-
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024 -
పేరు మార్చుకున్న మెగా హీరో.. కొత్తగా..
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయిదుర్గ తేజ్గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే తల్లి పేరు మీదట ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలన్న కలను సైతం నెరవేర్చుకున్నాడు. దుర్గ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ బ్యానర్ ద్వారానే సోల్ ఆఫ్ సత్య షార్ట్ ఫిలిం తెరకెక్కిందని పేర్కొన్నాడు. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవే మార్చి 8న ఉమెన్స్ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా సోల్ ఆఫ్ సత్య ప్రత్యేక ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ వేదికపైనే తన పేరు మార్పును వెల్లడించాడు. రామ్చరణ్తో మల్టీస్టారర్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్న ప్రశ్నకు.. మొన్నే పవన్ కల్యాణ్తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబుగారితో చేశాను. నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవిగారే! మా చిరుమామతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్ చేస్తాను అని తేజ్ చెప్పుకొచ్చాడు. వెబ్సైట్లో రాస్తేనే తెలిసింది గాంజా శంకర్ సినిమా ఉందా? ఆగిపోయిందా? అన్న ప్రశ్నకు.. 'సినిమా ఆగిపోయిందని ఓ వెబ్సైట్లో వార్త చూశాకే నాకూ తెలిసింది. మూవీ ఉందా? లేదా? అన్న విషయం ఆ వెబ్సైట్స్ చెప్తే కానీ తెలియదు' అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం సత్య. సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. చదవండి: ఓటీటీకి హనుమాన్.. తొలిసారి అలాంటి షాకింగ్ నిర్ణయం! -
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్సీరీస్ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్మేన్ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
ఒక్క మెసేజ్తో ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూనే.. సోషల్ సర్వీసులో కూడా ముందుంటాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను ఆయన చెల్లించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్మీడియా వేదికగా తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్మెంట్ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్ తేజ్ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్ చేస్తే.. వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. సాయిధరమ్ చేసిన సాయానికి ఒక వీడియో ద్వారా ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు సందర్భాల్లో తన వంతు సాయం చేస్తూ మనసు చాటుకున్నారు. బ్రో, విరూపాక్షలతో మెప్పించిన సాయిధరమ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్'చేస్తున్నారు. కానీ గాంజా అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7 — I.Andrew babu (@iandrewdop) February 22, 2024 -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకు బ్రేక్
-
'ఈ ఏడాదికి సరైన ముగింపు'.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోస్ట్ వైరల్!
ఈ ఏడాది విరూపాక్షతో హిట్ కొట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించారు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా మెగా హీరో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారంది. పాజిటివ్ మైండ్సెట్తో ఉండే వ్యక్తుల్లో హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. ఎల్లప్పుడూ సినిమా గెలవాలని ఆయన కోరుకుంటారు. అందులోనూ తెలుగు సినిమా ఎప్పుడూ ముందుడాలని కోరుకునే వ్యక్తి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ. తాజాగా ఆయన చేసిన పోస్ట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నేడు మన తెలుగు సినిమా సక్సెస్ఫుల్గా ఉన్నత స్థితికి చేరుకుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ నోట్లో రాస్తూ.. 'రెండు రోజుల్లో మూడు సినిమా ఇండస్ట్రీల నుంచి చిత్రాలు రిలీజవ్వడం సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ప్రభాస్ సలార్. షారుక్ ఖాన్ డంకీ, హాలీవుడ్ ఫిలిం అక్వామెన్తో సరిసమానమైన క్రేజ్తో విడుదల కావడం గర్వంగా వుంది. మూడు అగ్ర సినీ పరిశ్రమలు ఓకేసారి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతికి ఇవ్వడానికి సిద్దం కావడం గొప్ప విషయం. అన్నింటి కంటే ఈ రోజు సినిమా చాలా అగ్రస్థాయిలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. 2023కు ఇదే సరైన ముగింపు. ఈ అనుభూతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ సో గ్రేట్ షారుఖ్ సార్. డంకీ చిత్రంతో వరుసగా హ్యట్రీక్ సక్సెస్ సాధించాలి. సలార్తో వెండితెరపై ఫైర్ క్రియేట్ చేయడానికి సిద్దమైన ప్రభాస్ అన్నకు, అలాగే అక్వామెన్ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్' అంటూ రాసుకొచ్చారు. ఎందుకంటే ఈ వారంలో మోస్ట్ అవేటెడ్ ఫిల్స్మ్ డంకీ, సలార్ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇవాళ డంకీ రిలీజ్ కాగా.. మరికొద్ది గంటల్లో సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. అంతే కాకుండా మరో చిత్రం సైతం బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే హాలీవుడ్ మూవీ అక్వామెన్ కూడా ఈరోజు రిలీజైంది. రెండు రోజుల వ్యవధిలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సందర్భంగా మూడు సినిమాలను ఉద్దేశించి సాయి ధరమ్ తేజ్ నోట్ విడుదల చేశారు. CINEMA IS WINNING 💪🏼❤️#TeluguFilmIndustry#HindiFilmIndustry#Hollywood pic.twitter.com/hmlLm6PaJC — Sai Dharam Tej (@IamSaiDharamTej) December 21, 2023 -
Sai Dharam Tej Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్
-
ఎంత పని చేశావ్ వరుణ్ తేజ్.. పెళ్లిపై మెగా హీరో పోస్ట్ వైరల్!
ఇటీవలే టాలీవుడ్ జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో జరిగిన వీరి పెళ్లికి మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్తో సహా నితిన్ కూడా పాల్గొన్నారు. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. వరుణ్ తేజ్ పెళ్లిని ఉద్దేశించి చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూస్తే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లిలో సాయి ధరమ్ తేజ్ ఓ రేంజ్లో హంగామా చేసినట్లు కనిపిస్తోంది. పెళ్లిలో వరుణ్ తేజ్ను ఊరేగించే కారుపై కాలు పెట్టిన ఫోటో చూస్తే చాలా ఫన్నీగా కనిపిస్తోంది. అతన్ని చూసిన వరుణ్ తేజ్ చిరునవ్వుతో కనిపించాడు. ఆ ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చాడు. సాయి తన ఇన్స్టాలో రాస్తూ..' ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంత పని చేశావ్ వరుణ్ బాబు.. ఉష్..నీకు పెళ్లి సంబరాలు.. కానీ నాకేమో స్వతంత్ర పోరాటం' అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు మాత్రం అలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకు అన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు నెటిజన్స్. కాగా.. సాయి ధరణ్ తేజ్ ఈ ఏడాది విరూపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. View this post on Instagram A post shared by Sai Dharam Tej (@jetpanja) -
Pre-Wedding Party: వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
ఊర మాస్ శంకర్
‘సూపర్ మ్యాన్ ఏం చేశాడంటే’... ‘అబ్బా ఈ స్పైడర్ మ్యాన్లు.. సూపర్ మ్యాన్లు కాదు నాన్నా.. మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు నాన్నా..’ అని చిన్నారి కూతురు అడుగుతుంది... అప్పుడు మొదలవుతుంది లోకల్ మ్యాన్ గురించి... ఆడు చిన్నప్పుడే చదువు మానేశాడనీ, అమ్మా నాన్న మాట వినలేదనీ, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయనీ, పది రూపాయలుంటే పార్కులో, పది వేలుంటే పార్క్ హయత్లో ఉంటాడని చెప్పడంతో ఆ లోకల్ మ్యాన్ ఊర మాస్గా పెరిగినవాడని అర్థం అవుతుంది. అతని పేరు ‘గాంజా శంకర్’. సాయి ధరమ్ తేజ్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్లో పైన పేర్కొన్న డైలాగ్స్ ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: రిషీ పంజాబి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. -
ఊరమాస్గా సాయి ధరమ్ తేజ్.. గత్తరలేపిన ‘గాంజా శంకర్’ గ్లింప్స్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్ 15) సాయి తేజ్ బర్త్డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్ని వదిలారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అని టైటిల్ ఖరారు చేశారు. మాస్కి నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబతూ ‘గాంజా శంకర్’ వీడియో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ‘స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోలో చూపించారు. గంజాయి అని పేరు చెప్పలేదు కానీ.. హీరో గాంజా అమ్ముతాడనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పేశారు. మొత్తానికి సాయి తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. -
సాయి ధరమ్ తేజ్ కి ముద్దు పెట్టిన కలర్స్ స్వాతి
-
Month Of Madhu Trailer Launch Photos: ‘మంత్ ఆఫ్ మధు’ మూవీ ట్రైలర్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ మరియు కలర్ స్వాతి క్యూట్ మూమెంట్స్
-
బ్రో ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రో. ప్రియ ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్. మాతృకలో సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు రాబట్టడంలోనూ విఫలమైంది. డైరెక్టర్ సినిమా కథను లైట్ తీసుకుని హీరోను హైలైట్ చేసేందుకే ఎక్కువ కష్టపడ్డాడని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ మూవీ ఆగస్టు 25 నుంచి నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది. అంటే ఈ శుక్రవారం ఓటీటీలో ల్యాండ్ అయ్యేందుకు బ్రో సిద్ధమయ్యిందన్నమాట! థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు, లేదంటే మరోసారి బ్రోను చూడాలనుకునేవారు ఈ ఫ్రైడే ఓటీటీలో ఎంచక్కా చూసేయండి. బ్రో సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం, రోహిని, వెన్నెల కిశోర్, రాజా చెంబోలు తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే, మాటలు అందించాడు. తమన్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరించాడు. #Bro Coming to Netflix on this Friday ....#BroMovie#BroOnNetflix pic.twitter.com/1lxuAawGPe — The South Movies (@TheSouthMovies1) August 20, 2023 చదవండి: సాయిధరమ్ తేజ్ రీల్ చెల్లెలు.. ఇంత అందంగా ఉందేంటి బ్రో! -
నిహారికను తిట్టిన నెటిజన్కు సాయిధరమ్ తేజ్ వార్నింగ్
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి విమర్శలు గుప్పించడం పరిపాటిగా మారింది. చాలామంది ట్రోలర్లు ఇదే పనిగా పెట్టుకుని ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. విడాకుల వ్యవహారం తర్వాత ఇది పీక్స్కు వెళ్లింది. తను వెకేషన్కు వెళ్లినా, ఏదైనా పోస్ట్ పెట్టినా.. ఏం చేసినా సరే తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నెగెటివిటినీ నిహారిక లైట్ తీసుకుని తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ 'సత్య' అనే షార్ట్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే! ఇందులో ఒక పాటను ఆగస్టు 15న విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించిన అప్డేట్లను సాయిధరమ్ తేజ్ ఎప్పటికప్పుడూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఓ పోస్ట్పై నిహారిక కొణిదెల స్పందిస్తూ.. ఈ పాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నాను అని కామెంట్ చేసింది. దీనికి రిప్లైగా ఓ నెటిజన్.. వీటి మీద ఉన్న శ్రద్ధాసక్తులు కుటుంబం మీద లేకపాయె అని సెటైర్ వేశాడు. దీంతో సాయిధరమ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోరు అదుపులో పెట్టుకో, వెంటనే ఆ కామెంట్ డిలీట్ చేయ్ అని వార్నింగ్ ఇచ్చాడు. నిహారిక కోసం తేజ్ అండగా నిలబడడాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే నెటిజన్ కామెంట్తో పాటు తేజ్ తన కామెంట్ను సైతం డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అందుకు సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: జైలర్లో డ్యాన్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫేమస్ అవ్వడానికి ముందే గదిలో శవమై.. -
సాయిధరమ్ తేజ్ ‘ది సోల్ ఆఫ్ సత్య’ సాంగ్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ
టైటిల్: బ్రో నటీనటులు: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, . కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ , బ్రహ్మానందం తదితరులు నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ స్క్రీన్ప్లే, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం: సముద్రఖని సంగీతం: తమన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జులై 28, 2023 ‘బ్రో’కథేంటంటే.. మార్కండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి(రోహిణి), ఇద్దరు చెల్లెలు(ప్రియా ప్రకాశ్ వారియర్, యువ లక్ష్మీ), అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదే తనలోకం. చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు తనే చూసుకుంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం డబ్బు సంపాదన మీదే పెడతాడు. చివరకు తన ప్రియురాలు రమ్య(కేతిక శర్మ)తో కూడా సరదాగా గడపలేడు. అలా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న మార్క్ ఓ రోజు ప్రమాదానికి గురై చనిపోతాడు. అతని ఆత్మ అంధకారంలోకి వెళ్తుంది. అక్కడ ఓ వెలుగు ద్వారా టైంగాడ్ టైటాన్(పవన్ కల్యాణ్) ప్రత్యక్షమవుతాడు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని, కొన్ని రోజులు బతికే చాన్స్ ఇవ్వమని టైటాన్ని వేడుకుంటాడు మార్కండేయ. టైటాన్ అతనికి 90 రోజుల సమయం ఇస్తాడు. మరి ఈ 90 రోజుల్లో మార్కండేయ తన బాధ్యతలు నెరవేర్చాడా? ఈ క్రమంలో అతను ఏం నేర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మూడేళ్ల క్రితం విడుదల విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. జీవితంలో ఓ వ్యక్తికి రెండో చాన్స్ వస్తే ఎలా ఉంటుంది? దానిని సద్వినియోగం చేసుకుంటాడా? ఆయన అనుకున్న పనులన్నీ జరుగుతాయా? లేదా? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అయితే మాతృకకు, తెలుగు ‘బ్రో’కు చాలా వ్యత్యాసం ఉంది. పవన్ కల్యాణ్ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు. అక్కడ రెండో చాన్స్ వయసు అయిపోయిన ఓ ముసలాయనకు వస్తే.. ఇక్కడ రెండో చాన్స్ ఓ యువకుడికి వస్తుంది. అలాగే అక్కడ టైంగాడ్ పాత్ర నిడివి చాలా తక్కువ, కానీ తెలుగులో టైంగాడ్ దాదాపు సినిమా మొత్తం ఉంటాడు. అయితే ఈ మార్పులు ఫ్యాన్స్ని అలరిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. లుక్స్ పరంగా మాత్రం వింటేజ్ పవన్ కల్యాణ్ని తెరపై చూస్తారు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథ ప్రారంభమవుతుంది. సాయితేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ భూమి మీదకు వచ్చకా..అక్కడ జరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ సోసోగా ఉంటాయి. ప్రతిసారి పవన్ని ఎలివేట్ చేస్తూ చూపించడం ప్యాన్స్ని అలరిస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకుడికి అతిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం పవన్ కల్యాణ్ పాత పాటలను పెట్టడం కూడా మైనస్సే. ఒకటి రెండు సన్నివేశాలు అంటే ఓకే కానీ, సినిమా మొత్తం అదే ఉంటే చూసే ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిత్రం విషయం లోను అదే జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఫ్యాన్స్ కోసమే చేశారు. సెకండాఫ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. అయితే సాయితేజ్ పాత్ర పడే సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథ, కథనం బాగున్నప్పటికీ.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో హీరో సాయి తేజ్ అయినప్పటికీ సినిమా మొత్తం పవన్ కల్యాణ్ పాత్ర ఉంటుంది. టైంగాడ్ టైటాన్గా పవన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై వింటేజ్ పవన్ను చూస్తారు. ఇక మార్క్ పాత్రకు తేజ్ న్యాయం చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తేజ్ బాడీలో మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా అయ్యాడు.అది స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ కూడా ఆకట్టుకునేలా చేయలేకపోయాడు. మార్క్ లవర్ రమ్యగా కేతికా శర్మ ఉన్నంతలో పర్వాలేదు. హీరో చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్ వారియర్ చక్కగా నటించింది. బ్రహ్మానందం ఒకే ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. హీరో తల్లిగా రోహిణి, బాస్గా వెన్నెల కిశోర్తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం జస్ట్ ఓకే. కొన్ని పాటలు బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. స్క్రీన్ప్లే, డైలాగ్స్లో తివిక్రమ్ మార్క్ అంతగా కనిపించదు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
ఏంటి పవన్ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్లో..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రీమేక్ సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది) మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్ తేజ్కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్ చిత్రాల జాబితాలో పవన్కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్ తేజ్కి ఇది మొదటి రిమేక్ మూవీగా నిలవనుంది. కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాకి రీమేక్గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. పవన్ రీమెక్ సినిమాల లిస్ట్ ఇదే 'బ్రో' సినిమాకు ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్మార్, అన్నవరం, గబ్బర్సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్సాబ్, భీమ్లానాయక్ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్లు కావడం విశేషం. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్లో మెప్పించినా.. మరికొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్కు కామన్ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) -
కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
BRO Trailer: కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్.. డైలాగులే మైనస్!
సాధారణంగా ఓ మూవీ ట్రైలర్లో ది బెస్ట్ సీన్స్ని మాత్రమే చూపిస్తారు. సినిమా మొత్తంలో అవే కీలకం అనేలా ట్రైలర్ని కట్ చేస్తారు. ఎందుకంటే ఓ ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించడంలో పాటలతో పాటు ట్రైలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటిలో ‘బ్రో’మూవీ విఫలమైంది. తమన్ అందించిన పాటలపై తొలి నుంచి విమర్శలే వచ్చాయి. తమ హీరోకి సరైన పాటలు అందించలేదని పవన్ కల్యాణ్ ఫ్యాన్సే తమన్ను ట్రోల్ చేశారు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ఫ్యాన్స్ని కాస్త నిరాశకే గురి చేసింది. పవన్ నోట ఒక్కటంటే ఒక్కటి గుర్తించుకునే డైలాగ్ ట్రైలర్లో చూపించలేదు. ‘బ్రో’సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం`కు తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని పవన్తో సెట్ చేసింది అతని ‘గురువు’ త్రివిక్రమ్. ‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడు. తొలుత మాటల కోసం సాయి మాధవ్ బుర్రా అనుకుంటే.. త్రివిక్రమే రంగంలోకి దిగి మాటలు, స్క్రీన్ప్లే అందించాడు. ఇందుకుగాను రూ.15 కోట్లతో పాటు లాభాల్లో పావలా వాటాను రెమ్యునరేషన్గా తీసుకున్నారని టాలీవుడ్ టాక్. (చదవండి: ఓపెన్హైమర్ సినిమా రివ్యూ) కేవలం స్క్రీన్ప్లే, మాటల కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే నిన్నటి ట్రైలర్లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించలేదు. ట్రైలర్లోనే అలాంటి డైలాగ్స్ లేవంటే.. సినిమాలో కూడా లేనట్టే. పాటలు, ట్రైలర్ యావరేజ్గా ఉన్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే.. జులై 28వరకు ఆగాల్సిందే.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement