సిగ్నల్‌ తండా రోడ్డు పరిశీలన | Sakshi
Sakshi News home page

సిగ్నల్‌ తండా రోడ్డు పరిశీలన

Published Fri, May 10 2024 3:20 PM

సిగ్నల్‌ తండా రోడ్డు పరిశీలన

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధి సిగ్నల్‌ తండా రోడ్డును గురువారం అధికారులు పరిశీలించారు. తమ తండాకు రోడ్డు సౌకర్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరిస్తూ తండాకు వెళ్లే మార్గంలో స్థానికులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయంపై పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. డోర్నకల్‌ తహసీల్దార్‌ కృష్ణవేణి, మున్సిపల్‌ కమిషనర్‌ నరేష్‌రెడ్డి, సీఐ బి.ఉపేందర్‌రావు, ఐటీడీఏ ఏఈ ప్రశాంత్‌.. సిగ్నల్‌తండా రోడ్డును పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. రూ.52 లక్షల ఐటీడీఏ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు భూసమస్యలతో నిలిచాయని ఐటీడీఏ ఏఈ ప్రశాంత్‌ తెలిపారు. అధికారుల చొరవతో శుక్రవారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ జర్పుల వీరన్న, మున్సిపల్‌ ఏఈ పాషా, సర్వేయర్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement