-
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సారా అలీ ఖాన్తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 -
వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్.. డేటింగ్ చేసి తప్పు చేశా: హీరో
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. తెలియకుండానే కొందరు ప్రేమలో పడిపోతారు. కానీ కొందరే చివరివరకు ఆ ప్రేమను నిలుపుకుంటారు. చాలామటుకు ప్రేమలు మధ్యలోనే పుటుక్కుమంటాయి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ దేనికీ శుభం కార్డు పడలేదు. లవ్ ఆజ్ కల్ 2 సినిమా షూటింగ్ సమయంలో సారా అలీ ఖాన్తో, దోస్తానా 2 మూవీ చిత్రీకరణ టైంలో జాన్వీ కపూర్తో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇద్దరమ్మాయిలతో డేటింగ్ దోస్తానా 2 షూటింగ్ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. అప్పుడే వీరి ప్రేమ కూడా ముగిసిపోయింది. తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్.. తన పాత లవ్ కహానీల గురించి ప్రస్తావించాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్తో డేటింగ్ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అన్న ప్రశ్నకు అవునని బదులిస్తూనే.. ఒకవేళ నాతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్లు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు. కనిపిస్తే అదే అడుగుతా మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్ ఏం మాట్లాడతావు? అని హోస్ట్ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా సారా అలీఖాన్, జాన్వీ కపూర్.. ఇద్దరూ క్లోజ్ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్ సినిమా చేస్తున్నాడు. అలాగే భూల్ భులయ్యా 3, ఆషిఖి 3 చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. చదవండి: నటి భర్తకు గుండెపోటు.. క్షమాపణలు చెప్తూ పోస్ట్! -
యాచకులకు ఫుడ్ పంచిన హీరోయిన్.. ప్లీజ్ అలా చేయొద్దంటూ..
హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అందం ఉండాలి. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్నవారు హీరోయిన్లుగా నిలదొక్కుకున్నారు. కానీ ఈ తరంలో మాత్రం బొద్దుగా ఉంటే ఎక్కువకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేరు. ఇంకో ఛాయిస్ లేనట్లు సన్నబడి తీరాల్సిందే! అలా సారా అలీ ఖాన్ సైతం తన బరువు తగ్గించుకుని సన్నబడింది. హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. దేవుడి దర్శనం అనంతరం.. ఈ మధ్య 'మర్డర్ ముబారక్', 'ఏ వాతా మేరే వాతా' అనే ఓటీటీ ప్రాజెక్టులతో వెబ్ ఆడియన్స్ను అలరించింది. శనివారం నాడు ఆమె ముంబై.. జుహులోని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లింది. దేవుడిని దర్శించుకున్న అనంతరం బయట ఉన్న యాచకులకు స్వీట్లు పంచింది. భిక్షాటన చేస్తున్న అందరికీ స్వీటు బాక్సులు పంచుతుండటంగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు. మీరు మారరు దీంతో విసిగెత్తిన బ్యూటీ.. ప్లీజ్, ఆపేయండి. మిమ్మల్ని బతిమాలి, బతిమాలి నేను అలిసిపోతున్నాను, కానీ మీరు మారడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీట్లు పంచిన అనంతరం అక్కడినుంచి విసురుగా కారెక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్ 'మెట్రో ఇన్ డినో' అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ప్రియుడితో తొలిసారి విహారయాత్రకు వెళ్లిన బ్యూటీ -
Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో
సినిమాలు పాత కథలను తవ్వి పోస్తున్నాయి. చరిత్ర గతిని వెండి తెర మీద పునఃసృష్టిస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో ఘట్టాలు. ఎందరో త్యాగమూర్తులు. కాని పురుషుల బయోపిక్లు వచ్చినట్టుగా స్త్రీలవి రాలేదు. తాజాగా విడుదలైన ‘అయ్ వతన్ మేరే వతన్’ సినిమా నాటి వీర వనిత ఉషా మెహతా జీవితాన్ని చూపింది. బ్రిటిష్కు వ్యతిరేకంగా సీక్రెట్ రేడియో నడిపిన ఉషా మెహతా ఎవరు? ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... ఈ అనౌన్స్మెంట్ బ్రిటిష్ వారిని గడగడలాడించింది. మునికాళ్ల మీద పరిగెత్తిచ్చింది. ఒక బుల్లి రహస్య రేడియో స్టేషన్ని, దాని నిర్వాహకులను అరెస్ట్ చేయడానికి పిచ్చెక్కినట్టు తిరిగేలా చేసింది. మూడు నెలల పాటు బ్రిటిష్వారిని ముప్పుతిప్పలు పెట్టిన ఆ రేడియో నిర్వాహకురాలి పేరు ఉషా మెహతా. గాంధీ పిలుపు విని... ఉషా మెహతా గుజరాత్లోని సూరత్ సమీపంలో ఉన్న సారస్ అనే ఊళ్లో 1920లో జన్మించింది. ఐదేళ్ల వయసులో గాంధీజీని అహ్మదాబాద్లో చూసింది. 8 ఏళ్ల వయసులో వాళ్ల ఊరి దగ్గర గాంధీజీ చరఖా కార్యక్రమం నిర్వహిస్తే ఉషా పాల్గొని కొద్దిసేపు చరఖా తిప్పింది. బాల్యంలోనే గాంధీజీ మీద గొప్ప భక్తి పెంచుకున్న ఉషా 12 ఏళ్ల వయసులో తండ్రి వృత్తిరీత్యా బొంబాయికి మారడంతో తన దేశభక్తిని చాటుకునే అవకాశం పొందింది. డూ ఆర్ డై 1942 ఆగస్టు 8న బొంబాయిలో గాంధీజీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారు. ‘డూ ఆర్ డై’ లేదా ‘కరో యా మరో’ నినాదాలు మిన్నంటాయి. ‘ఇక భారత ప్రజలు నాయకుల కోసం ఎదురు చూడొద్దు. ప్రజలే నాయకులు’ అని గాంధీజీ పిలుపునిచ్చారు. 22 ఏళ్ల ఉషా మెహతా తన స్నేహితులైన విఠల్ దాస్ ఖాకడ్, చంద్రకాంత్ ఝావేరీ, బాబూభాయ్ ఠక్కర్లతో కలిసి ఆ మీటింగ్కు వెళ్లింది. ఉత్తేజితురాలైంది. అప్పటికే స్వతంత్రోద్యమ వార్తల మీద బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉద్యమం ఉధృతం కావాలంటే రేడియో మాధ్యమం ద్వారా వార్తలు అందించాల్సిన అవసరం ఉందని ఉషా మెహతా తన స్నేహితులతో చెప్పింది. దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పిలుపునిచ్చింది. రహస్య కాంగ్రెస్ రేడియో బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పని చేస్తున్న తండ్రి నివారించినా వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిన ఉషా బొంబాయిలో షికాగో రేడియో ట్రాన్స్మిషన్ను చూస్తున్న మరో మిత్రుడు మోత్వాని సహాయంతో సొంత ట్రాన్స్మిటర్ను సంపాదించింది. మిత్రులతో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్గా మలిచింది. ఆగస్టు 27, 1942న మొదటి చరిత్రాత్మక ప్రసారాన్ని సొంత గొంతుతో చేసింది. ‘దిసీజ్ కాంగ్రెస్ రేడియో 42.34 మీటర్స్ సమ్వేర్ ఇన్ ఇండియా’... అంటూ స్వాతంత్రోద్యమ వార్తలు వినిపించింది. ఆ క్షణం నుంచి ఆ రహస్య రేడియో కోసం బ్రిటిష్ అధికారులు, పోలీసులు కంటి మీద కునుకు లేకుండా వెతకసాగారు. ప్రసారాలు బొంబాయి నుంచే నిర్వహిస్తున్నా దేశంలో ఎక్కడి నుంచి అవుతున్నాయో తెలియక గింజుకున్నారు. మూడు నెలలు రహస్య రేడియో ప్రసారాలు మూడు నెలలు సాగాయి. కాని పరికరాలు సమకూర్చిన మోత్వాని లొంగిపోయి రేడియో స్టేషన్ చిరునామా చెప్పేశాడు. నవంబర్ 12, 1942న పోలీసులు దాడి చేసి ఉషా మెహతాను అరెస్ట్ చేశారు. ఆరు నెలల పాటు ఆమెను ఇంటరాగేట్ చేశారు. 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉషా ఏ మాత్రం జంకలేదు. 1946 నాటి మధ్యంతర ప్రభుత్వ హయాంలో మురార్జీ దేశాయ్ హోమ్ మినస్టర్గా ఉండగా ఆమె విడుదల జరిగింది. కాని జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసింది. బయటకు వచ్చాక ఆమె చదువు కొనసాగించి ముంబై యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి 1980లో రిటైర్ అయ్యింది. గాంధీజీ భావజాలాన్ని ప్రచారం చేస్తూ 2000 సంవత్సరంలో తుది శ్వాస విడిచింది. ఉషా మెహతా జీవితం ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘అయ్ వతన్ మేరే వతన్’ అమేజాన్లో మార్చి 21న విడుదలైంది. -
చీర సౌందర్యాలు, అందాల ఐశ్వర్యాలు (ఫోటోలు)
-
అందం ఉంటే సరిపోదు.. ఈ బ్యూటీలా దమ్ముండాలి
స్టేజీపై అందరిముందు హుందాగా, అందంగా నడవాలంటే టాలెంట్, ఒంపుసొంపులు ఉంటే సరిపోదు. ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ నడక అందం రెట్టింపు అవుతుంది. ముంబైలో జరిగిన లాక్మె ఫ్యాషన్ వీక్లో హీరోయిన్ సారా అలీ ఖాన్ ఎంతో దర్జాగా ర్యాంప్ వాక్ చేసింది. ఈ ఈవెంట్లో సిల్వర్ కలర్ లెహంగా ధరించిన సారా తన ఒంపుసొంపులతో హొయలొలికించింది. ఆమె కళ్లలోనే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చేలా కనిపిస్తోంది. కవర్ చేయలేదు అంతేనా.. తన నడుముపై ఉన్న మచ్చను మేకప్తో కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. దాన్నలాగే వదిలేసింది. తన ర్యాంప్ వాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'కాలిన మచ్చను కవర్ చేయడానికి ప్రయత్నించలేదు చూడు, అక్కడే నచ్చేసింది.. మనం ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలని చాటిచెప్తోంది. నీ నిజాయితీ, గొప్పతనేమ నిన్ను మరింత బ్యూటిఫుల్గా మలుస్తోంది' అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వేడినీళ్లు ఒంటిపై పడటంతో అలా మచ్చలు ఏర్పడినట్లు తెలుస్తోంది. సారా ప్రస్తుతం ఆ మూవీలో.. సారా ప్రస్తుతం 'ఏ వాటన్ మేరే వాటన్' అనే సినిమాలో నటిస్తోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సారాతో పాటు సచిన్ కేడేకర్, అభయ్ వర్మ, స్పర్ష శ్రీవాత్సవ్, అలెక్స్ ఓ నీల్, ఆనంద్ తివారి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: నల్లగా ఉన్నానని హేళన.. ఇంట్లోవాళ్లు ఆరేళ్లు మాట్లాడలేదు.. -
డైరెక్ట్గా ఓటీటీకి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీకి బాగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి వారికోసమే వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్లు సందడి చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్, జానర్లతో ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ త్రిపాఠి, సారా అలీ ఖాన్, కరిష్మా కపూర్, విజయ్ వర్మ, సంజయ్ కపూర్, టిస్కా చోప్రా, డింపుల్ కపాడియా లాంటి భారీ తారాగణంతో రూపొందించిన మర్డర్ మిస్టరీ మూవీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మర్డర్ ముబారక్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్గానే తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సెలబ్రిటీలు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలకు మాత్రమే అనుమతి ఉన్న రాయల్ ఢిల్లీ క్లబ్లో జరిగిన ఓ మర్డర్ ఆధారంగా కథను రూపొదించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ డైరెక్ట్గా మార్చి 15వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. సారా అలీ ఖాన్ నటించిన మరో మూవీ 'ఏ వతన్ మేరే వతన్' కూడా నేరుగా ఓటీటీలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. -
డైరెక్ట్గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే
స్టార్ హీరోయిన్ నటించిన ఓ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్య కథతో తీసిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. విజువల్స్, స్టోరీ పరంగా కాస్త ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఇదే సినిమా? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో తక్కువ కానీ హిందీలో చాలా సినిమాలు నేరుగా ప్రముఖ ఓటీటీల్లో రిలీజై అయిపోతున్నాయి. లాక్డౌన్ తర్వాత నుంచి ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ సారా అలీ ఖాన్ కాంబోలో తీసిన సినిమా 'ఏ వతన్ మేరే వతన్'. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఉషా మెహతా అనే స్వాతంత్ర్య ఉద్యమకారిణి జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1942లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు చాలామంది నిస్వార్థంగా పనిచేశారు. అలా అండర్ గ్రౌండ్లో రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి, ఉద్యమకారుల్లో చైతన్యాన్ని రగిల్చిన ఓ మహిళ కథే ఈ సినిమా. సారా అలీ ఖాన్ టైటిల్ రోల్ పోషించింది. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో నేరుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ట్రైలర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
ఆలియా చాలారోజుల తర్వాత అలా.. హీట్ పెంచుతున్న సీరత్!
చాలా ఏళ్ల తర్వాత క్లాసికల్ డ్యాన్స్.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిపోతున్న ఆలియా భట్ చీరకట్టులో మరింత క్యూట్గా ముద్దుగుమ్మ ప్రియమణి కలర్ఫుల్ సీతాకోకచిలుకలా కనిపిస్తున్న సీరత్ కపూర్ మేకప్ లేకపోయినా సరే అందంగానే మీనాక్షి చౌదరి ఎక్సర్సైజ్ చేస్తూ ఫొటోలు పోస్ట్ చేసిన మంచు లక్ష్మి భర్తతో కలిసి హీరోయిన్ దీపికా పదుకొణె క్యూట్ పోజులు రోజురోజుకీ మరింత హాట్గా సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Musskan Sethi Adlakha (@musskansethi9) -
డైరెక్ట్గా ఓటీటీకి వచ్చేస్తోన్న స్టార్ డైరెక్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ భామ సారా అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఏ వతన్ మేరే వతన్'. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మించారు. కణ్ణన్ అయ్యర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్లో ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. (ఇది చదవండి: బిగ్బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీనవం.. ఇంతలో!) ఈ సినిమాను భారత స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసి.. ఉద్యమకారుల్లో ఉత్తేజం నింపిన ఓ మహిళ కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఉషా మెహతా అనే మహిళ జీవిత కథనే సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో రేడియో కీలక పాత్ర పోషించింది. ఇవాళ ప్రపంత రేడియో దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, స్పార్ష్ శ్రీవాత్సవ, అలెక్స్ ఓ నేలి, ఆనంద్ తివారీ కీలక పాత్రలు పోషించారు. resilience in her voice, and the spirit of freedom in her heart, hear what she has to say to you this #WorldRadioDay 📻#AeWatanMereWatanOnPrime, Mar 21#KaranJohar @apoorvamehta18 @somenmishra0 @SaraAliKhan #KannanIyer @darab_farooqui @Dharmatic_ pic.twitter.com/ZdQvDsFLjH — prime video IN (@PrimeVideoIN) February 13, 2024 -
పొట్టి నిక్కర్లో సీరియల్ బ్యూటీ.. అనసూయ మాత్రం అలాంటి లుక్!
బ్లాక్ అండ్ వైట్లో మత్తెక్కిస్తున్న పూజా హెగ్డే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న మీనాక్షి చౌదరి భరతనాట్యం లుక్లో అదాశర్మ కొత్త స్టిల్స్ క్యాట్ వాక్తో కేక పుట్టించిన హీరోయిన్ తాన్య హోప్ 7 మిలియన్ల మార్క్ క్రాస్ చేసిన 'ఉప్పెన' కృతిశెట్టి వంగి వంగి మరీ అందాలు చూపిస్తున్న సారా అలీ ఖాన్ సోయగాల బెండు తీస్తున్న తమిళ బ్యూటీ యాషికా ఆనంద్ జిగేలుమనే డ్రస్లో విచిత్రమైన పోజుల్లో సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Kasthuri Shankar (@actresskasthuri) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) -
IFFI Goa 2023: గోవా ఇఫి వేడుకల్లో తారాలోకం (ఫొటోలు)
-
మీ సవతి కూతురితో నటిస్తారా?.. కరీనా సమాధానం ఇదే!
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. దక్షిణాది స్టార్ హీరోతో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ. సారా అలీఖాన్ (కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా' అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ అమృతా సింగ్ను వివాహమాడారు. ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత మీరు సౌత్లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని కరణ్ మరో ప్రశ్న వేశారు. వీరిలో ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్లో ఎవరితో ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ హీరో యశ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించాలని ఉంది. కేజీయఫ్ సినిమా చూశా. చాలా బాగుంది.' అని చెప్పారు. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు. కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 22, 2024న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
Sara Ali Khan: బాలీవుడ్ హీరోయిన్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
శుభమన్తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శుభమన్తో డేటింగ్? అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్మన్ గిల్తో డేటింగ్లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్కపూర్తో అనన్య డేటింగ్పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. సారాపై రూమర్స్! ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్లో సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇటీవలే అనన్య పాండే ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన రూమర్డ్ బాయ్ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కు వెళ్తూ వీడియోలో కనిపించారు. తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన భామ కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మరో నటి సారా అలీ ఖాన్తో కలిసి పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్లో..'!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తిక ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే వద్ద ఉన్న వస్తువు ఏంటి? అని అడిగారు. దీనికి సారా స్పందిస్తూ 'ది నైట్ మేనేజర్' అంటూ సమాధానమిచ్చింది. అయితే ఇది విన్న అనన్య తెగ సిగ్గు పడిపోయింది. తాను అనన్య రాయ్ కపూర్గా భావిస్తున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. కాగా.. సారా అలీ ఖాన్ మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్తో స్క్రీన్ను పంచుకోనుంది. మరోవైపు అనన్య పాండే.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్లో కూడా నటించనుంది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) -
సారా అలీ ఖాన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సారా అలీ ఖాన్.. బాలీవుడ్లో ఎంటర్ అవడానికి ఆమెకున్న నటనా వారసత్వం ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఆమె నిలబడింది మాత్రం అచ్చంగా తనలోని ప్రతిభతోనే! ఫ్యాషన్లోనూ ఆ స్టార్ స్టయిల్ సెపరేటే! అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్ఫ్లుయెన్స్ ఇంచ్ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సెలబ్రిటీలు అని అనుకుంటారు కదా! కానీ నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్కి, షోస్కి కూడా నేను రెంటల్ డ్రెసెస్నే ఫ్రిఫర్ చేస్తాను! పునీత్ బలానా.. ‘వార్డ్రోబ్లోని మన కలెక్షన్.. మన ఫ్యాషన్ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్ బలానా. అందుకే అతని డిజైన్స్ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్ సెలబ్రిటీస్ ఫేవరెట్గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్లైన్లోనూ లభ్యం. సారాఖాన్ ధరించి డ్రెస్ బ్రాండ్ పునీత్ బలానా ఖరీదు రూ. 1, 55, 000/-. జేకేజే జ్యూలర్స్ ఇది ఎనిమిది తరాల వారసత్వ వ్యాపారం. 1868లో రతన్గఢ్ అనే చిన్న పట్టణంలో సత్యనారాయణ జీ మోసున్తో ప్రారంభమై.. నేడు జైపూర్లోనే ఉత్తమ ఆభరణాలను అందించే బ్రాండ్గా స్థిరపడింది. రాజస్థానీ సంప్రదాయ నగలను ప్రపంచ దేశాలకూ పరిచయం చేస్తుండడంతో ఈ బ్రాండ్ కీర్తి అంతర్జాతీయ స్థాయికీ చేరుకుంది. ధర జ్యూలరీ డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక సారాఖాన్ ధరించిన జేకేజే జ్యూలర్స్ ధర ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. --దీపిక కొండి (చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!) -
‘సారా’లతో ప్రేమాయణం: శుబ్మన్కు సచిన్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!
Happy Birthday Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ పుట్టినరోజు నేడు(సెప్టెంబరు 8). పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జన్మించిన ఈ హ్యాండ్సమ్ బ్యాటర్ నేటి(శుక్రవారం)తో 24వ పడిలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సైతం గిల్ను ప్రత్యేకంగా విష్ చేయడం హైలైట్గా నిలిచింది. కాగా 2018 అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు గిల్. 104.5 స్ట్రైక్రేటుతో 418 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీగా నాటి ఐసీసీ ఈవెంట్లో కెప్టెన్ పృథ్వీ షాకు డిప్యూటీగా వ్యవహరించిన శుబ్మన్ గిల్.. ఇప్పుడు అతడిని దాటుకుని టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. మరుసటి ఏడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు. డబుల్ సెంచరీ వీరుడు ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 టెస్టులు, 29 వన్డేలు, 11 టీ20 మ్యాచ్లు ఆడిన శుబ్మన్ గిల్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 966, 1514, 304 పరుగులు సాధించాడు. టెస్టుల్లో రెండు శతకాలు సాధించిన ఈ పంజాబీ కుర్రాడు.. వన్డేల్లో 4 సెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లోనూ హవా పొట్టి ఫార్మాట్లోనూ ఒక శతకం సాధించి.. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఐపీఎల్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడి ఖాతాలో ఏకంగా 3 సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో.. టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లిని రోల్ మోడల్గా భావించే గిల్.. భవిష్యత్తులో అతడి స్థాయికి ఎదగలడని ప్రశంసలు అందుకుంటున్నాడు. భావి భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు గిల్ గురించి జోస్యం చెబుతున్నారు. సొట్ట బుగ్గల కుర్రాడు.. అమ్మాయిల కలల రాకుమారుడు మేటి బ్యాటర్గా ఎదుగుతున్న శుబ్మన్ గిల్కు అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అహ్మదాబాద్లో ఓ మ్యాచ్ సందర్భంగా ఓ యువతి.. ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా గిల్ అంటూ ప్లకార్డు ప్రదర్శించడం చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది. ‘సారా’లతో ప్రేమాయణం పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ సొట్ట బుగ్గల కుర్రాడి ‘ప్రేమాయణాలు’ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే! సచిన్ టెండుల్కర్ గారాలపట్టి సారా టెండుల్కర్తో గిల్ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. అడపాదడపా కలిసి బయట కనిపించడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, దేవతలను ప్రేమించకూడదంటూ గిల్ పెట్టిన పోస్ట్తో సారాతో బ్రేకప్ అయ్యిందని ఊహాగానాలు వినిపించాయి. పటౌడీల యువరాణితో చెట్టాపట్టాల్ ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్తో శుబ్మన్ గిల్ కలిసి కనిపించడం మరోసారి రూమర్స్కు దారితీసింది. పటౌడీ పరగణా వారసురాలితో ఈ కుర్ర క్రికెటర్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ గాసిప్రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. కెరీర్పై ఫుల్ ఫోకస్ అయితే, ఇవన్నీ పట్టించుకోకుండా తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టాడు గిల్. వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనను తాను నిరూపించుకుంటూ.. టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడయ్యాడు. ప్రస్తుతం ఆసియా కప్-2023తో బిజీగా ఉన్న గిల్.. తదుపరి వన్డే వరల్డ్కప్-2023తో ఐసీసీ ఈవెంట్ బరిలో దిగనున్నాడు. సచిన్ టెండుల్కర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే తన కుమార్తె సారాతో గిల్ ప్రేమ వార్తల నేపథ్యంలోనూ సచిన్ టెండుల్కర్ ఈ యువ క్రికెటర్ను ఎప్పటికపుడు ఆకాశానికెత్తడం విశేషం. తన కళ్ల ముందే టీ20 మ్యాచ్లో శుబ్మన్ గిల్ సెంచరీ సాధించిన సందర్భంగా సచిన్ అతడిపై గతంలో ప్రశంసలు కురిపించాడు. తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా.. ‘‘హ్యాపీయెస్ట్ బర్త్డే శుబ్మన్ గిల్. ఈ ఏడాది నువ్వు పరుగుల వరద పారించాలి. మరిన్ని గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాలి’’ అని సచిన్ ఆకాంక్షించాడు. ఇక రాబిన్ ఊతప్ప, అక్షర్ పటేల్ సహా సహచర క్రికెటర్లు బర్త్డే బాయ్ గిల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. చదవండి: పాక్ ఫాస్ట్బౌలర్లే కాదు.. టీమిండియా పేసర్లూ భేష్! వాళ్లకు చుక్కలు ఖాయం - Double hundred in ODIs. - Hundred in Test. - Hundred in T20I. - Hundred in IPL. - Player of the tournament in U-19 WC. Happy Birthday to the future Super-star of the World Cricket, Shubman Gill. pic.twitter.com/xUs1IcAtFI — Johns. (@CricCrazyJohns) September 8, 2023 5️⃣8️⃣ intl. matches 2️⃣7️⃣8️⃣4️⃣ intl. runs Youngest ODI double-centurion (in Men's cricket) 🔝 Youngest all-format centurion in Men's intl. cricket 👌 Here's wishing Shubman Gill a very happy birthday 👏 🎂#TeamIndia pic.twitter.com/BAaXEBClRN — BCCI (@BCCI) September 8, 2023 Happiest birthday to you @ShubmanGill. May the upcoming year be full of runs and great memories. — Sachin Tendulkar (@sachin_rt) September 8, 2023 -
జవాన్లతో కియారా సెలబ్రేషన్స్, తొలిసారి ఆ పని చేసిన ఐటం బ్యూటీ
నవ్వుతో ఫిదా చేస్తున్న కీర్తి సురేశ్ చీర కడితే ఆ ఆనందమే వేరంటున్న అనన్య నాగళ్ల తన ఫేవరెట్ ఫోటోలు షేర్ చేసిన శ్రియ ఇప్పుడీ సన్గ్లాసెసే ఇష్టమంటోన్న మాళవిక మోహన్ ఫస్ట్ టైం లైవ్లో డ్యాన్స్ చేసిన నోరా ఫతేహి ఆర్మీ జవాన్లతో కియారా అద్వానీ సాహసాలు View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Rani Mukerji 🔵 (@_ranimukerji) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Annie 🦋 (@thenameis_annie) -
Sara Ali Khan: ఒకప్పుడు 96 కిలోలు ఉండేది.. ఇప్పుడెంత నాజూకుగా అయిందో చూశారా? (ఫోటోలు)
-
ఒక్కరోజుకు నాలుగు వందలా?.. తనకు అవసరం లేదన్న హీరోయిన్
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం 'జరా హట్కే జరా బచ్కే'. ఈనెల 2న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో రూ.12.7 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇటీవలే అబుదాబిలో జరిగిన ఒక అవార్డ్ షో కోసం వచ్చిన సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ హాజరయ్యారు. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన జబర్దస్త్ కమెడియన్ .. అమ్మాయి ఎవరో చెప్పేశాడు!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా రూ.400 ఖర్చు చేసేందుకు కూడా నిరాకరించింది. అబుదాబిలో రోమింగ్ ఛార్జీల కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సారా అలీ ఖాన్ ఒక్క రోజుకు నాలుగు వందల రూపాయలు ఖర్చు చేయడం ఇష్టం లేక ఇంటర్నెట్ కోసం పక్కవారిని హాట్స్పాట్ ఆన్ చేయమని అభ్యర్థించినట్లు తెలిపింది. సారా మాట్లాడుతూ.. 'నా పక్కన ఉన్న వ్యక్తిని రోమింగ్ ప్యాకేజీ ధర గురించి అడిగా. రోమింగ్ ప్యాక్ నెల ప్లాన్ మాత్రమే వస్తుందని చెప్పారు. కానీ నేను అబుదాబిలో ఒకే రోజు ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత 10 రోజులకు రూ. 3000 ఖర్చవుతుందని తెలుసుకున్నా. నేను కేవలం ఇక్కడ రోజే కదా ఉండేది. పది రోజుల ప్లాన్ ఎందుకనిపించింది. ఆ తర్వాత రోమింగ్ ప్యాక్ను రోజుకు రూ. 400కి కొనుగోలు చేయవచ్చని ఎవరో చెప్పారు. కానీ ఒక్క రోజు రూ.400 ఖర్చు చేయడం ఇష్టం లేక నేను నా పక్కవారిని హాట్స్పాట్ అడిగాను.' అంటూ చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!) -
టవల్ కోసం అన్ని డబ్బులు తగలేస్తావా? అని ఒకటే తిట్టుడు..
సెలబ్రిటీల లైఫ్స్టయిల్ ఎలా ఉంటుందంటే.. చిన్న వస్తువు కోసం కూడా బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటారు. అవి వందలు, వేలు, లక్షలు, కొన్నిసార్లైతే కోట్లల్లో కూడా ఉంటాయి. ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత హుందాగా ఫీలవుతారు. అయితే కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా సింపుల్గా ఉండాలనుకుంటారు. హీరోయిన్గా, సహాయ నటిగా మెప్పించిన ఒకప్పటి బాలీవుడ్ సీనియర్ నటి అమృత సింగ్ కూడా ఏదైనా భారీగానే ప్లాన్ చేస్తుంది. ఎంత భారీగా అంటే ముఖం తుడుచుకునే టవల్ కూడా వేలు పోసి కొంటుంది. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ బయటపెట్టాడు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ ఆన్స్క్రీన్ జంట ద కపిల్ శర్మ షోలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు విక్కీ కౌశల్. 'ఒక రోజు సెట్లో సారా తన తల్లి అమృత మేడమ్ను తిడుతోంది. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అంతా ఓకేనా? అని అడిగా. దానికామె.. మా అమ్మ రూ.1600 పెట్టి కొత్త టవల్ తీసుకుంది. అందుకే కోప్పడుతున్నా అని చెప్పింది. నేను నమ్మలేకపోయాను. తను జోక్ చేస్తుందేమో అనుకున్నాను. నిజం చెప్పు? అని అడిగితే నిజమే చెప్తున్నానని అరిచింది. నేను షాకయ్యాను.. రూ.1600 పెట్టి ఎవరైనా టవల్ కొంటారా? అందుకే సారా వాళ్లమ్మను తిడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చాడు. ఇంతలో సారా మధ్యలో కలగజేసుకుంటూ 'మరి ఒక్క టవల్ కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు పెడతారా? కావాలంటే వానిటీ వ్యాన్లో ఉన్న ఫ్రీ టవల్స్ వాడుకోవచ్చుగా' అని పేర్కొంది. చదవండి: నిశ్చితార్థం జరిగిందంటూ అనుపమ పోస్ట్ -
సారా- గిల్ డేటింగ్ రూమర్స్.. అంతలోనే విడిపోయారా?
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ గతంలో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట దుబాయ్లోని ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కనిపించడంతో అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే దీనిపై ఎవరూ కూడా నోరు విప్పలేదు. (ఇది చదవండి: Shubman Gill: ‘సారా’తో దుబాయ్లో శుబ్మన్ గిల్.. ఫొటో వైరల్! అయితే ఈసారి..) అయితే అంతలా కలిసి తిరిగినా వీరిద్దరు తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పినట్లేనా అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందని మరికొందరు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో సూపర్ ఫామ్లో ఉన్న గిల్.. గతంలోనూ సచిన్ కూతురు సారా టెండూల్కర్తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడే గానీ డేటింగ్ గురించి స్పందించలేదు. (ఇది చదవండి: దానివల్లే శాకుంతలం సినిమాకు కలెక్షన్స్ రాలేదు: పరుచూరి) అయితే కొన్ని నెలల క్రితం సోనమ్ బజ్వాతో ఇంటర్వ్యూలో గిల్ చివరకు సారాతో డేటింగ్పై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మీరు సారాతో డేటింగ్ చేస్తున్నారా?" గిల్ని ప్రశ్నించగా.. అవ్వొచ్చు.. కాకపోవచ్చు అంటూ బదులిచ్చారు. కాగా.. సారా అలీ ఖాన్ ప్రస్తుతం 'జరా హాట్కే జరా బచ్కే' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. మరోవైపు శుభ్మన్ గిల్ ఐపీఎల్ మ్యాచ్లతో బిజీగా ఉన్నారు. -
‘జరా హట్కే జరా బచ్ కే’ మూవీ ప్రమోషన్స్లో సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ (ఫొటోలు)
-
అట్టహాసంగా ఆరంభమైన కాన్స్ చిత్రోత్సవాలు
76వ కాన్స్ చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఫ్రాన్స్లో ఈ నెల16న మొదలైన ఈ చిత్రోత్సవాలు 27 వరకు కొనసాగుతాయి. ఎనిమిది మంది జ్యూరీ సభ్యులకు స్వీడన్కు చెందిన రూబెన్ ఓస్ట్లాండ్ సారథ్యం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సమా చార, ప్రసార శాఖ డిప్యూటీ మినిస్టర్ ఎల్. మురుగన్ ఈ చిత్రోత్సవాల్లో ఇండియన్ టీమ్ను లీడ్ చేస్తున్నారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు రెడ్ కార్పెట్పై మెరవనున్నారు. ఇక తొలి రోజు వేడుక విశేషాల్లోకి వెళదాం. ఏడు నిమిషాల స్టాండింగ్ ఒవేషన్ తొలి రోజు బయోగ్రఫికల్ డ్రామా ‘జాన్ డ్యు బెర్రీ’ ప్రదర్శనతో ప్రారంభమై, చివరి రోజు ఉత్సవాలు ‘ఎలిమెంటల్’ సినిమా ప్రదర్శనతో ముగుస్తాయి. ‘జాన్ డ్యు బెర్రీ’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేసిన జానీ డెప్ ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. ఈ చిత్రప్రదర్శన ముగిసిన తర్వాత వీక్షకులు ఏడు నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ఇవ్వడం విశేషం. తమ చిత్రానికి ఇంత అద్భుత స్పందన లభించిన నేపథ్యంలో జానీ డెప్ కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. మైవెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. కాన్స్లో భారతీయం ప్రతి ఏడాదీ కాన్స్ చిత్రోత్సవాల్లో భారతీయ తారలు మెరుస్తుంటారు. ఈ ఏడాది తొలి రోజు హిందీ తారలు సారా అలీఖాన్, ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, ఊర్వశీ రౌతేలా రెడ్ కార్పెట్పై మెరిశారు. కాగా సారా, ఈషా, మానుషీ లు తొలిసారి కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు ఊర్వశి కూడా రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. దేశీ లుక్లో అగుపించిన సారాకి ప్రశంసలు లభించాయి. వీరు మాత్రమే కాదు.. ఇంకా హీరోయిన్లు అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, నాగాల్యాండ్ యాక్ట్రస్ ఆండ్రియా కెవిచుసాలు తొలిసారిగా ఈ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటారు. ఇంకా ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగా, దర్శకుడు మధుర్ భండార్కర్, హీరోయిన్ అదితీరావ్ హైదరీ, నటుడు విజయ్వర్మ, దర్శకుడు విఘ్నేష్ శివన్ వంటి వారు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే దర్శకుడు అనురాగ్ కశ్వప్ తెరకెక్కించిన ‘కెన్నెడీ’, దర్శకుడు కను బెహ్లీ తీసిన ‘ఆగ్రా’, మణిపూర్ దర్శకుడు అరిబామ్ శ్యామ్ శర్మ తెరకెక్కించిన ‘ఇషానౌ’, యుధాజిత్ బసు ‘నెహెమిచ్’ వంటి భారత చిత్రాలు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ‘కెన్నెడీ’ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకరిగా నటించిన సన్నీ లియోన్ ఈ చిత్రం ప్రదర్శనలో భాగంగానే ఉత్సవాలకు హాజరవుతున్నారు. రెండు దశాబ్దాలుగా... కాన్స్ చిత్రోత్సవాలంటే చాలామంది ఐశ్వర్యా రాయ్ కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా కాన్స్ రెడ్ కార్పెట్పై ఐష్ మెరుస్తున్నారు. షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘దేవదాస్’ (2002) చిత్రం 55వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అప్పట్నుంచి ఐశ్వర్యా రాయ్ క్రమం తప్పకుండా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవుతున్నారు. ఈ ఏడాది చిత్రోత్సవాల్లో సందడి చేసేందుకు తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐశ్వర్యా రాయ్ బుధవారం ముంబై నుంచి బయలుదేరారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement