-
రామోజీ రావు మార్గదర్శి స్కామ్ పై ఉండవల్లి సంచలన విషయాలు
-
మార్గదర్శి కేసులో సంచలన విషయాలు..!
-
అక్రమాల డొంక కదిలింది...రామోజీ ఇక జైలుకే..!
-
రామోజీరావు మార్గదర్శి కేసుపై నేను ఇంత ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం
-
ఇక రామోజీరావు తప్పించుకోలేడు.. కొమ్మినేని కామెంట్స్
-
రామోజీ ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశద్రోహి కూడా!
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఆర్థిక ఉగ్రవాదే కాదు.. దేశ ద్రోహి కూడా అన్న విషయం బయటపడింది. ఏడు దశాబ్దాలుగా ఆయన సాగిస్తున్న ఆర్థిక అక్రమాల వెనుక దేశ ద్రోహం వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉండటం సంచలనంగా మారింది. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన నిధులే పునాదిగా రామోజీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మార్గదర్శి చిట్ఫండ్స్, ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్ ఇలా అన్నింటిలోనూ అక్రమ పెట్టుబడులు, ఆర్థిక మోసాల దందా దాగుందన్నది స్పష్టమైంది. రామోజీ దేశద్రోహం అనంతర కాలంలో జీజే రెడ్డిపై దేశద్రోహం కేసు నమోదైంది. దాంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. కానీ ఈ కేసు విషయంలో ఆయన ప్రధాన ప్రమోటర్గా ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ను మాత్రం కేంద్ర ప్రభుత్వం విచారించకపోవడం గమనార్హం. జీజే రెడ్డి దేశం విడిచి పారిపోయిన తరువాత ఆయన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కానీ, మార్గదర్శి చిట్ఫండ్స్లో ఆయన పేరిట ఉన్న 288 షేర్లను రామోజీరావు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయలేదు. చట్టానికి వ్యతిరేకంగా తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అది తీవ్రమైన దేశ ద్రోహ నేరం. అంతేకాదు జీజే రెడ్డి దేశం విడిచిపారిపోవడానికి రామోజీ సహాయం చేశారని కూడా అప్పటి పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారు చెబుతుండటం గమనార్హం. ఆ కేసులో ఇతర నిందితులు ఈమేరకు వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు! రామోజీరావు ప్రధాన వ్యాపార సంస్థలైన ఈనాడు పత్రిక, డాల్ఫిన్ హోటల్స్లోనూ జీజే రెడ్డి పెట్టుబడులు పెట్టారని బలమైన వాదన ఉంది. జీజే రెడ్డి 1963లోనే రామోజీరావుతో ఎలైట్ అనే ఇంగ్లిష్ పత్రికను పెట్టించారని, ఆ తర్వాత ఈనాడు పత్రిక ప్రారంభానికి కూడా ఆయన పెట్టుబడి పెట్టారని ఆనాటి ఈనాడు సంస్థ ఉద్యోగులే చెప్పడం గమనార్హం. కమ్యూనిస్టు కార్డును ఉపయోగించి రష్యా నుంచి ప్రింటింగ్ యంత్రాలు తెప్పించి ఈనాడు పత్రికను ప్రారంభించడంలో జీజే రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఈనాడు స్థాపన సమయంలో పెట్టుబడులపై కూపీ లాగితే విదేశాల నుంచి అక్రమ నిధుల బాగోతం బయటపడుతుంది. 1960లలో రష్యా నుంచి తెచ్చిన నిధులను ఈనాడు, డాల్ఫిన్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రష్యా నుంచి అక్రమంగా నిధుల తరలింపు విషయంలో జీజే రెడ్డిపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహ నేరం కింద కేసు పెట్టింది. అలా అక్రమ నిధులు పెట్టుబడిగా పెట్టిన ఈనాడు, డాల్ఫిన్ హోటల్స్, వాటి యజమాని రామోజీరావుపైనా దేశ ద్రోహ నేరం నమోదు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రామోజీ వాటా 100 షేర్లే... జీజే రెడ్డి పేరిట 288 షేర్లు మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు. ఆ సంస్థపై సర్వాధికారాలు ఆయన కుటుంబానివేనని అందరూ భావిస్తారు. కానీ అసలు మార్గదర్శి సంస్థను ఏర్పాటు చేసిందే రామోజీ స్నేహితుడు జీజే రెడ్డి అని, దానిని ఏర్పాటు చేసే నాటికి రామోజీరావు షేర్లకంటే జీజేరెడ్డి షేర్లు చాలా రెట్లు ఎక్కువ అనే విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచారు. 1960ల నాటికే జీజే రెడ్డి ఢిల్లీలో బాగా పరపతి ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీరావుకు తన సంస్థలో గుమస్తాగా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం వారిద్దరూ కలిసి 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించారు. ఆ సంస్థకు జీజే రెడ్డి ప్రధాన ప్రమోటర్. 1962 ఆగస్టు 31 నాటికి హైదరాబాద్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డుల ప్రకారం రామోజీరావు ప్రారంభ వాటా కేవలం రూ.10 మాత్రమే. ఆయన సోదరుడు విశ్వనాథం పేరిట మరో వాటా ఉంది. ఇక 1960–70లలో మార్గదర్శి చిట్ఫండ్స్లో రామోజీరావు పేరిట ఉన్నవి కేవలం 100 షేర్లు మాత్రమే. కానీ జీజే రెడ్డి పేరిట 288 షేర్లు ఉండటం విశేషం. అంటే మార్గదర్శి చిట్ఫండ్స్లో ప్రధాన వాటాదారు జీజే రెడ్డే. జీజే రెడ్డి కుటుంబాన్ని మోసం చేసిన రామోజీ 1986లో జీజే రెడ్డి మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు తమ తండ్రి పేరిట ఉన్న 288 షేర్ల వాటాను తమ పేరిట బదిలీ చేయమని కోరితే రామోజీ ససేమిరా అన్నారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డిలను తుపాకితో బెదిరించారు. జీజే రెడ్డి పేరిట ఉన్న 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేశారు. దీనిపై ఆయన కుమారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు జీజే రెడ్డి కుటుంబం తమ వాటా షేర్ల కోసం న్యాయ పోరాటం కూడా చేస్తోంది. -
సిద్దార్థ్ లూథ్రా కి నేను ఒక్కటే చెప్పా..!
-
రామోజీరావు పట్ల కూడా చట్టం చట్టప్రకారమే వ్యవహరిస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్
-
తుపాకి గురిపెట్టి... షేర్లు కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి : మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల బాగోతం బయటపెట్టాల్సిందేనన్న సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పుతో ఆర్థిక ఉగ్రవాది రామోజీ అక్రమాలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే మరో కంపెనీని ఏర్పాటు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అని కనీసం బోర్డు కూడా పెట్టకుండా వేల కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లుగా సేకరించారు. రామోజీ ఇంతటి ఆర్థిక అక్రమానికి కేంద్ర బిందువుగా మార్చుకున్న మార్గదర్శి చిట్ఫండ్స్ అనే సంస్థ ఏర్పాటుకు, తన ఉన్నతికి సాయం చేసిన చేతినే ఆయన కాటేశారన్న వాస్తవం కూడా విస్మయపరుస్తోంది. నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్ఫండ్స్ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. దీనిపై జీజే రెడ్డి వారసుల ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆ సోదరులు ఇద్దరూ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. సాయం చేసిన మిత్రుడిని ముంచేసిన రామోజీ కృష్ణా జిల్లా పెదపారుపూడికి చెందిన చెరుకూరి రామోజీరావు 1960లలో నిరుద్యోగి. చిన్న ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత కొండపల్లి సీతారామయ్యను కలిసి ఏదైనా ఉద్యోగానికి సిఫార్సు చేయమని ప్రాథేయపడేవారు. ఇదే జిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లో్లవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో ఆయన రామోజీకి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1962లో ఇద్దరూ కలిసి మార్గదర్శి చిట్ఫండ్స్ను స్థాపించారు. జీజే రెడ్డి తన స్వగ్రామం జొన్నలపాడులోని భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇందులో పెట్టుబడిగా పెట్టారు. మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత జీజే రెడ్డి చెకొస్లో వేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని ఎన్నిసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. తుపాకితో బెదిరించిన రామోజీ 2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించారు. చిట్టచివరకు 2016 సెప్టెంబరు 29న రామోజీరావు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007 – 08 వార్షిక సంవత్సరం షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని కోరగా, అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోపెట్టారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి రూ.100 విలువైన స్టాంపు పేపర్పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు వారిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. తుపాకీ తీసి మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. ప్రాణభయంతో ఆ ఫామ్పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తారని గానీ, తేదీ గానీ ఆ ఫామ్పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్పై సంతకాలు చేసి అక్కడి నుంచి బతుకు జీవుడా అని బయటపడ్డారు. రామోజీ, శైలజపై సీఐడీ కేసు జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీరావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది. మరోవైపు ఇదే అంశంపై యూరి రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్న రామోజీరావు, శైలజ కిరణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ షేర్లను తమ పేరిట బదిలీ చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ను ఆదేశించాలని కోరుతున్నారు. దీనిపై న్యాయస్థానంలో వ్యాజ్యం కొనసాగుతోంది. షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు ప్రాణభయంతో ఆ ఫామ్పై సంతకం చేసినప్పటికీ, తమ షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. తమ తండ్రి వాటా షేర్లను అట్టిపెట్టుకోవాలనే నిర్ణయించుకున్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మారిస్తే చట్ట ప్రకారం షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. చిట్ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. వాటన్నింటిపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ కానీ ఆర్థిక అక్రమాల్లో ఆరితేరిన రామోజీ తాను అనుకున్నంతా చేశారు. జీజే రెడ్డి షేర్లను ఫోర్జరీ సంతకాలతో తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో యూరి రెడ్డి మార్గదర్శి చిట్ఫండ్స్లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తన పేరుతో ఒక్క షేరు కూడా లేకపోవడంతో విస్తుపోయారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. కంపెనీల చట్టం మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో అక్రమంగా షేర్లు బదిలీ చేసేసుకున్నట్లు వెల్లడైంది. -
ప్రజలను మోసం చేస్తూ రామోజీ రావు వ్యాపారాన్ని విస్తరించారు
-
పాపం పండింది..ఆరునెలల్లో...కటకటాలే..!
-
కాకి లెక్కలు కుదరవ్!
సాక్షి, అమరావతి: ‘నేరం నాదే..! దర్యాప్తు నాదే..! తీర్పూ నాదే..!’ అంటూ మొండికేస్తున్న ఈనాడు రామోజీకి సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు వేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి డిపాజిట్దారులకు చెల్లించేశామని, తమ ఆడిటర్లు ఈ లెక్కలు తేల్చేశారంటూ నమ్మబలుకుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఆ విషయాన్ని నిర్దారించాల్సింది మార్గదర్శి ఆడిటర్లు కాదని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ధ్రువీకరించాలని తేల్చి చెప్పింది. దీంతో రామోజీ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగ ప్రకటన జారీ చేసి అభ్యంతరాలు స్వీకరణకు సన్నద్ధం కానుండటం రామోజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెల్లించేశాం.. లెక్క తేల్చేశాం: రామోజీ వితండవాదం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు అడ్డగోలు వాదనలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. 2023 జూన్ 30 నాటికి 1,247 మంది డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని, కేవలం రూ.5.31 కోట్లు మాత్రమే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని ఆయన న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆడిటర్లు క్షుణ్ణంగా ఆడిట్ చేసి నివేదిక సమర్పించారని, అన్ని లెక్కలు సరిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్దారులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. తద్వారా మార్గదర్శి ఫైనాన్సియర్స్లో అక్రమంగా డిపాజిట్ చేసినవారి పేర్లు, ఆ డిపాజిట్ మొత్తాల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు రామోజీ ప్రయాస పడ్డారు. అక్రమ డిపాజిట్ల వెనుక భారీగా నల్లధనం దాగి ఉండటమే దీనికి కారణం. అదేం కుదరదు... నిగ్గు తేలాల్సిందే.. రామోజీ తరపు న్యాయవాదుల వాదనలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు. మీ దగ్గర పని చేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేం’ అని స్పష్టం చేసింది. డిపాజిట్దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా..!’ అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్లు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఓ జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. బహిరంగ ప్రకటన.. అభ్యంతరాల స్వీకరణ సుపీం్ర కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించిన అక్రమ డిపాజిట్లను సంబంధిత డిపాజిట్దారులకు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే డిపాజిట్దారులు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారిని సంప్రదించి బహిరంగ ప్రకటన జారీ చేసేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయనున్నాయి. అగ్రిగోల్డ్ కేసులో మాదిరిగానే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. బహిరంగ ప్రకటన జారీ చేసి డిపాజిట్దారులకు సమస్యలుంటే నివేదించాలని కోరనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకుంటే ఆ సెల్కు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని క్రోడీకరించి తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఇక రామోజీ డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్న వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను జ్యుడీషియల్ అధికారితోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి. వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ద్వారా విడుదల చేస్తాయి. అందులోని డిపాజిట్దారుల పేర్లు, చెల్లింపుల వివరాలను పరిశీలిస్తాయి. వాటిపై వ్యక్తమయ్యే అభ్యంతరాలపై విచారణ చేపడతాయి. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగా జ్యుడీషియల్ అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇరు ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం.. టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు
సాక్షి, అమరావతి: ఆర్థిక ఉగ్రవాది పత్రిక నడిపితే ఎలా ఉంటుందో ‘ఈనాడు’ చాటి చెబుతోంది. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్లు సేకరించడమే అందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఆర్థిక నేరం గుట్టంతా రట్టవుతుండటం.. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో రామోజీరావు భయంతో వణికి పోతున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం దిశగా దూసుకెళ్తోందని టైమ్స్నౌ–ఈటీజీ, జీ న్యూస్ తదితర ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేలి్చచెప్పడం.. రాజకీయ విశ్లేషకులూ అదే మాట చెబుతుండటం రామోజీరావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు వేల కోట్లు కుమ్మరిస్తోందని.. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోందంటూ వైఎస్సార్సీపీపై విషం చిమ్ముతూ బుధవారం ‘ఈనాడు’లో ‘కుమ్మరించేస్తోంది’ శీర్షికన రోతరాతలు అచ్చేశారు. ఇటీవల ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీ, మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేస్తే.. ‘ఈడ్చికొట్టిన ఈసీ’ అంటూ శివాలెత్తిన రామోజీ.. మార్గదర్శి కుంభకోణంపై విచారించిన అధికారి కొల్లి రఘురామిరెడ్డిని ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ అస్సాంకు పంపితే.. ‘కొల్లికి షాక్’ అంటూ కథనాన్ని అచ్చేసి సంబరపడ్డారు. ఈసీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తుంటే.. అడిగేవారు, అడ్డుకునేవారు లేరంటూ ఇప్పుడు ఎన్నికల సంఘంపై అభాండాలు వేయడం చూస్తే రామోజీరావు మతిస్థిమితం కోల్పోయారేమో అనిపిస్తోంది. ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తుంటే.. ఏ రోజు లెక్కలు ఆ రోజే తేలుస్తుంటే.. ప్రతి మద్యం దుకాణానికి వైఎస్సార్సీపీ రూ.పది లక్షలు ముందస్తు చెల్లింపులు చేయడం ఎలా సాధ్యం అన్న ఇంగిత జ్ఞానం కూడా రామోజీరావుకు లేకుండా పోయింది. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే గురవింద రామోజీ సాకులు వెతుకుతూ రోత రాతలు అచ్చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసింది బాబే దేశంలో రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి, ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే. ఎనీ్టఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్సభ ఎన్నికల నుంచి ఓటుకు నోటుకు తెరతీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేసిన సొమ్ముతోపాటు.. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బ్యాంకులను కొల్లగొట్టిన ఆర్థిక నేరగాళ్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, ఎన్నారైలకు టికెట్లు ఇచ్చారు. కోట్ల కట్టలను వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రక్రియను ప్రారంభించారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరగా వేస్తూ ఆడియో, వీడియో టేపులతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా చంద్రబాబు తన తీరు మార్చుకోలేదు సరికదా మరింతగా చెలరేగిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారిని కాదని రూ.900 కోట్లు ఫార్టీ ఫండ్గా ఇచ్చిన విద్యా వ్యాపారి పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దించారు. రూ.వందల కోట్లు పార్టీ ఫండ్గా ఇచ్చిన ఎన్నారైలు పెమ్మసాని చంద్రశేఖర్ను గుంటూరు లోక్సభ స్థానం నుంచి, కాకర్ల సురేష్ ను ఉదయగిరి నియోజకవర్గం నుంచి, వెలిగండ్ల రామును గుడివాడ నుంచి, యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నుంచి, రియల్టర్ కేశినేని చిన్నిని విజయవాడ లోక్సభ స్థానం నుంచి.. కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఫార్టీ ఫండ్ రూపంలో.. అభ్యర్థుల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను యథేచ్ఛగా వెదజల్లుతున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు పెమ్మసాని, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ అభ్యర్థులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి వారు భారీ ఎత్తున నోట్ల కట్టలను వెదజల్లుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు వంటి వారిని కొనుగోలు చేస్తూ తమ వైపునకు తిప్పుకోవడానికి బాబు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభలకు నోట్ల కట్టలను వెదజల్లుతున్నా జనం మొహం చాటేస్తున్నారు. కోట్ల కట్టలతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు రామోజీ కంటికి కన్పించలేదేమో! సరి కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం జన బలమే గీటురాయిగా.. ప్రజాసేవే ప్రామాణికంగా.. నిబద్ధతే పరమావధిగా కింది స్థాయి కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యానికి సరైన అర్థం చెప్పారు. శింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులును, మడకశిర నియోజకవర్గం నుంచి ఉపాధి కూలీ ఈర లక్కప్పను, నెల్లూరు సిటీలో విద్యా వ్యాపారి కోటీశ్వరుడు నారాయణపై సాధారణ కార్యకర్త ఖలీల్ అహ్మద్ను, మైలవరం నియోజకవర్గం నుంచి రైతుబిడ్డ సర్నాల తిరుపతిరావును, కోటీశ్వరులు బరిలోకి దిగే నరసాపురం లోక్సభ స్థానం నుంచి న్యాయవాది గూడూరి ఉమాబాలను సీఎం వైఎస్ జగన్ బరిలోకి దించడం ద్వారా రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. లంచాలకు చోటులేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలను కొనసాగించి.. ఇచ్చిన మాటపై నిలబడి.. సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. దీంతో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజు రోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రమే అందుకు నిదర్శనం. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మండుటెండైనా.. అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానసంద్రమే అందుకు తార్కాణం. ఓ వైపు వైఎస్ జగన్ నిర్వహించిన సిద్ధం సభలు, నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అభిమాన సంద్రం ఉప్పొంగుతుండటం.. మరో వైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడాన్ని చూస్తే రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభంజనమేనన్నది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలూ అదే చెబుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రామోజీరావు.. శిష్యుడు చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారని స్పష్టమవుతోంది. -
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
మార్గదర్శి క్లోజ్ ?.. జైలుకు రామోజీ..!
-
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం కోర్టు
-
‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ తీర్పు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యిమనిపించిన సుప్రీం..'డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే'
కోర్టు తీర్పుల్ని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేం ఆదేశించలేం.. – సుప్రీం కోర్టు సాక్షి, అమరావతి: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి స్వీకరించిన కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావుకు సుప్రీంకోర్టు గట్టి షాక్నిచ్చింది. చట్ట ఉల్లంఘనకు పాల్ప డినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియ ర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో ఇచ్చిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు జడ్జి జస్టిస్ తేలప్రోలు రజని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేసినందున తమపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా వసూలు చేసిన సొమ్ములను వెనక్కి ఇచ్చేశామంటే ఎంత మాత్రం సరిపోదని వ్యాఖ్యానించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు న్యాయమూర్తి ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని, తాజాగా విచారణ చేపట్టి ఆర్నెళ్లలో ముగించాలని హైకోర్టుకు సూచించింది. స్వీకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్ నోటీసు ఇవ్వాలని పేర్కొంది. డిపాజిట్లు వెనక్కి తీసుకోని వారి సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచించింది. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావుడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం పరిష్కరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాధన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి, రామోజీరావులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒక రోజు ముందు అంటే 31.12.2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే మూడేళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్కు, ఈ తాజా క్వాష్ పిటిషన్కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ జోక్యం చేసుకొంటూ.. సేకరించిన రూ.2,600 కోట్లను 1,247 మంది డిపాజిటర్లకు 30.6.2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ, ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ గానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. రూ.5.31 కోట్లు అన్ క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. రూ.5 వేలు డిపాజిట్దారులు కోర్టుకొచ్చి పోరాడగలరా..? ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ... సొమ్మంతా ఇచ్చేశారా? లేదా? ఫిర్యాదు చేశారా లేదా? అనే విషయాలు సమస్య కాదు. తీర్పులో హైకోర్టు ఏం చెప్పిందన్నదే ఇక్కడ ముఖ్యం. మొత్తం డిపాజిటర్లు ఇంత మంది ఉన్నారు.. ఇంత మొత్తం సొమ్ము ఉంది.. ఇస్తానన్న వడ్డీ, డివిడెంట్తో కలిపి ఇంత మొత్తం అయింది. ఆ తర్వాత సొమ్ములు ఇచ్చేశారు అనే విషయాలు తీర్పులో ఎక్కడున్నాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో బయటకు రాలేని వ్యక్తుల సమస్యలు కూడా ఆలోచించాలన్నారు. రూ.5 వేలు డిపాజిట్ చేసిన వారు వేల రూపాయిలు ఖర్చు చేసి కోర్టుకు వచ్చి పోరాడగలరా? అని ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న డిపాజిటర్ల గురించి హైకోర్టు పబ్లిక్ నోటీసు ఎందుకు ఇవ్వలేదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వ వాదన కూడా వినాలి కదా...! అనంతరం సింఘ్వీ తన వాదనలు కొనసాగిస్తూ.. ఫిర్యాదుదారు ఏపీ ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి కృష్ణరాజు అని, ప్రాసిక్యూట్ స్టేట్ తెలంగాణ ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. సుప్రీంకోర్టుకు రావడానికి ఏపీ ప్రభుత్వం 1,236 రోజులు ఆలస్యం చేసిందనడంతో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ డిపాజిటర్లు ఏపీలో కూడా ఉంటారు కదా? వారి వాదన ఆ రాష్ట్రం ద్వారానే కదా వినాలి? అని ప్రశ్నించారు. అయితే ఏపీ ప్రభుత్వం తొలుత రాలేదని సింఘ్వి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునిచ్చే సమయంలో నిర్దిష్ట విధానాన్ని అనుసరించలేదనే విషయాన్ని తాము ప్రశ్నిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి, లోతుల్లోకి వెళ్లడం లేదని, అందరికీ అవకాశాలు తెరిచే ఉంచుతామన్నారు. హైకోర్టులో ప్రతివాదులందరూ వాదనలు వినిపించలేదని గుర్తు చేశారు. ఈ కేసును తిరిగి హైకోర్టుకు పంపుతామని తేల్చి చెప్పారు. మార్గదర్శిపై ఫిర్యాదులు లేవు... మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఫిర్యాదులు లేవని, ఇప్పుడు వస్తాయని సింఘ్వి పేర్కొనగా.. సొమ్ములు మీవద్దే ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకొస్తారని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హైకోర్టుకు పంపడానికి ఏమీ లేదని, ఇక్కడే ఆదేశాలు ఇవ్వాలని సింఘ్వీ గట్టిగా కోరారు. ఈ సమయంలో నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ కొత్త పరిణామాలు ఏమీ లేకుండా ఒకసారి హైకోర్టు తోసిపుచ్చిన అంశాలతోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. హైకోర్టు ముందు వాదనలు జరిగిన సమయంలో తెలంగాణ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కరే హాజరయ్యారన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడగా ఆ సమయంలో కోర్టు మాత్రం ఒక్కటే ఉందన్నారు. ఉల్లంఘనలు బయటకు రాగానే ఆ సమయంలో కొన్నాళ్లు డిపాజిట్లు నిలుపుదల చేసి మళ్లీ రూ.2,600 కోట్లు వసూలు చేశారని నిరంజన్రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో సింఘ్వీ జోక్యం చేసుకొని ఇదంతా ప్రస్తుతం అనవసరమన్నారు. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీ తరఫున ముగ్గురు దిగ్గజాలు (సింఘ్వీ, రోహత్గీ, లూథ్రా) ఉన్నారంటూ వ్యాఖ్యానించింది. హైకోర్టు కేసు లోతుల్లోకి వెళ్లలేదని అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సింఘ్వీ ప్రస్తావిస్తుండగా.. అదంతా తమకు తెలుసునని, ఆ ఉత్తర్వులను పరిశీలించామని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఇదేమీ సహారా, ఆమ్రపాలి తరహా కేసు కాదని, రూ.5.31 కోట్లు మినహా మిగతా సొమ్ము అంతా వెనక్కి ఇచ్చేశామని, మొత్తం 70 వేల పేజీల రికార్డు సుప్రీంకోర్టుకు అందజేశామని సింఘ్వీ పేర్కొన్నారు. మొత్తం డిపాజిటర్లు ఎంత మంది? అని ధర్మాసనం ప్రశ్నించడంతో 2.7 లక్షల మంది అని సింఘ్వీ సమాధానమిచ్చారు. చెల్లించారో లేదో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి... తొలుత ముందుకు రాని ఏపీ ప్రభుత్వం సడన్గా ఎందుకు వచ్చిందో కూడా అర్థం చేసుకోగలమని, అయితే దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టుకు పంపుతామని, అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా వాదనలు వినిపిస్తుందని, విచారణ పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రూ.2,600 కోట్లు తిరిగి చెల్లించేశామని సింఘ్వీ మరోసారి ప్రస్తావించడంతో... ఈ వాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైకోర్టుకు నివేదించాల్సి ఉందని న్యాయమూర్తి తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ వాదనే విన్నారని, అయితే హైకోర్టు ఏ ప్రక్రియ అనుసరించిందనేది పరిశీలించాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ నోటీసు కన్నా మిన్నగానే తిరిగి చెల్లింపులు చేశామని, భవిష్యత్ మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఆర్బీఐ స్టేటస్ రిపోర్టు ఇచ్చిన అంశాన్ని ఆయన గుర్తుచేయగా.. దాన్నేం మార్చలేం కదా? ఇప్పుడు అది అప్రస్తుతం అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఏమున్నా తెలంగాణ హైకోర్టులోనే.. సింఘ్వీ వాదనలు కొనసాగిస్తూ.. అదృష్టమో, దురదృష్టమో రామోజీరావు ఈనాడు పబ్లిషర్ కావడంతో చాలా విషయాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఈనాడు చాలా పాత పేపరని, ఈటీవీ కూడా ఉందన్నారు. నాలుగేళ్లుగా ఈనాడు తమపై వార్తలు రాస్తోందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ముందుకు వచ్చిందని ఆరోపించారు. ఇదంతా హైకోర్టులో చెప్పుకోవాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.5 కోట్లు మాత్రమే ఉన్నందున ఉండవల్లి పిటిషన్ను కొట్టివేసి, భవిష్యత్తు మార్గదర్శకాలు ఇవ్వాలని సింఘ్వీ మరోసారి కోరగా హైకోర్టు ఎదుటే చెప్పుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్కడొద్దు.. మీరే పరిష్కారం చూపండి ఈ సమయంలో మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసును తెలంగాణ హైకోర్టు పంపొద్దని అభ్యర్థించారు. ఈ కేసు చాలా పాతదని, సుప్రీంకోర్టులోనే పరిష్కార మార్గం చూపాలని కోరారు. తగిన మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే తాము కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని, నిర్దిష్ట కాలపరిమితితో కేసును పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తామని ధర్మాసనం పేర్కొంది. అనంతరం మార్గదర్శి తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు ప్రారంభిస్తుండగా... ఆ పిటిషన్ ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆర్డర్లో హెచ్యూఎఫ్ విషయంలో వచ్చిన తప్పును సవాల్ చేశామని లూథ్రా తెలిపారు. ఇది ప్రస్తుతం అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. తెలంగాణ హైకోర్టు అందరి వాదనలు వినాలి... ‘‘పిటిషన్ దాఖలులో ఏపీ ప్రభుత్వ జాప్యాన్ని మన్నిస్తున్నాం. ఉండవల్లి అరుణ్కుమార్ ఎస్సెల్పీ విచారణ అర్హతతోపాటు పార్టీ ఇన్ పర్సన్గా అనుమతిస్తున్నాం. 31.12.18న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు తిరిగి విచారించాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆర్బీఐ, ఉండవల్లి అరుణ్కుమార్, రామోజీరావు, అన్క్లయిమ్ డిపాజిటర్ల వాదనలు విని ఆరు నెలల్లోగా ఈ కేసును తేల్చాలి. అన్ క్లెయిమ్డ్ డిపాజిటర్ల సమస్యలు విని నివేదిక ఇచ్చేందుకు ఒక న్యాయాధికారిని నియమించాలి’’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలాంటి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేం... కోర్టు తీర్పులపై ఏపీ ప్రభుత్వం, ఉండవల్లి అరుణ్కుమార్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని రామోజీరావు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా నివేదించారు.ఏపీ ప్రభుత్వానికి సాక్షి పత్రిక ఉందని, దాంట్లో రామోజీరావుపై కథనాలు రాయకుండా నియంత్రించాలని కోరారు. ఈ దశలో నిరంజన్రెడ్డి జోక్యం చేసుకుంటూ రామోజీరావుకే ఈనాడు, ఈటీవీ ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సాక్షి పత్రికతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తాను చట్టబద్ధంగా దీన్ని నిరూపించగలనని నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎలాంటి గ్యాగ్ ఆర్డర్లు ఇక్కడ ఇవ్వలేమని, కోర్టులో ఏం జరిగిందో చెప్పుకోవచ్చని, అదే సమయంలో జరగనిది చెప్పడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్కుమార్ దాన్ని తప్పు పట్టారని లూథ్రా పేర్కొనడంతో దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉండవల్లి మాజీ ఎంపీ, ప్రజా క్షేత్రంలో ఉంటారని వ్యాఖ్యానించింది. ప్రజల కోసమే ఉండవల్లి సుప్రీంకోర్టు వరకూ వచ్చారని, అదే సమయంలో కోర్టు తీర్పుపై తన అభిప్రాయాన్ని వెల్లడించి ఉంటారని పేర్కొంది. ‘కోర్టు తీర్పులను కొందరు స్వాగతిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. కోర్టు తీర్పులను ఒక్కొక్కరూ ఒక్కోలా చూడరాదంటూ మేం లక్ష్మణ రేఖ గీయలేం. ఈనాడు పత్రికకు ఏపీ ప్రభుత్వం వ్యతిరేకమన్న భావనతో అలా వ్యవహరించొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం కదా! ప్రజాక్షేత్రంలో ఉండేవారు మీడియా ముందు అనేక విషయాలు ప్రస్తావిస్తారు. మీడియా వాటిని రాస్తుంది. ఎవరినీ నియంత్రించలేం. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అదే సమయంలో ఇరు పక్షాలు కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాని స్పష్టం చేసింది. కత్తితో తిరగబడాలని లూథ్రానే చెప్పారు.. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్కుమార్, ఆయన తరఫు న్యాయవాది అల్లంకి రమేశ్లు స్పందిస్తూ తాను ఎవరిపైనైనా వ్యాఖ్యలు చేసినా, ఎలాంటి పరుష పదాలు వినియోగించలేదన్నారు. రామోజీరావుకు ఏదో అయిపోవాలని ఇక్కడకు రాలేదన్నారు. ఈ సమయంలో గతంలో సిద్దార్ధ లూత్రా చేసిన ఓ ట్వీట్ (స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ రాని సందర్భంలో)ను ఉండవల్లి గుర్తు చేశారు. ఎక్కడా విజయం సాధించకపోతే ప్రజలు కత్తితో తిరగబడే అవకాశం ఉందంటూ ఒకరు సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తానెప్పుడూ అలా చేయలేదని లూథ్రా పేర్కొనగా నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి తెలిపారు. తాను 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, వ్యక్తిగతంగా విమర్శించినట్లు ఎవరూ అనలేదన్నారు. ఈ కేసు పూర్తయ్యే వరకూ ఎక్కడా, ఎవరూ, ఏమీ మాట్లాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ అలా ఎలా ఆదేశాలు ఇవ్వగలమని ప్రశ్నించింది. ఇరు పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఆరు నెలలు వారికి పరీక్ష లాంటిదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ప్రజా క్షేత్రంలో ఉన్నవారిని నియంత్రించడం సాధ్యం కాదన్నారు. -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
మార్గదర్శి అక్రమాల కేసులో నేడు కీలక విచారణ
సాక్షి, ఢిల్లీ: రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేడు(మంగళవారం) కీలక విచారణ జరగనుంది. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో గత విచారణలో కేసు ఊహించని మలుపు తిరిగిన దృష్ట్యా.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. ఈ వాదనల తదనంతరం సమగ్ర విచారణ కోసం నేటికి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఇవాళ జరగబోయే విచారణ మార్గదర్శి కేసును మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నేడు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. -
ఆ డబ్బులు మావే ఇచ్చేయండి
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పచ్చ పత్రికాధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ డ్రామాలకు తెరలేపింది. ఆ నగదుతోపాటు చెక్కులు కూడా తమవేనని చెబుతున్న మార్గదర్శి ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపడం లేదు. దీంతో ఈ సొమ్ము మార్గదర్శిది కాదని.. టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తరలిస్తున్న నగదని అంతా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నగదుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. అంతేకాకుండా ఈ వ్యవహారం ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఆధారాలు చూపించి నగదును తీసుకునే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ అధికారులకు ఆధారాలు చూపాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదుతో మార్గదర్శి పేరుతో జరిగిన మనీలాండరింగ్కు సంబంధించిన అంశం ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పట్టుబడిన ప్రతి పైసాకు లెక్కలతో సహా ఆధారాల్ని పోలీసులతో పాటు ఐటీ అధికారులకు మార్గదర్శి సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ము మార్గదర్శిది కాదని.. అందుకే ఐదు రోజులు గడుస్తున్నా లెక్కా పత్రాలు చూపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఖర్చులకు తమకు అనుకూలమైన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందించేందుకు మార్గదర్శి పేరుతో పక్కా ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఇస్తున్నారో అధికారులు దర్యాప్తు చేసి రామోజీరావు నడిపిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆధారాల్లేకుండా అధికారుల చుట్టూ.. ఈ నెల 2న విశాఖ ద్వారకానగర్ ప్రాంతంలో రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. వీటిని ఇద్దరు మార్గదర్శి సిబ్బంది స్కూటీపై సూట్కేసులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, చెక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగదు తరలింపుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని రెండు రోజుల క్రితం మార్గదర్శి సిబ్బందికి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. కలెక్టరేట్లోని ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది ప్రదక్షిణలు చేస్తూ.. నగదు, చెక్కులు ఇప్పించాలంటూ హడావుడి చేస్తున్నారు. తమ పరిధిలో లేదని చెబుతున్నా వదలకపోవడంతో ‘ఆధారాలు చూపించండి.. పోలీసులు, ఐటీ సిబ్బందికి ఇస్తాం’ అని ఎన్నికల యంత్రాంగం చెప్పడంతో.. తామేమీ ఆధారాలు తీసుకురాలేదని అక్కడి నుంచి మార్గదర్శి సిబ్బంది పలాయనం చిత్తగించారు. అయితే శనివారం సాయంత్రం మళ్లీ ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి నగదు కోసం ఒత్తిడి తెచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్గదర్శి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
మార్గదర్శి సిబ్బందిపై కేసు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): మార్గదర్శి చిట్ఫండ్స్ కంపెనీ సిబ్బందిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల రెండో తేదీన నగరంలోని సీతంపేట మార్గదర్శి చిట్ఫండ్స్ శాఖ అకౌంట్ అసిస్టెంట్ వి.లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ శ్రీను స్కూటీలో రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,677 విలువైన 51 చెక్కులు తీసుకువెళ్తుండగా.. ద్వారకానగర్ మొదటి లైన్లో పోలీసులు తనిఖీలు చేస్తూ పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. దీనిపై ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 188 ప్రకారం మార్గదర్శి సిబ్బంది వి.లక్ష్మణరావు, శ్రీనులపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లడానికి వీలులేదని ద్వారకా సీఐ ఎస్.రమేష్ తెలిపారు. -
అడ్డంగా దొరికిన ‘మార్గదర్శి’.. కేసు నమోదు
సాక్షి,విశాఖపట్నం: మార్గదర్శి చిట్ఫండ్స్ కంపెనీపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్గదర్శి సీతంపేట అకౌట్ అసిస్టెంట్ వీ లక్షణ్రావు, ఆఫీస్ బాయ్శ్రీనులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా మంగళవారం తనిఖీల్లో మార్గదర్శి సీతంపేట బ్రాంచి నుంచి రూ. 52 లక్షలు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. -
అర కోటికి ఆధారాలేవి రామోజీ?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో అర కోటికి పైగా నగదు, చెక్కులతో ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయి 24 గంటలు దాటినా ఇంతవరకు వాటికి ఆధారాలు చూపించలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు తనిఖీల్లో ఇద్దరు మార్గదర్శి సిబ్బంది ఇద్దరి వద్ద రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. దీనిపై వారు పొంతన లేని సమాధానాలు చెప్పడం, ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును, చెక్కులు పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు. బుధవారం రాత్రి వరకు మార్గదర్శి సంస్థ ఉన్నతస్థాయి ఉద్యోగులెవరూ దానికి ఆధారాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును ఎన్నికల్లో పంపిణీ కోసం టీడీపీ నేతలకు అందించడానికి తీసుకెళ్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ నగదు వివరాలను సీజర్ యాప్లోకి అప్లోడ్ చేసి సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. సీజర్స్ సిస్టమ్లో కేసు నమోదు చేశారు. జిల్లా సీజర్స్ కమిటీ బృందం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. తమ డబ్బే అని మార్గదర్శి అప్పీల్ చేసుకున్న తర్వాత ఐటీ అధికారులకు సమాచారమిస్తామంటున్నారు. ఆధారాలు చూపించకపోతే డబ్బును సీజ్ చేసి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీతంపేట బ్రాంచి నుంచే.. ఈ నగదు మొత్తం సీతంపేట బ్రాంచి నుంచి తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ద్వారకానగర్ యూనియన్ బ్యాంక్కు తీసుకెళ్తున్నామని చెప్పిన మార్గదర్శి సిబ్బంది ఇంతవరకూ ఎలాంటి ఆధారాలూ చూపించలేదని జిల్లా సీజర్స్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, సుధాకర్ తెలిపారు. నిజంగా ఇది వారి డబ్బే అయితే అప్పీల్కి దరఖాస్తు చేసుకుంటే.. ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇస్తామని చెబుతున్నారు. రూ.10 లక్షలకు పైబడి నగదు దొరికితే ఐటీ అధికారుల సమక్షంలోనే విచారణ జరుపుతామని చెప్పారు. ఐటీకి, ఎన్నికల కమిషన్కు స్పష్టమైన ఆధారాలు చూపించిన తర్వాత అన్నీ పక్కాగా ఉంటే నగదు తిరిగి అప్పగిస్తామని, లేదంటే నగదు, చెక్కుల్ని సీజ్ చేసి ఆ సంస్థకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. దొంగ డాక్యుమెంట్స్ సృష్టిస్తారా? సీతమ్మధారలో లీజుకు తీసుకున్న స్థలాన్ని కాజేసే కుట్రలో భాగంగా రోడ్డు విస్తరణలో స్థలానికి పరిహారం కోసం అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన చరిత్ర గురివింద రామోజీరావుది. అలాంటి డ్రామోజీ.. ఆధారాలు సమర్పించి నగదు తీసుకెళ్లకుండా, వేచి ఉండటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా.. ఈ డబ్బు మార్గదర్శికి చెందింది కాదనీ, టీడీపీ నేతలకు అందించేందుకు తీసుకెళ్తున్న సొమ్మే అన్న అనుమానాలూ దృఢపడుతున్నాయి. డబ్బుని ఎలాగైనా దక్కించుకునేందుకు రామోజీరావు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడానికే ఇంత సమయం తీసుకుంటున్నారన్న వదంతులూ ఉన్నాయి. -
పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: ప్రజాబలంతో ఎన్నికల్లో విజయం సాధించలేమని స్పష్టం కావడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ నోట్ల దందాకు తెరతీశారు. రూ.వేల కోట్లు వెదజల్లి ఎన్నికల్లో అక్రమాలకు బరి తెగించేందుకు సన్నద్ధమయ్యారు. దశాబ్దాలుగా తన కుట్ర రాజకీయాల్లో భాగస్వాములైన ఈనాడు రామోజీరావు, పొంగూరు నారాయణలతోపాటు టీడీపీ బడా బాబుల వ్యాపార సంస్థలనే నల్లధనం డంపింగ్ యార్డులుగా మార్చేశారు. విశాఖ నుంచి నెల్లూరు వరకు పచ్చనేతల షిప్పింగ్, ఆక్వా కంపెనీలను నల్లధనం కంటైనర్లకు గమ్యస్థానాలుగా చేసుకున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తరలిస్తున్న నల్లధనం బాగోతం ఇప్పటికే రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, పోలీసుల సోదాల్లో బయటపడింది. కాకపోతే దొరికింది గోరంతే! గుట్టుచప్పుడు కాకుండా సిద్ధం చేసిన గిడ్డంగుల్లో టీడీపీ పెద్దలు గుట్టలు గుట్టలుగా అక్రమ నిధులు దాచిపెట్టినట్లు స్పష్టమవుతోంది. కుట్రలకు ‘మార్గదర్శి’ చంద్రబాబు రాజకీయ, ఆర్థిక కుట్రల్లో భాగస్వామి ఈనాడు రామోజీ మరోసారి నల్లధనం తరలింపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మీడియా ముసుగులో నిత్యం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై బురద చల్లుతున్న ఆయన మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలను టీడీపీ అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా మార్చారు. రోజూ చిట్ఫండ్స్ కార్యాలయాల ద్వారా టర్నోవర్ ముసుగులో అక్రమ నిధులను చాప కింద నీరులా టీడీపీ అభ్యర్థులకు చేరవేస్తున్నారు. విశాఖలో ఎలాంటి పత్రాలు లేకుండా మార్గదర్శి కార్యాలయం నుంచి తరలిస్తున్న రూ.51.88 లక్షల నగదు, రూ.39.29 లక్షలు విలువ చేసే చెక్కులను తాజాగా పోలీసులు గుర్తించి జప్తు చేయడం తెలిసిందే. అయితే మార్గదర్శి చిట్ఫండ్స్ కేంద్రంగా సాగుతున్న నల్లధనం దందాలో పట్టుబడిన ఈ మొత్తం సముద్రంలో కాకి రెట్ట లాంటిదే. ఆర్థిక అక్రమాల కోసం మార్గదర్శి చిట్ఫండ్స్ మొదటి నుంచి పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు లావాదేవీలు నిర్వహిస్తోంది. విశాఖ బ్రాంచిలో మూడు రోజుల లావాదేవీల మొత్తాన్ని తాము తరలిస్తున్నట్లు సోదాల సందర్భంగా మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది చెప్పారు. మూడు రోజులకే ఒక్క బ్రాంచిలో రూ.51.88 లక్షలు లావాదేవీల పేరుతో నల్లధనాన్ని తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు టీడీపీ సిద్ధపడిందో ఊహించవచ్చు. దీని ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్లే. రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే నెలలో నిర్వహించనున్న ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు జనవరి నుంచి ఈ విధంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ద్వారా అక్రమ నిధులు తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలా మార్గదర్శి కార్యాలయాల నుంచి రూ.వందల కోట్లను ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు స్పష్టమవుతోంది. 2022 నవంబరు నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్లో కొత్త చిట్టీలు వేయడం లేదు. అయినా సరే ఈ స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహిస్తుండటం వెనుక లోగుట్టు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలకు ఆదేశించి నగదు లావాదేవీల రికార్డులను తనిఖీ చేస్తే అక్రమాల బాగోతం బట్టబయలవుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగ ఓట్ల బడి ‘నారాయణ’ మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు చెందిన నారాయణ విద్యా సంస్థలు ఎన్నికల అక్రమాల శిక్షణా కేంద్రాలుగా మారాయి. నారాయణ విద్యా సంస్థల్లో చదువులు ఎలా చెబుతారో తెలియదు కానీ ఓటర్లను ఎలా ప్రలోభాలకు గురి చేయాలి? నోట్లు పంచి ఓట్లు ఎలా కొనుగోలు చేయాలి? అనేది టీడీపీ శ్రేణులకు పక్కాగా బోధిస్తారు. 2014, 2019 ఎన్నికల్లో అక్రమ నిధుల తరలింపు కేంద్రాలుగా నారాయణ విద్యా సంస్థలే ప్రధాన పాత్ర పోషించాయన్నది బహిరంగ రహస్యం. టీడీపీ హయాంలో అమరావతిలో భూదందాలో నారాయణ ‘ఎన్స్పైరా’ నుంచే అక్రమ నిధులు తరలించారన్నది సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే వెల్లడైంది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల నెల్లూరులోని ఎన్స్పైరా కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బట్టబయలైంది. నారాయణ విద్యా సంస్థల నిర్వహణ వ్యయం పేరిట అక్రమ నిధులు తరలిస్తున్నట్లు బయటపడింది. ఈదఫా ఎన్నికల్లో మరింత బరి తెగించారు. ఎన్స్పైరా ముసుగులో అక్రమ నిధుల పంపిణీకి పైప్లైన్ను ఏర్పాటు చేయడం పచ్చ పన్నాగానికి పరాకాష్ట. జిల్లా కేంద్రాల్లోని నారాయణ విద్యా సంస్థలు, వాటి కార్యాలయాల నుంచే టీడీపీ అభ్యర్థులకు అక్రమ నిధుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు చెల్లించిన ఫీజుల ముసుగులో చడీచప్పుడు కాకుండా కుట్రను అమలు చేసేందుకు ఉపక్రమించారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలు, బ్యాంకుల్లో జమ చేస్తున్న మొత్తం, ఇతర వ్యయం పేరిట చూపిస్తున్న లెక్కలను పరిశీలిస్తే ఈ అక్రమాల గుట్టు రట్టు కావడం ఖాయం. ఎన్నికల కమిషన్ నారాయణ విద్యా సంస్థల్లో సమగ్రంగా సోదాలు నిర్వహించి రికార్డులు, బ్యాంకు ఖాతాలను తనిఖీలు చేయాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. తీరం వెంట అక్రమ నిధుల డంపింగ్ యార్డులు రాష్ట్రానికి ఉన్న పొడవైన తీరప్రాంతాన్ని ఎన్నికల అక్రమాలకు చుక్కానిగా చేసుకోవాలని చంద్రబాబు కుట్ర పన్నారు. అందుకోసం విశాఖ నుంచి నెల్లూరు వరకు టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా కంపెనీలను దొంగ నోట్ల కేంద్రాలుగా, అక్రమ నిధులను తరలించే కంటైనర్లుగా మార్చుకోవడం ఆయన బరి తెగింపు రాజకీయాలకు నిదర్శనం. బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగ్నేశ నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీ కంటైనర్లలో తరలిస్తున్న అక్రమ నిధులు మార్చి 28న పోలీసుల సోదాల్లో బయట పడటం గమనార్హం. విదేశాల్లోని టీడీపీ సానుభూతిపరుల నుంచి సేకరించిన నిధులను లావాదేవీల ముసుగులో కంటైనర్ల ద్వారా మన రాష్ట్రంలోని పోర్టులకు తరలించడం ఆ పార్టీ పెద్దల లక్ష్యం. విశాఖ, కాకినాడ, నెల్లూరులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన బడా బాబుల షిప్పింగ్ కంపెనీలు, ఆక్వా కంపెనీల గిడ్డంగులకు తరలించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయాలని పన్నాగం పన్నారు. ఇప్పటికే విశాఖపలోని ఓ షిప్పింగ్ కంపెనీ యజమానికి చెందిన గిడ్డంగులు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు అక్రమ నిధుల పంపిణీ కేంద్రాలుగా మారాయి. విశాఖ, భీమిలీ తీరప్రాంతంలోని టీడీపీకి బడాబాబుకు చెందిన ఓ హేచరీస్ కంపెనీ స్థావరంగా ఉత్తరాంధ్ర అంతటా అక్రమ నిధులు తరలించేందుకు కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే రీతిలో కాకినాడ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఒకరు తీరప్రాంతంలోని హేచరీలు, ఆక్వా కేంద్రాలు అడ్డాగా అక్రమ నిధులు తరలింపును పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు కేంద్ర స్థానంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ తెరతీసింది. రాష్ట్రమంతా పర్చూరు మోడల్ ఎన్నికల్లో రూ.వేల కోట్లను వెదజల్లడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేసే పన్నాగాన్ని పక్కాగా పర్యవేక్షించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో అమలు చేసిన పథకాన్ని ఈసారి మరింత పకడ్బందీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన కుతంత్రం. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాలు ఇటీవల డీఆర్ఐ సోదాల్లో వెలుగులోకి వచ్చాయి. మండలాలు, పంచాయతీలవారీగా ఓటర్లకు పంపిణీ చేయాల్సిన విధానం, ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించడం, అందుకోసం నిధుల వ్యయం, ఓట్ల కొనుగోలు, దొంగ ఓట్ల పర్యవేక్షణకు వివిధ స్థాయిలో బాధ్యుల నియామకం తదితరాలతో ఓ బ్లూప్రింట్ను రూపొందించి ఎమ్మెల్యే సాంబశివరావు అమలు చేశారు. తన వ్యాపార సంస్థ నోవా అగ్రిటెక్ ఆర్థిక వ్యవహారాల ముసుగులో ఆ కుత్రంతాన్ని అమలు చేశారు. అదే రీతిలో బ్లూప్రింట్ను టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని నియోజకవర్గాలకు పంపి కుట్రను పక్కాగా అమలు చేయాలన్నది చంద్రబాబు పన్నాగం. అందుకోసం మార్గదర్శి చిట్ఫండ్స్, నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ బడాబాబులకు చెందిన షిప్పింగ్, ఆక్వా, ఇతర కంపెనీలను వాడుకోవాలని కుతంత్రం రచించారు. చంద్రబాబు, లోకేశ్, రామోజీ, నారాయణ, పచ్చ కోటరీలోని ఇతర ముఖ్యులు సర్వం తామై ఈ ఎన్నికల కుతంత్రం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడటం, రూ.వేల కోట్లు వెదజల్లడం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, అవసరమైతే భయోత్పాతం సృష్టించేందుకు చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చ ముఠా అక్రమ నోట్ల గిడ్డంగులపై వెంటనే దాడులు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ క్రియాశీలం కావడం ఒక్కటే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్షని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
పచ్చ మేనిఫెస్టోలో పచ్చి మోసాలు
స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
నా స్నేహితుడు: అల్లు అర్జున్
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
తప్పక చదవండి
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- ‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement