-
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
ఐపీఎల్-2024లో మరో కీలక సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో యష్ ఠాకూర్ వచ్చాడు. మరోవైపు కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది .తుది జట్లుకోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్ -
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ సీజన్లో అన్ క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్రేట్తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు.అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ఈ సీజన్లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో అదిరిపోయే స్ట్రయిక్రేట్తో 315 పరుగులు చేశాడు.వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..ఈ ఐపీఎల్ సీజన్లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్ సింగ్ అనే పంజాబ్ మిడిలార్డర్ బ్యాటర్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్లో శశాంక్ మెరుపు స్ట్రయిక్రేట్తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. శశాంక్ను ఈ సీజన్ వేలంలో పంజాబ్ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్ అనుకుని ఈ శశాంక్ను సొంతం చేసుకుందని సోషల్మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.ఈ సీజన్లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్ ప్రభ్సిమ్రన్ సింగ్. ప్రభ్సిమ్రన్ ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్రేట్తో 221 పరుగులు చేశాడు. అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్ నితీశ్కుమార్ రెడ్డి. ఈ ఎస్ఆర్హెచ్ మిడిలార్డర్ బ్యాటర్ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్ ఈ సీజన్ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్రైజర్స్ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్క్యాప్డ్ బ్యాటర్లు ఈ సీజన్లో ఇరగదీస్తున్నారు.బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్రైజర్స్ పేసర్ నటరాజన్ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. అండర్ డాగ్గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్ లీడింగ్ వికెట్టేకర్గా కొనసాగుతున్నాడు. అన్క్యాప్డ్ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, సందీప్ శర్మ, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు. -
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది. -
IPL 2024: లక్నో, ముంబై మ్యాచ్.. సంచలన ఫాస్ట్ బౌలర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నో హోం గ్రౌండ్ అయిన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎఖానా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. లక్నో జట్టులో మరిన్ని మార్పులు జరిగాయి. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్కు దూరం కాగా.. అర్షిన్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. ముంబై విషయానికొస్తే.. లూక్ వుడ్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ తిరిగి జట్టులోకి వచ్చాడు. లక్నో ఈ మ్యాచ్తో పాటు మిగతా మ్యాచ్లన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ముంబై ప్లే ఆఫ్స్పై ఆశలు దాదాపుగా వదులుకుంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా.. ముంబై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.తుది జట్లు..ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ ప్లేయర్స్: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్కీపర్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్ ప్లేయర్స్: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్ -
లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్.. టీమిండియాకు కూడా
ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఏప్రిల్ 30న ఏక్నా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు లక్నో సూపర్ జెయింట్స్కు గుడ్ న్యూస్ అందింది.గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్లకు దూరమైన ఆ జట్టు పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షను మయాంక్ క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధ్రువీకరించాడు.దీంతో అతడు ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు జట్టు సెలక్షన్కు యాదవ్ అందుబాటులో ఉండనున్నాడు. "మయాంక్ యాదవ్ ఫుల్ ఫిట్గా ఉన్నాడు. అతడు అన్ని రకాల ఫిట్నెస్ టెస్ట్లను క్లియర్ చేశాడు. మాకు ఇది నిజంగా గుడ్ న్యూస్. మంగళవారం జరిగే మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నాడు.ఇంపాక్ట్ ప్లేయర్గా అతడిని ఉపయోగించే ఛాన్స్ ఉందని" ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో మోర్కెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మయాంక్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. 155 కిలోమీటర్ల పైగా వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను వణికించాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. మయాంక్ ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు కూడా కలిసిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. మయాంక్ను టీ20 వరల్డ్కప్-2024కు ఎంపిక చేసే అవకాశముంది. -
T20 WC: కోహ్లి, హార్దిక్ వద్దు.. ఊహించని ఆటగాడికి ఛాన్స్!
ఐపీఎల్-2024 ఫీవర్ ముగియగానే పొట్టి ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది.ఇక హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాకు నోఈ క్రమంలో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.తన జట్టులో రన్మెషీన్ విరాట్ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్లో కలిపి 430 పరుగులు సాధించాడు.అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా, ఆల్రౌండర్గా విఫలమవుతున్నా టీమిండియా వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.ఊహించని ఆటగాళ్లకు చోటుఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మంజ్రేకర్ ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్గన్ మయాంక్ యాదవ్కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్ కామెంట్స్ వైరల్ -
Mayank: అభిమానులకు బ్యాడ్న్యూస్: ఇప్పట్లో కష్టమే!
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం సొంత మైదానంలో మరో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా స్టేడియంలో తలపడేందుకు సిద్దమైంది. అయితే, ఈ మ్యాచ్కు లక్నో యుంగ్ స్పీడ్గన్ మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. తదుపరి కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా 21 ఏళ్ల పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానం వీడిన మయాంక్.. తీవ్రమైన తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విలువైన ఆటగాడిని కాపాడుకోవాలని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతడిని మళ్లీ బరిలోకి దించాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్తో ఏప్రిల్ 19 నాటి మ్యాచ్ కోసం మయాంక్ను ఫిట్గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మయాంక్ లాంటి ప్రతిభావంతుడి సేవలను ప్రతీ మ్యాచ్లో ఉపయోగించుకోవాలని భావించడం సహజమేనన్న లాంగర్.. అన్నింటికంటే అతడి ఫిట్నెస్గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్లో బరిలోకి దిగేందుకు మయాంక్ సిద్ధమయ్యాడని.. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్లీ ఆడిస్తామని లాంగర్ తెలిపాడు. ఢిల్లీతో పాటు కేకేఆర్తో మ్యాచ్కు కూడా మయాంక్ దూరంగా ఉంటాడని ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. కాగా గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ యూపీ పేసర్ 3/27తో సత్తా చాటాడు. లక్నోను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్లోనూ మూడు వికెట్లు పడగొట్టి మరోసారి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా వరుస మ్యాచ్లకు మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. అతడి స్పీడ్ డెలివరీలను చూడాలనుకున్న అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్న్యూస్!! చదవండి: IPL 2024 MI VS RCB: ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నోకు బిగ్ షాక్
ఐపీఎల్ 2024 సీజన్తో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్లు మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగబోయే తదుపరి మ్యాచ్కు దూరం కానున్నారని తెలుస్తుంది. వీరిద్దరు గాయాల బారిన పడినట్లు సమాచారం. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో.. మొహిసిన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఎల్ఎస్జీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్తో మ్యాచ్ సందర్భంగా పొత్తి కడుపు నొప్పితో విలవిలలాడిన మయాంక్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మయాంక్ను వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలుస్తుంది. గత మ్యాచ్లో బెంచ్కే పరిమితమైన మొహిసిన్.. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత సీజన్లో మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో 6 వికెట్లు తీసి రెండింట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. భీకర ఫామ్లో ఉండగా మయాంక్ గాయపడటం ఎల్ఎస్జీని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు మొహిసిన్ సైతం ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. మొహిసిన్ ఎల్ఎస్జీ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మయాంక్, మొహిసిన్ల గైర్హాజరీలో లక్నో తరఫున మరో యువ పేసర్ చెలరేగిపోయాడు. గుజరాత్తో జరిగిన గత మ్యాచ్లో యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. ఈ ప్రదర్శన కారణంగా యశ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, జట్టులో ప్రతి ఆటగాడు తలో చేయి వేస్తుండటంతో లక్నో ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. సీజన్ తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓటమి మినహా లక్నో అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం ఈ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. లక్నో ఏప్రిల్ 12న జరిగే తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానంలో జరుగనుంది. -
'అతడు బ్యాటర్లను భయపెడుతున్నాడు.. టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు'
లక్నో సూపర్ జెయింట్స్ యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో సత్తాచాటుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా మూడు మ్యాచ్లు ఆడిన మయాంక్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లోనే ఆరు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన మయాంక్.. దురదృష్టవశాత్తు ఆదివారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో గాయపడ్డాడు. భుజం నొప్పి కారణంగా కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసి యాదవ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం అంత తీవ్రమైనది కానిట్లు తెలుస్తోంది. అతడు రాబోయే మ్యాచ్ల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే తొలి రెండు మ్యాచ్ల్లో తన సంచలన బౌలింగ్తో అదరగొట్టిన మయాంక్పై ఇంకా ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. ఈ జాబితాలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ చేరాడు. మయాంక్కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్కప్కు ఎంపిక చేయాలని ఎంఎస్కే అభిప్రాయపడ్డాడు. "మయాంక్ తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెడుతున్నాడు. అతడి బౌలింగ్ స్పీడ్కు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఆడేందుకు ఇబ్బంది పడతున్నాడు. అతడు భవిష్యత్తులో భారత జట్టుకు ముఖ చిత్రంగా మారుతాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్కప్కు మహ్మద్ షమీ దూరమయ్యాడు. ఇప్పుడు సెలక్టర్లు బుమ్రా, సిరాజ్తో పాటు బంతిని షేర్ చేసుకునే మూడో పేసర్ కోసం వెతుకుతున్నారు. కాబట్టి షమీ స్ధానాన్ని వరల్డ్కప్ జట్టులో మయాంక్తో భర్తీ చేయాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ యాదవ్లో ఉన్నాయి. అతడు ప్రస్తుతం ఆడుతున్నది వేరే ఫార్మాట్ అయితే నేను కాస్త ఆలోచించి నా నిర్ణయాన్ని వెల్లడించేవాడిని. కానీ ఐపీఎల్ అనే అనేది ఒక మెగా వేదిక. ఇక్కడ ప్రదర్శన చేయడం అంత సులభం కాదు. ప్రతి గేమ్లో ఒత్తిడి ఉంటుంది. కానీ మయాంక్ మాత్రం ఒత్తడిని తట్టుకుని మరి నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే అతడికి వరల్డ్కప్ కోసం భారత జట్టులో చోటు ఇవ్వాలని సూచిస్తున్నాని" ప్రసాద్ రేవ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మయాంక్కు గాయం.. లక్నో హీరోగా యశ్! ఎవరీ యంగ్ పేసర్?
ఒకరి దురదృష్టం.. మరొకరికి అదృష్టంగా మారడం అంటే ఇదేనేమో! అరంగేట్రంలోనే సత్తా చాటి వరుసగా రెండు మ్యాచ్లలో లక్నో సూపర్ జెయింట్స్ను గెలిపించి.. రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు మయాంక్ యాదవ్. తద్వారా ఐపీఎల్ పదిహేడేళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత తన పేరిట లిఖించుకున్నాడు ఈ స్పీడ్గన్. బుల్లెట్ వేగంతో బంతులు సంధించే ఈ రాజధాని ఎక్స్ప్రెస్ గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ లక్నోను గెలిపించి.. హ్యాట్రిక్ అందుకుంటాడని అభిమానులు భావించారు. కానీ దురదృష్టవవాత్తూ పక్కటెముల నొప్పి కారణంగా మయాంక్ యాదవ్ ఒక్క ఓవర్ మాత్రమే పూర్తి చేసి.. ఆ తర్వాత మైదానం వీడాడు. అతడి స్థానంలో వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం దక్కించుకున్న యశ్ ఠాకూర్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్-2024లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా రికార్డు సాధించాడు. 3.5 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి శుబ్మన్ గిల్(19), విజయ్ శంకర్(17), దర్శన్ నల్కండే(12), రాహుల్ తెవాటియా(30), రషీద్ ఖాన్(0) వికెట్లు దక్కించుకున్నాడు. 2️⃣nd win at home 👌 3️⃣rd win on the trot 👌 A superb performance from Lucknow Super Giants takes them to No. 3 in the points table 👏👏 Scorecard ▶ https://t.co/P0VeELamEt#TATAIPL | #LSGvGT pic.twitter.com/w2nCs5XrwT — IndianPremierLeague (@IPL) April 7, 2024 ఎవరీ యశ్ ఠాకూర్? కోల్కతాలో 1998లో జన్మించిన యశ్ ఠాకూర్.. దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ రైటార్మ్ మీడియం పేసర్ టీ20(48 మ్యాచ్లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్లు)లో 67 వికెట్లు పడగొట్టాడు. రూ. 45 లక్షలకు కొనుగోలు ఐపీఎల్-2023 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ యశ్ ఠాకూర్ను రూ. 45 లక్షలకు సొంతం చేసుకుంది. ఆ సీజన్లో ఆడిన 9 మ్యాచ్లలో కలిపి యశ్ 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇది నీ రోజు అని చెప్పాడు ఇక గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించి యశ్ ఠాకూర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. గిల్ను అవుట్ చేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా. కేఎల్ రాహుల్ సర్ సలహాలతో వ్యూహాలను సరిగ్గా అమలు చేయగలిగాను. దురదృష్టవశాత్తూ మయాంక్ గాయపడ్డాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ నా దగ్గరికి వచ్చి ఇది నీ రోజు.. ఉపయోగించుకో అని మోటివేట్ చేశాడు’’ అని యశ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశాడు. 5️⃣-fer ✅ Victory ✅ Celebration 🥳✅#LSGvGT #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/21U2dH6t2H — JioCinema (@JioCinema) April 7, 2024 లక్నో వర్సెస్ గుజరాత్ స్కోర్లు: ►వేదిక: భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏక్నా క్రికెట్ స్టేడియం ►టాస్: లక్నో.. బ్యాటింగ్ ►లక్నో స్కోరు: 163/5 (20) ►గుజరాత్ స్కోరు: 130 (18.5). ►ఫలితం: 33 పరుగుల తేడాతో లక్నో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశ్ ఠాకూర్(5/30). చదవండి: ముఖం మాడ్చుకున్న రోహిత్: పాండ్యాను హత్తుకుంటూనే సీరియస్ -
ఆర్సీబీ ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేశారు.. చాలా సంతోషంగా ఉంది: మయాంక్
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మయాంక్ తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సంచలనం సృష్టించిన మయాంక్.. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్లలో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం మయాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తమ సొంత గ్రౌండ్లో ఆడుతున్నప్పటికి ఆ జట్టు అభిమానులు మాత్రం తనను ఎంతగానో సపోర్ట్ చేశారని మయాంక్ తెలిపాడు. "జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా చివరి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. ఆర్సీబీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ఉంది. కానీ ఆ మ్యాచ్లో ఆర్సీబీ అభిమానులు నన్ను సపోర్ట్ చేశారు. నా స్పెల్ తర్వాత, నేను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూ నన్ను ఉత్సాహపరిచారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని" మయాంక్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
త్వరలోనే టీమిండియాకు ఆడతాడు.. నాన్ వెజ్ మానేశాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో తనదైన ముద్ర వేస్తున్నాడు లక్నో సూపర్ జెయింట్స్ స్పీడ్స్టర్ మయాంక్ యాదవ్. పంజాబ్ కింగ్స్తో మ్యాఛ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన ఈ ఫాస్ట్బౌలర్.. అరంగేట్రంలోనే అదరగొట్టిన విషయం తెలిసిందే. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించిన ఈ రైటార్మ్ పేసర్.. 3/27తో సత్తా చాటాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ మూడు వికెట్లు తీయడమే గాకుండా.. ఐపీఎల్లో గంటకు 155 KMPH కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన నాలుగో క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. వరుసగా తాను ఆడిన రెండు మ్యాచ్లలోనూ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు మయాంక్ యాదవ్. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతిభను నమ్ముకున్న 21 ఏళ్ల యంగ్ స్పీడ్గన్.. టీమిండియాలో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యం అంటున్నాడు. మయాంక్ యాదవ్ తల్లిదండ్రులు సైతం తమ కుమారుడు ఏదో ఒకరోజు కచ్చితంగా భారత జట్టుకు ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘‘వందకు వంద శాతం.. త్వరలోనే నా కుమారుడు టీమిండియా తరఫున అరంగేట్రం చేయడమే కాదు.. మెరుగ్గా రాణిస్తాడు కూడా! ఈ విషయంలో నా కంటే మయాంక్ వాళ్ల నాన్న ఇంకా ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు మయాంక్ ప్రదర్శన చూసి భారత జట్టుకు ఆడితే బాగుంటుంది అంటున్నారు. కానీ వాళ్ల నాన్న అయితే రెండేళ్ల క్రితమే ఈ మాట అన్నారు. ఒకవేళ మయాంక్ గనుక గాయపడకపోయి ఉంటే కచ్చితంగా వచ్చే టీ20 వరల్డ్కప్లో ఆడేవాడని ఆయన అంటూ ఉంటారు’’ అని మయాంక్ తల్లి మమతా యాదవ్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఇక మయాంక్ డైట్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘గతంలో నాన్ వెజ్ తినేవాడు. అయితే, ఇప్పుడు పూర్తి వెజిటేరియన్గా మారిపోయాడు. గత రెండేళ్లుగా వెజ్ మాత్రమే తింటున్నాడు. తన డైట్ చార్ట్కు అనుగుణంగా ఏం కావాలని కోరితే అదే తయారు చేసి ఇస్తాం. మరీ అంత ప్రత్యేకంగా ఏమీ తినడు. పప్పు, రోటి, అన్నం, పాలు, కూరగాయలు తన ఆహారంలో భాగం. నాన్ వెజ్ మానేయడానికి మయాంక్ రెండు కారణాలు చెప్పాడు. ఒకటి.. తను శ్రీకృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టానన్నాడు. రెండు.. తన శరీరానికి నాన్ వెజ్ పడటం లేదని చెప్పాడు’’ అని మమతా యాదవ్ పేర్కొన్నారు. ఆజ్తక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా లక్నో తదుపరి ఆదివారం గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా మయాంక్ తిరిగి యాక్షన్లో దిగనున్నాడు. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్
నిప్పులు చెరిగే వేగంతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న లక్నో సూపర్ జెయింట్స్ పేస్ గన్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో తొలి రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన మయాంక్ రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్లో పంజాబ్పై 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన మయాంక్.. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మరింత చెలరేగి 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మరోసారి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. మాయంక్ ఒక్కడే రెండో మ్యాచ్లోనూ ఈ అవార్డు దక్కించుకున్నాడు. మయాంక్ ఒక్కడే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. తొలి రెండు మ్యాచ్ల్లో క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధించిన మయాంక్.. ఆర్సీబీతో మ్యాచ్లో ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని (156.7 కిమీ) బౌల్ చేశాడు. పంజాబ్తో జరిగిన తన తొలి మ్యాచ్లో 155 కిమీ వేగంతో బంతిని సంధించిన మయాంక్.. ఆర్సీబీతో మ్యాచ్లోనూ 155 కిమీపైగా వేగంతో బంతిని సంధించి ఐపీఎల్ చరిత్రలో తొలి రెండు మ్యాచ్ల్లో 155 కిమీపైగా వేగంతో బంతులను సంధించిన తొలి పేసర్గా రికార్డు నెలకొల్పాడు. ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా మయాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. తన ప్రదర్శనలతో రెండు మ్యాచ్లు గెలవడం ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. దేశం కోసం ఆడటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. కాగా, ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. డికాక్ (81), పూరన్ (40 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ మయాంక్ యాదవ్ (4-0-14-3) ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మహిపాల్ లోమ్రార్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీపై గెలుపుతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ చివరి నుంచి రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఐపీఎల్ అరంగేట్రంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు.. బ్రెండన్ మెకల్లమ్ మైఖేల్ హస్సీ పర్వీజ్ మహరూఫ్ షోయబ్ అక్తర్ శ్రీవత్స్ గోస్వామి రస్టీ థెరాన్ ప్రశాంత్ పరమేశ్వరన్ రిచర్డ్ లెవి స్టీవ్ స్మిత్ మనన్ వోహ్రా ఆండ్రూ టై జోఫ్రా ఆర్చర్ అల్జారీ జోసెఫ్ హ్యారీ గుర్నీ ఓడియన్ స్మిత్ మయాంక్ యాదవ్ -
#Mayank Yadav: ‘స్పీడ్గన్’కు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు?!
లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం మయాంక్ యాదవ్పై ప్రశంసలు కురుస్తున్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ సహా పలువురు మాజీ క్రికెటర్లు ఈ ‘స్పీడ్గన్’ నైపుణ్యాలకు ఫిదా అవుతున్నారు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో మయాంక్ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో బంతిని విసిరి ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు మయాంక్. ఇక మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. పవన కుమారుడు... తుఫాన్ ఈ క్రమంలో 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ను.. పవన కుమారుడిగా అభివర్ణిస్తూ వెస్టిండీస్ మాజీ స్టార్ ఇయాన్ అభినందించాడు. మరోవైపు.. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్.. తుఫా..న్ అంటూ కొనియాడాడు. ఇక మయాంక్ ఆరాధ్య ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అయితే.. సీరియస్ బాల్ అంటూ ప్రశంసలు కురిపించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 ఇక టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఈ పేస్ గన్ గురించి ప్రస్తావిస్తూ.. అతడు ఇదే జోరు కొనసాగిస్తే పర్పుల్ క్యాప్ రేసులో నిలవడం ఖాయమన్నాడు. ‘‘మయాంక్ యాదవ్ మరోసారి తన పేస్తో ప్రత్యర్థి జట్టును కకావికలం చేశాడు. సెలక్టర్లను ఆలోచించేలా చేస్తాడు గత మ్యాచ్లో 155.8KMPH.. ఇప్పుడు 156.7KMPH. ఏంటా వేగం? కచ్చితంగా అతడు పర్పుల్ క్యాప్ రేసులో ఉంటాడు. అంతేకాదు.. టీమిండియాకు సెలక్ట్ అవుతాడో లేదో గానీ.. కచ్చితంగా టీ20 వరల్డ్కప్ జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు తన గురించి ఆలోచించేలా చేస్తాడు’’ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా.. ఆర్సీబీతో మ్యాచ్లో పరుగుల సునామీ సృష్టించిన లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ను సైతం ప్రశంసించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు మయాంక్ యాదవ్. వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఐపీఎల్-2024లో ఆడిన తొలి మ్యాచ్లోనే తన స్పీడ్ పవర్ను బ్యాటర్లకు పరిచయం చేశాడు. మూడు వికెట్లు తీసి ఆ మ్యాచ్లో జట్టును గెలిపించాడు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్లోనూ లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. చదవండి: MI: పాండ్యా ఒక్కడిని అలా వదిలేశారు.. అంతటికీ కారణం పెద్ద తలకాయలే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: తొలి ఫాస్ట్ బౌలర్గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్లోకి ఓ బుల్లెట్లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. First the catch and now an excellent direct-hit! 🎯#RCB lose both their openers courtesy of DDP 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG | @devdpd07 pic.twitter.com/oXoYWi5PC8 — IndianPremierLeague (@IPL) April 2, 2024 తద్వారా వరుసగా రెండోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ అందుకున్నాడు మయాంక్ యాదవ్. ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ సందర్భంగా ఈ రైటార్మ్ పేసర్ సంచలన డెలివరీతో మెరిశాడు. బెంగళూరు ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్ వేసిన మయాంక్.. రెండో బంతిని గంటకు 156.7 కిలో మీటర్ల వేగంతో సంధించాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్లోనే అది ఫాస్టెస్ట్ డెలివరీ కావడం విశేషం. ఇక పదో ఓవర్ వేసిన మయాంక్ బౌలింగ్లో రెండో బాల్ స్పీడ్ కూడా 155.3KMPHగా నమోదైంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్లో అడుగుపెట్టిన మయాంక్.. ఆ మ్యాచ్లో 155.8 KMPH వేగంతో బంతిని విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మూడుసార్లు 155 KMPH స్పీడ్తో బౌలింగ్ చేసిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు మొత్తంగా 48 బంతులు మాత్రమే వేసి ఈ ఘనత సాధించడం విశేషం. ఇక కశ్మీర్ ఎక్స్ప్రెస్, సన్రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే రెండుసార్లు గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఇక ఓవరాల్గా ఐపీఎల్ ఫాస్టెస్ట్ డెలివరీల విషయానికి వస్తే.. మయాంక్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్-2011లో షాన్ టైట్ 157.7 KMPH వేగంతో బౌలింగ్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన టాప్-5 బౌలర్లు 1. షాన్ టైట్- 157.7 KMPH 2. లాకీ ఫెర్గూసన్- 157.3 KMPH 3. ఉమ్రాన్ మాలిక్- 157 KMPH 4. మయాంక్ యాదవ్- 156.7 KMPH 5. అన్రిచ్ నోర్జే- 156.2 KMPH. 4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM — Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హడలెత్తించిన లక్నో పేస్ బౌలర్..సూపర్ జెయింట్స్ రెండో విజయం (ఫొటోలు)
-
వారెవ్వా మయాంక్.. టీమిండియాకు మరో శ్రీనాథ్ దొరికేశాడు
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ యవ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మరోసారి నిప్పులు చేరిగాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో మయాంక్ యాదవ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మయాంక్ తన పేస్ బౌలింగ్తో ఆర్సీబీ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 22 ఏళ్ల కుర్రాడి బౌలింగ్కు మాక్స్వెల్ లాంటి వరల్డ్క్లాస్ బ్యాటరే వణికిపోయాడు. అంతేకాకుండా గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు. అదే విధంగా ఆర్సీబీ బ్యాటర్ గ్రీన్ను మయాంక్ అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్ మొత్తానికే హైలెట్గా నిలిచింది. యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో నయాపేస్ సంచలనంపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్కు మరో జవగల్ శ్రీనాథ్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రైటర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన మయాంక్ యాదవ్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే కచ్చితంగా అతి త్వరలోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 28 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 19.4 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీని దెబ్బతీశాడు. అతడితో పాటు నవీన్ ఉల్ హక్ రెండు,యశ్ ఠాకూర్, స్టోయినిష్, సిద్దార్డ్ తలా వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మహిపాల్ లామ్రోర్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో డికాక్ 81 పరుగులు చేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ ఆఖరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 40 పరుగులు చేశాడు. 𝙎𝙃𝙀𝙀𝙍 𝙋𝘼𝘾𝙀! 🔥🔥 Mayank Yadav with an absolute ripper to dismiss Cameron Green 👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvLSG pic.twitter.com/sMDrfmlZim — IndianPremierLeague (@IPL) April 2, 2024 -
ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిని సంధించిన ముంబై పేస్ గన్
ముంబై ఇండియన్స్ పేస్ గన్ గెరాల్డ్ కొయెట్జీ 2024 ఐపీఎల్ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. రాజస్థాన్ రాయల్స్తో నిన్న (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్లో కొయెట్జీ ఈ ఫీట్ను నమోదు చేశాడు. రియాన్ పరాగ్ ఎదుర్కొన్న మ్యాచ్ చివరి బంతిని కొయెట్జీ రికార్డు స్థాయిలో 157.4 కిమీ వేగంతో బౌల్ చేశాడు. ఈ సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. సరిగ్గా రెండు రోజుల ముందు లక్నో పేసర్ మయాంక్ యాదవ్ ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని సంధించాడు. పంజాబ్తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్లోనే మయాంక్ రికార్డు స్థాయిలో 155.8 కిమీ వేగంతో బంతిని వేశాడు. తాజాగా కొయెట్జీ మయాంక్ వేగాన్ని అధిగమించి ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ బంతి ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిగానూ రికార్డుల్లోకెక్కింది. కొయెట్జీ సంధించిన ఈ సీజన్ వేగవంతమైన బంతిని రియాన్ పరాగ్ బౌండరీకి తరలించి మ్యాచ్ను గెలిపించడం కొసమెరుపు. కాగా, ముంబై ఇండియన్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో రాజస్థాన్కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. ముంబైకు హ్యాట్రిక్ పరాజయం. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై చెత్త ప్రదర్శనను కనబర్చి నిర్ణీత ఓవర్లలో కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్లో రోహిత్ సహా ముగ్గురు (నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్) గోల్డెన్ డకౌట్లయ్యారు. తిలక్ వర్మ (32), హార్దిక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బౌల్ట్ (4-0-22-3), చహల్ (4-0-11-3), బర్గర్ (4-0-32-2), ఆవేశ్ ఖాన్ (4-0-30-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైని వణికించారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్.. 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. రియాన్ పరాగ్ (54 నాటౌట్) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వి (10), బట్లర్ (13) మరోసారి నిరాశపరిచారు. సంజూ శాంసన్ 12, అశ్విన్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 3 వికెట్లు పడగొట్టగా.. మఫాక తన మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ దక్కించుకున్నాడు. -
వారెవ్వా.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు?: సౌతాఫ్రికా దిగ్గజం
ఐపీఎల్ తాజా సంచలనం మయాంక్ యాదవ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ‘ఢిల్లీ ఎక్స్ప్రెస్’ స్పీడుకు మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. మయాంక్ పేస్ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. వేగంగా బంతిని విసరడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్పై కూడా మయాంక్ పూర్తి నియంత్రణ కలిగి ఉండటం ముచ్చటగొలుపుతోందని బ్రాడ్ హర్షం వ్యక్తం చేశాడు. అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం పట్ల సాటి ఫాస్ట్బౌలర్గా ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతేగాకుండా త్వరలోనే మయాంక్ టీమిండియాలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని.. రానున్న టెస్టు సిరీస్లో అతడు గనుక ఆడితే.. జాగ్రత్తగా ఉండాలని స్టీవ్ స్మిత్కు ఇప్పటికే సందేశం పంపినట్లు బ్రాడ్ పేర్కొన్నాడు. మరోవైపు.. సౌతాఫ్రికా స్పీడ్గన్ డేల్ స్టెయిన్ సైతం మయాంక్ యాదవ్ సూపర్ఫాస్ట్ డెలివరీలు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ‘‘గంటకు 155.8 కిలో మీటర్ల వేగం. మయాంక్ యాదవ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావు!’’ అంటూ ఎక్స్ వేదికగా మయాంక్ను అభినందించాడు. ఇక భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ఢిల్లీ ఎక్స్ప్రెస్ అంటూ అతడిపై ప్రశంలస వర్షం కురిపించాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 155,8 KPH Mayank Yadav where have you been hiding! — Dale Steyn (@DaleSteyn62) March 30, 2024 కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 21 ఏళ్ల మయాంక్ యాదవ్ శనివారం అరంగేట్రం చేశాడు. పంజాబ్ కింగ్స్తో తన తొలి మ్యాచ్ ఆడిన ఈ రైటార్మ్ పేసర్.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటకు 155.8 కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ ఐపీఎల్ తాజా ఎడిషన్లో ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో పంజాబ్పై లక్నో విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా మయాంక్ యాదవ్ దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో తొలి మ్యాచ్లో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్.. తాజాగా పంజాబ్పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తదుపరి మంగళవారం ఆర్సీబీతో తలపడనుంది. చదవండి: #Mayank Yadav: నేను ఆరాధించే ఫాస్ట్ బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’ -
అరంగేట్రంలోనే అదుర్స్.. ఎవరీ ‘నయా స్పీడ్గన్’? (ఫొటోలు)
-
IPL 2024: నేను ఆరాధించే బౌలర్ ఆ ఒక్కడే: నయా ‘స్పీడ్గన్’
IPL 2024- LSG Speed demon Mayank Yadav reveals His Idol Name: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తన తొలి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్-2024 బరిలో దిగిన అతడు.. అరంగేట్రంలోనే తన ‘స్పీడ్’ పవరేంటో చూపించాడు. పంజాబ్ కింగ్స్తో శనివారం నాటి మ్యాచ్లో 150 కి.మీ. పైగా వేగంతో బంతులు విసిరి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో తొలి ఫాస్టెస్ట్ డెలివరీని నమోదు చేసి తన పేరును రికార్డుల్లో పదిలపరుచుకున్నాడు మయాంక్ యాదవ్. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ ఫాస్ట్ బౌలింగ్ పట్ల తనకున్న ఇష్టం గురించి చెప్పుకొచ్చాడు. 𝗦𝗽𝗲𝗲𝗱𝗼𝗺𝗲𝘁𝗲𝗿 goes 🔥 𝟭𝟱𝟱.𝟴 𝗸𝗺𝘀/𝗵𝗿 by Mayank Yadav 🥵 Relishing the raw and exciting pace of the debutant who now has 2️⃣ wickets to his name 🫡#PBKS require 71 from 36 delivers Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL |… pic.twitter.com/rELovBTYMz — IndianPremierLeague (@IPL) March 30, 2024 స్పీడ్ థ్రిల్స్ ‘‘వేగం.. నన్ను ఉత్కంఠకు గురి చేస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది. కేవలం బౌలింగ్లోనే కాదు.. సాధారణ జీవితంలోనూ అంతే! రాకెట్లు, విమానాలు, సూపర్ బైకులు.. వీటిని చూస్తుంటే నాకెంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. చిన్నతనంలో నేను వేగంగా ప్రయాణించే విమానాలను ఇష్టపడేవాడిని. అక్కడి నుంచే ఈ ఇష్టం మొదలైంది. నా బౌలింగ్లో వేగానికి స్ఫూర్తి అవే!’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు. నేను ఆరాధించే ఏకైక ఫాస్ట్ బౌలర్ అతడే ఇక తన ఐడల్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఈ ప్రపంచంలో తాను ఆరాధించే ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ సౌతాఫ్రికా స్పీడ్గన్ డేల్ స్టెయిన్ అని మయాంక్ యాదవ్ స్పష్టం చేశాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల జీవితాల్లో గాయాలు భాగమని.. అందుకే కెరీర్ ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఊహించలేమన్నాడు. గత సీజన్లో గాయం వల్లే తాను ఐపీఎల్కు దూరమైన విషయాన్ని ఈ సందర్భంగా మయాంక్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు. లక్నో నమ్మకాన్ని నిలబెడుతూ కాగా ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల మయాంక్ యాదవ్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 20 లక్షల కనీస ధరకు అతడిని కొనుక్కుంది. అయితే, గాయం కారణంగా 2023 సీజన్లో ఆడలేకపోయాడు. అనంతరం.. ఐపీఎల్-2024కు ముందు మినీ వేలంలో భాగంగా లక్నో మరోసారి అతడిని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శనివారం నాటి పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చెలరేగి జట్టును గెలిపించాడు మయాంక్ యాదవ్. కాగా సొంతమైదానంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఐపీఎల్ తాజా ఎడిషన్లో బోణీ కొట్టింది. చదవండి: IPL 2024: కోహ్లి, గంభీర్కు ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం First Home Game 👌 First Season Win 👌@LucknowIPL's strong comeback with the ball helps them secure a win by 21 runs 🙌 Scorecard ▶️ https://t.co/HvctlP1bZb #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/YKofyh3Kt5 — IndianPremierLeague (@IPL) March 30, 2024
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement