-
Heeramandi సోనాక్షి లుక్స్: జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్! ఫోటోలు
-
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
బాలీవుడ్ టాప్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మొట్టమొదటి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ హిట్ టాక్తో స్ట్రీమింగ్ అవుతుంది. మే 1నుంచి నెట్ఫ్లిక్స్లో అలరిస్తుంది. ఇందులో మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ తదితరులు నటించారు.హీరామండి వెబ్ సిరీస్లో ఉస్తాద్జీ పాత్రలో మెప్పించిన ఇంద్రేష్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో ఇంటిమేట్ సీన్ గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.‘సోనాక్షీకి, నాకు మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ కోసం ఎక్కువ రీటేక్లు తీసుకోలేదు. ఈ సీన్స్ తీస్తున్న సమయంలో నేను భయాందోళనకు గురైయాను. కాస్త సిగ్గుగా కూడా అనిపించింది. కానీ, సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్గా ఉండమని కోరారు. ఈ సీన్స్ కూడా ఆమె అమ్మగారి ముందే జరిగాయి. ఈ క్రమంలో సోనాక్షీ తల్లి ముందే నాతో మాట్లాడారు. ఈ సిరీస్లో ఇలాంటి సీన్లు అవసరం, కంగారు పడొద్దని చెప్పారు. సుమారు గంటకు పైగానే అందరం చర్చించుకున్నాకే షూట్ మొదలపెట్టాం. అందుకే ఎక్కువ రీటేక్లు తీసుకోలేదు. ఈ సిరీస్లో నా పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇది నా కోసమే రూపొందించబడిందని నేను అనుకుంటున్నాను. సంజయ్ భన్సాలీ ప్రతీ సీన్ను చాలా జాగ్రత్తగా తీశారు.మరోక సన్నివేశంలో సోనాక్షి తన కాళ్లతో నా తలను టచ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమె తల్లి పూనమ్ సిన్హా కూడా సెట్స్లో ఉన్నారు. ఆ సీన్ సమయంలో కాస్త ఇబ్బంది ఉన్నా.. ఆమె నాకు కొంత ఆత్మస్థైర్యాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో సీన్స్ మా మధ్య ఉన్నాయి. హీరామండి సెట్ నుంచి నాకు చాలా అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.' అని ఇంద్రేష్ మాలిక్ చెప్పాడు. -
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మే 1 స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సిరీస్ ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ నటించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ నటించారు. అయితే ఈ సిరీస్లో మనీషా కొయిరాలా కూతురిగా మెప్పించిన షర్మిన్ సెగల్పై పాత్రపై విమర్శలొచ్చాయి. హీరామండిలో అలంజేబ్ పాత్రపై చాలామంది ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు.చాలా మంది ప్రేక్షకులు హీరామండిలోని నటనను ప్రశంసించగా, ఈ సిరీస్లో కొయిరాలా పాత్ర మల్లికా జాన్ కుమార్తె అలంజేబ్ పాత్రను పోషించిన షర్మిన్, ముఖ్యంగా ఆమె నటనకు విమర్శలను అందుకుంది. తన పాత్రలో ప్రతి సీన్లో ఓకే ఎక్స్ప్రెషన్తో కనిపించడంతో కొందరు ఆమెపై కామెంట్స్ చేశారు. దీంతో తాజాగా తన ఇన్స్టా పోస్ట్కు కామెంట్ సెక్షన్ను నిలిపేసింది బాలీవుడ్ భామ. ఆ పాత్రకు ఆమెను ఎంపిక చేయడం సంజయ్ చేసిన బిగ్ మిస్టేక్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అలంజేబ్ పాత్రలో నటించిన షర్మిన్ సెగల్ స్వయాన సంజయ్ లీలా బన్సాలీకి మేనకోడలు కావడం విశేషం. ఆమె సంజయ్ లీలా బన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మలాల్ చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. అంతే కాకుండా గోలియాన్కి రాస్లీలా రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కతియావాడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తర్వాత హారర్ కామెడీ 'అతిథి భూతో భవ సినిమాలో నటించింది. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal) -
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
స్టార్ సంజయ్ లీలా భన్సాలీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి, దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'హీరామండి: డైమండ్ బజార్'. ప్రపంచవ్యాప్తంగా మే1న 190 దేశాల్లో రిలీజైంది. అలానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గ్రాండియర్ విషయంలో చాలామంది నెటిజన్స్.. ఈ సిరీస్ని అద్భుతమైన సిరీసుల్లో ఒకటిని అభిప్రాయపడుతున్నారు.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)8 ఎపిసోడ్లతో తీసిన ఈ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', ది క్రౌన్, బ్రేకింగ్ బ్యాడ్ లాంటి అంతర్జాతీయంగా సిరీస్లతో పోటీపడుతోంది. ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు.. పలు టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వారి ప్రశంసలను వ్యక్తం చేస్తున్నారు.ఉత్కంఠ భరితమైన విజువల్స్ నుంచి ఆకట్టుకునే కథల వరకు, ప్రతి ఫ్రేమ్ భన్సాలీ ప్రతిభకు నిదర్శనం. ఈ షోపై నెటిజన్లు ఎలా ప్రశంసలు కురిపిస్తున్నారు. "ఇది ఒక అద్భుత కళాఖండం! నేను మంత్రముగ్ధుడయ్యాను. సంజయ్ లీలా భన్సాలీ మళ్లీ మాయ చేశాడు!", "కథ, నటన, దర్శకత్వం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సిరీస్ తప్పకుండా చూడండి!", "సంజయ్ లీలా బన్సాలీ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఈ షో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అని రాసుకొస్తున్నారు.(ఇదీ చదవండి: హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?) -
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
హీరామండి.. భారీ బడ్జెట్తో నిర్మితమైన వెబ్ సిరీస్. పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ కళాఖండం మే 1 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ సిరీస్లో కొన్ని పొరపాట్లను నెటిజన్లు గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.జర్నలిస్టు ట్వీట్ఐదో ఎపిసోడ్లో సోనాక్షి సిన్హా వార్తా పత్రిక చదువుతున్న సమయంలోని పొరపాటను ఎత్తిచూపుతున్నారు. ఈ మేరకు పర్వేజ్ ఆలమ్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. స్వతంత్రానికి ముందు బ్రిటీష్ పాలనలో ఉన్న లాహోర్లో కథ సాగుతుంది. ఉర్దూ పేపర్ఐదో ఎపిసోడ్లో ఫరీదన్ (సోనాక్షి సిన్హ) ఉర్దూ పేపర్ చదువుతుంది. అందులోని హెడ్లైన్స్లో వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్: టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న యూత్ కాంగ్రెస్.., కరోనాతో పోరాడాలంటే ఆత్మస్థైర్యం ఉండాలి: కరోనా రోగులకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సలహా.. ఇలాంటి హెడ్లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు. అది కూడా తెలీదా?మరో నెటిజన్.. ఉర్దూ పేపర్ను ఎడమ నుంచి కుడికి చదవడం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడమకు చదువుతారని కూడా తెలీకుండా ఆ పాత్రను డిజైన్ చేయడం, కనీసం ఎవరైనా భాషాజ్ఞానులను సంప్రదించకపోవడం విచారకరం అని కామెంట్లు చేస్తున్నారు. Sanjay Leela Bhansali’s epic web series Heera Mandi on Netflix is set against the Indian independence/British Raj in Lahore of the 1920s-1940s. Fareedan (Sonakshi Sinha) is supposedly reading an Urdu newspaper (EP5). Headlines say, “Warangal Municipal Elections: TRS Distributes… pic.twitter.com/EI44Z61rkt— Pervaiz Alam (@pervaizalam) May 3, 2024 -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్లో ఈ భారీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్తో ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్సిరీస్ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్డ్రాప్లో హీరామండి వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్కు, బ్రిటీష్వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్లలో తన విజువల్ ఫీస్ట్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్ను 'హీరామండి'గా సంజయ్లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సిరీస్లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి. -
తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. గతంలో గంగూభాయి కతియావాడి మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన మరోసారి అలాంటి కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్ను భారీ బడ్జెట్తో తెరకెక్కించడం మరో విశేషం.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. మే 1వ తేదీ నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వర్షన్లతో పాటు 14 భాషల్లో హీరామండి సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావు హైదరి, సంజీదా షేక్, షార్మిన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. పోషించారు.కాగా.. భారత స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలనలోని 1940 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరామండిని తెరెకెక్కించారు. పాకిస్తాన్లోని రెడ్లైట్ ప్రాంతంలో జరిగే సంఘర్షణ, కుట్రల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. హీరామండి ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటనలను ఈ సిరీస్లో చూపించారు. కాగా.. హీరామండి ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో ఉంది. -
రియల్ స్టోరీతో వస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం గంగూభాయి కతియావాడి. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ముంబయిలో వేశ్యవాటిక నేపథ్యంలో వచ్చిన గంగూభాయి కతియావాడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.తాజాగా అలాంటి కథతోనే సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంజయ్. ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. హీరామండి: ది డైమండ్ బజార్ పేరుతో వస్తోన్న వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదికరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్లో మల్లికాజాన్గా మనీషా కొయిరాలా, ఫరీదాన్గా సోనాక్షి సిన్హా, బిబ్బోజాన్గా అదితి రావు హైదరీ, అలంజేబ్గా షర్మిన్ సెగల్, వహీదాగా సంజీదా షేక్, లజ్జోగా రిచా చద్దా నటించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. పాక్లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
నయన్కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్స్టార్గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
Manisha Koirala: జీవితం అనే గురువు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది
సంజయ్లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది. ‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్జనులను బాగా కదిలించింది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్గా రూపొందించిన వెబ్ సిరీస్గా నిలిచింది. ఈ సిరీస్ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్లోని లాహోర్లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
జాతీయ అవార్డులు అందుకున్న మూవీ.. 19 ఏళ్లకు ఓటీటీలో..
దర్శకదిగ్గజం సంజయ్లీలా భన్సాలీ తీసే సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్గా ఉంటాయో అంతే ఎమోషనల్గా కూడా ఉంటాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుంది. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్ పీస్ 'బ్లాక్'. టైటిల్ చూడగానే ఓ విషయం అర్థమైపోతుంది. హీరోహీరోయిన్లలో ఒకరికి అంధత్వం ఉందని తెలిసిపోతోంది. అవును, ఇందులో హీరోయిన్గా నటించిన రాణీ ముఖర్జీకి కనబడదు, వినబడదు. అంధురాలు, అల్జీమర్ టీచర్ మధ్య లవ్.. ఆమెకు టీచర్ అమితాబ్ బచ్చన్తో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్(మతిమరుపు) వచ్చి ఆమెను మర్చిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే బ్లాక్. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ కంటతడి పెట్టించేలా చేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇన్నాళ్లకు ఓటీటీలో అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. తాజాగా నెట్ఫ్లిక్స్ ఓ గుడ్న్యూస్ చెప్పింది. నేటి నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నామో, ఫైనల్గా మా కల నెరవేరింది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: పేరెంట్స్తో వెళ్లా.. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ, గిల్లుతూ...: హీరోయిన్ -
జవాన్కు రూ.10 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్, ఇప్పుడేకంగా..
తన వయసు నాలుగు పదులు.. అయినా ఎక్కడా తగ్గేదేలే అంటోంది నయనతార. ఇంతకుముందు వివాదాలకు ఇప్పుడు సంచలనాలకు కేంద్రం ఈ బ్యూటీ. సినిమాల్లో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లోనూ దూసుకుపోతోంది. మరో పక్క దర్శకుడు విఘ్నేశ్ శివన్ను పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లి కూడా అయింది. అయినప్పటికీ లేడీ సూపర్స్టార్ పట్టం చేజారకుండా చూసుకుంటోంది. బాలీవుడ్లోనూ నయన్కు క్రేజ్ అగ్ర కథానాయికగా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇటీవల బాలీవుడ్లో తన లక్ పరీక్షించుకుంది. అక్కడ షారుక్ ఖాన్తో జత కట్టిన జవాన్ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచి రికార్డులను బ్రేక్ చేయడంతో ఈ అమ్మడి క్రేజ్ అక్కడ కూడా పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు నయనతార తలుపు తడుతున్నాయని సమాచారం. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలి తాజా చిత్రంలో నయనతార ఒక ముఖ్యపాత్రలో నటింపజేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న హీరోయిన్ కాగా జవాన్ చిత్రానికి రూ.10 కోట్లు పుచ్చుకున్న నయనతార ఈ చిత్రానికి ఏకంగా రూ.13 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అలా ఏ విషయంలోనూ తగ్గేదేలే అంటూ ముందుకు పోతోందన్నమాట. ప్రస్తుతం ఈమె తమిళంలో తన 75వ చిత్రంతోపాటు, క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న టెస్ట్, మన్నాంగట్టిసిన్స్ 1960 చిత్రాల్లో నటిస్తోంది. నటుడు జయం రవి సరసన మరోసారి తనీ ఒరువన్–2 చిత్రంలో నయనతార నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. చదవండి: మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. నెట్టింట వైరల్ -
సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు..!
బాలీవుడ్ చిత్రనిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు బీ టౌన్లో చర్చ నడుస్తోంది. నటి అయిన షర్మిన్ సెగల్ ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో షర్మిన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోనుంది. (ఇది చదవండి: బోల్డ్ సీన్స్తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్, ఇప్పుడు పేదరికంలో! ) ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం షర్మిన్ 2023 ప్రారంభంలోనే అహ్మదాబాద్కు చెందిన వజ్రాల వ్యాపారితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదని తెలుస్తోంది. కాగా.. షర్మిన్ సినిమాల్లో ఎంట్రీకి ముందే భన్సాలీతో కలిసి పనిచేసింది. ఆమె 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'గంగూబాయి కతియావాడి' వంటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. కాగా.. షర్మిన్ 2019లో 'మలాల్' చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 2022లో ఆమె 'అతిథి భూతో భవ'లో నటించింది. తాజాగా ఆమె భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'హీరామండి'లో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'హీరమండి' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తోంది షర్మిన్. 'హీరమండి'లో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్) View this post on Instagram A post shared by Sharmin Segal (@sharminsegal) -
వేశ్యల జీవిత కథ ఆధారంగా హీరామండిలో..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. మనీషా కొయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్ను శనివారం విడుదల చేశారు. లాహోర్ బ్యాక్డ్రాప్లో ఒకప్పటి వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్ను రూపొందించారు. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
ఓటీటీకే మొగ్గు చూపుతున్న బాలీవుడ్ అగ్ర దర్శకులు
టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విస్తృతి పెరిగింది. దీంతో అగ్ర నటీనటులు ఓటీటీ ప్రాజెక్ట్స్పై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దర్శకులు కూడా ఓటీటీకి ఓకే చెబుతున్నారు. అలా హిందీ చిత్రసీమలో కొందరు దర్శకులు చేస్తున్న వెబ్ సిరీస్లు, వెబ్ ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం. ⇔ ‘దేవదాస్’, ‘బ్లాక్’, ‘రామ్లీల’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన అగ్రదర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఎనిమిది ఎపిసోడ్స్గా రానున్న ఈ వెబ్ సిరీస్లో సోనాక్షీ సిన్హా, అదితీరావ్ హైదరీ, మనీషా కొయిరాల తదితరులు ⇔ ‘గోల్మాల్’, ‘సింగమ్’ ఫ్రాంచైజీలతో పాటు ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘సింబ’ వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రోహిత్ శెట్టి. ఇదే కమర్షియల్ క్రేజ్ను డిజిటల్ వరల్డ్లో కూడా రిపీట్ చేయాలను కుంటున్నారాయన. ఇందులో భాగంగానే ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ పోలీసుల బ్యాక్డ్రాప్లో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఒబెరాయ్ ప్రధాన తారాగణం. ⇔ వెబ్ వరల్డ్లో ‘లస్ట్ స్టోరీస్’, ‘ఘోస్ట్ స్టోరీస్’ ఆంథాలజీకి మంచి వ్యూయర్షిప్ లభించింది. ఈ ఆంథాలజీలోని ఓ భాగానికి దర్శకత్వం వహించారు జోయా అక్తర్. ఇప్పుడు సోలోగా ఓ వెబ్ఫిల్మ్ చేస్తున్నారామె. అమెరికన్ కామిక్ బుక్ ‘ది అరీ్చస్’ ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ వెబ్ ఫిల్మ్తోనే అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నంద, షారుక్ ఖాన్ కుమార్తె సుహానా, బోనీకపూర్–దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ యాక్టర్స్గా ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఇక ‘జిందగీ నా మిలేగీ దోబారా’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో జోయా అక్తర్ దర్శకురాలిగా సుపరిచితురాలే. ⇔ ‘బరేలీ కీ బర్ఫీ’, ‘పంగా’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు అశ్వనీ అయ్యర్ తివారి (ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి భార్య). ఇప్పటికే భర్త నితీష్తో కలిసి ‘బ్రేక్ పాయింట్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్లో భాగస్వామ్యులయ్యారు అశ్వని. ఇప్పుడు సోలోగా ‘ఫాదు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్తో పావైల్ గులాటి, సయామీ ఖేర్ ముఖ్య తారలుగా ఈ సిరీస్ తీస్తున్నారు అశ్వనీ. రెండో సిరీస్తో... కొందరు దర్శకులు రెండో వెబ్ సిరీస్కి రెడీ అయ్యారు. ఆ వివరాల్లోకి వస్తే... ⇔ సల్మాన్ ఖాన్తో ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ చిత్రాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తొలిసారిగా ‘తాండవ్’ అనే వెబ్ సిరీస్ చేశారు. తాజాగా షాహిద్ కపూర్ లీడ్ రోల్లో ‘బ్లడీ డాడీ’ అనేæసిరీస్ తీశారు. ఇక ‘స్కామ్ 1992’తో ఓటీటీలో సంచలనం సృష్టించిన దర్శకుడు హన్సల్ మెహతా తాజాగా భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఇందులో ప్రతీక్ గాంధీ టైటిల్ రోల్ చేస్తున్నారు. ‘కహానీ’, ‘బద్లా’ వంటి హిట్ సినిమాలు చేసిన సుజోయ్ ఘోష్ ఇప్పటికే ‘టైప్ రైటర్’ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ దర్శకుడు ప్రస్తుతం కరీనా కపూర్తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్తో డిజిటల్ వరల్డ్లోకి వెళ్లిన అనురాగ్ కశ్యప్ మరో వెబ్ సిరీస్కు కథ రెడీ చేశారట. ఇక హిట్ చిత్రాలు ‘క్వీన్’, ‘సూపర్ 30’ ఫేమ్ దర్శకుడు వికాశ్ బాల్ రెండో వెబ్ సిరీస్గా ‘ది క్యాన్సర్ బిట్చ్ చేస్తున్నారు. ‘సన్ ఫ్లవర్’ అనే సిరీస్తో వికాశ్ వెబ్ ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు దర్శకులు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లు, వెబ్ ఫిల్మ్లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
Oscars: ఆస్కార్ బరిలో అలియా భట్ సినిమా!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. గంగూబాయి జీవితం ఆధారంగా రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని ఆమె జీవిత కథనే సినిమాగా తెరకెక్కించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆలియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో ఒటికగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. (చదవండి: అభిమాని కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్, వీడియో వైరల్) లేటేస్ట్ సమాచారం ప్రకారం ఆస్కార్ బరిలో గంగూబాయి కతియావాడి సినిమా ఉందట. భారతీయ సినిమాల నుంచి గంగూబాయి కతియావాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. ‘గంగుబాయి’ని కచ్చితంగా ఆస్కార్ బరిలోకి దింపుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది. మరో రెండు నెలల్లో ఆస్కార్ చిత్రాల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గంగూబాయి కతియావాడి కాకుండా.. ఆర్ఆర్ఆర్ , ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. -
జోయా అఖ్తర్ యాక్టర్స్కు సెలవులివ్వదట, కారణం?
సినిమా.. ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో హీరోహీరోయిన్స్ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్ సరే.. దర్శకుల స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్నే క్యాచ్ చేశాం. ఇలా.. ! బయటకు వెళ్లిపోతారనే.. జోయా అఖ్తర్.. దర్శకురాలిగానే కాదు.. రైటర్గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్ను షూట్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు. రీటేక్స్ విషయంలో చాలా లిబరల్గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్ ధడక్నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్కు.. తన తోబుట్టువు ఫర్హాన్ అఖ్తర్తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్ షెడ్యూల్స్లో యాక్టర్స్కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. నో డీటైలింగ్.. సంజయ్ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్ మిస్ అవడు కానీ నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు.. తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. డార్క్ స్టోరీ అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎక్కువగా డార్క్ టాపిక్స్ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్ అబ్యూజ్ విక్టిమ్ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్ను అర్థం చేసుకోవాలి. సీన్స్ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్ను ఇష్టపడడు. -
గంగూభాయ్ కతియావాడి: అలియా భట్కు ఓ రేంజ్లో రెమ్యునరేషన్!
ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ‘గంగూభాయ్ కతియావాడి’ మూవీకి సంబంధించిన ఓ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాల్లో తన నటనతో అలరించిన స్టార్ హీరోయిన్ అలియా భట్ తాజా సినిమాతో మరో మెట్టు ఎక్కిందని విశ్లేషకులు చెప్తున్నారు. టాప్ హీరో అజయ్ దేవ్గన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో అలియా కళ్లు చెదిరే పారితోషికం తీసుకుందని సమాచారం. ఇండియా టుడే వార్త సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూభాయ్ సినిమాకు అలియా ఏకంగా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. దేవ్గన్ రూ.11 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోగ్రాఫికల్ క్రైం డ్రామా సినిమా బడ్జెట్ రూ.100 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా గంగూభాయ్ తెరకెక్కింది. (చదవండి: ఎనర్జిటిక్ హీరోకు సరైనోడు విలన్.. ఆది రోల్ రివీల్) 1960 కాలంలో ముంబైలోని కామాఠీపుర రెడ్లైట్ ఏరియా ప్రధానంగా కథ సాగుతుంది. ఇక స్టార్ కిడ్ అయిన అలియా.. భన్సాలీ దర్శకత్వంలో నటించాలని తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి అనుకున్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘బ్లాక్’ సినిమా ఆడిషన్స్కు వెళ్లానని, అయితే ఆ సినిమాలో అవకాశం రాలేదని ఆమె గుర్తు చేసుకుంది. ఇక దేశవ్యాప్తంగా గంగూభాయ్ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి: రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్కు డేట్ ఫిక్స్) -
మాటలు సరిపోవట్లేదు, ఎప్పటికీ నా మదిలో నిలిచిపోతాయి: సమంత
Samantha Lauds Alia Bhatt Performance In Gangubai Kathiawadi: గ్లామర్ రోల్స్తోనే కాకుండా వైవిధ్యభరితమైన నాయికా ప్రాధాన్యత కథలు ఎంచుకుంటూ దూసుకెళ్తోంది బాలీవుడ్ క్యూట్గుమ్మ అలియా భట్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో అలియా సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో అలరించిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ప్రముఖ బీటౌన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు అతిథి పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో అలియా వేశ్యగా నటించడం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందుతూ విజయవంతంగా ఆడుతోంది. ముఖ్యంగా ఇందులో అలియా నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ సమంత అలియా నటనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి వివరించడానికి పదాలు సరిపోవు. ప్రతీ ఒక్క డైలాగ్, హావాభావాలు నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి.' అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది సామ్. ఇంకా అనన్య పాండే, ఆదిత్య సీల్, సోఫీ చౌదరి వంటి తారలు కూడా అలియా నటనపై ప్రశంసలు కురిపించారు. -
గంగూబాయ్ కథియావాడి ట్విటర్ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా నటించిన చిత్రం గంగూబాయ్ కథియావాడి. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్లీలా భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్పై జయంతీలాల్ గడ నిర్మించారు. ఇదివరకే రిలీజైన ట్రైలర్, సినిమాపై చుట్టుకున్న వివాదాలు ఆలియా సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. అయితే ఈ సినిమాలో తన తల్లి గంగూబాయ్ కథియావాడీని వేశ్యగా చూపించారంటూ ఆమె తనయుడు బాబూ రావుజీ షా కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే! రిలీజ్ను సైతం అడ్డుకోవాలని చూసినప్పటికీ సినిమా విడుదలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసేసిన పలువురు నెటిజన్లు గంగూబాయ్ మూవీపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరి మెజారిటీ నెటిజన్లు గంగూబాయ్ను మెచ్చుకుంటున్నారా? ఆలియాకు మంచి మార్కులు పడ్డాయా? ఈ సినిమా తన కెరీర్కు ప్లస్ అయిందా? లేదా అనేది కింద చూసేయండి.. గంగూబాయ్ కథియావాడిలో ఆలియా నటన అద్భుతమని కొందరు కీర్తిస్తుంటే ఈ సినిమా పూర్తయ్యేవరకు థియేటర్లో నిద్రపోతూనే ఉన్నామని మరికొందరు అంటున్నారు. ఆ పాత్ర గాంభీర్యానికి ఆలియా గొంతు సెట్ అవ్వలేదన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీలు మాత్రం సినిమా అదిరిపోయిందని, ఆలియా పర్ఫామెన్స్కు మాటల్లేవ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆ రివ్యూలపై మీరూ ఓ లుక్కేయండి.. #OneWordReview...#GangubaiKathiawadi: BRILLIANT. Rating: ⭐️⭐⭐⭐#SLB is a magician, gets it right yet again... Powerful story + terrific moments + bravura performances [#AliaBhatt is beyond fantastic, #AjayDevgn outstanding]... UNMISSABLE. #GangubaiKathiawadiReview pic.twitter.com/pIyaf1MWtv — taran adarsh (@taran_adarsh) February 25, 2022 Saw #GangubaiKathiawadi last night!!! Another magical experience.. #SanjayLeelaBhansali is an absolute master storyteller. Every frame in the film has perfection written all over it. @aliaa08 you are gold! You are a fantastic actor but you have outdone yourself as Gangubai. — Riteish Deshmukh (@Riteishd) February 24, 2022 #GangubaiKathiawadi received 7 minutes standing ovation at the Berlin International film Festival from 700-800 audiences. #AliaBhatt — Indian Box Office (@box_oficeIndian) February 24, 2022 Finally watched most over hyper movie of the decade, I was big Bhasanali movies fan but after watching this i feel like he lost his charm, what a pathetic casting in main lead. If you watch other movies of him like black, HDDCS or Bajirao casting was perfect #GangubaiKathiawadi pic.twitter.com/lqrpcxnD73 — TweetuSultanL (@TweetuSultanL) February 25, 2022 Finished #GangubaiKathiawadi Disappointed from slb Below average performance of Alia Bhatt Slow screen play Over all it was a average movie 2.5/5 — gunjanchaubayofficial (@gunjanchau1993) February 25, 2022 I just Watched A Super Duper Hit Movie #GangubaiKathiawadi What a Amazing Movie 😍😍 Loved it Thank you @aliaa08 #SanjayLeelaBhansali @ajaydevgn for Giving a Wonderful and Blockbuster Movie. My review : ⭐⭐⭐⭐ 5/5#AliaBhatt #AjayDevgn @bhansali_produc ❤️❤️ pic.twitter.com/HxMhT3l14g — Pulkit Moonat (@am_pulkit) February 25, 2022 #PriyankaChopra , the first choice for #GangubaiKathiawadi would have given a 100 times better and Convincing performance than #AliaBhatt. The way she overshadowed M@@l aunty #DeepikaPadukone in BJM despite having a supporting role speaks volume about her acting skills. — Fotia (fire) (@I_am_fighter08) February 25, 2022 #GangubaiKathiawadi Movie : @aliaa08 ’s biggest career risk pays off. She took her acting to a different level and made it tough for her contemporaries to match her standards. #AliaBhatt pic.twitter.com/qWF172pqlJ — dinesh akula (@dineshakula) February 25, 2022 The soundtrack goes well with the mood of the film, but there's a hitch... Barring #Dholida, the remaining songs of #GangubaiKathiawadi are definitely not at par when one compares it with #SLB's earlier accomplished works. #GangubaiKathiawadiReview — Olid Ahmed Razu (@BeingOlidAhmed) February 25, 2022 Don't waste your money on movie like #GangubaiKathiawadi rather save it or serve it to poor.. — ✰Şนຖ (@a12sun) February 25, 2022 #OneWordReview...#GangubaiKathiawadi: BRILLIANT. Rating: ⭐️⭐⭐⭐#SLB is a magician, gets it right yet again... Powerful story + terrific moments + bravura performances [#AliaBhatt is beyond fantastic, #AjayDevgn outstanding]... UNMISSABLE. #GangubaiKathiawadiReview pic.twitter.com/XNuxqbFt9M — Olid Ahmed Razu (@BeingOlidAhmed) February 25, 2022 #GangubaiKathiawadi.. One word review. Flop.... #aliaabhatt looks like a kid.. Wrong casting only thing good is #AjayDevgn.. Will be the biggest flop of the year 1 out 5.. only for ajays performance... — Afzal rocks (@Afzalrocks1) February 25, 2022 you all bow down to the queen! she's here to rule & she's ruling!!! everybody in the theater is clapping and cheering and what not! truly one of a kind experience! loving the vibeeee 🥵😍#GangubaiKathiawadi #AliaBhatt — saurabh (@Saurabhhh_) February 25, 2022 #OneWordReview...from Australia#GangubaiKathiawadi: Engrossing Rating: 🌟🌟🌟🌟#SanjayLeelaBhansali weaves his magic, gets it right yet again. Powerful story #AliaBhatt gives her best, #AjayDevgn is outstanding Songs are good A must watch #GangubaiKathiawadiReview @aliaa08 pic.twitter.com/gw4F3tKJqm — Nitesh Naveen (@NiteshNaveenAus) February 25, 2022 After watching the movie you all sure bow down to her talent. #AliaBhatt born to play it and be a slb heroine.Alia Bhatt helps him with her immaculate acting and attitude. You will definitely miss out on a gem if you don’t watch it on the big screen. @aliaa08 #GangubaiKathiawadi pic.twitter.com/xW1GD4OBv4 — Jeny 🌸 (@Idiotic_luv_) February 25, 2022 చదవండి: జీవితంలో కామాఠిపురను చూడలేదు, తెలీకుండానే గంగూబాయ్లా మారిపోయేదాన్ని: ఆలియా -
'గంగూబాయ్' కోసం కాస్ట్లీ చీరల్లో ఆలియా దర్శనం
Alia Bhatt Looks For Gangubai Kathiawadi Promotions: బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. మహేష్ భట్ వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా తన నటనతోనే అభిమానుల్ని సంపాదించుకుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' వంటి సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్న ఆలియా ఇప్పుడు 'గంగూబాయి కతియావాడి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్.. ఆలియా నట విశ్వరూపాన్ని చూపించింది. డైలాగ్ డెలివరీలోనూ స్టార్ హీరోలకు సమానంగా సత్తా చాటింది. ఈ సినిమాతో ఆలియా బాలీవుడ్ నెంబర్1 హీరోయిన్గా చక్రం తిప్పుదింటూ ఇప్పటికే పలువురు ప్రముఖులు సైతం భావిస్తున్నారు. ట్రైలర్తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో చీరకట్టుతో మరింత మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఈ ప్రమోషన్స్ కోసం కేవలం చీరకట్టులో తళుక్కుమంటుంది. ఒక్కో చీర ధర సుమారు 21-29వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ ఫోటోలను మీరూ చూసేయండి మరి.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement