక్కటయ్యారా? ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. ఉన్నంతలో 'ఊరి పేరు భైరవకోన' మాత్రమే ఎంటర్టైన్ చేస్తోంది. మరోవైపు ఈ వారమే రిలీజైన మలయాళ చిత్రాలు 'భ్రమయుగం', 'ప్రేమలు' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటి గురించి తెలుగు ప్రేక్షకుల డిస్కస్ చేస్తుండటమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఈ రెండు మూవీస్లో అంతలా ఏముంది? కలెక్షన్స్ ఎంతనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో సినిమా అంటే ఫుల్ కలర్ఫుల్గా ఉండాల్సిందే. కానీ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మాత్రం బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో తీసిన 'భ్రమయుగం'లో నటించాడు. నలుపు తెలుపు కలర్కి తోడు కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రానికి ఆడియెన్స్ మెల్లమెల్లగా కనెక్ట్ అవుతున్నారు. స్టోరీ పరంగా అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. హైదరాబాద్లోనూ దీనికి డిమాండ్ గట్టిగానే ఉందండోయ్. రెండు రోజుల్లోనే దీనికి రూ.10 కోట్ల వరకు వసూళ్లు దక్కాయి. (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) 'ప్రేమలు' అనే మలయాళ యూత్ఫుల్ లవ్స్టోరీ కూడా వారం క్రితం థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. బ్యాక్ డ్రాప్ అంతా దాదాపు హైదరాబాద్లోనే ఉండటంతో మనోళ్లు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కలెక్షన్స్ కూడా రూ.35 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లు పెట్టి తీస్తే ఈ రేంజు వసూళ్లు వచ్చేసరికి మన నిర్మాతలు కూడా దీన్ని రీమేక్ లేదంటే డబ్బింగ్ చేసేయాలని చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలు కూడా వేటికవే విభిన్నంగా ఉండటంతో పాటు కాస్త డిఫరెంట్ ఫీల్ ఇస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ కథతో తీసిన 'భ్రమయుగం' కొందరికి కనెక్ట్ కాగా.. యూత్కి నచ్చే విషయంలో 'ప్రేమలు' ఫుల్ మార్క్స్ కొట్టేస్తోంది. టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలో వీటిని తెలుగులో కూడా డబ్ చేసి వదలబోతున్నారట. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్కి ముందే నోటీసులు) -
సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్'. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో జయరాం హీరోగా నటించారు. ఈ సినిమాలో మమ్ముట్టి సీరియల్ కిల్లర్గా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.37 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. అలెగ్జాండర్ జోసెఫ్ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో మెగాస్టార్ మమ్ముట్టి కనిపించారు. కాగా.. జయరాం రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. అబ్రహం ఓజ్లర్ అమెజాన్ ప్రైమ్లో రిలీజవ్వగా.. తెలుగు మూవీ గుంటూరు కారం మూవీ నెట్ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తండ్రిగా మెప్పించారు. ఈ సినిమాలో అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, అనూప్ మీనన్, ఆర్య సలీం, సైజు కురుప్, సెంథిల్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. భాగమతి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జయరాం.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్లో కనిపించనున్నారు. -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
సూపర్స్టార్ కొత్త మూవీ.. టీజర్ మాత్రం అదుర్స్!
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన కొత్త సినిమా 'మలైకోట్టై వాలిబన్'. లిజో జోస్ పల్లిచోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిలిమ్స్, మ్యాక్స్ ల్యాబ్, సరిగమ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడికల్ డ్రామాగా తీసిన ఈ చిత్ర షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!) ఈ సినిమాని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ.. దర్శకుడి అద్భుత పనితనమని హీరో మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. టీజర్లో చూపించిన సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా మూవీ ఉంటుందని అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా
ఓటీటీల వచ్చిన తర్వాత మూవీ లవర్స్ చాలా సదుపాయం అయిపోయింది. ఎందుకంటే మహా అయితే లేదంటే మరోవారం అంతే. హీరో ఎవరనేది సంబంధం లేకుండా ఆయా మూవీస్.. ఓటీటీల్లో రిలీజైపోతున్నాయి. ఇప్పుడు కూడా అలానే ఓ స్టార్ హీరో నటించిన హిట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయింది. కానీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే స్మాల్ స్క్రీన్పై రానుండటం షాకింగ్ విషయం. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) ఏంటా సినిమా? మలయాళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది రిలీజైన బెస్ట్ సినిమా '2018'. ఇందులో హీరోగా నటించిన టొవినో థామస్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఓటీటీల్లో పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా.. తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల్ని సంపాదించాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'అదృశ్య జలకంగళ్'. వార్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో.. టొవినో డీ గ్లామర్ రోల్ చేశాడు. ఓటీటీలో ఎప్పుడు? ఈ నవంబరు 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. హిట్ టాక్తో పాటు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాంటి ఈ చిత్రాన్ని.. రెండే వారాల్లోకి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. డిసెంబరు 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ఈ సినిమాని నిర్మించింది. ఓటీటీలో కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది. అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ అయిన ఈ మూవీని మరీ రెండు వారాల్లోనే ఓటీటీలో తీసుకొస్తుండటం మూవీ లవర్స్కి మంచి కిక్ ఇస్తోంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
మెగాస్టార్ పాన్ ఇండియా సినిమా.. రెండు నెలల్లో పూర్తి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'భ్రమయుగం'. రాహుల్ సదాశివం దర్శకుడు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమూల్దా లైజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జవీర్ సంగీతమందిస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్) ఆగస్టు 17 నుంచి ఒట్టపాలెం, కొచ్చి, అదిరపల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయిందని దర్శకుడు చెప్పాడు. అయితే పాన్ ఇండియా సినిమా షూటింగ్ కేవలం రెండు నెలల్లో పూర్తిచేయడమంటే విశేషమనే చెప్పాలి. కొన్నాళ్ల ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా విశేష స్పందన వచ్చిందని స్వయంగా దర్శకుడు చెప్పాడు. ఈ క్రమంలోనే చిత్ర విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు. వైవిధ్య భరితమైన హారర్ థ్రిల్లర్ కథా చిత్రంగా 'భ్రమయుగం' ఉంటుందని దర్శకుడు చెప్పాడు. వచ్చేది ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: కీర్తి సురేశ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. హాజరైన ఆ నిర్మాత) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది. అన్ని భాషల్లో సినిమాలు అందుబాటులోకి రావడం ఓటీటీల వల్లే మరింత సులువుగా మారింది. అందుకే భాషతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను సీనీ ప్రియులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలు డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్చున్నారు. చిన్న సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఓ వరంలా మారిందనే చెప్పాలి. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైన మలయాళ చిత్రం కాసర్ గోల్డ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాసర్ గోల్డ్ ఈనెల 13న ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది. అసలు కథేంటంటే.. ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ గోల్డ్ పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఈ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్, దీపక్ పారంబోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: శివకార్తికేయన్ నన్ను దారుణంగా మోసం చేశాడు: సంగీత దర్శకుడు) -
ఓటీటీలోకి ఆ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మధ్య థియేటర్లలో కావొచ్చు.. ఓటీటీలో కావొచ్చు సరైన మాస్ మసాలా యాక్షన్ మూవీ రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఓ మలయాళ సూపర్హిట్ మూవీ.. ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది. ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన 'RDX' ఓ చిన్న సినిమా. కానీ అదే రోజు విడుదలైన దుల్కర్, నివీన్ పౌలీ చిత్రాలని మించి బ్లాక్బస్టర్ అయింది. 'ఆర్డీఎక్స్' ప్రత్యేకత ఏంటి? స్టోరీ పరంగా చూస్తే ఇదేం కొత్త కథ కాదు. మాస్, ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్షిప్, లవ్ ఇలా అన్నీ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా. అయితే తెలిసిన కథే అయినా దర్శకుడి డిఫరెంట్ ప్రెజంటేషన్ మలయాళంలో అందరికీ బాగా నచ్చేసింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని నెల రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత విడుదలకు రెడీ) ఓటీటీ డేట్ ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను.. సెప్టెంబరు 24న అంటే ఈ ఆదివారం ఓటటీలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మలయాళం మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో మిగతా భాషల్ని జోడించొచ్చని అనిపిస్తుంది. 'RDX' కథేంటి? రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోని వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ల ఫ్రెండ్ గ్జేవియర్ (నీరజ్ మాధవ్). చర్చి ఫెస్టివల్లో తన తండ్రిపై చేయి చేసుకున్నాడని ఓ అల్లరి ముకని డోని చితకబాదుతాడు. ఆ తర్వాత అదే రౌడీ గ్యాంగ్.. డోని ఇంటికొచ్చి చిన్న పిల్లలని వదలకుండా ఫ్యామిలీ మొత్తంపై దాడి చేస్తారు. అసలు ఈ దాడి చేసిన గ్యాంగ్ ఎవరు? వాళ్లకు డోని కుటుంబంపై పగ ఎందుకు? మరి డోని, రాబర్ట్, గ్జేవియర్.. గ్యాంగ్పై పగ ఎలా తీర్చుకున్నారనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
పోటీ లేదులే..
‘కొత్త ఊరిలో తోపు మనమే.. పోటీ లేదులే... కొట్టలేరులే..’ అంటూ సాగే పాట ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం లోనిది. దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన మలయాళ యాక్షన్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘హల్లా మచారే’ పాట తెలుగు వెర్షన్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం సమకూర్చారు. ఎల్వీ రేవంత్, సింధూజ శ్రీనివాసన్ పాడారు. -
ఓటీటీకి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
మలయాళంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన చిత్రం 2018. ఇటీవలే ఈ చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన 25 రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక టాలీవుడ్లోనూ ఈ చిత్రానికి ఊహించని రీతిలో ఆదరణ దక్కింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన వచ్చింది. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకోగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యాన్ని కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: గీతగోవిందం వసూళ్లను విరాళంగా ఇచ్చాం, అందుకేనేమో!) ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ! The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV 2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory @ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j — Sony LIV (@SonyLIV) May 29, 2023 -
Malaikottai Vaaliban: మోహన్లాల్ యువకుడు!
ఆరు పదుల వయసులో ఉన్న మోహన్లాల్ని యువకుడు అంటున్నారు దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ. మోహన్లాల్ టైటిల్ రోల్లో లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మలైకోట్టై వాలిబన్’ (మలైకోట యువకుడు అని అర్థం). ఈ చిత్రంలోని మోహన్లాల్ లుక్ని విడుదల చేశారు. ఓ యాక్షన్ సీన్కి సంబంధించిన లుక్ ఇది. ‘‘జనవరి 18న రాజస్థాన్లోని జై సల్మేర్లో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాం. హై బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ పేర్కొన్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు. ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్ లీడ్లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన సూపర్హీరో అయ్యప్పన్ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్ జోసెఫ్, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. -
Tamannaah Bhatia: యువరాణిలా తమన్నా
పదిహేనేళ్లకు పైగా అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న తమన్నా తొలిసారి ఓ మలయాళ సినిమా చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మలయాళ హిట్ ఫిల్మ్ ‘రామ్లీల’ (2017) తర్వాత హీరో దిలీప్, దర్శకుడు అరుణ్ గోపీ కాంబినేషన్లో తాజాగా మరో సినిమా తెరకెక్కుతోంది. ‘బాంద్రా’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె కెరీర్లో ఇదే తొలి మలయాళ సినిమా. కాగా కొచ్చిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో తమన్నా పాల్గొననున్నారు. ఈ నెల 20 నుంచి తమన్నా ఈ సినిమా షెడ్యూల్లో జాయిన్ అవుతారట. ఆ తర్వాత ముంబై లొకేషన్స్లో మరో షెడ్యూల్ను ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో తమన్నా యువరాణి తరహా పాత్ర చేస్తున్నారని టాక్. ఈ పాత్ర మలయాళం, హిందీ భాషలు మాట్లాడుతుందట. కొచ్చితో పాటు ముంబై నేపథ్యంలోనూ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కొత్త సంవత్సరాన్ని ఈ ఇద్దరూ గోవాలో జరుపుకున్నారంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్త గురించి ఇటు తమన్నా కానీ అటు విజయ్ వర్మ కానీ స్పందించలేదు. -
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఆహాలో మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కరోనా సమయంలో ఓటీటీల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్కు వెళ్లాలంటనే జంకిన సినీప్రేక్షకుడు ఎంచక్కా ఉన్నచోటునే సినిమా చూసే అవకాశం కల్పించడంతో ఓటీటీకి జై కొట్టాడు. అలా దేశంలో పలు ఓటీటీ ప్లాట్ఫామ్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. వాటికి గట్టి పోటీనిస్తూ తెలుగులో ఆహా ఓటీటీ లాంచ్ చేశారు. దీనికి సినీప్రియుల నుంచి విశేషాదరణ లభించింది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఆహా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ శుక్రవారం మరో మలయాళ మూవీని ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఫహద్ ఫాజిల్ నటించిన తొందిముతలమ్ దృక్షక్షియుం అనే మూవీని దొంగాట పేరుతో మే 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ట్వీట్ చేసింది. జాతీయ అవార్డు అందుకున్న ఈ సినిమాను ఈ ఫ్రైడే చూసేయండని పేర్కొంది. Friday release alert!! #FahadhFaasil's National Award winning film Thondimuthalum Driksakshiyum as #DongataOnAHA in Telugu premieres May 6. Witness the rich performance of the thief 🙌#DileeshPothan #SandeepSenan #SurajVenjaramoodu #NimishaSajayan pic.twitter.com/uNKJebaA0V — ahavideoin (@ahavideoIN) April 30, 2022 చదవండి: అనిల్ అదృష్టం, బిగ్బాస్ నుంచి హమీదా ఎలిమినేట్!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement