-
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024 -
మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు: సెల్ఫీ వీడియో పుణ్యమే!
సెల్ఫీ వల్ల చాలామంది మనుషుల ప్రాణాలు బలైన సంఘటనలు అనేకం చూశాం. కానీ ఒక సెల్ఫీ వీడియో నిందితుడిని పట్టిచ్చిన వైనం వైరల్గా మారింది. ఓ రైలు ప్రయాణికుడి సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనకున్ మిస్టరీ ఛేదించిన ఘటన మహారాష్ట్రలోని కళ్యాణ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి: బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకలకు ఇంటికెళ్లి అనంతరం తిరిగి పూణే వెళ్లేందుకు ఈ నెల 24న సిద్దేశ్వర్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. కానీ అనూహ్యంగా అతని మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్లో పట్టాలపై దర్శనమిచ్చింది. అయితే జారి పడి దుర్మరణం పాలై ఉంటాడని పోలీసులు తొలుత భావించారు. అయితే ఇక్కడే అసలు కథ వెలుగులోకిచ్చింది. రైలు విఠల్వాడి స్టేషన్ వద్దకు వచ్చేసరికి ప్రభాస్ భాంగే బయట రైలు డోరు దగ్గర నిలబడి ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన సెల్ఫోన్ దొంగ ఆకాశ్ జాదవ్ హఠాత్తుగా అతని ఫోన్ లాక్కున్నాడు. అతని మొబైల్ ఫోన్ను లాక్కోవడానికి ప్రయత్నించినపుడు అదుపు తప్పి పట్టాలపై పోయాడు. అయితే ఈ మొత్తం ఉందంతం మరో రైలు ప్రయాణికుడు జాహిద్ జైదీ సెల్ఫీ వీడియోలో రికార్డు అయింది. జాహిద్ ఫోన్ కొట్టేసేందుకు కూడా ఆకాశ్ జాదవ్ ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు. అది వీడియోలో రికార్డు అయింది.దీనిపై అతను ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనిపై విచారించాల్సిందిగా పోలీసులను కోరాడు.ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితుడిగా ఆకాశ్ జాదవ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు కూడా నిజం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి ప్రభాస్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నామని రైల్వే పోలీసు అధికారి పండరీనాథ్ కాండే వెల్లడించారు. -
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
చిరుతతో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం!
నారాయణపేట, సాక్షి: చిరుత పులితో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డ ఘటన శనివారం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. దామరగిద్ద మండలం కాంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతాయనే సమాచారంతో చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. ఆ సమయంలో జనం రాకను చూసి పిల్ల చిరుతలు పరారయ్యాయి. అయితే అనారోగ్యంతో ఉన్న తల్లి చిరుత నిస్సహాయ స్థితిలో అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో కొందరు యువకులు ఫొటోలు-వీడియోలు తీసేందుకు.. ఆ చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని దానిని పరిశీలిస్తున్నారు. -
TS Assembly Elections 2023: ఓటుతో మా బాధ్యత పూర్తి చేశాం
-
తెలంగాణ ఎన్నికల పోలింగ్లో ఓటేశారు (ఫొటోలు)
-
ఓటేయండి.. సెల్ఫీ తీసుకోండి.. సాక్షికి పంపండి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటేసే వారికోసం సాక్షి. కామ్ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్ఫోన్తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫోటో గ్యాలరీలు గ్యాలరీ -4 గ్యాలరీ -3 గ్యాలరీ -2 గ్యాలరీ -1 -
Video: సెల్ఫీల వివాదం.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న యువతులు
సెల్ఫీల పిచ్చి ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరికి ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ట్రెండ్గా మారింది. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫీ మోజుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ ఫోటోల పిచ్చి కొన్నిసార్లు శ్రుతిమించుతోంది. తాజాగా సెల్ఫీ కారణంగా వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా అమ్మాయిలు జుట్లుపట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులోని గాంధీ పార్క్లో కొంతమంది ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. సెల్ఫీల కోసం యువతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ముందు తామే సెల్ఫీలు దిగాలని, తాము సెల్ఫీలు దిగుతున్నప్పుడు అడ్డు తప్పుకోవాలని ఓ వర్గం అమ్మాయిలు చెప్పడంతో తీవ్ర ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి యువతులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. జుట్లుపట్టుకొని కొట్టుకున్నారు. అమ్మాయిలు ఫైటింగ్ చేసుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్యర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? Gandhi Park, Guntur. Ladies Fighting...we are so developed. 😂😂😂 pic.twitter.com/fgqfWOef4k — Saran Bhuma (@telugodikeka) November 27, 2023 -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు హాజరైనట్టు ఇన్స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్గా మారాయి. (గోల్డ్ లవర్స్కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్లో పేర్కొంది. ఈ పోస్ట్లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
ఆదిత్య L1 సెల్ఫీ...ఒకే ఫ్రేమ్ లో భూమి-చంద్రుడు..
-
వాహ్ ఆదిత్య.. సెల్ఫీ అద్భుతం
బెంగళూరు: సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ( ఇస్రో) ప్రయోగించిన ఉపగ్రహం ఆదిత్య ఎల్1 మిషన్ (Aditya L1 Mission) విన్యాసాలు షురూ చేశాడు. ఈ క్రమంలో ఏకంగా అద్భుతమైన ఫొటోలు తీసింది కూడా. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్-1 దిశగా పయనిస్తోంది ఆదిత్య ఎల్1. అందుకు ఇంకా 4 నెలల సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తొలి 16 రోజులు భూకక్ష్యల్లోనే చక్కర్లు కొడుతుంది. అలా.. చక్కర్లు కొడుతూ.. ఆదిత్య ఎల్1 అద్భుతమైన ఫొటోలను తీసింది. ఎల్1 మిషన్ కనిపించేలా సెల్ఫీ తీసుకోవడంతో పాటు ఒకే ఫొటోలో భూమి, సుదూరాన ఉన్న చంద్రుడు ఫొటోల్ని కూడా బంధించింది. సెప్టెంబర్ 4న భూమి, చంద్రుడు ఒకే కక్ష్యలో ఉన్న సమయంలో ఈ ఫొటో తీసినట్లు ఇస్రో తెలిపింది. ‘‘ ఆదిత్య-ఎల్1 మిషన్: చూస్తోంది!. సూర్యుడు-భూమి ఎల్1 పాయింట్ లక్ష్యంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్1 ఒక సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడి చిత్రాలు కూడా తీసింది’’ అంటూ ఇస్రో ఒక వీడియోను షేర్ చేసింది. Aditya-L1 Mission: 👀Onlooker! Aditya-L1, destined for the Sun-Earth L1 point, takes a selfie and images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy — ISRO (@isro) September 7, 2023 ఆదిత్య ఎల్1 మిషన్ శాటిలైట్ జీవితకాలం ఐదేళ్లు కాగా ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా.. సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేయాలనుకుంటోంది ఇస్రో. -
సెల్ఫీ దిగేందుకు తాపత్రయం.. చంద్రబాబు తిప్పలు
-
కేదార్నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు. ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్నాథ్ యాత్ర మార్గమధ్యలోని రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. Video: Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie, Saved Later https://t.co/nvqy95fj1p pic.twitter.com/FeK21URcOY — NDTV (@ndtv) September 5, 2023 పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
మళ్లీ సెల్ఫీ తీసుకునేందుకు కష్టపడ్డ బాబు !
-
గాలి తీసుకున్న చంద్రబాబు
-
ప్చ్.. సెల్ఫీ కోసం ముసలాయన కష్టాలు
సాక్షి, శ్రీసత్యసాయి: చంద్రబాబు నాయుడికి.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. వయసు మీద పడే కొద్దీ.. అధికార దాహం పెరిగిపోతోంది ఆయనలో. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదనే అసహనమూ ఆయనలో కొట్టొచ్చినట్లూ కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే.. తాజాగా ఆయన చేసిన స్టంట్ నవ్వులు పూయిస్తోంది. పెనుగొండ పర్యటనలో కియా కార్ల పరిశ్రమ ఎదురుగా సెల్ఫీ దిగి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాననుకున్నారాయన. దానికి యెల్లో మీడియా ఈనాడు తన కథనంలో ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఉద్యోగులతో పాపం బలవంతంగా తన బావ పాటకు(జై బాలయ్య..) డాన్స్ చేయించిన ఉదంతాన్ని సైతం చంద్రబాబు తన ప్రసంగంలో ఉదహరించాడు. అయితే.. సెల్ఫీ కోసం చంద్రబాబు నాయుడు అవస్థలు పడ్డాడు. అది తీయటం రాక మూడు సెల్ ఫోన్లు మార్చారు. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది సహకరించారు. ఇంకేం.. ఆ ముసలాయన తాను అనుకున్న పని చేసేశాడు. ఇదే కాదు.. తన మీటింగ్లకు జనాలు వచ్చారని చూపించుకునేందుకు ఆయన చేసే ప్రయత్నమూ(డ్రోన్ కెమెరా) కనిపించిందక్కడ. గతంలో ఇలాంటి అత్యుత్సాహమే కదా అమాయక ప్రాణాల్ని బలిగొంది. అయినా చంద్రబాబుకు సిగ్గుమాత్రం రావడం లేదు! అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు. -
ఓపక్క గర్జించే జలపాతం..సెల్ఫీ పిచ్చితో చేసిన పని..
ఇటీవలకాలంలో సెల్ఫీ పిచ్చి మాములుగా లేదు. సెల్ఫీ మోజులోపడి వేగంగా వెళ్లే ట్రెయిన్ వద్ద, ప్రమాదకరమైన లోయలు, సముద్రంలోని అలలు వద్ద..సెల్ఫీలు తీసుకుని చనిపోయిన ఉదంతాలు చూశాం. అయినా సరే జనాలు తగ్గేదే లే! అంటున్నారు. ఏ మాత్రం భయం లేకుండా ప్రమాదరకరమైన ప్రదేశాల్లో సెల్ఫీ అంటూ ప్రాణాలను రిస్క్లో పడేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి బంధువులు లబోదిభోమని పెట్టే కేకలు అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని చవిచూశాడు ఇక్కడొక వ్యక్తి. 30 ఏళ్ల గోపాల్ పుండ్లిక్ చవాన్ మహారాష్ట్రలోని అజంతా గుహాల సందర్శనకు వచ్చాడు. అక్కడ ఉన్న బౌద్ధ గుహ దేవాలయాలను చూస్తూ ఉండగా సమీపంలో ఉన్న నది అతడిని ఆకర్షించింది. ఇంకేముంది..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెల్ఫీ కోసం ట్రై చేశాడు. అంతే ఒక్కసారిగా ఆ నదిలో పడిపోయాడు. సరిగ్గా సమీపంలోనే.. గర్జించే జలపాతం. మంచి ఫోర్స్గా వస్తున్న నీటి ప్రవాహం చూస్తే.. ఆ వ్యక్తి రాళ్లు గుంటలపై కొట్టుకుపోయేలా ఉంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి నీటిలోకి పడగానే ఈత కొట్టే యత్నం చేయడంతో వెంటనే అదికారులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేశారు. సుమారు 10 మందికి పైగా వ్యక్తుల తాడు సాయంతో ఆ వ్యక్తి లోయ నుంచి బయటకు తీశారు. కాగా, అతను భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బట్టగట్టగలిగాడు కానీ లేదంటే చనిపోయేవాడని అధికారులు అంటున్నారు. అతను పడిన వెంటనే గాభరాపడకుండా ఈత కొట్టే యత్నం చేశాడు కాబట్టే మాకు అతడిని రక్షించగలిగే సమయం దొరికిందని చెప్పుకొచ్చారు. చాలా మంది అతిడిలా అదృష్టవంతులు కాకపోవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇక 2020 అధ్యయనం ప్రకారం షార్క్ దాడులతో చనిపోయే వారికంటే ఇలా నీళ్ల వద్దకు సెల్ఫీ కోసం వచ్చి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువని పేర్కొనడం గమనార్హం. (చదవండి: గూగుల్ మ్యాప్లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
‘నిమ్మల’ నాటకాలు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒకవైపు పనులు జరగకుండా అడ్డుకోవడం.. మరోవైపు ఆగిపోయాయంటూ యాగీ చేయడం.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీరు ఇదీ.. సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుంటే స్వాగతించాల్సిందిపోయి అడ్డదారుల్లో అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకొల్లు మండలం దగ్గులూరులో 58.33 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్ల వ్యయంతో నూతన మెడికల్ కళాశాలకు సీఎం వైఎస్ జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. తొలుత రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ల్యాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. 27 మీటర్ల లోతులో ఆరు బోర్లు తవ్వారు. 1.7 మీటర్ల ఎత్తు వరకూ ఫ్లోర్ కాంక్రీట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పనులు దక్కించుకున్న మెగా సంస్థను యలమంచిలి మండలం వేల్పూరులంకలో ఇసుక తవ్వకానికి మైనింగ్ శాఖ అనుమతించింది. ఎమ్మెల్యే నిమ్మల ఈ పనులను అడ్డుకునేందుకు అనుచరులతో పర్యావరణానికి హాని కలుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దీంతో ఐదు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని పనులను కొనసాగిస్తున్నారు. పాలకొల్లులో సోమవారం టీడీపీ బస్సు యాత్ర సందర్భంగా పార్టీ నాయకులతో పొలాల్లో సెల్ఫీ దిగిన నిమ్మల రామానాయుడు ఇదే మెడికల్ కాలేజీ.. అసలు పనులే జరగడం లేదని బురద చల్లేందుకు ప్రయతి్నంచారు. -
సెల్ఫీ కోసం విజయ్ ఫ్యాన్ ఎం చేసాడో చూడండి
-
అమెరికాలో అంబానీ, మహీంద్ర ఉబెర్ కష్టాలు: మిలియన్ డాలర్ల సెల్ఫీ వైరల్
భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు ఉబెర్ కోసం ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇటీవల అమెరికాలో అదే జరిగింది. ఈ సందర్భంగా బిలియనీర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎపిక్ సెల్ఫీవైరల్గా మారింది. ఏమీ అర్థం కాలేదు కదా? అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్వర్త్ తెలిస్తే షాకవుతారు) మహీంద్రా గ్రూప్ చైర్మన్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇద్దరూ వైట్హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్కి హాజరైన సంగతి తెలిసిందే. స్టేట్ డిన్నర్ తర్వాత, ఇండియా యుఎస్ మధ్య జరిగిన హైటెక్ హ్యాండ్షేక్ సమావేశానికి కూడా వీరు హాజరయ్యారు. వీరితోపాటు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితర దిగ్గజాలు కూడా ఈ మీటింగ్నకు హాజరైనారు. అయితే అంబానీ ఆనంద్ మహీంద్రా యూఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో 3rdiTech సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్తో మాటల్లో పడి , తర్వాతి లంచ్ అపాయింట్మెంట్కి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవడంతో వీరిందరినీ అక్కడికి చేర్చాల్సిన గ్రూపు షటిల్ను మిస్ అయిపోయారు. చివరికి ఉబెర్ కోసంప్రయత్నిస్తుండగా హై-టెక్ హ్యాండ్షేక్ కాన్ఫరెన్స్కు హాజరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని కలిశారు. (సింగిల్ బ్రాండ్తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఈ సందర్భాన్ని ట్విటర్లో అభిమానులతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర బహుశా దీన్ని వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో. ఇదే శక్తివంతమైన సెల్ఫీకి దారితీసింది అంటూ అంబానీ, సునీతా విలియమ్స్, బృందా కపూర్లతో ఉన్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఉబెర్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉబర్కు బదులుగా సునీతా స్పేస్ షటిల్లో వెళదామా అని సునీతాని అడిగామంటూ వెల్లడించారు. ఈ సెల్ఫీపై పలువురు నెటిజన్లు సంతోషంగా స్పందించారు. ఇది 10 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్తో వైరలైంది. (వైట్హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) చాలా అరుదుగా కలుసుకున్నప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు నిజంగా తెలుసుకోవాలని ఉంది..వ్యాపారం, ప్రయాణం, ఈవెంట్ ఏదైనా.. ఎలాంటి జోకులు వేసుకుంటారంటూ జేకే జ్యుయలర్ల్ వినీత్ చమత్కరించారు. గొప్ప వక్తులు.. ఒకే ఫ్రేమ్లో.. ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI — anand mahindra (@anandmahindra) June 25, 2023 -
నాచారంలో సెల్ఫీ సూసైడ్
సాక్షి, క్రైమ్ విభాగం: నాచారంలో దారుణం జరిగింది. ఓ వివాహిత ఫేస్బుక్ లైవ్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సమస్యలే అందుకు కారణమని పోలీసులు భావిస్తుండగా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె భర్త, అతని కుటుంబం టార్చర్ భరించలేక తన కూతురు ప్రాణం తీసుకుందని ఆమె తండ్రి వాపోతున్నాడు. ఉద్యోగి అయిన సనా.. తండ్రి ఉంటున్న బిల్డింగ్లోనే మరో పోర్షన్లో ఉంటోంది. ఈ క్రమంలో సనాతల్లి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో బద్ధలు కొట్టిచూశారు. సనా ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. భర్త, మామల్ని ఫేస్బుక్లో లైవ్పెట్టి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. తండ్రి సాయంతో కొడుక్కి(3) స్కూల్లో తాజాగా అడ్మిషన్ ఇప్పించింది. అంతా సంతోషంగా ఉందనుకుంటున్న సమయంలో ఆమె ఇలా చేయడాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. షాదీ నాటి ఫొటో మతం మార్చుకుని.. వివాహేతర సంబంధంతో.. వివాహేతర సంబంధం.. అల్లుడి కుటుంబం వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందని సనా తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2019లో రాజస్థాన్కు చెందిన రాజ్పుత్ యువకుడు హేమంత్తో ఆమె ప్రేమ వివాహం జరిగింది. మతం మారతానని ముందుకొచ్చిన అతను.. ఆమె తండ్రిని ఒప్పించి మరీ వివాహం చేసుకున్నాడు. అయితే.. అతని కుటుంబ సభ్యులకు ఈ వివాహం ఇష్టం లేదు. అందుకే సనాను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చింది. ఈలోపు అతని దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సూఫీ ఖాన్ వచ్చింది. సనా తండ్రి నటిగా పరిచయం చేసుకున్న సూఫీ ఖాన్తో సనా భర్తకు చనువు ఏర్పడింది. ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. దీంతో సనాకు, ఆమె భర్తకు మధ్య గొడవలు జరిగాయి. సూఫీఖానాను ప్రేమలో పడి.. తన కూతురిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని.. టార్చర్ పెట్టాడని సనా తండ్రి నాచారం పీఎస్లో ఫిర్యాదు కూడా చేశాడు. అప్పుడు ఇరుకుటుంబాలు మాట్లాడుకుని గొడవను సర్దుమణిగేలా చేశాయి. ఆపై ఆ భార్యాభర్తలు రాజస్థాన్ వెళ్లిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ కొడుకును చూసుకుంటున్నారు. ఈలోపు సూఫీఖాన్ విషయంలోనే మళ్లీ ఆ భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో కొడుకును తీసుకుని తిరిగి నాచారం వచ్చేసిందామె. అయితే కొడుకును చూసుకుంటూ.. సంతోషంగానే ఆమె ఉందని అంతా భావించారు. ఈలోపే ఇలా అఘాయిత్యానికి ఒడిగట్టింది సనా. సూఫీఖాన్కు, సనా భర్త మధ్య జరిగిన సంభాషణలు, వాట్సాప్ ఛాటింగ్, వాళ్లు దిగిన ఫొటోలు, వాళ్ల వివాహేతర సంబంధానికి సంబంధించిన అన్నీ సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని సనా తండ్రి అంటున్నాడు. తన కూతురికి న్యాయం చేయాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నాడాయన. భర్త వేధింపులు ఎక్కువ కావడంతోనే ఆమె.. వాళ్లను లైవ్లో పెట్టి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. సూఫీఖాన్ బయటకు వస్తే.. మొత్తం అన్ని విషయాలు బయటపడతాయని అంటున్నారాయన. ఈ మేరకు సనా ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
సెల్ఫీ తీసుకునే నెపంతో భర్తను చెట్టుకు కట్టేసి..ఆ తర్వాత
బిహార్లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తను చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించింది. గాయాలపాలైన బాధితున్ని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ముజఫర్పూర్ జిల్లాలోని వసుదేవ్పుర్ సరాయ్ గ్రామంలో జరిగింది. సెల్ఫీ తీసుకునే నెపంతో.. సెల్ఫీ తీసుకునే నెపంతో భార్య తన భర్తను చెట్టుకు కట్టేసింది. అనంతరం అతనిపై కిరోసిన్ పోసి, నిప్పంటించింది. బాధితుడు అరుపులు పెట్టడంతో ఘటనా స్థలం నుంచి పారిపోయింది. చుట్టుపక్కలవారు చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఘటనకు గల సరైన కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకే భర్తపై భార్య ఈ ఘాతుకానికి పాల్పడిందని గ్రామస్థులు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి:భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్లో వెతికిన భార్య -
సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందన్నది ఎవరికి తెలియదు. ఒక్కోసారి కేవలం చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం చూస్తుంటాం. ప్రేమను వ్యక్తం చేసే దారులు వేరుగా ఉన్నప్పటికి అంతిమంగా గెలిస్తే వచ్చే సంతోషం వేరు. ఇక అభిమానితో దిగిన ఒక్క సెల్ఫీ స్పెయిన్ టెన్నిస్ స్టార్ గార్బిన్ ముగురుజా జీవితాన్ని మర్చేసింది. ఆ ఒక్క సెల్ఫీ తమ ప్రేమకథకు దారి తీస్తుందని ముగురుజా ఊహించి ఉండదు. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు తాను ఇష్టపడ్డ అభిమానితో ఏడు అడుగులు వేసేలా చేసింది. గార్బిన్ ముగురుజా త్వరలోనే ఆర్థర్ బోర్జెస్ అనే అభిమానిని పెళ్లి చేసుకోబోతోంది. బుధవారం వాళ్లిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అనంతరం బోర్జెస్తో ఉన్న ఫొటోలను ముగురుజా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముగురుజా షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. సెల్ఫీతో మొదలైన ప్రేమకథ.. ముగురుజా, ఆర్థర్ బోర్జెస్ల ప్రేమకథ ఒక సెల్ఫీతో మొదలైంది. 2021లో ముగురుజ యూసె ఓపెన్ ఆడేందుకు ఆమెరికా వెళ్లింది. అక్కడ న్యూయార్క్ వీధిలో బోర్జెస్ను మొదటిసారి చూసిందట. ''నేను బస చేసిన హోటల్ సెంట్రల్ పార్క్కు దగ్గర్లో ఉంది. ఒకరోజు బోర్ కొట్టడంతో కాసేపు నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడ బోర్జెస్ను మొదటిసారి చూశాను. నన్ను గమనించిన అతను ఒక సెల్పీ అడిగాడు. 'ఎంత అందంగా ఉన్నాడు' అని నా మనసులో అనుకున్నా. అక్కడి నుంచి మా ప్రేమకథ మొదలైంది'' అని ముగురుజా చెప్పుకొచ్చింది. ఆ రోజు నుంచి ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు. రెండేళ్ల తర్వాత బోర్జెస్ ముగురుజాకు ప్రపోజ్ చేశాడు. ఆ క్షణంలో ఆమె కంగారుపడింది. ఈ సంతోషంతో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ వెంటనే బోర్జెస్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా బోర్జెస్ తన అభిమాన టెన్నిస్ స్టార్ను పెళ్లాడబోతున్నాడు. ముగురుజా ఇప్పటివరకు రెండు గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆమె 2016లో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ చాంపియన్గా నిలిచింది. 15 వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించింది. చదవండి: 'ఓవల్లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది' -
బేబీ బంప్తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!
దేవదాసు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్కు మకాం మార్చింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్కు వెళ్లిన ముద్దుగుమ్మ!) ఇటీవలే సోషల్ మీడియాలో తాను గర్భం ధరించినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడంతో అవాక్కయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్ను ప్రదర్శించింది ముద్దుగుమ్మ. మిర్రర్ ముందు సెల్ఫీ దిగుతూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'ఇట్స్ ఆల్ ఏబౌట్ ఎంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే పరోక్షంగా ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలియానాకు పుట్టబోయేది కూతురే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం. (ఇది చదవండి: విషాదం.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత)
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- Andhra Pradesh: నేటితో ప్రచారానికి తెర
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement