-
ఫోన్ ట్యాపింగ్ కేసు...ఓ మీడియా ఛానల్ ఓనర్ ఇంట్లో సోదాలు
-
కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..
-
khalistani Terrorists: నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల ఎన్ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాలోని బిలాస్పూర్ గ్రామంలో, ఫర్దికోట్లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్ మాఫియా మధ్య బలపడుతున్న నెట్వర్క్లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు చెందిన నగదు సీజ్ చేయడం, వారి ఆస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని వాటిని అటాచ్ చేయడం వీలవుతుందని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి.. గ్యాంగ్స్టర్,లేడీ డాన్ల పెళ్లికి గ్యాంగ్వార్ ముప్పు -
41 వేల ఖాతాల్లో రూ.820 కోట్లు జమ.. ప్రముఖ బ్యాంకులో సీబీఐ సోదాలు
యూకో బ్యాంక్లో గతంలో జరిగిన ఇమిడియట్ పేమెంట్ సిస్టమ్(ఐఎంపీఎస్) లావాదేవీల కుంభకోణంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్రల్లోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే.. బ్యాంకులో గతేడాది నవంబరు 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్కు చెందిన 41 వేల మందికి పైగా ఖాతాదార్ల అకౌంట్ల్లోకి తప్పుగా డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా జమ అయిన మొత్తం నిధుల విలువ రూ.820 కోట్లని తేల్చింది. 7 ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41,000కు పైగా ఖాతాదారులకు తప్పుగా నిధులు జమ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు కట్ అవకుండానే, యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమైనట్లు గుర్తించారు. ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమ అయిన తేదీల్లోనే, యూకో బ్యాంకులో వేల సంఖ్య లో కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును చాలామంది విత్డ్రా చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నిర్వహించిన దాడుల్లో యూకో బ్యాంకు, ఐడీఎఫ్సీకి చెందిన 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్లు, ఇంటర్నెట్ డాంగుల్ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం సీజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. -
టానిక్ లిక్కర్ గ్రూప్స్పై రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: టానిక్ లిక్కర్ గ్రూప్స్పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్కు 11 ఫ్రాంచైజ్లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇదీ చదవండి: Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
ఐటీ దాడులు.. ఆ కార్ల విలువే 60 కోట్లు!
ఢిల్లీ: ఇన్కమ్ టాక్స్ (ఐటీ) దాడులనగానే.. కరెన్సీ లేదంటే నగలు లేకుంటే కీలక పత్రాలు బయటపడుతుండడం చూస్తుంటాం. కానీ, ఖరీదైన కార్లు.. అందునా కోట్లు విలువ చేసే పోష్ కార్లు బయటపడడం ఎప్పుడైనా చూశామా?.. తాజాగా ఓ టొబాకో కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో ఇదే వెలుగుచూసింది. అధికారుల దాడుల్లో అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడ్డాయి. తమ దాడుల్లో కనిపించిన ఖరీదైన కార్లను చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. శుక్రవారం ఐటీ అధికారుల బృందం.. కాన్పూర్కు చెందిన ఓ టొబాకో కంపెనీపై దాడిలు చేసింది. ఢిల్లీలోని ఆ కంపెనీ యజమాని నివాసంలో కూడా సోదాలు జరిపిపారు. ఈ సోదాల్లో వారికి ఆశ్చర్యపరిచే రీతిలో అత్యంత ఖరీదైన.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెక్లారెన్, లంబోర్ఘిని, ఫెరారీ కార్లు పట్టుపడ్డాయి. వాటివిలువ సుమారు రూ.60 కోట్లు ఉండనుందని ఐటీ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను బృందం అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లతో పాటు కంపెనీ యజమాని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలతో ఉన్న పలు బ్యాగులతో సుమారు రూ.4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాన్పూర్కు చెందిన బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం నుంచే సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న ఐదు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఏకకాలంలో 15-20 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు పరిశ్రమలకు పొగాకు సంబంధిత సరుకు ఎగుమతి చేసే ఈ కంపెనీ.. భారీ ఎత్తున టాక్స్లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ యజమాని అయిన పారిశ్రామికవేత్త కేకే. మిశ్రా (అలియాస్ మున్నా మిశ్రా) సంబంధించిన ప్రాపర్టీ వివరాలు.. పలువురితో చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. తమకు ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ మాత్రమే వస్తుందని చెబుతోంది. కానీ, ఆ కంపెనీ అసలు టర్నోవర్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని ఐటీ భావిస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో లభ్యమైన పలు ఖరీదైన కార్లతో పోజులు ఇచ్చిన కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శివం మిశ్రా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాలోని ‘కహో నా ప్యార్ హై’ అనే పాటలోని ఉన్న వేషధారణతో ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రోజు(శుక్రవారం) కూడా ఐటీ దాడుల కొనసాగుతున్నాయి. -
తమిళనాడులో NIA సోదాలు
-
నారాయణ మెడికల్ కాలేజీలో అక్రమాలు..ఏసీబీ తనిఖీల్లో కీలక ఆధారాలు
-
సోదాలపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పలు రాష్ట్రాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ( ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లో వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాలపై తాజాగా ఎన్ఐఏ అధికార ప్రకటన వెల్లడించింది. తెలంగాణా, మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించాము. హైదరాబాద్లో రెండు చోట్ల సహా థానే, పాలక్కడ్, చెన్నై, మల్లాపురం సోదాలు చేశాము. సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు సంజయ్ దీపక్ను సైబరాబాద్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశాము. అరెస్ట్ సమయంలో రివాల్వర్ సహా నకిలీ ఆధార్ కార్డులు, 47వేల నగదు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఆధారంగా గత నెలలో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ రోజు ఉదయం నుంచి నాలుగు రాష్ట్రాల్లో ఆరు చోట్ల ఎన్ఐఏ సోదాలు చేశాము. సోదాల్లో భాగంగా పలు డాక్యుమెంట్లు, ఆరు చరవాణులు, సిమ్ కార్డులు, 1.37లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. చదవండి: ‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు -
సంజయ్ దీపక్ రావు అరెస్ట్ పై నన్ను ప్రశ్నించారు: వేణుగోపాల్
-
హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు
-
‘వీక్షణం’ పత్రిక ఎడిటర్ ఇంట్లో ముగిసిన ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ముగిసిన NIA సోదాలు ఎల్బీనగర్లోని శ్రీనివాస నగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఎ సోదాలు ముగిశాయి. కూకట్పల్లి పీఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు అరెస్ట్ విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు. రవిశర్మ మొబైల్తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోలకు చెందిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఎ అధికారులు. ఈ నెల 10న ఎన్ఐఎ కార్యాలయానికి హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన NIA అడిషనల్ ఎస్పీ రాజ్కుమార్. విక్షణం పత్రిక ఎడిటర్ వేణు కామెంట్స్ ఉదయం ఐదు గంటలకు మా ఇంటికి ఎన్ఐఏ వాళ్ళు వచ్చారు.. సెర్చ్ వారెంట్తో వచ్చామని చెప్పారు సంజయ్ దీపక్ రావు అరెస్ట్ అయినా దాని మీద వచ్చామని అన్నారు. 2013 నయిల్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశాను. ఆ పుస్తకాలను తీసుకెళ్లారు. నా మొబైల్ సీజ్ చేశారు. సెప్టెంబర్ 15 సింహపురి టౌన్ షిప్లో సంజయ్ దీపక్ రావును అరెస్ట్ చేశారు. దీపక్కు నాకు సంబంధముందని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి లేఖ రాశాను. నేను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యింది. దేశంలో NIA ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాము. జనవరి మూడో తేదీన నాపై పెట్టిన కేసును NIA టెకప్ చేసుకుంది. ఈ కేసులో ఏ-22గా నా పేరు చేర్చారు పోలీసుల దగ్గర ఉన్న కన్ఫక్షన్ స్టేట్మెంట్లో నా పేరు ప్రస్థావించినట్టు తెలిపారు. -
DNA దెబ్బతినే ఇంజెక్షన్లు తయారు చేస్తున్న ముఠా..
-
ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్
రాంచీ: తనపై విచారణ చేపడుతున్న ఈడీ అధికారులపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సొరెన్ను ప్రశ్నించడానికి బుధవారం ఆయన నివాసానికి ఈడీ బృందాలు వెళ్లాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో ఆయనపై ఈడీ దర్యాప్తు చేయడం ఇది రెండోసారి. నేడు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న తరుణంలో సొరెన్ అరెస్టు కానున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సొరెన్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో 144 సెక్షన్ను పోలీసులు విధించారు. అటు.. అరెస్టు వార్తల నేపథ్యంలో ఆయన భార్య కల్పనా సొరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అటు సొరెన్పై ఈడీ దాడులు రాజకీయంగానూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జార్ఖండ్లో భారీ భూకుంభకోణంలో హేమంత్ సొరెన్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా భూమి యాజమాన్యాన్ని మార్చే మాఫియాకు సహకరించారని అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని సొరెన్ ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.36 లక్షలు, ఒక కారు, కొన్ని విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పనితీరుకు అంతరాయం కలిగించేందుకే ఈడీ తనను టార్గెట్ చేసిందని సొరెన్ ఆరోపిస్తున్నారు. ఇదీ చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టులో అధికారులు హాజరు పర్చారు. కాగా.. ఆయనకు కోర్టు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 8వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు ఆయన్ను చంచల్ గూడా జైలుకు తరలించారు. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాలకృష్ణ ఇంటితో పాటు, బందువులు, సహచరుల ఇళ్లల్లో సోదాలు చేశామని పేర్కొన్నారు. బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షలు నగదు సీజ్ చేశామని స్పష్టం చేశారు. 1988 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు. 6 కేజీల సిల్వర్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. రూ.8.26 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూ లో ఇంకా ఎక్కువ ఉంటుందని అన్నారు. మిగిలిన బీనామీలపై విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. బాధితుల ఆవేదన.. ఏసీబీ అరెస్టుతో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పుప్పాలగూడ సర్వేనెంబర్ 447లో కోర్టు పరిధిలోని వివాదస్పద భూములకు అనుమతులు ఇచ్చారని సూర్యప్రకాష్ అనే బాధితుడు తెలిపాడు. తమకు కోర్టు డిక్రీ ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి పరిమీషన్ ఇచ్చాడని వెల్లడించాడు. రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు హైరేస్ అపార్ట్ మెంట్స్ కు అనుమతులు ఇచ్చాడని పేర్కొన్నాడు. అక్రమ అనుమతులపై హైకోర్టకు వెళ్తే కోర్టును తప్పుదోవ పట్టించి ఫేక్ అఫిడవిట్ వేశారని తెలిపాడు. ఆర్టీఏ ద్వారా సమాచారం అడిగితే ఇప్పటివరకు ఎలాంటి సమాదానం ఇళ్వకుండా దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.400కోట్ల విలువైన 6.36 ఎకరాల భూమిలో అక్రమ పర్మిషన్ ఇచ్చాడని బాధితులు తెలిపాడు. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్నారని గతంలో తమను బెదిరించారని తెలిపారు. సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శివ బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. ఇదీ చదవండి: నేడో రేపో కోర్టులో ప్రవేశపెట్టనున్న ఏసీబీ -
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ సోదాలు
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై బుధవారం ఏసీబీ సోదాలు జరిగాయి. ఆదాయం మించి ఆస్తుల కేసు నమోదు చేసి 8 ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. 20 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. బాలకృష్ణ ఇల్లు, బంధువులు ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టంది. గతంలో పదవిని అడ్డం పెట్టుకొని రూ. కోట్లు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేశారు. చదవండి: సీఎం రేవంత్ సెక్యూరిటీలో లీక్ రాయుళ్లు.. ఐబీ కీలక నిర్ణయం -
ఆ షాపులపై రంగు పడింది
భూదాన్ పోచంపల్లి: పేటెంట్ హక్కు కలిగి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్ను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి విక్రయిస్తున్న పలు వస్త్ర దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 8న సాక్షి దినపత్రికలో ‘ఇక్కత్కు ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 12 చేనేత వస్త్రాల షోరూంలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అక్కడి షాపుల్లో విక్రయిస్తున్న ఇక్కత్ ప్రింటెడ్, పవర్లూమ్లపై తయారైన వస్త్రాలను సీజ్ చేసి సంబంధిత షాపు యజమానులకు నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. దినపత్రికలలో వచ్చిన కథనానికి స్పందించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోచంపల్లిలో సీజ్ చేసిన వస్త్రాలను చెన్త్నెలోని ల్యాబ్టెస్టింగ్కు పంపిస్తామని, ప్రింటెడ్ వస్త్రాలు అని తేలితే నిందితులు స్థానికులైతే కేసు నమోదు చేస్తామని, లేదా ఇతర రాష్ట్రాలలో తయారైనవిగా తేలితే అక్కడి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. హ్యాండ్లూమ్ మార్కు తప్పనిసరి స్వచ్ఛతకు నిదర్శనమైన హ్యాండ్లూమ్ మార్కు, సిల్క్మార్క్తో పాటు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగో ట్యాగ్ చేసిన చేనేత వస్త్రాలను మాత్రమే పోచంపల్లి వస్త్ర వ్యాపారులు అమ్మాలని వెంకటేశం కోరారు. దాడుల్లో జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్, డీఓలు ప్రసాద్, సంధ్యారాణి, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు -
HYD: ఏసీబీ వలలో చైతన్యపురి కానిస్టేబుళ్లు
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీస్స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లుతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో నిందితుడి దగ్గర నుంచి కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హర్యానాలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితులు, బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్ షూటర్లు అంకిత్ సెర్సా, ప్రియవ్రత్ ఫౌజీల కుటుంబ సభ్యులను విచారించేందుకు సోనిపట్ జిల్లాకి ఎన్ఐఏ అధికారులు వెళ్లారు. VIDEO | NIA conducts raids in connection with #SidhuMooseWala murder case in Sonipat, Haryana. pic.twitter.com/ofm93XDhnI — Press Trust of India (@PTI_News) January 11, 2024 ఇదీ చదవండి: అశ్లీల కంటెంట్... యూట్యూబ్కు సమన్లు -
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు
-
LB Nagar:మెడికల్ షాపులపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ జోన్లోని మెడికల్ షాప్లపై ఎస్ఓటీ పోలీసులు, నార్కో టిక్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మెడికల్ షాప్లలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పలు మెడికల్ షాప్లపై దాడులు నిర్వహించి నిషేధిత ఆల్ ఫ్రాక్స్ డ్రగ్స్ (NDPS), ఇంజెక్షన్లు, మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. పది మంది మెడికల్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం అల్కాపూరిలో దాడులు కొనసాగుతున్నాయి. -
ఈడీ దాడులు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, అక్రమ ఆయుధాల సీజ్
చండీగఢ్: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హర్యానాలోని ప్రతిపక్ష నేతల ఇళ్లపై మెరుపు దాడులు చేపట్టింది. అక్రమ మైనింగ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, మరికొందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. యమునా నగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్ వంటి 20 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత మైనింగ్ వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేపట్టింది. 15, 20 మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. కుటుంబంలోని అందరి సెల్ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 100 బాటిళ్ల మద్యం, రూ. 5 కోట్ల నగదు, భారీగా అక్రమ విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, నగదుతో పాటు 4 నుంచి 5 కిలోల బరువున్న మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సింగ్ యమునానగర్ మాజీ శాసన సభ్యుడు. అదే విధంగా ఎమ్మెల్యే పన్వార్ ఇంట్లోనూ దాడులు కొనసాగాయి ఆయన సోనిపట్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించిన మైనింగ్పై యమునానగర్, చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హర్యానా పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. అనంతరం దీనిపై 2013లో ఈడీ మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలను నిందితులుగా పేర్కొంది. వీరు మైనింగ్ కోసం బిల్లులు, స్లిప్పులను రూపొందించడానికి నకిలీ 'ఈ-రవాణ' పథకాన్ని నడుపుతున్నట్లు ఈడీ ఆరోపించింది. -
హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు
-
పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, ముంబయి, ఢిల్లీలో జరిపిన సోదాల్లో 8మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. Nia Foils ISIS Ballari Module’s Plans to Trigger IED Blasts Arrests 8 Terror Operatives, including Module Head, in Raids Across 4 States, Seizes Explosive Raw Materials, Weapons, Documents Exposing Terror Plans, etc. pic.twitter.com/jluje0B91b — NIA India (@NIA_India) December 18, 2023 సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్పౌడర్ వంటి పేలుడు పదార్థాల నిల్వలు, ప్రతిపాదిత దాడుల వివరాలతో కూడిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. బాకులు, నగదు, డిజిటల్ పరికరాల వంటి పదునైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బళ్లారి మాడ్యూల్కు చెందిన నాయకుడు మహ్మద్ సులైమాన్ అరెస్టైన వాళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులు సమాచారం పంచుకోవడానికి IM యాప్లను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోపేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారని అధికారులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్లో చేర్చుకోవడానికి కళాశాల విద్యార్థులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని గత వారం ఎన్ఐఏ 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం? -
ఉగ్ర దాడులకు ప్లాన్.. బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు
బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పలుచోట్ల ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు చేపట్టింది. రెండు రోజులు క్రితం.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్ మాడ్యూల్ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పడఘా - బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదుతోపాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. The National Investigation Agency is conducting searches over half a dozen locations in Bengaluru in a terror conspiracy case. pic.twitter.com/az1k80U07m — ANI (@ANI) December 13, 2023
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement