-
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పనితీరు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ ట్రెండ్ను నిర్ణయిస్తాయని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ ధరలు, బాండ్లపై రాబడులు, రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. ఈ వారం ఈక్విటీ ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ఆకర్షణీయమైన క్యూ3 జీడీపీ డేటా నమోదు, ఫిబ్రవరి తయారీ రంగ, ఆటో అమ్మకాలు మెప్పించడంతో గతవారం సూచీలు సరికొత్త గరిష్టాలను అధిరోహించాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బ్యాంకులు, ఆటో, మెటల్ షేర్లు రాణించాయి. ‘‘స్మాల్క్యాప్, మిడ్క్యాప్ పథకాల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల రక్షణ దృష్ట్యా తగిన విధివిధానాలను అమలు చేయలంటూ సెబీ ఏంసీఏలను ఆదేశించడంతో చిన్న, మధ్య తరహా షేర్లలో దిద్దుబాటు మెదలైంది. రానున్న రోజుల్లోనూ కొనసాగే వీలుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలూ స్వల్పంగా పెరిగాయి. ఏవైనా ప్రతికూల సంకేతాలు నెలకొంటే మార్కెట్లో ప్రస్తుత సానుకూలతను దెబ్బతీయగలవు. అయితే ప్రతికూలతను మార్కెట్ విస్మరిస్తే బుల్లిష్ మూమెంటం కొనసాగొచ్చు. రెండు నెలల స్థిరీకరణ తర్వాత నిఫ్టీ బుల్లిష్ వైఖరి ప్రదర్శిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ నాడు కీలకమైన నిరోధం 22,400 స్థాయిని చేధించి 22,420 వద్ద ముగిసింది. లాభాల కొనసాగితే 22,500 స్థాయిని పరీక్షింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే 22,200 స్థాయి వద్ద కీలక మద్దతు ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింఘ్ తెలిపారు. 3 ఐపీఓలు రూ.1,325 కోట్లు ప్రాథమిక మార్కెట్లో ఈ వారమూ ఐపీఓల సందడి కొనసాగనుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా గోపాల్ స్నాక్స్, జేజీ కెమికల్స్, ఆర్కే స్వామి కంపెనీలు రూ.1,325 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సరీ్వసెస్ సంస్థ ఆర్కె స్వామీ 4–6 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు రానుంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 173 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ నుంచి మరో రూ. 250.56 కోట్లను మొత్తం రూ.423.56 కోట్ల వరకు నిధుల సమీకరించనుంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 270–288 మధ్య నిర్ణయించింది. జింక్ ఆక్సైడ్ తయారీ కంపెనీ జేజీ కెమికల్స్ 5–7 తేదీల మధ్య రూ. 251.2 కోట్ల నిధులను సమీకరించనుంది. రూ. 210–221 శ్రేణిలో ధరలను నిర్ణయించగా, కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 165 కోట్లను, ఆఫర్ ఫర్ సేల్ రూ. 86.2 కోట్లను సేకరించనుంది. రాజ్కోట్ కేంద్రంగా కార్యకలాపాలను సాగించే గోపాల్ స్నాక్స్ కంపెనీ ఈ నెల 6–11 తేదీల మధ్య పబ్లిక్ ఇష్యూకు అందుబాటులో ఉండనుంది. రూ. 650 కోట్ల వరకు నిధుల కోసం సిద్ధమవుతున్న కంపెనీ రూ. 381–401 శ్రేణిలో షేర్ల ధరలను నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 16 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 13 వేల కోట్ల వరకు సేకరించాయి. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయంగా మంగళవారం ఫిబ్రవరి సేవారంగం గణాంకాలు విడుదల అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఫిబ్రవరి 23 తేదీతో ముగిసిన బ్యాంకు రుణ, డిపాజిట్ వృద్ధి డేటా, మార్చి ఒకటో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వలు వెల్లడి కానున్నాయి. -
నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్!
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్లో పెండింగ్లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం (మార్చి 1) నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్మిట్టల్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ►తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ టీమ్లలో తహసీల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితోపాటు పారాలీగల్ వలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించాలి. వారికి దీనికి అవసరమైన శిక్షణను కూడా ఇప్పించాలి. ►పెండింగ్ దరఖాస్తులను మాడ్యూళ్లు లేదా గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలి. ►దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వీఆర్వోల ద్వారా లేదంటే వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సదరు దరఖాస్తుదారులకు పంపాలి. ►సేత్వార్, ఖస్రా, సీస్లా పహాణి, ఇతర పాత పహాణీలు, పాత 1బీ రిజిస్టర్లు, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్ దరఖాస్తులను, వాటితోపాటు వచి్చన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలించాలి. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల వివరాలను కూడా క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ►అవసరమనుకుంటే ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపాలి. స్థానికంగా సదరు భూముల గురించి విచారించాలి. చివరిగా నివేదికను రూపొందించి.. సదరు దరఖాస్తును ఆమోదించాలా, తిరస్కరించాలా అన్నది పొందుపర్చాలి. ► ప్రత్యేక బృందాల నివేదికలను తహసీల్దార్లు పైస్థాయి అధికారులకు పంపాలి. వారు వాటిని పరిశీలించి దరఖాస్తు ఆమోదానికి లేదా తిరస్కారానికి గల కారణాలను తెలియజేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ►ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి. ఒక్కటి కూడా పెండింగ్లో ఉండకూడదు. ఇందుకు కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన మధ్యప్రదేశ్ బౌలర్
మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కుల్వంత్ కేజ్రోలియా చరిత్రపుట్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్లో అతను నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ఆఖరి రోజు 95వ ఓవర్ వేసిన కుల్వంత్.. రెండు, మూడు, నాలుగు, ఐదు బంతులకు వికెట్లు తీసి, రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. కుల్వంత్కు ముందు ఢిల్లీ బౌలర్ శంకర్ సైనీ (1988), జమ్మూ కశ్మీర్ బౌలర్ మొహమ్మద్ ముదాసిర్ (2018) మాత్రమే రంజీల్లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. కుల్వంత్ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విరుచుకుపడటంతో (5/34) మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. ఐపీఎల్లో ఢిల్లీ, కేకేఆర్ జట్ల తరఫున ఆడిన కుల్వంత్.. మధ్యప్రదేశ్ తరఫున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్గా, రంజీ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 80వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. నాలుగో బంతుల్లో నాలుగు వికెట్ల ఘనతను అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎక్కువ మంది సాధించలేదు. ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఫీట్ను సాధించారు. లసిత్ మలింగ, ఆండ్రీ రసెల్, షాహీన్ అఫ్రిది, రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 454 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (111) సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం బరోడా తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకే కుప్పకూలింది. అనుభవ్ అగర్వాల్, సరాన్ష్ జైన్ బరోడా పతనాన్ని శాశించారు. కుల్వంత్ 2 వికెట్లు తీశాడు. ఆతర్వాత ఫాలో ఆన్ ఆడిన బరోడా.. కుల్వంత్ ధాటికి సెకెండ్ ఇన్నింగ్స్లో 270 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. రావత్ (105) సెంచరీ చేసినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. -
IND VS ENG 2nd Test: అరుదైన క్లబ్లో చేరిన జైస్వాల్
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారీ సెంచరీ (179) చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్న టీమిండియా భవిష్యత్ తార, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. భారత్ తరఫున టెస్ట్ల్లో సిక్సర్తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. Reaching a Test Hundred with a SIX for India Umrigar Kapil Dev Tendulkar (6 times) Azharuddin Dravid Sehwag Irfan Pathan Gambhir (2 times) MS Dhoni Harbhajan KL Rahul (twice) Rohit (3 times) Ashwin Pujara Pant (2 times) JAISWAL pic.twitter.com/ExOjCFhUQR — Cricketopia (@CricketopiaCom) February 2, 2024 సిక్సర్తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఫీట్ను సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ ఖాతాలో ఉంది. సచిన్ ఏకంగా ఆరు సార్లు సిక్సర్తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్ తర్వాత ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తలో రెండు సార్లు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. విశేషమేమిటంటే హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఫుల్టైమ్ బౌలర్లు కూడా సిక్సర్తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. ఈ జాబితాలో పైపేర్కొన్న వారు కాకుండా కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, రాహల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ మార్కును కూడా సిక్సర్తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ఐదు మ్యచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), శుభ్మన్ గిల్ (34), శ్రేయస్ అయ్యర్ (27), రజత్ పాటిదార్ (32), అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) తక్కువ స్కోర్లకే ఔటైనా యశస్వి కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా చేశాడు. యశస్వితో పాటు అశ్విన్ (5) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, టామ్ హార్ట్లీ తలో వికెట్ దక్కించకున్నారు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
IND VS ENG 1st Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండోసారి ఇలా..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (సెకెండ్ ఇన్నింగ్స్లో 196 పరుగులు), స్పిన్నర్ టామ్ హార్ట్లీ (2/131, 7/62) అద్భుతంగా రాణించి టీమిండియా ఓటమికి ప్రధాన కారకులయ్యారు. వీరిద్దరూ అత్యుత్తమంగా రాణించి టీమిండియాకు స్వదేశంలో (100కి పైగా లీడ్ సాధించినప్పటికీ) ఓటమి రుచి చూపించారు. ఈ మ్యాచ్తో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్ట్లీ.. తన కెరీర్ తొలి మ్యాచ్లోనే ఓ చెత్త రికార్డును, ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హార్ట్లీ తాను సంధించిన తొలి బంతికే సిక్సర్ సమర్పించుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అనంతరం హార్ట్లీ ఇదే మ్యాచ్లో ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ అరంగేట్రంలో తొలి బంతికే సిక్సర్ సమర్పించుకుని అదే మ్యాచ్లో తొమ్మిది వికెట్లతో (3/145, 6/73) చెలరేగిన రెండో ఆటగాడిగా హార్ట్లీ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఇతనికి ముందు బంగ్లాదేశ్ ఆటగాడు సోహగ్ ఘాజీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. 2012లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఘాజీ కూడా ఇలాగే తొలి బంతికే (అరంగేట్రం) సిక్సర్ సమర్పించుకుని, అదే మ్యాచ్లో తొమ్మిది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఘాజీ పేరు మీద ఇప్పటికీ చెక్కుచెదరని ఓ ప్రపంచ రికార్డు కూడా ఉంది. ఓ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధించిన ఏకైక క్రికెటర్గా ఘాజీ నేటికీ చలామణి అవుతున్నాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్తో కలుపుకుని ఈ ఘనత రెండుసార్లు సాధించిన ఏకైక క్రికెటర్గా ఘాజీ చరిత్ర పుటల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల భారీ లీడ్ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్ మూడో ఇన్నింగ్స్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ ముందు ఫైటింగ్ టోటల్ను ఉంచాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన భారత్ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది. -
గ్లోబల్ మూవీగా సలార్..అరుదైన ఘనత సాధించిన ప్రభాస్
-
రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్..దెబ్బకు రికార్డులన్నీ బద్దలు !
-
12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం.. చరిత్రపుటల్లోకెక్కిన బీహార్ ఆటగాడు
12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీలోకి అరంగేట్రం చేయడం ద్వారా బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ చరిత్రపుటల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో భాగంగా ముంబైతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్లో బీహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్ పేరిట ఉంది. అలీముద్దీన్ 1942-43 రంజీ సీజన్లో రాజ్పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అలీముద్దీన్ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రికార్డు ఎస్కే బోస్, మొహమ్మద్ రంజాన్ పేరిట ఉంది. బోస్.. 1959-60 రంజీ సీజన్లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్.. 1937 సీజన్లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి డెబ్యూ చేశాడు. ఈ ముగ్గురు వైభవ్ కంటే చిన్నవయసులోనే ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. వైభవ్.. రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్ కూచ్ బెహార్ ట్రోఫీలో బీహార్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. జార్ఖండ్తో జరిగిన ఆ మ్యాచ్లో వైభవ్ రెండు ఇన్నింగ్స్ల్లో 151, 76 పరుగులు చేశాడు. వైభవ్కు లోకల్ క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్గా పేరుంది. ముంబైతో ఇవాళ మొదలైన రంజీ మ్యాచ్లో వైభవ్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్లో బుపేన్ లాల్వాని (65), సువేద్ పార్కర్ (50), తనుశ్ కోటియన్ (50) అర్దసెంచరీలతో రాణించారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్ 4, సకీబుల్ గనీ, హిమాన్షు సింగ్ తలో 2 వికెట్లు, అషుతోష్ అమన్ ఓ వికెట్ పడగొట్టారు. -
ఆర్బీఐ అండతో మళ్లీ రికార్డుల మోత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి మెప్పించడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 –24) వృద్ధి రేటు అంచనాలు పెంచడం, వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్ల జోలికెళ్లకపోవడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకులు, ఫైనాన్స్ సరీ్వసులు, రియల్టీ షేర్లకు భారీ డిమాండ్ లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు నమోదు నమోదు చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్షా సమావేశ నిర్ణయాలు వెల్లడి(ఉదయం 10 గంటలు) తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 372 పాయింట్లు బలపడి 69,894 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి తొలిసారి 21 వేల స్థాయిపై 21,006 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ► బ్లాక్ డీల్ ద్వారా 75.81 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా వెల్లడి కావడంతో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ షేరు 12% లాభపడి రూ.69 వద్ద ముగిసింది. -
ఎడారి రాష్ట్రంలో ఓటింగ్ సునామీ!
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఈసారి ఓటింగ్ శాతం మునుపటి ఓటింగ్ శాతాన్ని మించిపోనుంది. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 68 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం, పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్లో అత్యల్పంగా 57.36 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 74.06 శాతం రాజస్థాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ వెలుపల ఓటర్లు పొడవాటి క్యూలలో నిల్చోవడం చూస్తుంటే, ఓటింగ్ శాతం 75 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్లో ఓటింగ్పై బీజేపీ ఫిర్యాదు ఓటింగ్ శాతం బాగా నమోదవుతుందని భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష బీజేపీ మాత్రం స్లో ఓటింగ్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. స్లో ఓటింగ్ కోసం అధికార యంత్రాంగంపై సీఎం అశోక్ గెహ్లాట్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ నారాయణ్ పంచారియా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, పోలింగ్ ముగిసే సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 5.25 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. 199 నియోజకవర్గాల్లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తమ ఓటు ద్వారా నిర్ణయించారు. నువ్వా.. నేనా.. రాజస్థాన్లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ప్రత్యక్ష పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతుండగా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి చెక్ చెప్పి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీజీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. -
CWC 2023: 31 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా..!
వన్డే వరల్డ్కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఆదివారం నెదర్లాండ్స్పై గ్రాండ్ విక్టరీతో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో ఓ రికార్డును భారత్ 31 ఏళ్ల అనంతరం సాధించింది. నిన్నటి మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించి, వరల్డ్కప్ రికార్డును సమం చేశాడు. వరల్డ్కప్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే ఓ మ్యాచ్లో తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించారు. 1987 వరల్డ్కప్లో తొలిసారి ఇలా జరిగింది. నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ తొమ్మిది మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. అనంతరం 1992 వరల్డ్కప్లో రెండోసారి ఇలా జరిగింది. పాకిస్తాన్తో జరిగిన నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించింది. తాజాగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంతో వరల్డ్కప్ చరిత్రలో 31 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా, విరాట్, రోహిత్, షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు, విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. షమీ, గిల్, సూర్యకుమార్ యాదవ్లకు వికెట్ దక్కలేదు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
CWC 2023: ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఇలా..
2023 వన్డే ప్రపంచకప్ రికార్డుల అడ్డాగా మారింది. ఈ ఎడిషన్లో నమోదైనన్ని రికార్డులు బహుశా ఏ ఎడిషన్లోనూ నమోదై ఉండకపోవచ్చు. ప్రతి మ్యాచ్లో పదుల సంఖ్యలో రికార్డులు నమోదవుతున్నాయి. ప్రపంచ రికార్డులు సైతం ఈ ఎడిషన్లో సులువుగా బద్దలవుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ పలు వ్యక్తిగత, టీమ్ రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఓ ప్రధానమైన రికార్డు ఉంది. అదేంటంటే.. ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్లో అన్ని జట్లు కనీసం రెండు మ్యాచ్లు గెలవడం ఇదే తొలిసారి. నెదర్లాండ్స్పై గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్కప్లో రెండో విజయాన్ని (బంగ్లాదేశ్, నెదర్లాండ్స్) నమోదు చేసింది. నెదర్లాండ్స్ ఇదివరకే రెండు విజయాలు (సౌతాఫ్రికా, బంగ్లాదేశ్) సాధించింది. ప్రస్తుత ఎడిషన్లో పాల్గొన్న మిగతా జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో చెరో రెండు విజయాలు సాధించాయి. ఈ ఎడిషన్లో భారత్ అందరికంటే ఎక్కువగా, ఆడిన 8 మ్యాచ్ల్లో 8 వరుస విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరి 6 విజయాలు (8 మ్యాచ్ల్లో) సాధించాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలో 4 విజయాలు (8 మ్యాచ్ల్లో) నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఎడిషన్లో పాల్గొన్న పది జట్లు కనీసం రెండ్రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి వరల్డ్కప్ రికార్డు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే, బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ గెలుపుతో ప్రస్తుత వరల్డ్కప్లో ఇంగ్లండ్కు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అర్హత దృష్ట్యా కీలకంగా పరిగణించడుతుంది. వరల్డ్కప్ లీగ్ దశ తర్వాత టాప్-7లో ఉన్న జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే. -
విరాట్ కోహ్లి= సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డును అందుకోవాలంటే మళ్లీ సచినే దిగి రావాలి... మాస్టర్ బ్యాటర్ ఘనతల గురించి ఒకప్పుడు వినిపించిన వ్యాఖ్యల్లో ఇదొకటి. సచిన్ రికార్డుల స్థాయి, అతను అందుకున్న అసాధారణ మైలురాళ్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావన ఇందులో కనిపించింది... కానీ వాటిలో ఒక అరుదైన రికార్డును విరాట్ కోహ్లి ఇప్పుడు అందుకున్నాడు... తనకే సాధ్యమైన అద్భుత ఆటతో వన్డే క్రికెట్కు ముఖచిత్రంగా మారిన కోహ్లి 49వ సెంచరీని సాధించడం అనూహ్యమేమీ కాదు... ప్రపంచకప్కు ముందు 47 వద్ద నిలిచిన అతను మెగా టోర్నీలో కనీసం రెండు సెంచరీలు సాధించగలడని అందరూ నమ్మారు... బంగ్లాదేశ్పై సెంచరీ తర్వాత మరో రెండుసార్లు చేరువగా వచ్చీ శతకానికి దూరమైన అతను ఈసారి విజయవంతంగా ఫినిషింగ్ లైన్ను దాటాడు. విరాట్ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు... అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు... కోహ్లి శతకం అందుకున్న క్షణాన కామెంటేటర్ అన్న ఈ మాట అక్షరసత్యం. ప్రపంచకప్ మ్యాచ్లో తన 35వ పుట్టిన రోజున సచిన్ సెంచరీల సరసన నిలవడంవంటి అద్భుత స్క్రిప్ట్ నిజంగా కోహ్లికే సాధ్యమైంది. ప్రపంచకప్ గెలిచిన క్షణంలో సచిన్ను భుజాల మీదకు ఎత్తుకున్న కోహ్లి... పుష్కరం తర్వాత భుజం భుజం కలుపుతూ అతని సరసన సమానంగా నిలిచాడు. సాక్షి క్రీడా విభాగం : వన్డే క్రికెట్ను విరాట్ కోహ్లి చదువుకున్నంత గొప్పగా మరెవరి వల్లా సాధ్యం కాలేదేమో! ఇన్నింగ్స్ను ఎలా ప్రారంభించాలి, మధ్య ఓవర్లలో ఎలాంటి ఆట ఆడాలి, చివర్లో ఎంతగా దూకుడు జోడించాలి... సరిగ్గా తాసులో కొలిచి లెక్కించినట్లుగా అతను ఈ ఫార్మాట్లో తన ఆటను ప్రదర్శించాడు. రుచికరమైన వంటకం కోసం వేర్వేరు దినుసులను సరిగ్గా ఎలా కలపాలో బాగా తెలిసిన షెఫ్ తరహాలో వన్డేల్లో విజయం కోసం ఎలాంటి మేళవింపు ఉండాలో అతను ఆడి చూపించాడు. ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా...లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా తన వ్యూహంపై ఉండే స్పష్టత కోహ్లిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే లక్ష్య ఛేదనలో గొప్ప గొప్ప ఆటగాళ్ల రికార్డులు కూడా పేలవంగా ఉంటాయి. కానీ కోహ్లికి మాత్రం పరుగుల వేటలోనే అసలు మజా. ఎంత లక్ష్యాన్నైనా అందుకోవడంలో తనను మించిన మొనగాడు లేడన్నట్లుగా అతని బ్యాటింగ్ సాగింది. తొలి ఇన్నింగ్స్లతో (51.15 సగటు, 22 సెంచరీలు) పోలిస్తే ఛేదనలో కోహ్లి రికార్డు (65.49 సగటు, 27 సెంచరీలు) ఘనంగా ఉందంటే అతని ఆట ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ 27లో 23 సార్లు భారత్ విజయం సాధించడం విశేషం. తన బ్యాటింగ్పై అపరిమిత నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లిని ‘ది బెస్ట్’గా తీర్చిదిద్దగా... అసాధారణ ఫిట్నెస్, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ సమయం పాటు సాగే కఠోర సాధన అతడి ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కోల్కతాలో శతకంతో మొదలై... ఆగస్టు 18, 2008... కోహ్లి తొలి వన్డే మ్యాచ్ ఆడిన రోజు. కొద్ది రోజుల క్రితమే భారత్కు అండర్–19 ప్రపంచకప్ అందించిన కెపె్టన్గా కోహ్లికి గుర్తింపు ఉండగా... సచిన్, సెహ్వాగ్లు విశ్రాంతి తీసుకోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్లో అతనికి తొలి అవకాశం దక్కింది. ఐదింటిలో ఒక మ్యాచ్లో అర్ధ సెంచరీ చేసినా సీనియర్ల రాకతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత దేశవాళీలో, ఆ్రస్టేలియా గడ్డపై ఎమర్జింగ్ టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిన తనను మళ్లీ ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దాంతో ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం దక్కింది. మూడు అర్ధసెంచరీల తర్వాత తన 14వ వన్డేలో శ్రీలంకపై 114 బంతుల్లో చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్తో అతని ఖాతాలో తొలి సెంచరీ చేరింది. ఈ సెంచరీ కోల్కతాలోనే ఈడెన్ గార్డెన్స్లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత మరో మూడు వన్డేలకే మళ్లీ సెంచరీ నమోదు చేసిన కోహ్లికి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వన్డే టీమ్లో అతను పూర్తి స్థాయిలో రెగ్యులర్ మెంబర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో సెహ్వాగ్తో పాటు కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. అయితే ఫైనల్లో అతని ఇన్నింగ్స్ (35 పరుగులు) కూడా ఎంతో విలువైంది. 31 పరుగులకే సెహ్వాగ్, సచిన్ అవుటైన తర్వాత గంభీర్తో మూడో వికెట్కు జోడించిన కీలకమైన 83 పరుగులు చివరకు విజయానికి బాట వేశాయి. ఒకదాన్ని మించి మరొకటి... విరాట్ కెరీర్లో అప్పటికే ఎనిమిది సెంచరీలు వచ్చి చేరాయి. జట్టులో స్థానానికి ఢోకా లేకపోగా, జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్ నిరి్మంచే ‘క్లాసిక్’ ఆటగాడిగా కోహ్లికి అప్పటికి గుర్తింపు వచ్చింది. కానీ అతనిలోని అసలైన దూకుడుకు హోబర్ట్ మైదానం వేదికైంది. శ్రీలంకతో మ్యాచ్లో 40 ఓవర్లలో 321 పరుగులు ఛేదిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశం ఉన్న సమయంలో కోహ్లి నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్స్లతో అజేయంగా 133 పరుగులు చేయడంతో 37వ ఓవర్లోనే భారత్ లక్ష్యాన్ని చేరింది. పరిస్థితిని బట్టి కోహ్లి తన ఆటను ఎలా మార్చుకోగలడో ఈ ఇన్నింగ్స్ చూపించగా, తర్వాతి రోజుల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆసియా కప్లో పాకిస్తాన్పై చేసిన అత్యధిక స్కోరు 183, కేప్టౌన్లో దక్షిణాఫ్రికాపై 160 నాటౌట్, నేపియర్లో కివీస్పై 123, పుణేలో ఇంగ్లండ్పై 123, మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై 117... ఏది గొప్పదంటే ఏమి చెప్పాలి? జైపూర్లో ఆ్రస్టేలియాపై 52 బంతుల్లోనే చేసిన శతకం ఇప్పటికీ భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదై ఉంది. అతని ఒక్కో వన్డే ఇన్నింగ్స్కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ శతకాలు అభిమానులకు పంచిన ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! -
న్యూజిలాండ్పై ఆసీస్ గెలుపు.. స్టార్క్ జైత్రయాత్రకు ముగింపు.. పలు రికార్డుల వివరాలు
ఆసీస్తో ఇవాళ (అక్టోబర్ 28) జరిగిన ఉత్కంఠ సమరంలో న్యూజిలాండ్ 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 389 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో చివరి బంతి వరకు పోరాడిన కివీస్.. ప్రత్యర్ధికి ఓటమిని పరిచయం చేసి పరాజయంపాలైంది. రచిన్ రవీంద్ర (89 బంతుల్లో 116; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో జేమ్స్ నీషమ్ (39 బంతుల్లో 58; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచితంగా పోరాడి కివీస్ను గెలిపించినంత పని చేశారు. చివరి బంతికి ఆరు కావాల్సి ఉండగా.. స్టార్క్ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో కివీస్ కనీసం ఒక్క పరుగు కూడా రాబట్టలేక ఓటమిపాలైంది. ఆసీస్ గెలిచినా.. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలిచినా, ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం చెత్త గణాంకాలను నమోదు చేయడంతో పాటు వరల్డ్కప్లో తన వికెట్ల జైత్రయాత్రకు ముగింపు పలికాడు. ఈ మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 89 పరుగులు సమర్పించుకుని వరల్డ్కప్లో ఆసీస్ తరఫున అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టార్క్ మరో చెత్త రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్కప్లో గత 23 మ్యాచ్లుగా సాగుతున్న తన వికెట్ల జైత్రయాత్రకు (మ్యాచ్లో కనీసం ఓ వికెట్ తీయడం) ఈ మ్యాచ్తో ఎండ్ కార్డ్ పడింది. పై రికార్డులతో పాటు ఈ మ్యాచ్లో నమోదైన పలు రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.. వరల్డ్కప్ మ్యాచ్ల్లో రెండో అత్యధిక సిక్సర్ల సంఖ్య (32) రికార్డు ఈ మ్యాచ్లో నమోదైంది. ఈ విభాగంలో 2019 వరల్డ్కప్ ఇంగ్లండ్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ టాప్లో ఉంది. ఆ మ్యాచ్లో 33 సిక్సర్లు నమోదయ్యాయి. వరల్డ్కప్ మ్యాచ్ల్లో రెండో అత్యధిక బౌండరీల సంఖ్య (97) రికార్డు ఈ మ్యాచ్లో నమోదైంది. ఈ జాబితాలో టాప్లో ఇదే వరల్డ్కప్లో జరిగిన సౌతాఫ్రికా-శ్రీలంక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో ఏకంగా 105 బౌండరీలు నమోదయ్యాయి. వన్డేల్లో ఛేదనలో నాలుగో అత్యధిక స్కోర్ (383/9) రికార్డును న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో నమోదు చేసింది. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ టాప్లో ఉంది. ఆ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించి సంచలనం సృష్టించింది. ఈ విభాగంలో 2009లో జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్ రెండో స్థానంలో నిలిచింది. నాటి మ్యాచ్లో భారత్ నిర్ధేశించిన 415 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ శ్రీలంక 411 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓటమిలో (వరల్డ్కప్లో) అత్యధిక స్కోర్ (383/9) చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. ఇదే వరల్డ్కప్లో లంకేయులు 344/9 స్కోర్ చేయగా.. పాక్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. వరల్డ్కప్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా తరఫున ఆత్యధిక క్యాచ్లు (3) అందుకున్న నాన్ వికెట్కీపర్ స్టార్క్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో అలెన్ బోర్డర్, రికీ పాంటింగ్, ఆరోన్ ఫించ్ (నాన్ వికెట్కీపర్స్) కూడా వరల్డ్కప్ మ్యాచ్ల్లో 3 క్యాచ్లు పట్టారు. వన్డేల్లో అత్యధిక పరుగులు నమోదైన విభాగంలో ఈ మ్యాచ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 771 పరుగులు చేశాయి. ఈ విభాగంలో 2006 సౌతాఫ్రికా-ఆసీస్ మ్యాచ్ (872) టాప్లో ఉండగా.. 2009 భారత్-శ్రీలంక మ్యాచ్ (825) రెండో స్థానంలో నిలిచింది. ఇవే కాక ఈ మ్యాచ్లో పలు చిన్నా చితక రికార్డులు కూడా నమోదయ్యాయి. -
CWC 2023: శ్రీలంక-సౌతాఫ్రికా మ్యాచ్.. రికార్డులు బద్దలు
2023 వన్డే ప్రపంచకప్లో భాగంగా శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో పలు ప్రపంచకప్ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ వరల్డ్కప్ హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (428) నమోదు చేసింది. దీంతో పాటు వరల్డ్కప్లో ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీలు చేయడం (వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్లు)) లాంటి అత్యంత అరుదైన రికార్డు కూడా ఈ మ్యాచ్లోనే నమోదైంది. అలాగే ఈ మ్యాచ్లో సుడిగాలి వేగంతో శతక్కొట్టిన ఎయిడెన్ మార్క్రమ్.. వరల్డ్కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ (49 బంతుల్లో) రికార్డును నమోదు చేశాడు. ఈ మూడు రికార్డులతో పాటు ఈ మ్యాచ్లో మరో వరల్డ్కప్ రికార్డు కూడా నమోదైంది. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. లంక ఇన్నింగ్స్లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్లు) దూకుడుగా ఆడారు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక.. సౌతాఫ్రికాకు అంత సునయాసంగా విజయాన్ని దక్కనీయలేదు. లంకేయులు ఓడిపోతామని తెలిసి, ఎదురుదాడి చేశారు. వికెట్లు ఉండి ఉంటే వారు కూడా 400 మార్కును రీచ్ అయ్యేవారు. లంకన్లు సైతం భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచ్లో వరల్డ్కప్ హైయెస్ట్ మ్యాచ్ స్కోర్ రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్లో సఫారీలు, లంకేయులు కలిపి 754 పరుగులు చేశారు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్. 2019లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 714 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్కు ముందు వరకు వరల్డ్కప్లో ఇదే అత్యధిక మ్యాచ్ స్కోర్గా చలామణి అయ్యింది. -
కొడితే బంతి ఎవరెస్ట్కు...
హంగ్జౌ: ఆసియా క్రీడల్లో నేపాల్ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పనికూనలాంటి ఆ జట్టు ఆటలో ఇప్పుడే నడక మొదలుపెట్టిన టీమ్పై తమ ప్రతాపాన్ని ప్రదర్శించింది. పరుగుల వాన, పరుగుల వరద అనే విశేషణాలు ఈ మ్యాచ్కు సరిపోవు... విధ్వంసం, దూకుడు అనేవి కూడా చిన్న పదాలు... ఒకదాని తర్వాత మరో కొత్త మరో రికార్డు... పరుగులు, బంతులు, బౌండరీలు... ఇలా అన్నింటిలోనూ కొత్త ఘనతలే. ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో నేపాల్ ఏకంగా 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టి20ల్లో పలు రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్స్లు) మెరుపు సెంచరీతో చెలరేగాడు. రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్స్లు), దీపేంద్ర సింగ్ ఐరీ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్స్లు) అతనికి అండగా నిలిచారు. అనంతరం మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. దవాసురెన్ (10) ఒక్కటే రెండంకెల స్కోరు చేయగా, ఎక్స్ట్రాలదే (23) అత్యధిక స్కోరు. మంగోలియా జట్టుకు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్గా కూడా ఆ జట్టుకు ఇదే తొలి టి20 మ్యాచ్. తుది జట్టులోని 11 మందీ తొలిసారి టి20 మ్యాచ్ బరిలోకి దిగినవారే. దాంతో కాస్త అనుభవం ఉన్న నేపాల్ ముందు ఈ జట్టు కనీసం నిలవలేకపోయింది. మ్యాచ్లో నమోదైన రికార్డులు... 314 అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఏ జట్టూ 300 పరుగులు చేయలేదు. 278 పరుగులతో ఉన్న రికార్డును (2019లో ఐర్లాండ్ జట్టుపై అఫ్గానిస్తాన్, 2019లో తుర్కియే జట్టుపై చెక్ రిపబ్లిక్) నేపాల్ బద్దలు కొట్టింది. 273 టి20ల్లో అతి పెద్ద విజయం. గతంలో చెక్ రిపబ్లిక్ 257 పరుగులతో తుర్కియేని ఓడించింది. 34 అంతర్జాతీయ టి20ల్లో కుశాల్ మల్లా 34 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. గతంలో 35 బంతుల్లో రోహిత్ శర్మ (భారత్; 2017లో శ్రీలంకపై), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా; 2017లో బంగ్లాదేశ్పై), విక్రమశేఖర (చెక్ రిపబ్లిక్; 2019లో తుర్కియేపై) నెలకొల్పిన సెంచరీ రికార్డు తెరమరుగైంది. 9 అంతర్జాతీయ టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని దీపేంద్ర సింగ్ నమోదు చేశాడు. గతంలో 12 బంతులతో ఈ రికార్డు భారత స్టార్ యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్పై) పేరిట ఉంది. 26 ఇన్నింగ్స్లో నేపాల్ అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు చేసింది. గతంలో అఫ్గానిస్తాన్ జట్టు ఐర్లాండ్పై (2019లో), వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాపై (2023లో) 22 సిక్స్లు చొప్పున కొట్టింది. -
ప్రభాస్ రికార్డు బద్దలు కొట్టాలంటే ప్రభాస్ రావాల్సిందే
-
Asia Cup 2023: టీమిండియా స్టార్లను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఆసియా కప్-2023 ప్రారంభానికి ముందు పలువురు స్టార్ క్రికెటర్లను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏవంటే.. విరాట్ కోహ్లి: ఆసియా కప్-2023లో విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఫార్మాట్లో 13000 పరుగుల మార్కును అందుకున్న ఐదో ప్లేయర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12898 పరుగులు ఉండగా.. అతనికి ముందు సచిన్ (18426), సంగక్కర (14234), పాంటింగ్ (13734), జయసూర్య (13430) ఈ ఘనత సాధించారు. ఈ రికార్డుతో పాటు విరాట్ మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్లో అతను 13000 పరుగుల మార్కును అందుకుంటే, వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13000 పరుగులు సాధించిన రికార్డు సచిన్ (321 ఇన్నింగ్స్లు) పేరిట ఉండగా.. విరాట్ (265 ఇన్నింగ్స్లు) సచిన్ కంటే చాలా ముందే ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. విరాట్ పై పేర్కొన్న రెండు భారీ రికార్డులతో పాటు మరో అత్యంత భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. ఆసియా కప్-2023లో అతను మరో 4 సెంచరీలు చేస్తే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును బద్దలు కొట్టి, సెంచరీల హాఫ్ సెంచరీని పూర్తి చేస్తాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 46 వన్డే సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ: ఆసియా కప్ 2023లో రోహిత్ మరో 163 పరుగులు చేస్తే వన్డేల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. తద్వారా ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 15వ క్రికెటర్గా.. ఆరో భారత క్రికెటర్ రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 9837 పరుగులు ఉన్నాయి. ప్రస్తుత టోర్నీలో రోహిత్ మరో 255 పరుగులు చేస్తే, ఆసియా కప్లో (వన్డే ఫార్మాట్) 1000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. భారత క్రికెటర్లలో సచిన్ అత్యధికంగా ఆసియా కప్ వన్డే టోర్నీల్లో 971 పరుగులు చేశాడు. ఓవరాల్గా ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జయసూర్య, సంగక్కర మాత్రమే 1000 పరుగుల మైలురాయిని దాటారు. రవీంద్ర జడేజా: ఆసియా కప్ 2023లో జడేజా (194) మరో 6 వికెట్లు తీస్తే, వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఐదో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ విభాగంలో జయసూర్య అత్యధికంగా 323 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ అల్ హసన్: ప్రస్తుత ఆసియా కప్లో షకీబ్ మరో 168 పరుగులు చేస్తే, విదేశాల్లో 4000 పరుగుల మార్కును రెండో బంగ్లాదేశీగా రికార్డు సృష్టిస్తాడు. షకీబ్కు ముందు తమీమ్ ఇక్బాల్ (4323) ఈ ఘనత సాధించాడు. అలాగే ప్రస్తుత టోర్నీలో షకీబ్ (305) మరో వికెట్ తీస్తే, అత్యధిక వికెట్లు సాధించిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో డేనియల్ వెటోరీని (305) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకతాడు. ఇమామ్ ఉల్ హాక్: ఇమామ్ ఈ ఆసియా కప్లో తదుపరి 4 మ్యాచ్ల్లో మరో 116 పరుగులు చేస్తే, వన్డేల్లో హషీమ్ ఆమ్లా ఝ(61) తర్వాత అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ఇమామ్ ఖాతాలో ప్రస్తుతం 62 ఇన్నింగ్స్ల్లో 2884 పరుగులు ఉన్నాయి. -
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
పది రోజుల్లో నాలుగింతల వాన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా గత పది రోజుల పాటు కురిసిన వానలు వర్షపాతం రికార్డులను తారుమారు చేశాయి. పది రోజుల క్రితం 54% లోటు వర్షపాతం ఉండగా.. ఇప్పుడు ఏకంగా 65 శాతం అధిక వర్షపాతానికి చేరడం గమనార్హం. ఏటా జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతపవనాల సీజన్గా పరిగణిస్తారు. ఈ నాలుగు నెలల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సగటున 73.91 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూలై 28వ తేదీ నాటికి 33.64 సెంటీమీటర్ల సగటు వర్షం కురవాలి. అయితే ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 55.75 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే సాధా రణం కంటే 22.11 సెంటీమీటర్లు (65 శాతం) అధికంగా వానలు పడ్డాయి. కేవలం గత పదిరోజుల వర్షపాతాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణం కంటే ఏకంగా నాలుగింతలు అధికంగా వర్షాలు కురిశాయి. లోటు నుంచి అధికం వైపు వాస్తవానికి ఏటా నైరుతి సీజన్ జూన్ 1 నుంచి ప్రా రంభమవుతుంది. ఆ నెల తొలి లేదా రెండో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వానలు మొదలవుతాయి. కానీ ఈసారి జూన్ నాలుగో వారంలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఒకట్రెండు రోజులు మోస్తరు వానలు పడ్డాయి. తర్వాత రుత పవనాల కదలికలు మందగించి వర్షాలు జాడ లే కుండాపోయాయి. దీనితో లోటు పెరుగుతూ వచ్చింది. ఈ నెల 18 నాటికి 19.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 54శాతం లోటు. కానీ 18వ తేదీ నుంచి వానలు మొదలయ్యాయి. తర్వాతి పది రోజులకుగాను 8రోజులు వానలు పడ్డాయి. దీనితో వర్షపాతం 54 శాతం లోటు నుంచి ఏకంగా 65 శాతం అధికానికి చేరింది. అంతటా కుండపోత వానలతో.. గత పది రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో అయితే 64.98 సెంటీమీటర్ల అతిభారీ వర్షం రికార్డు సృష్టించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది కూడా. ఇక తొమ్మిది జిల్లాల్లో అయితే 50 సెంటీమీటర్లపైన సగటు వర్షపాతం నమోదవడం గమనార్హం. -
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్కార్డు, ఫోన్నంబర్లు ఆ స్లాట్లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
IND VS WI 1st ODI: భారీ రికార్డులపై కన్నేసిన హిట్మ్యాన్, కోహ్లి
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులపై కన్నేశారు. హిట్మ్యాన్ మరో 175 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకోనుండగా.. విరాట్ మరో 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13,000 పరుగుల క్లబ్లో చేరతాడు. బార్బడస్ వేదికగా విండీస్తో రేపు (జులై 27) జరుగబోయే తొలి వన్డేలో విరాట్, రోహిత్లకు ఈ మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రోహిత్ 243 వన్డేల్లో 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 9825 పరుగులు చేయగా.. కోహ్లి 274 వన్డేల్లో 46 సెంచరీ, 65 హాఫ్ సెంచరీల సాయంతో 12898 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, విండీస్తో ఇటీవల ముగిసిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 1-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో సునాయస విజయం సాధంచగా.. ట్రినిడాడ్లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఆఖరి రోజు మరో 8 వికెట్లు తీసి ఉంటే భారత్ విజయం సాధించేదే. అయితే ఎడతెరిపి లేని వర్షం టీమిండియా విజయావకాశాలకు భారీ గండికొట్టింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. దీని ప్రభావం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్పై కూడా పడింది. విండీస్తో రెండో టెస్ట్ గెలిచుంటే భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేది. విండీస్ పర్యటన విషయానికొస్తే.. 27న తొలి వన్డే ఆడే భారత్, ఆతర్వాత 29, ఆగస్ట్ 1 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఆగస్ట్ 3, 6, 8, 12, 13 తేదీల్లో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. టీ20 సిరీస్లో తొలి మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా జరుగనుండగా.. రెండు, మూడు మ్యాచ్లు గయానాలో.. చివరి రెండు మ్యాచ్లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. అనంతరం టీమిండియా ఫ్లోరిడా నుంచి నేరుగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ భారత్ 3 టీ20లు ఆడుతుంది. -
యాషెస్ సిరీస్లో అత్యుత్తమ రికార్డులు ఇవే..!
141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్లో రికార్డులకు కొదవ లేదు. అంతర్జాతీయ క్రికెట్లో నెలకొల్పబడిన రికార్డులన్నీ దాదాపుగా యాషెస్లో సాధించినవే ఉంటాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్కీపింగ్.. ఏ విభాగంలో చూసినా టాప్ రికార్డులన్నీ యాషెస్ సిరీస్కే దక్కుతాయి.340 టెస్ట్ మ్యాచ్ల యాషెస్ సిరీస్ చరిత్రలో అత్యుత్తమ రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక స్కోర్ (టీమ్ టోటల్): 903/7 (ఇంగ్లండ్, 1938) అత్యల్ప స్కోర్: 36 (ఆస్ట్రేలియా, 1902) అత్యధిక పరుగులు: డాన్ బ్రాడ్మన్ (5028 పరుగులు, ఆస్ట్రేలియా) అత్యధిక వ్యక్తిగత స్కోర్: లెన్ హటన్ (364, ఇంగ్లండ్) అత్యధిక సెంచరీలు: డాన్ బ్రాడ్మన్ (19, ఆస్ట్రేలియా) అత్యధిక హాఫ్ సెంచరీలు: డాన్ బ్రాడ్మన్ (31, ఆస్ట్రేలియా) అత్యధిక డకౌట్లు: ఎస్ గ్రెగరీ (11, ఆస్ట్రేలియా) అత్యధిక సిక్సర్లు: బెన్ స్టోక్స్, కెవిన్ పీటర్సన్ (24, ఇంగ్లండ్) అత్యధిక వికెట్లు: షేన్ వార్న్ (36 మ్యాచ్ల్లో 195 వికెట్లు) అత్యుత్తమ గణాంకాలు (ఇన్నింగ్స్లో): జిమ్ లేకర్ (10/53) అత్యుత్తమ గణాంకాలు (మ్యాచ్లో): జిమ్ లేకర్ (19/90) అత్యధిక ఫైఫర్లు (ఇన్నింగ్స్లో): ఎస్ బర్న్స్ (12) అత్యధిక సార్లు 10 వికెట్ల ఘనత (మ్యాచ్లో): షేన్ వార్న్ (4) అత్యధిక క్యాచ్లు (వికెట్కీపర్గా): ఇయాన్ హీలీ (33 మ్యాచ్ల్లో 135 డిస్మిసల్స్) అత్యధిక క్యాచ్లు (ఫీల్డర్గా): ఇయాన్ బోథమ్ (32 మ్యాచ్ల్లో 54 క్యాచ్లు) -
ఒక షేరు ధర లక్ష రూపాయలు.. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో రికార్డు..
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
ఓటు హక్కుకు భంగం కలిగిస్తే సహించం
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
రూ.1 కోటి విరాళమిచ్చిన హీరో ధనుష్
సార్వత్రిక పోరుకు సర్వం సిద్ధం
ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలి ●
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
ఐదేళ్ల భవితకు ఒక్కవేలుపై చుక్క!
నకిలీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురి అరెస్టు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement