-
#CSK: మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే!
కెప్టెన్గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు.‘‘ఢిల్లీ ఇన్నింగ్స్లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్కు కట్టడి చేయగలిగారు.తొలి ఇన్నింగ్స్లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది.తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా ఢిల్లీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. -
మా ఓటమికి కారణం అదే.. అతడు స్కోరు చేసి ఉంటే: రుతు
కెప్టెన్గా ఐపీఎల్-2024లో తొలి పరాజయాన్ని చవిచూశాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్. ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి పాలైంది. విశాఖపట్నంలో ఆదివారం నాటి మ్యాచ్లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితంపై స్పందించిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలో వైఫల్యమే తమ పరాజయానికి కారణమని పేర్కొన్నాడు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్లో పవర్ ప్లేలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత మెరుగ్గానే బౌలింగ్ చేశారు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన ప్రత్యర్థిని 191 రన్స్కు కట్టడి చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్లో పిచ్ బౌలర్లకు అంతగా అనుకూలించలేదు. కానీ రెండో ఇన్నింగ్స్లో సీమ్ కారణంగా బాల్ బౌన్స్ అయింది. నిజానికి ఈ మ్యాచ్లో రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే ఫలితం వేరేలా ఉండేది. తొలి మూడు ఓవర్లలో మేము అనుకున్నంతగా స్కోరు చేయలేకపోయాం. అప్పటి నుంచే మ్యాచ్ మా చేజారిపోయింది. ఒక్క ఓవర్లోనైనా భారీ స్కోరు చేసి ఉంటే రన్రేటు తగ్గి ఉండేది. అంతేకాదు.. ఢిల్లీ ఇన్నింగ్స్లో ఒకటీ.. రెండు బౌండరీలు ఆపినా బాగుండేది. అయినా.. ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మేము తిరిగి పుంజుకుంటాం’’ అని రుతురాజ్ గైక్వాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఢిల్లీతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది సీఎస్కే. ఈ క్రమంలో ఢిల్లీ 191 రన్స్ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో 171 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(1), రచిన్ రవీంద్ర(2) పూర్తిగా నిరాశపరిచారు. Vintage Dhoni 👌#TATAIPL fans were treated to some strong hitting by MS Dhoni Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#DCvCSK | @ChennaiIPL pic.twitter.com/eF4JsOwmsa — IndianPremierLeague (@IPL) March 31, 2024 అజింక్య రహానే(45), డారిల్ మిచెల్(34).. ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని(37 నాటౌట్) మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్లో అద్భుత స్పెల్(2/21) వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: #Dhoni: స్ట్రైక్రేటు 231.25.. సీఎస్కే ఓడిందా?!.. అట్లుంటది మనతోని Season’s 1️⃣st Win 🙌@DelhiCapitals get off the mark in #TATAIPL 2024 with a collective team effort in Visakhapatnam 🙌 Scorecard ▶️ https://t.co/8ZttBSkfE8#DCvCSK pic.twitter.com/PB9tLAD13i — IndianPremierLeague (@IPL) March 31, 2024 These maximums 🤩 Some clean hitting tonight 👌 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/4ps9IcmCbl — IndianPremierLeague (@IPL) March 31, 2024 -
ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్ కామెంటేటర్, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సీఎస్కే ఫీల్డింగ్ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా. అజింక్య రహానే మంచి క్యాచ్ అందుకున్నాడు. రచిన్ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్ అందుకున్నాడు’’ అని క్రిక్బజ్ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్ రోహన్ గావస్కర్.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు. కాగా గుజరాత్ టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో ధోని అద్బుత రీతిలో డైవ్ చేసి.. గుజరాత్ బ్యాటర్ విజయ్ శంకర్ను పెవిలియన్కు పంపాడు. 𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎 An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg — IndianPremierLeague (@IPL) March 26, 2024 పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్ను రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛 pic.twitter.com/95k8QD94wz — Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024 ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం.. ధోని, రహానే, రచిన్లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. -
వాళ్లిద్దరూ అదరగొట్టారు.. ఫీల్డింగ్ కూడా అద్భుతం: రుతురాజ్
ఐపీఎల్-2024లో వరుసగా రెండో విజయం సాధించడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టి కృషితో గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట జట్టును ఓడించామని పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క సీఎస్కే ఆటగాడూ రాణించాడని ప్రశంసలు కురిపించాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. తాజాగా గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. సొంతమైదానం చెపాక్లో మంగళవారం నాటి మ్యాచ్లో 63 పరుగుల తేడాతో శుబ్మన్ గిల్ సేనపై జయభేరి మోగించింది. 2⃣ in 2⃣ for Chennai Super Kings 👏👏 That's some start to #TATAIPL 2024 for the men in yellow 💛 Scorecard ▶️ https://t.co/9KKISx5poZ#TATAIPL | #CSKvGT | @ChennaiIPL pic.twitter.com/njrS8SkqcM — IndianPremierLeague (@IPL) March 26, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ పరిపూర్ణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో మా వాళ్లు అదరగొట్టారు. సాధారణంగా చెన్నైలో వికెట్ ఎలా ఉంటుందో కచ్చితంగా అంచనా వేయలేం. అందుకే తొలుత బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా రాణించడం మాత్రం ముఖ్యం. అయితే, వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే ఆఖర్లో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈరోజు రచిన్ పవర్ ప్లేలో అత్యద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేశాడు. అదే విధంగా.. దూబే.. అతడికి ఆత్మవిశ్వాసం మెండు. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా వ్యక్తిగతంగా అతడిని మెటివేట్ చేశాడు. జట్టులో తన పాత్ర ఏమిటో అతడికి బాగా తెలుసు. దూబే జట్టుతో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈరోజు నేను మా వాళ్ల ఫీల్డింగ్కు కూడా ఫిదా అయ్యాను’’ అని పేర్కొన్నాడు. గుజరాత్తో మ్యాచ్లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. కాగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. Jubilant Chepauk 🏟️ witnessed @ChennaiIPL's consecutive win as they beat @gujarat_titans by a resounding 63 runs 💪 Recap of the #CSKvGT clash 🎥 👇 #TATAIPL pic.twitter.com/reeLzs1IEh — IndianPremierLeague (@IPL) March 27, 2024 చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46) రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన శివం దూబే(23 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్తో మెరుపు అర్ధ శతకం సాధించాడు. డారిల్ మిచెల్(24- నాటౌట్) సైతం తన వంతు పరుగులు జతచేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి చెన్నై 206 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడ్డ గుజరాత్ 143 పరుగుల వద్దే నిలిచిపోవడంతో సీఎస్కే చేతిలో ఓటమి తప్పించుకోలేకపోయింది. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్ దేశ్పాండే తలా రెండు వికెట్లు పడగొట్టగా.. డారిల్ మిచెల్, మతీశ పతిరణ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: #WHAT A CATCH: వారెవ్వా ధోని.. 42 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో -
CSK Vs GT: చెన్నై ధనాధన్ గెలుపు
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ ఆల్రౌండ్ షోకు నిరుటి రన్నరప్ గుజరాత్ టైటాన్స్ పోరాటం వదిలి చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై 63 పరుగుల తేడాతో గుజరాత్పై ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీస్కోరు చేసింది. శివమ్ దూబే (23 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్స్లు), రచిన్ రవీంద్ర (20 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. సాయి సుదర్శన్ (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. పరుగుల తేడా పరంగా ఐపీఎల్లో గుజరాత్కిదే అతిపెద్ద ఓటమి. చెన్నై బౌలర్లు దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ తలా 2 వికెట్లు తీశారు. ముందు రచిన్... తర్వాత దూబే... చెన్నై ఇన్నింగ్స్ తొలి 10 ఓవర్లు, తర్వాత 10 ఓవర్లు అన్నట్లుగా రెండు దశలూ ధనాధన్గా సాగింది. తొలి దశను ఓపెనర్ రచిన్ దూకుడుగా మొదలుపెట్టాడు. అతను క్రీజులో ఉన్నది కాసేపే అయినా... భారీ షాట్లతో విరుచుకుపడటంతో మెరుపు వేగంతో చెన్నై స్కోరు దూసుకెళ్లింది. ఆరో ఓవర్ రెండో బంతికి రషీద్ అతని జోరుకు కళ్లెం వేశాడు. ఓపెనింగ్ జోడీ 32 బంతుల్లో 62 పరుగులు జతచేయగా, ఇందులో 46 పరుగులు ఒక్క రచిన్వే కావడం విశేషం. తర్వాత రహానే (12), కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైను నడిపించారు. 10 ఓవర్లలో చెన్నై 104/1 స్కోరు చేసింది. తర్వాతి ఓవర్ తొలి బంతికే రహానే అవుట్కాగా... శివమ్ దూబే రావడంతో రెండో దూకుడు కొత్తగా మొదలైంది. స్పిన్, పేస్ ఏ బౌలర్కు తలొగ్గకుండా దూబే బ్యాట్ దంచేసింది. మిచెల్ (20 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు) అండతో శివమెత్తడంతో... ఈ జోడీ కూడా 35 బంతుల్లో 57 పరుగులు జోడించింది. 22 బంతుల్లో దూబే అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే నిష్క్రమించాడు. సమీర్ రిజ్వీ (6 బంతుల్లో 14; 2 సిక్స్లు) మెరుపులతో చెన్నై స్కోరు 200 పైచిలుకు చేరింది. టైటాన్స్ వల్ల కాలేదు! కొండంత లక్ష్యం చూసే గుజరాత్ భీతిల్లినట్లుంది. ఓపెనర్లు మొదలు ఆఖరి వరుసదాకా అందరి బ్యాటర్లదీ అదే తీరు! ఛేదించాల్సిన లక్ష్యం కోసం ఆడాల్సిన తీరు ఏ ఒక్కరిలోనూ కనిపించలేదు. పవర్ప్లేలోనే కెపె్టన్ శుబ్మన్ గిల్ (8), సాహా (17 బంతుల్లో 21; 4 ఫోర్లు) పెవిలియన్కు వెళ్లిపోయారు. వన్డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ టాప్స్కోరర్గా నిలిచాడు. కానీ మెరిపించలేదు... కాసేపైనా మురిపించ లేదు. హిట్టర్లు విజయ్ శంకర్ (12), మిల్లర్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు), రాహుల్ తెవాటియా (6) అంతా చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్కు వికెట్లు అప్పగించేశారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) సాహా (బి) జాన్సన్ 46; రచిన్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ ఖాన్ 46; రహానే (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 12; దూబే (సి) శంకర్ (బి) రషీద్ ఖాన్ 51; మిచెల్ (నాటౌట్) 24; సమీర్ రిజ్వీ (సి) మిల్లర్ (బి) మోహిత్ 14; జడేజా (రనౌట్) 7; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–62, 2–104, 3–127, 4–184, 5–199, 6–206. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–30–0, ఉమేశ్ 2–0–27–0, రషీద్ ఖాన్ 4–0–49–2, సాయికిషోర్ 3–0–28–1, జాన్సన్ 4–0–35–1, మోహిత్ శర్మ 4–0–36–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) తుషార్ (బి) దీపక్ 21; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీపక్ 8; సాయి సుదర్శన్ (సి) సమీర్ (బి) పతిరణ 37; విజయ్ శంకర్ (సి) ధోని (బి) మిచెల్ 12; మిల్లర్ (సి) రహానే (బి) తుషార్ 21; అజ్మతుల్లా (సి) రచిన్ (బి) తుషార్ 11; తెవాటియా (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 6; రషీద్ ఖాన్ (సి) రచిన్ (బి) ముస్తఫిజుర్ 1; ఉమేశ్ (నాటౌట్) 10; జాన్సన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–28, 2–34, 3–55, 4–96, 5–114, 6–118, 7–121, 8–129. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–28–2, ముస్తఫిజుర్ 4–0–30–2, తుషార్ దేశ్పాండే 4–0–21–2, జడేజా 2–0–15–0, మిచెల్ 2–0–18–1, పతిరణ 4–0–29–1. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X ముంబై వేదిక: హైదరాబాద్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
CSK Vs GT: రచిన్ రవీంద్ర విధ్వంసం.. కేవలం 20 బంతుల్లోనే! వీడియో వైరల్
కివీస్ యవ సంచలనం, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో అదరగొట్టిన రవీంద్ర.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను రవీంద్ర ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రవీంద్ర బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సీఎస్కేకు మరో సూపర్ స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. Rachin Ravindra is a superstar!!! ⭐pic.twitter.com/FUYcUekI9Y — Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024 -
#Kohli: అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి?
Virat Kohli Reaction To Rachin Ravindra Dismissal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్కు చెందిన ఈ ఆల్రౌండర్ ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం నాటి మ్యాచ్లో ఈ భారత సంతతి ఆటగాడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న రచిన్ ఏకంగా 37(3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు రాబట్టి చెన్నై ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. తద్వారా విజయంలో తానూ భాగమై సత్తా చాటాడు రచిన్ రవీంద్ర. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో జోరు మీదున్న సమయంలో రచిన్ను కర్ణ్ శర్మ అవుట్ చేశాడు. కర్ణ్ బౌలింగ్లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రచిన్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న రజత్ పాటిదార్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6⃣.5⃣ - SIX 6⃣.6⃣ - OUT That was an interesting passage of play! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y #TATAIPL | #CSKvRCB pic.twitter.com/JjiIclkEoj — IndianPremierLeague (@IPL) March 22, 2024 ఫలితంగా ఆర్సీబీ శిబిరంలో సంబరాలు షురూ కాగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యవహరించిన తీరు అభిమానులను ఆశ్చర్యపరిచింది. రచిన్ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ.. వెళ్లిపో అన్నట్లు కోహ్లి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడన్నట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. pic.twitter.com/HUcInu5yTz — Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 22, 2024 దీంతో.. ‘‘అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి, వయసుకు ఇది తగదు చీకూ’’ అంటూ కోహ్లి అభిమానులు సైతం అతడి తీరును విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ చెన్నై చేతిలో ఓడి పరాజయంతో సీజన్ను ఆరంభించింది. ఇక ఆర్సీబీ ఓపెనర్ కోహ్లి చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అదీ సంగతి!! అందుకే ఆ వైల్డ్ సెలబ్రేషన్! Fielder ki kamaal ki lapak aur khatam hua Kohli ka luck! 🤯 Lijiye mazaa #IPLonJioCinema ka Bhojpuri mein ek dum FREE!#TATAIPL #JioCinemaSports pic.twitter.com/3tCrsyTGBo — JioCinema (@JioCinema) March 22, 2024 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోర్లు: ►వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్), చెన్నై ►టాస్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. బ్యాటింగ్ ►రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్కోరు: 173/6 (20) ►చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు: 176/4 (18.4) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముస్తాఫిజుర్ రహ్మాన్ (4/29). చదవండి: IPL 2024: ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు.. ఆర్సీబీ కొంపముంచాడు! ఎవరంటే? -
అరంగేట్రంలోనే సిక్సర్ల వర్షం.. అస్సలు తగ్గేదేలే!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రవీంద్ర.. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రవీంద్ర ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను ఈ కివీ స్టార్ టార్గెట్ చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో సీఎస్కే అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతడు ఇన్నింగ్స్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎస్కేకు మరో స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సీఎస్కే నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఫీల్డింగ్లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో సీఎస్కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ను రవీంద్ర పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
సత్తా ఉన్న ప్రతిభావంతులకు తారా జువ్వలా దూసుకుపోయేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక. స్వదేశీ ఆటగాళ్లయినా... విదేశీ ఆటగాళ్లయినా ఒక్కసారి ఐపీఎల్లో ఆడి మెరిపిస్తే కావాల్సినంత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. నిలకడైన ఆటతీరుతో కెరీర్ను గాడిలో పెట్టుకోవడానికి.... ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఐపీఎల్ దోహదం చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్లో అదరగొట్టి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రాబోయే ఐపీఎల్ 17వ సీజన్లో అరంగేట్రంలోనే తమ విధ్వంసకర ఆటతీరుతో, ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం గెలుపు గుర్రం... రచిన్ రవీంద్ర (చెన్నై) అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ న్యూజిలాండ్ క్రికెటర్. ఫార్మాట్ ఏదైనా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అనతికాలంలోనే జట్టు ముఖ్య సభ్యుడిగా ఎదిగాడు. గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో రచిన్ 10 మ్యాచ్లు ఆడి 578 పరుగులు సాధించి న్యూజిలాండ్ టాప్ స్కోరర్గా నిలవడంతోపాటు టాప్–4లో చోటు సంపాదించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో కేవలం 35 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో చెలరేగి 68 పరుగులు చేశాడు. తొలిసారి ఐపీఎల్ ఆడబోతున్న రచిన్ తన మెరుపులతో మెరిపించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నిలబెట్టుకునేందుకు తనవంతు పాత్ర పోషిస్తే మాత్రం భవిష్యత్ లో టాప్ స్టార్గా ఎదగడం ఖాయం. సిక్సర్ల వీరుడు... సమీర్ రిజ్వీ (చెన్నై) ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో ఆటగాళ్లను ఎంచుకునే సమయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ గత మినీ వేలంలో ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోసం చెన్నై పట్టుబట్టింది. ఇంకా భారత జట్టుకు ఆడని సమీర్ రిజ్వీని చెన్నై ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలు వెచ్చించింది. ముస్తాక్ అలీ దేశవాళీ టి20 టోర్నీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో రిజ్వీ యూపీని గెలిపించినంత పనిచేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు సాయికిశోర్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తిలపై విరుచుకుపడిన రిజ్వీ ఆ మ్యాచ్లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. యూపీ టి20 లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ జట్టు తరఫున అత్యధిక సిక్స్లు బాది వెలుగులోకి వచ్చిన రిజ్వీ కల్నల్ సీకే నాయుడు అండర్–23 టోర్నీలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆడుతున్న తొలి ఐపీఎల్లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసేందుకు రిజ్వీ రెడీ అవుతున్నాడు. వేగం.. వైవిధ్యం.. గెరాల్డ్ కొయెట్జీ (ముంబై) గతంలో రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గెరాల్డ్ కొయెట్జీని ప్రత్యామ్నాయ ప్లేయర్గా తీసుకున్నా మ్యాచ్ ఆడించలేదు. వేగంతోపాటు వైవిధ్యభరిత బౌలింగ్తో కొయెట్జీ గత వన్డే వరల్డ్కప్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టి టాప్–5లో నిలిచాడు. ఈ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఆకట్టుకుంది. 23 ఏళ్ల కొయెట్జీని ముంబై రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్లో బుమ్రా తర్వాత ముంబై తరఫున రెండో ప్రధాన బౌలర్గా కొయెట్జీని చూడవచ్చు. ఆల్రౌండర్... అజ్మతుల్లా (గుజరాత్) 2022లో కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎల్ చాంపియన్గా అవతరించింది. గత ఏడాది రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఏడాది పాండ్యా గుజరాత్ ను వీడి ముంబై ఇండియన్స్కు వెళ్లిపోయాడు. దాంతో పాండ్యా తరహాలో టైటాన్స్కు ఆల్రౌండర్ కొరత ఏర్పడింది. ఈ లోటును కొంతలో కొంత అఫ్గానిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ భర్తీ చేస్తాడని చెప్పవచ్చు. రూ. 50 లక్షలకు అజ్మతుల్లాను టైటాన్స్ కొనుగోలు చేసింది. గత ఏడాది వన్డే వరల్డ్కప్లో అజ్మతుల్లా 353 పరుగులు చేయడంతోపాటు ఏడు వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ పేసర్... జాన్సన్ (గుజరాత్) మడమ గాయంతో గుజరాత్ టైటాన్స్ ప్రధాన బౌలర్ మొహమ్మద్ షమీ ఈ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో టైటాన్స్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనపడింది. అయితే ఆ్రస్టేలియాకు చెందిన లెఫ్టార్మ్ పేసర్ స్పెన్సర్ జాన్సన్ రూపంలో టైటాన్స్కు మరో మంచి బౌలర్ దొరికాడనే చెప్పాలి. 28 ఏళ్ల జాన్సన్ గత రెండేళ్లలో ఎంతో రాటుదేలాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్లలో పాల్గొన్నాడు. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చించి జాన్సన్ను తీసుకుంది. లక్కీ చాన్స్... షామర్ జోసెఫ్ (లక్నో) ఆ్రస్టేలియాతో ఈ ఏడాది జనవరిలో జరిగిన టెస్టులో షామర్ జోసెఫ్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ను గెలిపించాడు. ఈ ప్రదర్శనతో షామర్ అంతర్జాతీయస్థాయిలో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. గత ఏడాది మినీ వేలంలో షామర్ను ఎవరూ తీసుకోలేదు. అయితే ఇంగ్లండ్కు చెందిన పేస్ బౌలర్ మార్క్ వుడ్ గాయంతో తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ షామర్ జోసెఫ్ను రూ. 3 కోట్లకు తీసుకుంది. -
రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్గా
ప్రపంచ క్రికెట్లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వన్డే వరల్డ్కప్లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్కు దక్కింది. -
IPL 2024: కాన్వే ఔట్.. రుతురాజ్కు జోడీ ఎవరు..?
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. కాన్వే వైదొలగడంతో రుతురాజ్ గైక్వాడ్తో పాటు సీఎస్కే ఇన్నింగ్స్ను ఎవరు ఆరంభిస్తారనే అంశంపై ప్రస్తుతం నెట్టింట భారీ ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్కేకు అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను ఓపెనర్గా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వారిలో కొత్తగా జట్టులో చేరిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రచిన్ ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో ఓపెనర్గా సక్సెస్ సాధించాడు కాబట్టి అతన్నే రుతురాజ్కు జోడీగా పంపాలని మెజార్టీ శాతం సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సీఎస్కే యాజమాన్యం ముందు రచిన్తో పాటు మరో రెండు ఆప్షన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వెటరన్లు అజింక్య రహానే, మొయిన్ అలీల్లో ఎవరో ఒకరికి ఓపెనర్గా ప్రమోషన్ ఇవ్వాలని ధోని యోచిస్తున్నట్లు సమాచారం. రహానేకు గతంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా ఆడిన అనుభవం ఉండటం అతనికి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే రహానేకు గత సీజన్లో పేసర్లపై విరుచుకుపడిన ట్రాక్ రికార్డు కూడా ఉండటం సెకెండ్ అప్షన్ ఓపెనర్గా అతని పేరునే పరిశీలించే అవకాశం ఉంది. రచిన్, రహానేలతో పాటు మొయిన్ అలీ పేరును సైతం సీఎస్కే మేనేజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాటర్గా మొయిన్ అలీకి పెద్ద సక్సెస్ రేట్ లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలు అతన్ని ఓపెనర్ రేసులో వెనకపడేలా చేయవచ్చు. సీజన్ ప్రారంభానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సీఎస్కే యాజమాన్యం అతి త్వరలో ఓపెనింగ్ స్థానాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో తలపడనుంది. మార్చి 22న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు.. ఎంఎస్ ధోని వికెట్కీపర్బ్యాటర్ 12 కోట్లు (కెప్టెన్) డెవాన్ కాన్వే బ్యాటర్ కోటి రుతురాజ్ గైక్వాడ్ బ్యాటర్ 6 కోట్లు అజింక్య రహానే బ్యాటర్ 50 లక్షలు అజయ్ మండల్ ఆల్ రౌండర్ 20 లక్షలు నిశాంత్ సింధు ఆల్ రౌండర్ 60 లక్షలు మొయిన్ అలీ ఆల్ రౌండర్ 8 కోట్లు శివమ్ దూబే ఆల్ రౌండర్ 4 కోట్లు రాజవర్ధన్ హంగర్గేకర్ బౌలర్ 1.5 కోట్లు షేక్ రషీద్ బ్యాటర్ 20 లక్షలు మిచెల్ సాంట్నర్ ఆల్ రౌండర్ 1.9 కోట్లు రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 16 కోట్లు తుషార్ దేశ్పాండే బౌలర్ 20 లక్షలు ముఖేష్ చౌదరి బౌలర్ 20 లక్షలు మతీషా పతిరణ బౌలర్ 20 లక్షలు సిమ్రన్జీత్ సింగ్ బౌలర్ 20 లక్షలు దీపక్ చాహర్ బౌలర్ 14 కోట్లు ప్రశాంత్ సోలంకి బౌలర్ 1.2 కోట్లు మహేశ్ తీక్షణ బౌలర్ 70 లక్షలు రచిన్ రవీంద్ర బ్యాటర్ 1.8 కోట్లు శార్దూల్ ఠాకూర్ ఆల్ రౌండర్ 4 కోట్లు డారిల్ మిచెల్ ఆల్ రౌండర్ 14 కోట్లు సమీర్ రిజ్వీ బ్యాటర్ 8.4 కోట్లు ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 2 కోట్లు అవినాష్ రావు ఆరవెల్లి కొట్టు 20 లక్షలు -
NZ vs Aus: 5 వికెట్లతో చెలరేగిన గ్లెన్ ఫిలిప్స్.. రచిన్ ఫిఫ్టీ!
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్లు), హాజల్వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్కు 116 పరుగులు జోడించడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఆసీస్కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు: ఆస్ట్రేలియా- 383 & 164 న్యూజిలాండ్- 179 న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369.. మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
NZ Vs Aus: న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ
Australia tour of New Zealand, 2024: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా ఈ ఓపెనర్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. కాన్వే స్థానంలో అతడు జట్టులోకి ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. ‘‘కీలక మ్యాచ్కు ముందు డెవాన్ జట్టుకు దూరం కావడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది. టాపార్డర్లో ఇలాంటి క్లాస్ ప్లేయర్ సేవలను కోల్పోవడం కష్టంగా ఉంది. పూర్తిగా కోలుకుని అతడు తిరిగి జట్టుతో చేరతాడని నమ్మకం ఉంది’’ అని కివీస్ జట్టు హెడ్కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. కాన్వే స్థానంలో హెన్రీ నికోల్స్ను ఎంపిక చేసినట్లు తెలిపాడు. కాగా మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన ఆసీస్.. తదుపరి టెస్టు సిరీస్పై కన్నేసింది. రచిన్, మిచెల్ వచ్చేస్తున్నారు మరోవైపు.. సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో కంగారూ జట్టు చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఇరు జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. ఈ మ్యాచ్కు యువ సంచలనం రచిన్ రవీంద్ర, ఆల్రౌండర్ డారిల్ మిచెల్ అందుబాటులోకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఆసీస్తో రెండో టీ20 సందర్భంగా డెవాన్ కాన్వే ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. దీంతో మూడో టీ20కి దూరంగా ఉన్న అతడు.. తొలి టెస్టుకు కూడా ఆడలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు న్యూజిలాండ్ టెస్టు జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మ్యాట్ హెన్రీ, స్కాట్ కుగెలిజిన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్. చదవండి: Ind vs Eng: లండన్కు పయనమైన కేఎల్ రాహుల్.. కారణం ఇదే! -
NZ vs Aus: రచిన్ సుడిగాలి ఇన్నింగ్స్.. 19 బంతుల్లోనే!
New Zealand vs Australia, 1st T20I - Rachin Ravindra Maiden T20I fifty: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్ డెవాన్ కాన్వే, ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సుడిగాలి అర్ధ శతకాల కారణంగా భారీ స్కోరు నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు ఆసీస్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 బుధవారం మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 32 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కాన్వే(46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర 35 బంతులు ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. 19 బంతుల్లోనే 54 రన్స్ రచిన్ ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఆరు సిక్స్లు ఉన్నాయి. కాగా రచిన్కు టీ20లలో ఇదే తొలి అర్థ శతకం కావడం విశేషం. 29 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఇక తాను ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసిన రచిన్.. మిగిలిన 19 బంతుల్లో 54 పరుగులతో సత్తా చాటాడు. రచిన్ సంగతి ఇలా ఉంటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 19, ఐదో నంబర్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 13 బంతుల్లో 18 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం మూడు వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. Rachin Ravindra 🔥#nzvsaus pic.twitter.com/VgISIw95Ji — piyush (@piyushson17) February 21, 2024 చదవండి: IPL 2024: టెస్టులో ధనాధన్ ఇన్నింగ్స్.. సర్ఫరాజ్ రీఎంట్రీ! A chat with Wellington local Rachin Ravindra after his maiden T20I fifty 🏏 #NZvAUS pic.twitter.com/ON0wxbgQGA — BLACKCAPS (@BLACKCAPS) February 21, 2024 -
న్యూజిలాండ్కు షాకిచ్చిన సౌతాఫ్రికా ‘అనుభలేమి జట్టు’!
న్యూజిలాండ్తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో అనూహ్యంగా సౌతాఫ్రికా పైచేయి సాధించింది. మంగళవారం నాటి ఆటను 220/6తో ముగించిన సౌతాఫ్రికా.. బుధవారం తమ స్కోరుకు మరో 22 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. 242 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. హామిల్టన్ టెస్టులో కివీస్ బౌలర్లలో విలియం రూర్కీ 4 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర 3 వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ టిమ్ సౌతీతో పాటు మ్యాట్ హెన్రీ, వాగ్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్కు సౌతాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ 40 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 43 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా వాళ్లలో విల్ యంగ్(36), నీల్ వాగ్నర్(33) మాత్రమే ముప్పై పరుగుల మార్కు అందుకున్నారు. ఫలితంగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 77.3 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా కంటే.. 31 పరుగులు వెనుకబడి ఉంది. ప్రొటిస్ స్పిన్నర్ డేన్ పీడ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ డేన్ పీటర్సన్ 3 వికెట్లు కూల్చాడు. మరో పేసర్ మొరేకికి ఒక వికెట్ దక్కింది. కాగా తొలి టెస్టులో ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర(240) వ్యక్తిగత స్కోరు కంటే కూడా ఈసారి కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు తక్కువ కావడం గమనార్హం. ఇక మొదటి టెస్టులో రచిన్ డబుల్ సెంచరీ, విలియమ్సన్ వరుస సెంచరీల కారణంగా 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది న్యూజిలాండ్. అనుభలేమి సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్తో బిజీగా ఉన్న కారణంగా కీలకమైన కివీస్ పర్యటనకు అనుభవలేమి జట్టును పంపి విమర్శుల మూటగట్టుకుంది సౌతాఫ్రికా. న్యూజిలాండ్తో మౌంట్ మాంగనుయ్లో జరిగిన తొలి టెస్టు సందర్భంగా ఏకంగా ఆరుగురు ప్రొటిస్ ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. చదవండి: అరంగేట్ర జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి! -
ఈసారి బంతితో మ్యాజిక్ చేసిన రచిన్ రవీంద్ర
న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర ఫార్మాట్లకతీతంగా ఇరగదీస్తున్నాడు. వన్డే వరల్డ్కప్ 2023లో సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన రచిన్.. తాజాగా టెస్ట్ ఫార్మాట్లోనూ సత్తా చాటుతున్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో బ్యాట్తో (డబుల్ సెంచరీ) చెలరేగిన రచిన్.. ఇవాళ (ఫిబ్రవరి 13) మొదలైన రెండో టెస్ట్లో బంతితో మ్యాజిక్ చేశాడు. రచిన్ 3 వికెట్లతో రాణించడంతో పర్యాటక సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రచిన్తో పాటు మ్యాట్ హెన్రీ (1/48), విలియమ్ రూర్కీ (1/47), నీల్ వాగ్నర్ (1/28) వికెట్లు తీశారు. 150 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికాను రుయాన్ డి స్వార్డ్ట్ (55), షాన్ వాన్ బెర్గ్ (34) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజ్లోనే ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో నీల్ బ్రాండ్ 25, క్లైడ్ ఫోర్టిన్ 0, రేనార్డ్ వార్ టోండర్ 32, జుబేర్ హంజా 20, డేవిడ్ బెడింగ్హమ్ 39, కీగన్ పీటర్సన్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సిరీస్లోని జరిగిన తొలి మ్యాచ్లో కివీస్ 281 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. కేన్ విలియమ్సన్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్ట్లో రచిన్ బంతితోనూ (2 వికెట్లు) పర్వాలేదనిపించాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును పంపించి చేతులుకాల్చుకుంది. -
‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!
New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్-2024తో బిజీ కావడంతో నీల్ బ్రాండ్ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్ బ్రాండ్ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం. రచిన్ డబుల్ సెంచరీ ఈ క్రమంలో మౌంట్ మౌంగనుయ్ వేదికగా కివీస్తో ఆదివారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ విలియమ్సన్(118) సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ(240)తో చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్ బ్యాటర్లలో కీగన్ పీటర్సన్(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్ (3/34), జేమీసన్ (2/35), రచిన్ రవీంద్ర (2/16) రాణించారు. విలియమ్సన్ వరుస శతకాలతో ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ (109; 12 ఫోర్లు, 1 సిక్స్) రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్ క్రికెటర్గా విలియమ్సన్ గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా చిత్తు ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టార్గెట్ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో కైలీ జెమీషన్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్లకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్ ఆటగాళ్లు: 1.ఎడ్వర్డ్ మూరే(ఓపెనర్) 2.నీల్ బ్రాండ్(ఓపెనర్, కెప్టెన్) 3.వాన్ టాండర్(వన్డౌన్ బ్యాటర్) 4.రువాన్ డి స్వార్డ్(బౌలింగ్ ఆల్రౌండర్) 5.క్లైడ్ ఫార్చూన్(వికెట్ కీపర్ బ్యాటర్) 6. షోపో మొరేకి(పేస్ బౌలర్). చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్ -
రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో
మౌంట్ మాంగనుయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్తో డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కాగా రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు. ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కేన్ మామ(118) పరుగులు చేశాడు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. What an incredible moment! After over 8 hours at the wicket, Rachin Ravindra has passed 200 runs - a historic double hundred 🔥👏@BLACKCAPS v South Africa: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/00Xlbjoirl — TVNZ+ (@TVNZ) February 5, 2024 -
సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. రచిన్ రీఎంట్రీ..?
సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ విల్ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్ర ఈ సిరీస్తో టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్ వన్డేల్లోలా ఓపెనర్గా కాకుండా మిడిలార్డర్లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే. 2021 భారత పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేసిన రచిన్.. ఆ పర్యటనలో రెండు టెస్ట్లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్కు టెస్ట్ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్కు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్కప్ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది. సౌతాఫ్రికాతో సిరీస్కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్ -
యశస్విని వెనక్కినెట్టిన రచిన్: అవార్డులు గెలిచింది వీళ్లే.. పూర్తి జాబితా
ICC Awards 2023: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)- 2023 వార్షిక పురస్కారాల్లో భారత్కు రెండు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. రన్మెషీన్ విరాట్ కోహ్లి మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలవగా.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కోహ్లి ఏకంగా నాలుగోసారి(వన్డే) ఈ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించగా.. సూర్య వరుసగా రెండోసారి పురస్కారం అందుకుని ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని ఘనత(టీ20) సాధించాడు. కెప్టెన్సీలో అదరగొట్టాడు.. అందుకే గత ఏడాది సూర్య 18 మ్యాచ్లు ఆడి 155.95 స్ట్రయిక్రేట్తో 733 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ‘టి20 ఫార్మాట్లో భారత మిడిలార్డర్ వెన్నెముకగా సూర్య ఉన్నాడు. తన దూకుడైన ఆటతో పలుసార్లు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్సీ బాధ్యతల్లోనూ అతను ఒత్తిడికి లోనుకాకుండా నిలకడగా రాణించాడు’ అని ఐసీసీ వ్యాఖ్యానించింది. ఇక ఈ టీమిండియా స్టార్లతో పాటు 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితా చూద్దాం. ►మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 విజేత జట్టు కెప్టెన్ ►మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- విరాట్ కోహ్లి(ఇండియా) డబ్ల్యూటీసీ టైటిల్ ►మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా)- 13 మ్యాచ్లలో కలిపి 1210 పరుగులు- ఆసీస్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర యశస్విని వెనక్కినెట్టి ►మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)- వన్డే వరల్డ్కప్లో 578 పరుగులు. యశస్వి జైస్వాల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుషాంకలను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. డచ్ జట్టు విజయాలకు కారణం ►మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- బాస్ డి లీడే(నెదర్లాండ్స్)- 285 పరుగులు చేసి, 15 వికెట్లు తీసి- వన్డే వరల్డ్కప్నకు డచ్ జట్టు అర్హత సాధించడంలో కీలక పాత్ర- వన్డే ప్రపంచకప్లో 139 పరుగులు- 16 వికెట్లు. మహిళా క్రికెట్లో మహరాణులు ►వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- నాట్ సీవర్ బ్రంట్(ఇంగ్లండ్) ►వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- చమరి ఆటపట్టు(శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 415 రన్స్ ►వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- హేలీ మాథ్యూస్(వెస్టిండీస్)- స్టెఫానీ టేలర్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో వెస్టిండియన్ ప్లేయర్- టీ20లలో జట్టుకు అవసరమైన సమయంలో 99 నాటౌట్, ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా 132, 79 రన్స్ ►వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- ఫోబె లిచ్ఫీల్డ్(ఆస్ట్రేలియా)- ఆసీస్ టాపార్డర్కు వెన్నెముకగా నిలిచినందుకు ►వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- క్వీంటర్ అబెల్(కెన్యా)- అంతర్జాతీయ టీ20లలో 476 పరుగులు, 30 వికెట్లు జింబాబ్వేకే ఆ అవార్డు స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డు- జింబాబ్వే జాతీయ జట్టు(ఓటమి బాధలో ఉన్న వెస్టిండీస్ ఆటగాడు అకీల్ హుసేన్ను ఓదార్చినందుకు) అంపైర్ ఆఫ్ ది ఇయర్- రిచర్డ్ ఇల్లింగ్వర్త్. ఐసీసీ టెస్టు జట్టు: ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్. ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: ఫోబె లిచ్ఫీల్డ్, చమరి ఆటపట్టు (కెప్టెన్), ఎలిస్ పెర్రీ, అమేలియా కెర్, బెత్ మూనీ (వికెట్ కీపర్), నాట్ సీవర్-బ్రంట్, యాష్ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, నాడిన్ డి క్లెర్క్, లీ తహుహు, నహీదా అక్తర్. ఐసీసీ 2023 వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, ఆడమ్ జంపా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్. ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: చమరి అటపట్టు(కెప్టెన్), బెత్ మూనీ (వికెట్ కీపర్), లారా వోల్వార్డ్, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లిస్ పెర్రీ, యాష్ గార్డెన్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, మెగాన్ షట్. ఐసీసీ పురుషుల టీ20 జట్టు: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేశ్ రాంజాని, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎన్గరవ, అర్ష్దీప్ సింగ్. చదవండి: INDA& U19 WC: ఒకేరోజు అటు అన్న.. ఇటు తమ్ముడు సెంచరీలతో ఇరగదీశారు! -
న్యూజిలాండ్ తరఫున సెంచరీ బాదిన విజయవాడ కుర్రాడు
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్లో తెలుగు కుర్రాడు స్నేహిత్ రెడ్డి సెంచరీ బాదాడు. నేపాల్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న మ్యాచ్లో స్నేహిత్ 125 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేశాడు. పేరు, విజయవాడను చూసి స్నేహిత్ భారత్ తరఫున సెంచరీ బాదాడని అనుకుంటే పొరబడినట్టే. స్నేహిత్ సెంచరీ చేసింది న్యూజిలాండ్ తరఫున. 17 ఏళ్ల స్నేహిత్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టినప్పటికీ.. అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్నాడు. స్నేహిత్లా న్యూజిలాండ్కు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. భారత్ వేదికగా ఇటీవల జరిగిన వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసిన రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది కూడా ఇండియానే. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో స్నేహిత్తో పాటు భారతీయ మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా ఉన్నాడు. 18 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఒలివర్ తెవాతియా న్యూఢిల్లీలో పుట్టి, ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్నేహిత్ విషయానికొస్తే.. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు న్యూజిలాండ్కు వలస వెళ్లారు. స్నేహిత్ విద్యాభ్యాసం, క్రికెట్ సాధన అంతా న్యూజిలాండ్లో జరిగింది. కుడి చేతి బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన స్నేహిత్ న్యూజిలాండ్ మాజీ ఆటగాళ్లు బీజే వాట్లింగ్, క్రెయిగ్ కుగ్గెలిన్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. అండర్ 15, అండర్ 17 టోర్నీల్లో పరుగుల వరద పారించిన స్నేహిత్ పేరు ప్రస్తుతం న్యూజిలాండ్లో సెన్సేషన్గా మారింది. స్నేహిత్ ప్రస్తుత న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్లను అమితంగా ఇష్టపడతాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అండర్ 19 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నేపాల్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. స్నేహిత్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్నేహిత్తో పాటు కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (75) రాణించాడు. భారత్లో పుట్టిన మరో కివీస్ క్రికెటర్ తెవాతియా డకౌటయ్యాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. 6 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. -
గిల్ సూపర్ టాలెంట్.. దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడు
He’s a super talent: టీమిండియా యువ బ్యాటర్ శుబ్మన్ గిల్పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ ప్రశంసలు కురిపించాడు. మెన్స్ క్రికెట్లో అతడు దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతాడని అంచనా వేశాడు. ఈ ఏడాది గిల్ అత్యుత్తమంగా రాణించాడంటూ అతడిని ‘‘సూపర్ టాలెంట్’’గా అభివర్ణించాడు. అత్యధిక పరుగుల వీరుడు కాగా అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ ఈ ఏడాది అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2023లో మొత్తంగా 29 వన్డేలు ఆడిన 24 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. సగటు 63.36తో 1584 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో గిల్.. 149 బంతుల్లోనే 208 పరుగులు రాబట్టి సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. అంతేకాదు.. టీ20, టెస్టు ఫార్మాట్లోనూ ఒక్కో శతకం బాది సత్తా చాటాడు. అద్భుత నైపుణ్యాలు... తనకు తానే సాటి ఈ నేపథ్యంలో రాబోయే తరం క్రికెట్ సూపర్స్టార్ల గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ నాసిర్ హుసేన్.. శుబ్మన్ గిల్ పేరును ప్రస్తావించాడు. ‘‘మెన్స్ క్రికెట్ నెక్ట్స్ సూపర్స్టార్ ఎవరంటే నేను శుబ్మన్ గిల్ పేరు చెబుతాను. 2023లో అతడు అత్యుత్తమంగా ఆడాడు. మరో ఎండ్ నుంచి తనకు సహకారం అందించే రోహిత్ శర్మ వంటి సీనియర్ల నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. గిల్ అద్భుత నైపుణ్యాలు కలిగిన ఆటగాడు. టీమిండియా తరఫున రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన ప్రదర్శనలు ఇవ్వగలడు. 2024లోనూ అతడి ఫామ్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని నాసిర్ హుసేన్ శుబ్మన్ గిల్ను కొనియాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టా వేదికగా పంచుకుంది. రచిన్ రవీంద్ర జోరు కొనసాగాలి ఇక ఈ ఏడాది గిల్తో పాటు న్యూజిలాండ్ యువ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర కూడా తనను బాగా ఆకట్టుకున్నాడని నాసిర్ హుసేన్ తెలిపాడు. అతడి జోరు వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. కాగా రచిన్ రవీంద్ర వన్డే వరల్డ్కప్-2023లో ఏకంగా మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే. పది ఇన్నింగ్స్లో కలిపి 578 పరుగులు రాబట్టాడు రచిన్. చదవండి: IND Vs SA: వాళ్లిద్దరిని ఎంపిక చేయకుండా పెద్ద తప్పు చేశారు: భజ్జీ View this post on Instagram A post shared by ICC (@icc) -
IPL 2024: ధోని అభిమానులకు శుభవార్త! కీలక అప్డేట్
CSK CEO Kasi Viswanathan On MS Dhoni IPL future: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఐపీఎల్ సీజన్ ఆడతాడా? గతేడాది నుంచి తలైవా అభిమానులను వేధిస్తున్న మిలియన్ డాలర్ ప్రశ్న. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్కు ఐదోసారి ట్రోఫీ అందించాడు ధోని. నిజానికి.. ఐపీఎల్-2022లోనే తన వారసుడిగా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ప్రకటించి.. పగ్గాలు అప్పగిస్తే ఫలితం శూన్యం కావడంతో మళ్లీ తనే సారథిగా బాధ్యతలు చేపట్టాడీ ఈ ‘జార్ఖండ్ డైనమైట్’. తనదైన మార్కుతో ఈ ఏడాది మరోసారి సీఎస్కేను చాంపియన్గా నిలిపాడు. వేధిస్తున్న మోకాలి నొప్పి మరి ఐపీఎల్-2024లోనూ ధోని ఇదే దూకుడును కొనసాగించగలడా? మోకాలి నొప్పి నుంచి కోలుకుని జట్టును మరోసారి ముందుండి నడిపిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జరిగిన జూనియర్ సూపర్ కింగ్స్ ఈవెంట్ లాంచ్ సందర్భంగా ధోని ఐపీఎల్ భవితవ్యంపై ప్రశ్న ఎదురుకాగా.. ‘‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కెప్టెన్గా ఆయన తనంతట తానే ఈ విషయాన్ని నేరుగా అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాడు. పది రోజుల్లో నెట్స్లో ప్రాక్టీస్ తను ఆడతాడా లేదా అన్న విషయం గురించి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. తను ఏం అనుకుంటే అదే చేస్తాడు. ప్రస్తుతం ధోని ఫిట్గానే ఉన్నాడు. రిహాబిలిటేషన్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు. జిమ్లో వర్కౌట్లు చేస్తున్నాడు. ఇంకో పది రోజుల్లో ధోని నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది’’ అని కాశీ విశ్వనాథ్.. తలైవా అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా ఐపీఎల్-2024 వేలం సందర్భంగా సీఎస్కే కొత్తగా ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2024 వేలంలో సీఎస్కే కొన్న ఆటగాళ్లు వీరే 1. రచిన్ రవీంద్ర (రూ.1.8 కోట్లు) 2. శార్దూల్ ఠాకూర్ (రూ.4 కోట్లు) 3. డారిల్ మిచెల్ (రూ.14 కోట్లు) 4. సమీర్ రిజ్వీ (రూ.8.4 కోట్లు) 5. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ.2 కోట్లు) 6. అవనీష్ రావు అరవెల్లి (రూ.20 లక్షలు). రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్పాండే, రాజ్వర్ధన్ హంగర్గేకర్, మిచెల్ శాంట్నర్, మతీషా పతిరణా, సుబ్రాన్షు సేనాపతి. రిలీజ్ చేసిన ప్లేయర్లు డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, ఎన్. జగదీశన్, సి.హరి నిశాంత్, కె.భగత్ వర్మ, కె.ఎం.ఆసిఫ్, అంబటి రాయుడు(రిటైర్డ్), రాబిన్ ఊతప్ప (రిటైర్డ్). చదవండి: IPL 2024: ముస్తాబాద్ నుంచి ఐపీఎల్ దాకా.. సీఎస్కేకు ఆడే ఛాన్స్! -
IPL 2024 Auction: సీఎస్కేపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం
చెన్నై సూపర్ కింగ్స్పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు. ఇవాళ జరిగిన వేలంలో సీఎస్కే మేనేజ్మెంట్ డారిల్ మిచెల్ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్ను 4 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు)
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement