-
పదోన్నతులు ఎలా ?
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈఓ నుంచి ఏఓకు, ఏఓ నుంచి ఏడీఏ పోస్టులకు పదోన్నతులు నిర్వహించేందుకు వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు ఉత్తర్వు లు ఇచ్చారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ కన్వీనర్గా, సహకార శాఖ కమిషనర్, ఉపకార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా రెండేళ్ల కాల పరిమితితో డీపీసీని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖలోని మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ పోస్టుల్లో పదోన్నతులు కల్పించడమే దీని ఉద్దేశమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలంటే, ఆయా పోస్టుల్లో ప్రస్తుతమున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలి. ఉదాహరణకు ఏఓ నుంచి ఏడీఏ పోస్టుల్లోకి ప్రమోషన్ ఇవ్వాలంటే, ఏడీఏ పోస్టుల్లో ఖాళీలు ఉండాలి. కానీ ఏడీఏ నుంచి డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు పదోన్నతులు జరపకుండా, ఖాళీలు ఎలా ఏర్పడతాయని వ్యవసాయ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అతి కొద్దిగా మాత్రమే రిటైర్మెంట్లు ఉంటాయి. కాబట్టి పూర్తిస్థాయిలో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఇక ఏఈఓ నుంచి ఏఈలుగా పదోన్నతులు ఇవ్వాలన్నా అటువంటి క్లిష్టమైన పరిస్థితే తలెత్తుతుంది. పైస్థాయిలో కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా మొదటి, రెండోస్థాయి గెజిటెడ్ ఆఫీసర్ల పదోన్నతులు చేయడం కుదరదని అంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూపులువ్యవసాయశాఖలో దాదాపు 500 మందికి పైగా పదోన్నతు లకు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒకేసారి అన్ని శాఖల్లో పదోన్నతులు జరిగినా, వ్యవసాయశాఖలో మాత్రం చేయలేదు. ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేదని సాకులు చెబుతూ పదోన్నతులు ఆపేశారని అంటున్నారు. ఏఓ స్థాయి నుంచి అడిషనల్ డైరెక్టర్ కేడర్ వరకు పదోన్న తులు జరగాలి. సర్వీస్ రూల్స్ ప్రకారం పదోన్నతులు నిర్ణీత కాలంలో జరపకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనని సంఘాల నేతలు అంటున్నారు. పదోన్నతులు రాకపోవడం వల్ల సీనియర్లు మనోవేదనకు గురవుతున్నారు. దీనివల్ల పోస్టింగ్ల్లోనూ అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నా రు. ఇప్పుడు కేవలం రెండు కేడర్లలో పదో న్నతులకు మాత్రమే డీపీసీని ఏర్పాటు చేశారు. దీని వల్ల పైస్థాయిలో కద లిక రాకుంటే వీటికి కూడా ప్రమోషన్లు ఇచ్చే పరి స్థితి ఉండదని అంటున్నారు. ఆయా విషయాలపై ఇటీవ ల అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవ స్థాపక అధ్యక్షుడు కె.రాము లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నికలకు ముందే విజ్ఞప్తి చేశారు. కానీ ప్రక్రియ మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. బదిలీల మాటేంటి?గత ప్రభుత్వంలో అంటే దాదాపు ఐదారేళ్ల క్రితం వ్యవసాయ శాఖలో బదిలీలు జరిగాయి. అవి కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు ఒకే చోట తిష్టవే యగా, కొందరు కుటుంబాలకు దూరంగా ఉంటూ అన్యా యానికి గురవుతున్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు వ్యవసా య ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నాయి. ఉద్యోగు ల్లో దాదాపు 2 వేల మందికి పైగా బదిలీలకు ఎదు రుచూస్తున్నారు. కొందరైతే అక్రమ బదిలీలు చేయించుకుంటున్నారన్న విమర్శ లున్నాయి. మరికొందరైతే డిప్యూ టేషన్లు చేయించుకుంటున్నారు. వ్యవసాయ శాఖ లో చాలామంది డిప్యూటేషన్లు, ఓడీలు, ఫారిన్ సర్వీసులపై ఉంటున్నారు. బదిలీలు జరగకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికీ డిప్యూటేషన్లకు వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆ అధికారి వెల్లడించారు. నిర్ణీత సమయం ప్రకారం బదిలీ లు జరగాలని, అది ఉద్యోగుల హక్కు అని ఆయన వ్యాఖ్యానించారు. -
అమెరికాలో సూర్య గ్రహణం సందడి
ఉత్తర అమెరికా ఆకాశంలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసేందుకు అక్కడి జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికోలోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్తో పాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని పలు మార్కెట్లతో పాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సౌత్వెస్ట్, డెల్టా వంటి విమానయాన సంస్థలు సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. అలాగే వివిధ రంగురంగుల టీ షర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు పలు కంపెనీలు దానిని ఆదాయమార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రిస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్య గ్రహణం సందర్భంగా పరిమిత-ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్లను విడుదల చేసింది. -
ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన ఫ్యామిలీ స్టార్ బ్యూటీ!
సీతారామం సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్కు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంతే కాకుండా గతేడాది నాని సరసన హాయ్ నాన్న చిత్రంతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నా మృణాల్ ఠాకూర్ హైదరాబాద్లో సందడి చేసింది. బల్కంపేట్లో ఉన్న ఎల్లమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. కుటుంబ సంప్రదాయాలు, ఏదైనా పెద్ద పని ప్రారంభించే ముందు ఒక్క క్షణం ఆగి ప్రార్థించండి.. వీలైతే ఆలయాన్ని సందర్శించండి అంటూ తన ఇన్స్టాలో పంచుకుంది. ఆలయంలో పూజలు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
వాళ్లు పోతే పోనీ.. దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రమోషన్లు!
Wipro Promotions : భారతీయ ఐటీ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు, మరో 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రమోట్ చేసినట్లు అంతర్గత మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ అయిన విప్రో నుంచి ఉన్నత స్థాయి నిష్క్రమణల పరంపర తర్వాత సీనియర్-స్థాయి అట్రిషన్ను నిరోధించే చర్యగా ఈ ప్రమోషన్లను పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడింట్గా పదోన్నతి పొందిన చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహాలే, హెల్త్కేర్ పోర్ట్ఫోలియో లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో సీఎఫ్ఓ బెంజమిన్ సైమన్, కెనడా కంట్రీ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ శ్రీనివాసా హెచ్జి, క్లౌడ్ ఆర్మ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్ హెడ్ సతీష్ వై ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్మాన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ భరత్ నారాయణన్ సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు విప్రోను వీడారు. నియామక సంస్థ ఎక్స్ఫెనో డేటా ప్రకారం.. దేశంలోని ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడింట్, వైస్ ప్రెసిడింట్, సీనియర్ వైస్ ప్రెసిడింట్ పోస్టుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం తగ్గింది. కాగా ప్రమోషన్ల అంశాన్ని విప్రో యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. "బలమైన అంతర్గత నాయకులను అభివృద్ధి చేయడంలో కొనసాగుతున్న నిబద్ధత"లో ఇది భాగమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది. 2023 జనవరిలో విప్రో రికార్డు స్థాయిలో 73 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. వీరిలో 12 మందిని సీనియర్ వైస్ ప్రెసిడింట్ స్థాయికి, 61 మందిని వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పదోన్నతి కల్పించింది. -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్ఈఐఆర్బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
సలార్ రిలీజ్ పరిస్థితి ఏంటి?
-
ప్రమోషన్స్లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అభిమానులకు నాగచైతన్య బిగ్ సర్ప్రైజ్.. ఏం చేశారంటే?
ఈ ఏడాది కస్టడీ సినిమాతో అభిమానులను అలరించిన అక్కినేని హీరో నాగచైతన్య. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి కీలకపాత్రలో కనిపించారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఇప్పటికే చాలామంది హీరోలు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వగా.. చైతూ సైతం సరికొత్త సిరీస్తో అరంగేట్రం చేస్తున్నారు. నాగచైతన్య ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ దూత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సిరీస్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్లో బిజీ అయిపోయారు నాగచైతన్య. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సరికొత్త పంథాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈనెల 23న చైతూ బర్త్ డే కావడంతో స్పెషల్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. తన అభిమానుల కోసం సరికొత్తగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా తన అభిమాన హీరోను కలవాలంటే మనమే వాళ్ల ఇంటికి వెళ్తాం. కానీ ఇక్కడ నాగచైతన్యనే స్వయంగా అభిమానుల ఇంటికి వెళ్లి వారికి ఆశ్చర్యానికి గురి చేశారు. అంతే కాకుండా వారికి గిఫ్ట్ బాక్సులు కూడా అందజేశారు. దీంతో అభిమాన హీరోనే స్వయంగా తమ ఇంటికి రావడంతో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఫ్యాన్స్ను కలిసిన చైతూ వారితో కాసేపు మాట్లాడారు. ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ..'పర్సనల్గా నాకు సంతృప్తినిచ్చిన వెబ్ సిరీస్ ఇది. ఈ జోనర్ను నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు. కాగా.. ఈ సిరీస్ ట్రైలర్ను నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు. కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ సిరీస్ రానుంది. శరద్ మరార్ నిర్మించిన ఈ సిరీస్కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలు చేశారు. ఈ వెబ్ సిరీస్లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
'సినిమా బాగుంటే అడుతది. లేదంటే పీకుతది'.. నాని ఆసక్తికర కామెంట్స్!
దసరాతో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దసరాలో మాస్ యాక్షన్లో అలరించిన.. ఈసారి మాత్రం హాయ్ నాన్న అంటూ తండ్రి, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీతో రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. అయితే మూవీ ప్రమోషన్స్తో నాని బిజీ అయిపోయారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉండడంతో విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నాని.. తాజాగా ప్రెస్మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో రాహుల్ మాట్లాడుతూ.. 'మన రాహుల్ వచ్చిండా. నువ్వు చాలా గమ్మత్తుగా ఉన్నావయ్యా. ఇక్కడ నార్త్, సౌత్ సినిమా అని ఉండదు. లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ కాదని నేను అనలే. మన సినిమాను పోస్ట్ పోన్ కానివ్వం. ఏమయ్యా రాహుల్ ప్రీ పోన్కు, పోస్ట్ పోన్కు ఆ మాత్రం తేడా తెల్వదా నీకు. సినిమా బాగుండే అడుతది. లేకుంటే పీకుతది. డిసెంబర్ 7న థియేటర్లో దావత్ చేసుకోవాలే. తమ్ముడు నువ్వు ఏదో కిరి కిరి పెట్టాలని చూస్తున్నావ్. అదే జరగదు. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అయితది.' నవ్వులు పూయించారు. హాయ్ నాన్న పార్టీ ప్రెస్ మీట్ అంటూ తెలంగాణం సీఎం కేసీఆర్ స్టైల్లో స్పీచ్ అదరగొట్టేశారు నాని. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఊరికే Press meet పెట్టా 😬#HiNanna #HiNannaOnDec7th pic.twitter.com/bZIQroHN5P — Nani (@NameisNani) November 20, 2023 -
హైదరాబాద్: ‘దిమార్వెల్స్’ యూనిట్తో కలసి సమంత సందడి (ఫొటోలు)
-
ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం(ఆర్టీసీ) ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన సానుకూలతను మరోసారి చాటుకుంది. ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కీలక డిమాండ్పై సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు కేటగిరీల ప్రకారం పదోన్నతులు కల్పించేలా కార్యాచరణ చేపట్టింది. ప్రభుత్వంలో విలీనం చేయకముందు అంటే.. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్ నిబంధనలనే వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరినవారికి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) సర్వీసు నిబంధనలను అమలు చేస్తారు. ఈ మేరకు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్ 5ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో ఆర్డినెన్స్ ఇచ్చింది. అనంతరం సవరణ బిల్లునూ ఆమోదించింది. దీనిపై త్వరలోనే తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని నిర్ణయించింది. రెండు కేటగిరీలుగా పదోన్నతులు 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉన్న దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు మొదలైనవన్నీ ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకే కల్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమితులైవారికి పదోన్నతులకు సంబంధించి విద్యార్హతల నిబంధనలు ప్రత్యేకంగా ఉండేవి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. దీంతో గతంలో తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొంది.. పదోన్నతులకు అర్హత కలిగిన ఉద్యోగులు తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలతో నష్టపోయే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులకు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సరైన విధాన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి(2020, జనవరి 1) ఉద్యోగులుగా ఉన్నవారికి ఆర్టీసీ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. దాంతో 2020, జనవరి 1 కంటే ముందు నుంచి ఉద్యోగులుగా ఉన్న దాదాపు 50 వేల మందికి ఆర్టీసీ సర్వీసు నిబంధనలే వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉద్యోగాల్లో చేరిన వారికి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పిస్తారు. ప్రస్తుతం ఆ కేటగిరీలో ఆర్టీసీలో 311 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ విషయంలో థ్రిల్లింగ్గా ఫీలవుతున్నా: సమంత
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్లో సందడి చేసింది. ఈ దీపావళికి ఫ్యాన్స్కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన అభిమానుల కోసం మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తోన్న ‘దిమార్వెల్స్ యూనిట్తో జతకట్టింది. అమెరికన్ సూపర్ హీరోస్కు తానెప్పుడూ అభిమానినని చెప్పే సమంత.. ది మార్వెల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజాగా భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను లాంఛ్ చేశారు. తాజాగా మూవీ ప్రమోషన్స్లో సమంత స్పెషల్గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ది మార్వెల్స్ నవంబర్ 10న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత మాట్లాడుతూ..'కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. అవెంజర్, ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియా తో జతకట్టడం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నా. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ సినిమా కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.' అని అన్నారు. కాగా.. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘కెప్టెన్ మార్వెల్’ ప్రమోషన్స్లోనూ సమంత భాగమైన సంగతి తెలిసిందే. Smile, Slay & Pose done ✅ As ever #Samantha stuns us with her stylish looks at an event!!❤️🔥 @Samanthaprabhu2 #TheMarvels #TeluguFilmNagar pic.twitter.com/GU777LnnIU — Telugu FilmNagar (@telugufilmnagar) November 3, 2023 -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల పరంపర
-
పదోన్నతుల పరంపర
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించగా... తాజాగా వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న 35 మంది గ్రామ పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించారు. వారిని అదే జిల్లా పరిధిలోని వివిధ పశువైద్యశాలల్లో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో నియమిస్తూ ఈ నెల 19వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా ఏడీహెచ్వో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యాన 19 కేటగిరీల ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 17 కేటగిరీల ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ 17 కేటగిరీలకు సంబంధించిన శాఖల్లో ఖాళీలు ఏర్పడిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు పశు వైద్యశాలల్లో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయితే వాటిలో 40శాతం పోస్టులను గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశుసంవర్థక అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి నియమించాలని స్పష్టంగా పేర్కొంది. దాని ప్రకారమే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో 35 మందికి ప్రమోషన్లు కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. మరోవైపు సచివాలయాల్లో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అపోహలు.. అభూత కల్పనల నుంచి పదోన్నతుల వరకు.. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం... ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం... ఆ తర్వాత పట్టించుకోకపోవడం.. కోర్టు కేసులు, ఇతర సమస్యలతో నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి సాగిన చరిత్ర నాలుగేళ్ల క్రితం వరకు ఉంది. కానీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఏకంగా 1.34లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ఒకేసారి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఉంటాయో... ఊడుతాయో.. అని భయపెట్టాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సచివాలయ ఉద్యోగులకు మేలు చేస్తోంది. ప్రొబేషన్ ఖరారు చేసి అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేలుతో కూడిన వేతనాలు అందిస్తోంది. తాజాగా సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా శాఖల్లో పోస్టింగ్లు కూడా ఇస్తోంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. -
ఇప్పటికీ పురుషులకే ఎక్కువ పదోన్నతులు..!
మహిళలకు పురుషులతో సమానంగా అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలని పోరాటలు చేశారు. తాము పురుషులకు ఎందులోనూ తీసిపోం అని చాటి చెప్పినప్పటికీ స్త్రీలు ఇంకా పదోన్నోతుల్లో వెనుకబడే ఉన్నారు. మహిళలు కార్యాలయాల్లో అగ్రగామిగా ఉండాలనే కోరికి కలగానే మిగిలిందా? ఎందుకిలా? అంటే..ఔననే చెబుతున్నాయి అమెరికన్ సాంకేతిక అధికారి షెరిల్ శాండ్బర్గ్, లెర్న్ఇన్ డాట్ ఆర్గనైజేషన్, మిక్నిసే అండ్ కో సంయుక్తంగా నిర్వహించిన విమెన్ ఇన్ ది వర్క్ ప్లేస్ నివేదికలు. ఆ సర్వే ప్రకారం 2022లో పదోన్నతులు పొందిన ప్రతి వంద మంది పురుషుల్లో 87 మంది మహిళలు మాత్రమే ఆ ప్రోత్సాహాన్ని పొందారు. పురుషులతో సమానంగా ప్రమోషన్లు పొందాలని కోరినప్పటికీ అందులో వారు ఇంకా వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఈ గ్యాప్కి కారణం ఏంటంటే పని ప్రదేశాల్లో తమ సామర్థ్యాన్ని పురుషుల, స్త్రీలు ప్రూవ్ చేసుకునేదనే బట్టే ఉంటుంది. పురుషులు, స్త్రీలు తమ పనితీరుని చూపించుకోవాల్సి ఉంటుఒంది. మీకు (స్త్రీలు) మీరుగా మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోనట్లయితే వెనుకబడక తప్పదని శాండ్బర్గ్ సర్వే వెల్లడించింది. దీన్ని నల్లజాతీయుల పరంగా చూస్తే ఆ స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతి వంద మంది పురుషులకు కేవలం 54 మంది నల్లజాతీయులు పదోన్నతులు పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 2021లో 96 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 2018, 2019 కనిపించిన 58 దగ్గరకు ఉంది. అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు నల్లజాతీయులకు ఉద్యోగావకాశాలు హామీ ఇచ్చాయి కూడా. కాగా యూఎస్, కెనడాలలో సుమారు 276 కంపెనీలపై సర్వే చేయగా దాదాపు 33 సంస్థలు నుంచి 27 వేలకు పైగా ఉన్న ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ ప్రమోషన్లు పొంది లాభపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. పురుషులు ఆన్సైట్లో ఉన్నప్పుడూ మహిళలు కంటే ఎక్కువ మెంటర్షిప్, స్పాన్సర్షిప్ పొందుతారని, వారు కొత్తవి తెలుసుకోవడంలో ఆసక్తి కనబరుస్తారని లెర్ని ఇన్ డాట్ ఆర్గనైజేషన్ సహ వ్యవస్థాపకుడు సీఈవో రేచెల్ థామస్ అన్నారు. అంతేగాదు పని వాతావరణంలో ఉద్యోగుల నైపుణ్యాలు వెలికితీసేలా మంచి శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును కూడా సమీక్షించాలి, ఎక్కడ తప్పు దొర్లుతుందో గమనించాలని అన్నారు. ఇక మెటా ఫ్లాట్ఫారమ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్బర్గ్ మాట్లాడుతూ..మహిళలే పనితీరులో కాస్త నిర్లక్ష్యంగా ఉంటూ అసంతృప్తిగా పనిచేస్తున్నారని చెప్పడం దురదృష్టకరం. అయినా ఇలా ఉంటే మహిళలు వారు ఆశించిన లక్ష్యాన్ని ఎలా చేరుకొనగలరు అని ప్రశ్నిస్తోంది. సామర్థ్యాన్ని పెంచుకోకుండా పురుషులతో సమాన అవకాశాలు ఎక్కడ నుంచి వస్తాయని శాండ్బర్గ్ అన్నారు. మహమ్మారికి ముందు మహిళలు ప్రతిష్టాత్మకంగా ఉన్నారని 2019లో ఏకంగా 80% మంది మహిళలు ప్రమోషన్లు ఆశించినట్లు తెలిపారు. -
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జాప్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానోపాధ్యాయుల సీని యారిటీ వ్యవహారం పీటముడిగా మారడ మే దీనికి కారణం. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పోస్టులకు పదోన్నతి కోసం గురు వారం నుంచి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయి తే రాత్రి పొద్దుపోయే వరకూ ఈ ప్రక్రియ మొదలుకాలేదు. ఆప్షన్లు ఇచ్చేందుకు టీచర్లు సిద్ధపడ్డా, వెబ్సైట్ ఓపెన్ కాలేదు. రోస్టర్ విధానం, మల్టీజోన్ల వారీగా సీనియారిటీ, నాట్–విల్లింగ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవసర మైన సాఫ్ట్వేర్ ఏర్పాటులో సాంకేతిక సమ స్యలొచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్ర వారం నుంచి ఆప్షన్లు అందుబాటులోకి రావ చ్చని అధికారులు తెలిపారు. మల్టీజోన్–2లోని 14 జిల్లాల్లో కోర్టు ఆదేశాల కార ణంగా హెచ్ఎంల పదోన్నతి ప్రక్రియ ఆగిపోయింది. ఇది ముందుకెళితేనే స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై స్పష్టత వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,974 హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. 6,500 మంది ఎస్జీటీలకు పదోన్నతులు లభించాల్సి ఉంటుంది. తొలిదశలోనే సమస్యలు మొదలుకావడంతో మిగతాప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు. షెడ్యూల్ ప్ర కారం అక్టోబర్ 3, 4 తేదీల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీలు, పదో న్నతుల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అన్నిస్థాయిల్లోనూ ఆర్డర్లు కూడా ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే హెచ్ఎంల సీనియారిటీ సరిగాలేదనే కారణంగా మల్టీజో న్–2లో ప్రక్రియ ఆగిపోవడంతో బదిలీలు, పదోన్నతులు కిందస్థాయిలోనూ బ్రేక్ పడుతున్నాయి. కోర్టు స్టే తొలగించేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చినప్పటికీ అక్టోబర్ నెలాఖరునాటికి అన్నిస్థాయిల్లో బదిలీలు, పదోన్నతులు ముందుకెళ్లే అవకాశం కన్పించడంలేదు. స్టే ఎత్తివేయడంలో ఆలస్యమైతే మరికొంత జాప్యం తప్పదని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
సోషల్ మీడియాలో బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్నారా? అలా చేస్తే శిక్షార్హులు అవుతారు!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్ని యాడ్స్ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్ సంస్థల బ్రాండ్స్ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు. ఇవి తెలియని ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. వ్యూవర్లను, సబ్స్రైబర్లను పొందాలంటే.. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్మీడియా ఛానెల్స్లో పోస్ట్ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్స్రైబర్స్కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్టైమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా సక్సెస్ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. ►అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. ► సబ్స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్ అన్ని కామెంట్స్కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. ► సబ్స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. ► మీ ఛానెల్ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్మీడియా ఛానెల్లో ప్రమోషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్ చేయకండి. అది మీ వ్యూవర్స్ని పెంచదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్పైనే దృష్టి పెట్టండి. ► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్ చేస్తారు. దీనివల్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్ చేయడంలో వారి పూర్తి పాయింట్ అదే కాబట్టి ట్రోల్లను విస్మరించకూడదు. ► అన్ని సామాజిక ఛానెల్స్ కంటెంట్ను మానిటైజ్ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్బుక్, బ్లాగ్ పోస్ట్లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్ ఇన్.. ఇలా దేనికది ఎంచుకోవాలి. ► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ► హాష్ట్యాగ్ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్ట్యాగ్లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రకటనలు ఎలా చేయాలి? ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్మెంట్ సందేశంలో ఉంచాలి. హ్యాష్ట్యాగ్లు లేదా లింక్ల సమూహంతో యాడ్స్ను బహిర్గతం చేయకూడదు. వ్యూవర్స్ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్ మెంట్ ఇమేజ్పై ఉంచాలి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి. ప్రకటనలు మొత్తం లైవ్స్ట్రీమ్లో ప్రదర్శించాలి. సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి. తగిన శ్రద్ధ .. ►సెలబ్రిటీలు/ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది. ► ఒక ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తమ బ్రాండ్ దుస్తులను ధరించమని, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల కోసం కంటెంట్ను రూపొందించమని కోరాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్ను పోస్ట్ చేస్తే ఆ బ్రాండ్స్ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి. ► ఏదైనా మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఫెయిల్ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉచిత ఉత్పత్తుల వల్ల.. వ్యూవర్స్ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్ లేదా హోటల్ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు కంప్యూటర్ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
TS: టీచర్ల పదోన్నతులు, బదిలీలు షురూ
సాక్షి, హైదరాబాద్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ రూపొందించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. 6, 7 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో నేరుగా అందించాల్సి ఉంటుంది. ఈ నెల 12, 13 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ సీనియారిటీ జాబితాలను ప్రదర్శిస్తారు. సెప్టెంబర్15న ఆన్లైన్లోనే ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపడతారు. ఆ తర్వాత వరుసగా అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల బదిలీల ఆదేశాలు జారీ చేస్తారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏక కాలంలో చేపడతారు. అయితే, ముందుగా హెచ్ఎంలను బదిలీ చేస్తారు. ఈ విధంగా అయిన ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల కల్పించి, బదిలీలు చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లు పదోన్నతుల ద్వారా భర్తీ అయిన స్థానాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించి, వారిని బదిలీలు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 3వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. అక్టోబర్ 5 నుంచి 19 వరకూ బదిలీలు, పదోన్నతులపై అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీనియారిటీ జాబితా రూపొందించేందుకు అవసరమైన మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. జనవరి షెడ్యూల్కు స్వల్ప మార్పులు ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన షెడ్యూల్కు స్వల్ప మార్పులు చేశారు. ఒకే స్థానంలో మూడేళ్ళు పనిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. టీచర్లు గరిష్టంగా 8 ఏళ్ళు, హెచ్ఎంలు 5 ఏళ్ళు ఒకేచోట పనిచేస్తే విధిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ సర్విస్ కటాఫ్ తేదీ గతంలో ఫిబ్రవరి 1గా ఉండేది. ఇప్పుడు దీన్ని సెపె్టంబర్ 1గా నిర్ణయించారు. ఈ కారణంగా మరికొంతమంది బదిలీలకు అర్హులవుతారు. రిటైర్మెంట్కు 3 ఏళ్ళలోపు సర్వీస్ ఉంటే బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కటాఫ్ తేదీ మారడంతో ఈ విభాగంలోనూ కొత్తగా వచ్చే సర్విస్ను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆన్డ్యూటీ పొందే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సీనియారిటీలో పది పాయింట్లు ఇవ్వడాన్ని కోర్టు వ్యతిరేకించింది. దీంతో ఈ ఆప్షన్ తొలగించి కొత్త సీనియారిటీ జాబితాను రూపొందించాల్సి ఉంది. సీనియారిటీ దగ్గరే తికమక ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో జిల్లా అధికారులు టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 10 వేల మంది పదోన్నతులకు, 58 వేల మంది బదిలీలకు అర్హులని లెక్కగట్టారు. అయితే, సినియారిటీ జాబితా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశించినా, అందుకు తగిన మార్గదర్శకాలు ఇవ్వలేదని డీఈవోలు అంటున్నారు. ఈ కారణంగా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీని పదోన్నతి కోసం రూపొందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎస్ఏల్లో ఫిజిక్స్, మేథ్స్.. ఇలా వివిధ సబ్జెక్టుల బోధకులు ఉంటారు. కేటగిరీ వారీగా సీనియారిటీని తీసినప్పుడు ఒకరి కన్నా ఎక్కువ మంది తేలినప్పుడు ఎవరిని మొదటి స్థానంలో ఉంచాలని, ఎవరికి హెచ్ఎం పదోన్నతి కల్పించాలనేది ఇబ్బందిగా ఉందని డీఈవోలు చెబుతున్నారు. హెచ్ఎం పోస్టులు మల్టీ జోనల్ అయినప్పుడు 14 జిల్లాల ఎస్ఏ సీనియారిటీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఉద్యోగి చేరిన తేదీ, డీఎస్సీలో వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకుని సీనియారిటీ రూపొందిస్తారు. అప్పటికీ ఒకరికన్నా ఎక్కువ ఉంటే, డీఎస్సీలో ప్రతీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు, జాయినింగ్ తేదీ, ఇంకా కావాలంటే పుట్టిన తేదీని పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మార్గదర్శకాలు వస్తే తప్ప ఇది సాధ్యం కాదని డీఈవోలు అంటున్నారు. వికలాంగుల విషయంలోనూ ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదు. 40 శాతం అంగవైకల్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు తెలిపింది. గత షెడ్యూల్లో 70 శాతం వైకల్యాన్ని అర్హతగా పేర్కొన్నారు. -
పంచాయతీరాజ్లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో పనిస్తున్న ఎంపీడీవోలకు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీఎల్డీవో) గా, మరో 167 గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 2007 గ్రూపు–1 నోటిఫికేషన్ ద్వారా ఎంపీడీవోలుగా ఉద్యోగాలు పొందిన మొత్తం 66 మంది సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపినట్టు పంచాయతీరాజ్ శాఖ ఇన్చార్జి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వెల్లడించారు. కాగా.. 66 మంది ఎంపీడీవోల సీనియారిటీ జాబితాల్లో 14 మందిపై వివిధ శాఖాపరమైన అభియోగాలు పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. సీనియారిటీ జాబితాలో శాఖాపరమైన అభియోగాలు పెండింగ్ లేని ఎంపీడీవోల పదోన్నతులకు పూర్తి స్థాయిలో అర్హులుగా వివరించారు. కాగా.. పూర్వం మేజర్ గ్రామ పంచాయతీలో ఎగ్జిక్యూటివ్ అధికారులు(ఈవో)గా, గతంలో విలేజి డెవలప్మెంట్ అధికారులు(వీడీవో)గా పనిచేసి ప్రస్తుతం గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారితోపాటు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాలు, డీపీవో కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న 167 మందికి ఈవోపీఆర్డీలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సూర్యకుమారి ఆమోదం తెలిపారు. ఈవోపీఆర్డీలుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ ఒక ప్రకటనలో సీఎం జగన్మోహన్రెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. -
పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) సర్దుబాటు ప్రక్రియ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 5,138 మంది వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. జూనియర్ అసిస్టెంట్ కేడర్లో వీరిని నియమించింది. అయితే రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన తమ సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని తాము వెళ్లిన కొత్త శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, అప్పటివరకు ఆయా శాఖల్లో పదో న్నతులు ఇవ్వద్దని పాత వీఆర్వోలు కోర్టులకు వెళ్లడం, వీరి అభ్యర్థన మేరకు కోర్టులు స్టేలు ఇస్తుండడంతో పలు శాఖల్లో శాఖాపరమైన పదోన్నతులకు బ్రేక్ పడుతోంది. ఈ తరుణంలో పదోన్నతులకు కోర్టుల రూపంలో రెడ్ సిగ్నల్ పడుతుండడంతో ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నత విద్య, వైద్య శాఖల్లో ఆటంకాలు ఉన్నత విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ల పదోన్నతుల్లో అర్హత గల జూనియర్ అసిస్టెంట్లకు 10% కోటా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బందితో ఆ శాఖ అధికారులు జేఎల్ పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా తయారు చేశారు. అయితే ఇదే శాఖలో సర్దుబాటు అయిన వీఆర్వో ఒకరు తనకు కూడా జేఎల్ ఉద్యోగం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో పనిచేసిన తన సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాలో తన పేరు కూడా చేర్చేలా ఆదేశాలివ్వాలని, అప్పటివరకు ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థన మేరకు జేఎల్ పదోన్నతులపై స్టే విధిస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల విషయంలోనూ ఇదే జరిగింది. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ పలువురు సర్దుబాటు వీఆర్వోలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్కో ఉత్తర్వులు జారీ చేసింది. -
‘టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి’
హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను కోర్టు తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం నడాఉ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ‘పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్లు పంపాలి. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలి’ అని మంత్రి సబితా ఆదేశించారు. -
టీచర్ల బదిలీలు,పదోన్నతులకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతోందని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ నేతలు తెలిపారు. విద్యాశాఖమంత్రి సబిత ఇంద్రారెడ్డిని సంఘం నేతలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీఎమ్మెల్సీ పూల రవీందర్ కలిశారు. ప్రభు త్వం బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు గతంలో జారీ చేయగా, ఇందుకు సంబంధించిన జీఓ నంబరు 5కు అసెంబ్లీ చట్టబద్ధత లేదనే కారణంగా కొంతమంది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైనా ఆగిపోయా యి. అయితే, జీఓ 5 అమలుకు శాసనసభ ఆ మోదం పొందే ప్రతిపాదనలు విద్యాశాఖ సమర్పించినట్టు మంత్రి సబిత శుక్రవారం పీఆర్టీయూ టీఎస్ నేతలకు తెలిపారు. ఇందుకు మంత్రి సబితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
సీఎం జగన్తోనే విద్యాభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
AP: ‘కారుణ్య’ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకం కింద టైపిస్ట్, ఎల్డీ టైపిస్ట్, యూడీ టైపిస్ట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందినవారు కంప్యూటర్ పరీక్ష పాసైతే వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారు ఇక నుంచి తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనకు స్వస్తి చెబుతూ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి పోలా భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు గత నిబంధనలను సడలించినట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు పొందినవారు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ టెస్ట్ పాస్ అయితేనే వారి సర్వీసు రెగ్యులర్ చేసేవారని, టైపింగ్కు ప్రాధాన్యత తగ్గిపోవడంతో అది నేర్పించేవారు లేక, ఆ పరీక్ష పాస్ కాలేక చాలామంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్ కాక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాము సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల నుంచి మినహాయింపు ఇచి్చందని వివరించారు. ఇది కూడా చదవండి: ‘అప్పటికీ సునీతమ్మ ఫోన్ చేయలేదు.. ఇప్పుడు బతికున్నోళ్లను బజారుకీడుస్తోంది’ -
LGM Promotions Photos: ఎల్జీఎం ప్రమోషన్లో ధోని భార్య సాక్షి (ఫొటోలు)
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు..
టైటిల్ దాచి కొత్త సినిమా ఆప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
టాప్ 30 హెడ్లైన్స్@11:30AM 28 May 2024
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
తప్పక చదవండి
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement