-
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్రైజర్స్తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (మే 8) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. విధ్వంసకర ఆటగాళ్లతో నిండిన సన్రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీకి సిద్దమయ్యాయి. సన్రైజర్స్ హోం గ్రౌండ్ అయిన ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగునుంది. హైదరాబాద్లో నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే నగరంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సన్రైజర్స్, ఎల్ఎస్జీ పాయింట్ల పట్టికలో సమవుజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు చెరి 11 మ్యాచ్లు ఆడి ఆరింట గెలుపొందాయి. అయితే లక్నోతో పోలిస్తే సన్రైజర్స్ రన్రేట్ కాస్త మెరుగ్గా ఉండటంతో ఆ జట్టు మెరుగైన స్థానంలో ఉంది. సన్రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సమానంగా ఉండటంతో ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు టెన్షన్ లేకుండా తదుపరి మ్యాచ్కు వెళ్లవచ్చు. ఇరు జట్ల ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.మరో మూడేస్తే..ఇక ఈ మ్యాచ్ ఓ భారీ మైలురాయికి వేదిక కానుంది. ఈ మ్యాచ్లో మరో మూడు సిక్సర్లు నమోదైతే ఈ సీజన్లో 1000 సిక్సర్లు (అన్ని జట్లు కలిపి) పూర్తవుతాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్గా ఐపీఎల్ 2023 ఉంది. గత సీజన్లో రికార్డు స్థాయిలో 1124 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇంకా 18 మ్యాచ్లు మిగిలుండగానే 1000 సిక్సర్లు మార్కు తాకితే ఆల్టైమ్ హైయెస్ట్ సిక్సర్ల రికార్డు బద్దలవడం ఖాయం. నేటి మ్యాచ్లో తలపడబోయే సన్రైజర్స్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్లో కనీసం 20 సిక్సర్లు నమోదయ్యే అవకాశం ఉంది. సీజన్ల వారీగా సిక్సర్లు..2008- 6222009- 5062010- 5852011- 6392012- 7312013- 6722014- 7142015- 6922016- 6382017- 7052018- 8722019- 7842020- 7342021- 6872022- 10622023- 11242024- 997* -
పరుగుల ప్రళయం.. సిక్సర్ల సునామీ.. ఆల్టైమ్ రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య నిన్న (మార్చి 27) జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీ పడి సిక్సర్లు బాదారు. ఇరు జట్ల బ్యాటర్ల సిక్సర్ల సునామీ ధాటికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 18 సిక్సర్లు బాదితే.. ఛేదనలో ముంబై తామేమీ తక్కువ కాదని 20 సిక్సర్లు బాదింది. ఇరు జట్లు కలిపి ఈ మ్యాచ్లో ఏకంగా 38 సిక్సర్లు కొట్టాయి. ఫలితంగా భారీ స్కోర్లు నమోదు కావడంతో పాటు పలు ఆల్టైమ్ రికార్డులు బద్దలయ్యాయి. పోట్టి క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్గా ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. పురుషుల టీ20ల్లో అత్యధిక సిక్సర్లు.. 38 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 37 - బాల్ఖ్ లెజెండ్స్ vs కాబుల్ జ్వానన్, షార్జా, APL 2018 37 - SNKP vs JT, బస్సెటెర్రే, CPL 2019 36 - టైటాన్స్ vs నైట్స్, పోట్చెఫ్స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 35 - JT vs TKR, కింగ్స్టన్, CPL 2019 35 - SA vs WI, సెంచూరియన్, 2023 ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సిక్సర్లు (38) నమోదైన మ్యాచ్ గానూ రికార్డు నెలకొల్పింది. 38 - SRH vs MI, హైదరాబాద్, 2024 33 - RCB vs CSK, బెంగళూరు, 2018 33 - RR vs CSK, షార్జా, 2020 33 - RCB vs CSK, బెంగళూరు, 2023 ఐపీఎల్లో అత్యధిక బౌండరీల సంఖ్య (4s+6s).. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి కొట్టిన బౌండరీలు (ఫోర్లు, సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధికం. 69 - CSK vs RR, చెన్నై, 2010 69 - SRH vs MI, హైదరాబాద్, 2024 67 - PBKS vs LSG, లక్నో, 2023 67 - PBKS vs KKR, ఇండోర్, 2018 65 - డెక్కన్ ఛార్జర్స్ vs RR, హైదరాబాద్, 2008 ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కొట్టిన సిక్సర్ల సంఖ్య ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధికం కాగా, సన్రైజర్స్ బాదిన సిక్సర్ల సంఖ్య నాలుగో అత్యధికం. 21 - RCB vs PWI, బెంగళూరు, 2013 20 - RCB vs GL, బెంగళూరు, 2016 20 - DC vs GL, ఢిల్లీ, 2017 20 - MI vs SRH, హైదరాబాద్, 2024 18 - RCB vs PBKS, బెంగళూరు, 2015 18 - RR vs PBKS, షార్జా, 2020 18 - CSK vs KKR, కోల్కతా, 2023 18 - SRH vs MI, హైదరాబాద్, 2024 ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్లు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టుగా సన్రైజర్స్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. 277/3 - SRH vs MI, హైదరాబాద్, 2024 263/5 - RCB vs PWI, బెంగళూరు, 2013 257/5 - LSG vs PBKS, మొహాలి, 2023 248/3 - RCB vs GL, బెంగళూరు, 2016 246/5 - CSK vs RR, చెన్నై, 2010 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 టీ20ల్లో అత్యధిక స్కోర్లు.. ఈ మ్యాచ్లో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్రైజర్స్ టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. 314/3 - నేపాల్ వర్సెస్ మంగోలియా, హాంగ్జౌ, ఏషియన్ గేమ్స్ 2023 278/3 - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019 278/4 - చెక్ రిపబ్లిక్ వర్సెస్ టర్కీ, ఇల్ఫోకౌంటీ, 2019 277/3 - సన్రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్, ఐపీఎల్ 2024 275/6 - పంజాబ్ వర్సెస్ ఆంధ్ర, రాంచీ, 2023 ఐపీఎల్ రెండో ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్లు.. ఐపీఎల్ హిస్టరీలో ఛేదనలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకెక్కింది. 246/5 - MI vs SRH, హైదరాబాద్, 2024 (ఓటమి) 226/6 - RR vs PBKS, షార్జా, 2020 (గెలుపు) 223/5 - RR vs CSK, చెన్నై, 2010 (ఓటమి) 223/6 - MI vs PBKS, ముంబై WS, 2017 (ఓటమి) 219/6 - MI vs CSK, ఢిల్లీ, 2021 (గెలుపు) ఐపీఎల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్లు.. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 523 పరుగులు (సన్రైజర్స్ 277/3, ముంబై ఇండియన్స్ 246/5) చేయడంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్లో 500 పరుగుల మార్కు దాటింది. 523 - SRH vs MI, హైదరాబాద్, 2024 469 - CSK vs RR, చెన్నై, 2010 459 - PBKS vs KKR, ఇండోర్, 2018 458 - PBKS vs LSG, మొహాలి, 2023 453 - MI vs PBKS, ముంబై WS, 2017 టీ20ల్లో అత్యధిక స్కోర్ (ఇరు జట్లు కలిపి) నమోదైన మ్యాచ్లు.. ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక స్కోర్గా రికార్డైంది. 523 - SRH vs MI, హైదరాబాద్, IPL 2024 517 - SA vs WI, సెంచూరియన్, 2023 515 - QG vs MS, రావల్పిండి, PSL 2023 506 - సర్రే vs మిడిల్సెక్స్, ది ఓవల్, T20 బ్లాస్ట్ 2023 501 - టైటాన్స్ vs నైట్స్, పోచెఫ్స్ట్రూమ్, CSA T20 ఛాలెంజ్ 2022 -
హిట్మ్యాన్ ఖాతాలో మరో రికార్డు.. తొలి ఆసియా క్రికెటర్గా..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇప్పటికే ఓ ప్రపంచ రికార్డు (అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్లు అందుకున్న తొలి ప్లేయర్) నెలకొల్పిన హిట్మ్యాన్.. తాజాగా బ్యాటింగ్లో మరో రికార్డు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్క్ వుడ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన రోహిత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 50 సిక్సర్ల మార్కును అందుకున్నాడు. తద్వారా డబ్యూటీసీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా.. ఓవరాల్గా రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. డబ్యూటీసీ హిస్టరీలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. స్టోక్స్ డబ్యూటీసీలో 45 మ్యాచ్ల్లో 78 సిక్సర్లు కొట్టాడు. స్టోక్స్ తర్వాత అత్యధికంగా హిట్మ్యాన్ 32 ఇన్నింగ్స్ల్లో 50 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో స్టోక్స్, రోహిత్ తర్వాత రిషబ్ పంత్ (38), జానీ బెయిర్స్టో (29), జైస్వాల్ (26) ఉన్నారు. కాగా, ధర్మశాల టెస్ట్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Rohit Sharma: మరో 'ఆరేస్తే' క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ఆటగాడవుతాడు..!
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో ఆరు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్ల మార్కును తాకిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 594 సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో కలిపి) ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానంలో విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఖాతాలో 553 సిక్సర్లు ఉన్నాయి. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (476), మార్టిన్ గప్తిల్ (398), ధోని (383), జయసూర్య (359), ఇయాన్ మోర్గన్ (352), ఏబీ డివిలియర్స్ (346), జోస్ బట్లర్ (328) వరుసగా టాప్ 10 స్థానాల్లో ఉన్నారు. హిట్మ్యాన్ ముంగిట మరో రికార్డు.. ధర్మశాల టెస్ట్లో రోహిత్ శర్మ మరో సిక్సర్ కొడితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. కాగా, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్ట్ మ్యాచ్ నామమాత్రం సాగనుంది. సిరీస్ వరకు ఇది అప్రధానమైన మ్యాచే అయినప్పటికీ... వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 దృష్ట్యా కీలకం కానుంది. ఈ సిరీస్లో టీమిండియా సీనియర్ల సేవలు కోల్పోయినప్పటికీ.. యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. -
ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన రోహిత్
ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే టీ20 సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎవరికీ సాధ్యం కాని ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్లో హిట్మ్యాన్ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు 148 మ్యాచ్ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్ల్లో 173 సిక్సర్లు) పేరిట ఉంది. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (125), యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (124), టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (123) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. 117 సిక్సర్లతో విరాట్ కోహ్లి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. కాగా, జనవరి 11 (మొహాలీ), 14 (ఇండోర్), 17 (బెంగళూరు) తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చాలాకాలం తర్వాత టీ20ల్లో బరిలోకి దిగుతున్నారు. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్కీపర్), సంజు శాంసన్ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్లో హిట్మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
CWC 2023: సిక్సర్ల టీమిండియా.. సౌతాఫ్రికా, వెస్టిండీస్లను తలదన్ని..!
వన్డే వరల్డ్కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పలు ప్రపంచకప్ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్లో వ్యక్తిగత రికార్డులతో పాటు పలు టీమ్ రికార్డులు కూడా బద్దలయ్యాయి. నిన్నటి మ్యాచ్లో భారత బ్యాటర్లు 16 సిక్సర్లు బాదడంతో తొలిసారి ఓ క్యాలెండర్ ఇయర్లో భారత్ 200కు పైగా సిక్సర్లు నమోదు చేసింది. నెదర్లాండ్స్పై 16 సిక్సర్లు కలుపుకుంటే ఈ ఏడాది వన్డేల్లో భారత్ సిక్సర్ల సంఖ్య 215కు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ జట్టూ ఓ క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్కు ముందు ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. ఇదే ఎడిషన్లో సౌతాఫ్రికా 200 సిక్సర్ల మార్కును తాకింది. సఫారీలు ఈ ఏడాది వన్డేల్లో 203 సిక్సర్లు బాదారు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో భారత్, సౌతాఫ్రికా మధ్యలో వెస్టిండీస్ ఉంది. ఈ జట్టు 2019లో 209 సిక్సర్లు బాదింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ (2015లో 179 సిక్సర్లు), ఆస్ట్రేలియా (2023లో 165 సిక్సర్లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత బౌలర్లు తలో చేయి వేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. -
IND VS AUS 3rd ODI: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ అయ్యేలోపు 5 సిక్సర్లు బాదిన హిట్మ్యాన్ న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ (256) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్గా అవతరించాడు. మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు కూడా రోహిత్ చేరువవుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ కేవలం 4 సిక్సర్ల దూరంలో (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్కు దరిదాపుల్లో కూడా లేరు. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ స్థానంలో, విరాట్ కోహ్లి 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్కు 74 పరుగులు జోడించారు. అనంతరం సుందర్ ఔట్ కాగా.. విరాట్ క్రీజ్లోకి వచ్చాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 78/1గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 275 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదడంతో భారత్ వన్డే క్రికెట్లో 3000 సిక్సర్ల మార్కును (3007) తాకిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ వన్డేల్లో ఏ జట్టు ఇప్పటివరకు 3000 సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా విండీస్ (2953) ఉంది. ఈ జాబితాలో పాక్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజిలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), సౌతాఫ్రికా (1947), శ్రీలంక (1779), జింబాబ్వే (1303), బంగ్లాదేశ్ (959) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కొట్టిన 18 సిక్సర్లు వన్డేల్లో భారత్ రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదైంది. 2013లో బెంగళూరులో ఆసీస్పై బాదిన 19 సిక్సర్లు వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో భారత అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదై ఉంది. కాగా, ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ధేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2 వద్ద ఉండగా వర్షం మొదలై ఆటకు అంతరాయం కలిగింది. లబూషేన్ (17), వార్నర్ (26) క్రీజ్లో ఉన్నారు. -
IND VS AUS 1st ODI: సెంచరీ పూర్తి చేసిన వార్నర్
ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డే క్రికెట్లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో వార్నర్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ అశ్విన్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన వార్నర్.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో వార్నర్ ఈ సిక్సర్తో పాటు మరో సిక్సర్ కూడా బాది తన సిక్సర్ల సంఖ్యను 101కి (148 మ్యాచ్ల్లో) పెంచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో 53 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఆసీస్ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తూ 26 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. వార్నర్, మిచెల్ మార్ష్ (4), స్టీవ్ స్మిత్ (41) ఔట్ కాగా.. మార్నస్ లబూషేన్ (23), కెమరూన్ గ్రీన్ (5) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2, జడేజా ఓ వికెట్ పడగొట్టారు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఎవరి పేరిట ఉందంటే..? వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), రోహిత్ శర్మ (286), సనత్ జయసూర్య (270), ఎంఎస్ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు. భారత ఆటగాళ్లు సచిన్ (195), గంగూలీ (190), యువరాజ్ సింగ్ (155), విరాట్ కోహ్లి (141), సెహ్వాగ్ (136), సురేశ్ రైనా (120) 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. -
చరిత్ర మరచిపోలేని రికార్డుకు 16 ఏళ్లు..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 19కి ఓ ప్రత్యేకత ఉంది. 2007లో ఈ రోజున టీమిండియా డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్లో యువీ చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ నేటికీ పొట్టి క్రికెట్లో ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. సౌతాఫ్రికాలో జరిగిన తొట్టతొలి టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో యువీ ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ను ఉతికి 'ఆరే'శాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశాడు. యువీ సిక్సర్ల సునామీకి ముందు ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ అతనితో అనవసర గొడవకు దిగాడు. దీని ప్రభావం బ్రాడ్పై పడింది. ఫ్లింటాఫ్పై కోపాన్ని యువీ బ్రాడ్పై చూపించాడు. యువీ.. బ్రాడ్ బౌలింగ్ను ఊచకోత కోశాడు. కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, నేటికీ చెక్కుచెదరని టీ20 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. Look out in the crowd! On this day in 2007, @YUVSTRONG12 made #T20WorldCup history, belting six sixes in an over 💥 pic.twitter.com/Bgo9FxFBq6 — ICC (@ICC) September 19, 2021 ఆ ఇన్నింగ్స్లో మొత్తం 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ కేవలం 14 నిమిషాలు క్రీజ్లో ఉండి 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి, ఫ్లింటాఫ్ బౌలింగ్లోనే ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువీకి ముందు గంభీర్ (58), సెహ్వాగ్ (68) సైతం అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, లక్ష్యానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్పీ సింగ్ 2, హర్భజన్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఇదే మ్యాచ్ ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ మెగా టోర్నీ ఫైనల్లో భారత్.. పాక్ను మట్టికరిపించి తొట్టతొలి టీ20 ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. -
భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్.. మూడేస్తే రోహిత్, విరాట్ సరసన చోటు
విండీస్తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగనున్న రెండో టీ20కి ముందు టీమిండియా చిచ్చరపిడుగు, వరల్డ్ టీ20 నంబన్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. నేటి మ్యాచ్లో స్కై మరో 3 సిక్సర్లు బాదితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ (182), విరాట్ కోహ్లిల (117) సరసన చేరతాడు. రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ టీ20ల్లో 100 అంత కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లుగా రికార్డుల్లో నిలువగా.. స్కై ఈ జాబితాలో చేరేందుకు మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. 49 అంతర్జాతీయ టీ20ల్లో స్కై ఇప్పటివరకు 97 సిక్సర్లు బాది, ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా.. 72 మ్యాచ్ల్లో 99 సిక్సర్లు బాదిన కేఎల్ రాహుల్ మూడో ప్లేస్లో నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 12 మంది 100 సిక్సర్లు బాదగా.. వారిలో రోహిత్ అగ్రస్థానంలో, కోహ్లి ఏడో ప్లేస్లో ఉన్నారు. రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (173), ఆరోన్ ఫించ్ (125), క్రిస్ గేల్ (124), పాల్ స్టిర్లింగ్ (123), ఇయాన్ మోర్గాన్ (120), జోస్ బట్లర్ (113), ఎవిన్ లూయిస్ (111), కొలిన్ మున్రో (107), మ్యాక్స్వెల్ (106), డేవిడ్ మిల్లర్ (106), డేవిడ్ వార్నర్ (105) ఉన్నారు. కాగా, అంతర్జాతీయ టీ20 కెరీర్ను సిక్సర్తోనే ప్రారంభించిన సూర్యకుమార్.. అతి తక్కువ కాలంలో పలు టీ20 రికార్డులు తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అతి తక్కువ వ్యవధిలో వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గానూ ఎదిగాడు. టీ20 కెరీర్లో 47 ఇన్నింగ్స్లు ఆడిన స్కై.. 174.1 స్ట్రయిక్రేట్తో 3 సెంచరీలు, 13 అర్ధసెంచరీల సాయంతో 45.8 సగటున 1696 పరుగులు చేశాడు. స్కై ఖాతాలో 97 సిక్సర్లతో పాటు 152 బౌండరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, విండీస్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తొలి మ్యాచ్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్ (41), కెప్టెన్ రోవ్మన్ పావెల్ (48) రాణించగా.. భారత్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (39) ఒక్కడే పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లు అర్ష్దీప్ సింగ్, చహల్ తలో 2 వికెట్లు, హార్దిక్, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టగా.. విండీస్ బౌలర్లు జేసన్ హోల్డర్, ఓబెద్ మెక్కాయ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
పోతూ పోతూ రికార్డుల్లోకెక్కిన స్టువర్ట్ బ్రాడ్.. సిక్సర్తో..!
దిగ్గజ ఫాస్ట్ బౌలర్, ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ స్టువర్ట్ బ్రాడ్ తన కెరీర్లో చివరాఖరి మ్యాచ్లో ఓ రికార్డు నమోదు చేశాడు. 37 ఏళ్ల బ్రాడీ అంతర్జాతీయ కెరీర్లో తానెదుర్కొన్న ఆఖరి బంతిని సిక్సర్గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో బ్రాడ్ టెస్ట్ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. కెరీర్లో 167 టెస్ట్లు ఆడిన బ్రాడ్ 55 సిక్సర్లు బాది బెన్ స్టోక్స్ (124), కెవిన్ పీటర్సన్ (81), ఆండ్రూ ఫ్లింటాఫ్ (78), ఇయాన్ బోథమ్ (67) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. Most sixes for England in Tests: 124* - Ben Stokes 81 - K Pietersen 78 - A Flintoff 67 - I Botham 55 - Stuart Broad@StuartBroad8 ends his Test career with fifth-most sixes for Englandpic.twitter.com/xLrFzLqIcd — CricTracker (@Cricketracker) July 30, 2023 ఆఖరి టెస్ట్ కావడంతో బ్యాటింగ్కు దిగే ముందు ఆసీస్ ఆటగాళ్ల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న బ్రాడ్.. అభిమానుల కేరింతలు, చప్పట్ల ధ్వనుల మధ్య క్రీజ్లోకి వచ్చాడు. వచ్చీ రాగానే (నాలుగో రోజు తొలి ఓవర్ ఆఖరి బంతి) స్టార్క్ బౌలింగ్లో సిక్సర్ బాది స్టేడియంలో ఉన్నవారిని ఉర్రూతలూగించాడు. Australia wins hearts with their gesture.pic.twitter.com/5ewxALuy44 — CricTracker (@Cricketracker) July 30, 2023 అనంతరం మర్ఫీ వేసిన ఆ మరుసటి ఓవర్లో ఆండర్సన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 395 పరుగుల వద్ద ముగిసింది. కెరీర్లో ఆఖరి ఇన్నింగ్స్లో బ్రాడ్ (8, సిక్స్) నాటౌట్గా మిగిలాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ సాధించిన స్వల్ప లీడ్ను తీసేస్తే ఆ జట్టు టార్గెట్ 384 పరుగులైంది. ఛేదనకు దిగిన ఆసీస్.. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (39), డేవిడ్ వార్నర్ (30) క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ విజయానికి 309 పరుగులు, ఇంగ్లండ్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. కాగా, కెరీర్లో 167 టెస్ట్లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు (602) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటలో మూడో సెషన్లో బ్యాటింగ్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. జో రూట్ 71, జానీ బెయిర్ స్టో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా ఇంగ్లండ్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ ముంగిట ఇంగ్లండ్ కనీసం 400 పరుగుల టార్గెట్ను పెట్టాలని భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టోక్స్ 67 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో స్టోక్స్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఆసీస్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో స్టోక్స్ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. 2018-19లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో వెస్టిండీస్ ఆటగాడు హెట్మైర్ కూడా 15 సిక్సర్లు బాదాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 2019-20లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 19 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక యాషెస్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన టెస్టు సిరీస్లు కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గా స్టోక్స్ రికార్డులకెక్కాడు. స్టోక్స్ తర్వాతి స్థానంలో కెవిన్ పీటర్సన్(2005 యాషెస్లో) 14 సిక్సర్లు బాదగా, 2019 యాషెస్లో మళ్లీ బెన్ స్టోక్స్ 13 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. 2005 యాషెస్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ 11 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు. Ben Stokes straightaway in the mood. Smashes Josh Hazlewood for a six in the first over after Lunch. pic.twitter.com/z9Di8YY4PM — Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2023 చదవండి: Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్పై రొనాల్డో అసహనం వాళ్లు లేరు.. వీళ్లకు ఛాన్స్.. బెడిసికొట్టిన ప్రయోగం! 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి.. -
మేజర్ లీగ్ క్రికెట్ 2023.. సిక్సర్లతో విరుచుకుపడిన పాక్ ఆల్రౌండర్
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతూ అభిమానులను అలరిస్తున్నాయి. పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) తర్వాత పాక్ జట్టుకు చెందిన చాలా మంది ఆటగాళ్లు మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఇమాద్ వసీమ్ ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకోగా.. తాజాగా పాక్ ఆల్రౌండర్ షాబాద్ ఖాన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. లీగ్లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు 22 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు చేసింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోరే అండర్సన్(52 బంతుల్లో 91 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్(30 బంతుల్లో 61 పరుగులు, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 31 పరుగులతో ఆడుతున్నాడు. సరబ్జిత్ లడ్డా వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలుత స్ట్రెయిట్ సిక్సర్ సంధించిన షాదాబ్.. ఆ తర్వాత డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ తరలించాడు. అనంతరం రెండు వరుస బంతులను సిక్సర్లను సంధించాడు. షాదాబ్ఖాన్ మెరుపు ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. టిమ్ డేవిడ్ 53 నాటౌట్, డెవాల్డ్ బ్రెవిస్ 32, నికోలస్ పూరన్ 40, కీరన్ పొలార్డ్ 48 పరుగులు చేశారు. అయితే చివర్లో ఒత్తిడికి లోనైన ముంంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగుల వద్ద ఆగిపోయింది. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో కార్మీ లి రౌక్స్, లియామ్ ప్లంకెట్లు చెరో రెండు వికెట్లు తీశారు. Feels good to contribute to a win in @SFOUnicorns first MLC match. pic.twitter.com/q8vKYEc0DW — Shadab Khan (@76Shadabkhan) July 15, 2023 చదవండి: సింగిల్ తీయడానికి 20 బంతులు.. కిషన్పై రోహిత్ సీరియస్! -
మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సంచలనం
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ వికెట్ కీపర్ రింకూ సింగ్ విధ్వంసాన్ని అంత త్వరగా ఎవరు మరిచిపోలేరు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూ సింగ్ పేరు మార్మోగిపోయింది. ఇటీవలే వెస్టిండీస్తో టి20 సిరీస్కు రింకూ సింగ్ను ఎంపిక చేయకపోవడంపై కూడా తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అది సరే ఇప్పుడు రింకూ సింగ్ ప్రస్తావన ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. అచ్చం రింకూ సింగ్ ఇన్నింగ్స్ను తలపించే మ్యాచ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్లో చోటుచేసుకుంది. 12 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది మ్యాచ్ ఫలితాన్నే మార్చేశారు. కాకపోతే అక్కడ ఒక్క రింకూ సింగ్ ఉంటే ఇక్కడ మాత్రం ఇద్దరు రింకూ సింగ్లు కనిపించారు. విషయంలోకి వెళితే.. టీఎన్పీఎల్(TNPL 2023)లో సోమవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, దిండిగుల్ డ్రాగన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నెల్లయ్ కింగ్స్ బ్యాటర్స్ రితిక్ ఈశ్వరన్, అజితేష్ గురుస్వామి సంచలన బ్యాటింగ్తో అదరగొట్టారు.186 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన రాయల్ కింగ్స్ అజితేష్, రితిక్ అసమాన పోరాటంతో చివరి బాల్కు విజయాన్ని అందుకున్నది. రాయల్ కింగ్స్ గెలుపుకు 12 బాల్స్లో 37 రన్స్ అవసరమైన తరుణంలో గేర్ మార్చిన రితిక్ ఈశ్వరన్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. అజిత్ గురుస్వామి ఓ సిక్స్ దంచాడు. ఓ నోబాల్, సింగిల్ రన్తో మొత్తంగా ఆ ఓవర్లో 33 రన్స్ వచ్చాయి.ఆ తర్వాత మరో సిక్స్తో రాయల్ కింగ్స్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు రితిక్ ఈశ్వరన్. అజితేష్ గురుస్వామి 44 బాల్స్లోనే ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 73 రన్స్, రితిక్ ఈశ్వరన్ 11 బాల్స్లో ఆరు సిక్సర్లతో 39 రన్స్ తో నాటౌట్గా మిగిలారు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 185 రన్స్ చేసింది. దిండిగల్ డ్రాగన్స్ ఓపెనర్ శివమ్ సింగ్ 46 బాల్స్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 76 రన్స్ చేశాడు. భూపతి కుమార్ 41 రన్స్తో రాణించాడు. 33-RUN OVER WITH 5 SIXES! 🤯 Insane hitting by Easwaran 🔥 and Ajitesh 💥#TNPLonFanCode pic.twitter.com/GSc41DpGk7 — FanCode (@FanCode) July 10, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్ను కూడా వదలడం లేదు! -
ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్
సాధారణంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొడితే ప్రపంచ రికార్డుగా పరిగణిస్తారు. అదే ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొడితే దానిని సంచలనం అంటారు. అలాంటి సంచలనం విటాలిటీ టి20 బ్లాస్ట్లో నమోదైంది. సర్రీ బ్యాటర్ విల్ జాక్స్ మిడిలెసెక్స్తో మ్యాచ్లో ఈ ఫీట్ను నమోదు చేశాడు.45 బంతుల్లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 96 పరుగులు చేసిన జాక్స్ నాలుగు పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ తన మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న విల్ జాక్స్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన హోల్మన్కు చుక్కలు చూపించాడు. ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్వికెట్ మీదుగా.. రెండో బంతిని స్ట్రెయిట్ వికెట్ మీదుగా.. మేడో బంతిని లాంగాన్ మీదుగా.. నాలుగో బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్స్ మీదుగా.. ఐదో బంతిని మరోసారి లాంగాన్ మీదుగా తరలించాడు. ఆఖరి బంతిని కూడా సిక్సర్ బాదే ప్రయత్నం చేసినప్పటికి కేవలం సింగిల్ మాత్రమే రావడంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్ మిస్సయింది. అయితే విల్ జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ సర్రీని ఓటమి నుంచి తప్పించలేకపోయింది. 252 పరుగులు చేసిన సర్రీ జట్టు.. టార్గెట్ను కాపాడుకోలేకపోయింది. మిడిలెసెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 254 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించిన జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించింది. ఇక ఐపీఎల్లో విల్ జాక్స్ ఆర్సీబీ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 6 6 6 6 6 🔥 Absolutely brutal 🫣 from Will Jacks 🏏#Blast23 pic.twitter.com/B0l9QWqS13 — FanCode (@FanCode) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్కు షాకిచ్చిన ఐసీసీ -
13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు
మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో(MPL 2023) మరో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. దేశవాలీ క్రికెటర్ అర్షిన్ కులకర్ణి 46 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని లీగ్లో ఫాస్టెస్ట్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈగల్ నాసిక్ టైటాన్స్, పుణేరి బప్పా మధ్య మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఈగల్ నాసిక్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అర్షన్ కులకర్ణి 54 బంతుల్లో 3 ఫోర్లు, 13 సిక్స్ లతో 216.67 స్ట్రైక్ రేట్ తో 117 పరుగులు చేశాడు.అయితే ఇందులో ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 90 పరుగులు చేయడం గమనార్హం. అతనికి తోడుగా రాహుల్ త్రిపాఠి 28 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అనంతరం 203 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పుణేరి బప్పా గెలుపు కోసం దీటుగానే అద్భుత ఆటను ప్రదర్శించింది.చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణేరి బప్పా ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఐదు పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది.ఇక పుణేరి బప్పా టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన అర్షన్ కులకర్ణి ఐదు పరుగులే ఇవ్వడంతో.. ఒక్క పరుగు తేడాతో ఈగల్ నాసిక్ టైటాన్స్ విజయం సాధించింది. 13 sixes! Arshin Kulkarni was looking to the skies with this century. .#MPLonFanCode pic.twitter.com/u8BagV5tfW — FanCode (@FanCode) June 20, 2023 Arshin Kulkarni, 18-year-old, playing in MPL: - 117(54) with bat. - 4/21 with ball. - Defended 5 runs in the final over. He has been a run-machine in age group cricket, another talent to watch out in future. pic.twitter.com/tzPxtnruQJ — Johns. (@CricCrazyJohns) June 20, 2023 చదవండి: #Ashes2023: ఇంతకు మించి ఏమి కావాలి.. చాలా సంతోషంగా ఉంది: కమ్మిన్స్ 'మ్యాచ్ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు' -
WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన టీమిండియా రన్నరప్గా నిలిచింది. మరి ఈ ఏడాదైనా టీమిండియా డబ్ల్యూటీసీ విజేతగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక టెస్టు క్రికెట్లో సాధారణంగా సిక్సర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎక్కువగా బౌండరీలతోనే బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టడం చూస్తుంటాం. ఇన్నింగ్స్ మధ్యలోనూ సిక్సర్ల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరనేది పరిశీలిద్దాం. టెస్టు క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. మొత్తం 180 టెస్టుల్లో 91 సిక్సర్లు కొట్టి సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని 144 టెస్టు ఇన్నింగ్స్ల్లో మొత్తం 78 సిక్సర్లు బాదాడు. 329 టెస్టు ఇన్నింగ్స్ల్లో 69 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 83 ఇన్నింగ్స్ల్లో 69 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 4వ స్థానంలో ఉన్నాడు. 184 టెస్టు ఇన్నింగ్స్ల్లో 61 సిక్సర్లు బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరొక్క సిక్సర్ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీరాజ్, మహ్మద్ షమీరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, ట్రెవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషిన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెజర్ , స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్) , మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్. చదవండి: WTC Final: రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు! -
#JiteshSharma: పంజాబ్ తరపున కొత్త సిక్సర్ల వీరుడు
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున వికెట్ కీపర్ జితేశ్ శర్మ సంచలన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆడినంతసేపు ఎక్కువగా సిక్సర్లకే ప్రాధాన్యమిచ్చిన జితేశ్ ఒక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శుక్రవారం(మే 19న) రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో 28 బంతుల్లో 44 పరుగులు చేసిన జితేశ్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. Photo: IPL Twitter కాగా ఈ సీజన్లో ఇప్పటివరకు జితేశ్ శర్మ 21 సిక్సర్లు బాదాడు. పంజాబ్ కింగ్స్ తరపున సీజన్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా నిలిచాడు. జితేశ్ శర్మ తర్వాత లియామ్ లివింగ్స్టోన్, ప్రభ్సిమ్రన్ సింగ్ 19 సిక్సర్లతో ఉన్నారు. ఇక ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున జితేశ్ శర్మ మూడో టాప్ స్కోరర్గా నిలిచాడు. 14 మ్యాచ్ల్లో 309 పరుగులు చేశాడు. ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చే జితేశ్ ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. సీజన్లో అతని అత్యధిక స్కోరు 49 నాటౌట్గా ఉంది. చదవండి: స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి! -
సిక్సర్ల విషయంలో రోహిత్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ను ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆరంభించింది. రోహిత్ శర్మ సీజన్లో తొలిసారి కాన్ఫిడెంట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 61 పరుగులు దాటింది. ఈ క్రమంలో హిట్మ్యాన్ ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో షమీ వేసిన ఆఖరి బంతిని కవర్స్ దిశగా సిక్సర్ కొట్టాడు. రోహిత్కు ఇది ఐపీఎల్లో 252వ సిక్సర్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో డివిలియర్స్(251 సిక్సర్లు)ను రోహిత్ అధిగమించాడు. ఇక అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్ గేల్ 357 సిక్సర్లతో టాప్లో నిలిచి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. 252 సిక్సర్లతో రోహిత్ శర్మ , 251 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్, 239 సిక్సర్లతో ధోని టాప్-5లో కొనసాగుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ 200 సిక్సర్లు పూర్తి చేసుకొని మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. There's the @ImRo45 we all love to see - short and pulled away beautifully for six 😍#IPLonJioCinema #TATAIPL #GTvMI pic.twitter.com/M3RPWoyx5E — JioCinema (@JioCinema) May 12, 2023 Rohit Sharma completing 200 sixes for Mumbai Indians. pic.twitter.com/kPQtyMQpsd — MI Fans Army™ (@MIFansArmy) May 12, 2023 చదవండి: అడుగు పడింది.. జైశ్వాల్ జోరులో గమనించలేదు -
చెత్త ఫీల్డింగ్తో మూడు లైఫ్లు.. సిక్సర్లతో రికార్డులకెక్కాడు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా కేకేఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ దారుణ ఫీల్డింగ్ కనబరిచింది. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఆర్సీబీ చెత్త ఫీల్డింగ్ వల్ల మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తొలుత నితీష్ 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు విజయ్కుమార్ బౌలింగ్లో లాంగాఫ్ దిశగా షాట్ ఆడగా.. సిరాజ్ చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేశాడు. ఇక రెండోసారి సిరాజ్ బౌలింగ్ఓ ఫైన్లెగ్ దిశగా ఆడగా.. అక్కడే ఉన్న ఫీల్డర్ మరోసారి క్యాచ్ను జారవిడిచాడు. ఇక ముచ్చటగా మూడోసారి మ్యాక్స్వెల్ వదిలేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో రానా లాంగాన్ దిశగా ఆడగా.. మ్యాక్స్వెల్ కాస్త వేగంగా స్పందించి ఉంటే ఉంటే క్యాచ్ దొరికేది. ఇలా మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న నితీశ్ రానా చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. Photo: IPL Twitter కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్ల రికార్డు సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. మొత్తంగా 21 బంతుల్లో 4 సిక్సర్లు, మూడు ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే నితీశ్ రానా ఒక రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్గా నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్లో నితీశ్ రానా కొట్టిన నాలుగు సిక్సర్లతో వంద సిక్సర్ల మార్క్ను అందుకున్నాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్ 180 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా.. వంద సిక్సర్లతో నితీశ్ రానా రెండో స్థానంలో, 85 సిక్సర్లతో యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్పలు సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్నారు. Nitish is scoring Run Rana Run 😅@KKRiders' skipper goes 💥 back-to-back 💪#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/I3fNVedeSr — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: #JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్ను ఉతికారేశాడు -
#JasonRoy: 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. షాబాజ్ అహ్మద్ను ఉతికారేశాడు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఓపెనర్ జేసన్ రాయ్ వరుసగా రెండో అర్థశతకం సాధించాడు. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్లో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రాయ్ 22 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన షాబాజ్ అహ్మద్కు జేసన్ రాయ్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదిన రాయ్ 24 పరుగులు పిండుకొని ఉతికారేశాడు. ఇక మ్యాచ్లో 29 బంతుల్లో 56 పరుగులు చేసిన జేసన్ రాయ్ విజయ్కుమార్ వైశాక్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. Oh boy, this Roy can bat! 👏#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @JasonRoy20 @KKRiders pic.twitter.com/QVYc2ZuZ2b — JioCinema (@JioCinema) April 26, 2023 చదవండి: Virat Kohli: చరిత్రకెక్కిన కోహ్లి.. 580 రోజుల తర్వాత -
ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిందెవరు..?
పొట్టి క్రికెట్ అంటేనే సిక్సర్లకు పెట్టింది పేరు. ఈ ఫార్మాట్లో బ్యాటర్లు పోటీపడి మరీ సిక్సర్లు బాదుతుంటారు. ఒకటి అరా సందర్భాల్లో తప్ప దాదాపు ప్రతి మ్యాచ్లో సిక్సర్ల సునామీ తప్పక ఉంటుంది. ఐపీఎల్ వచ్చాక బ్యాటర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇన్నింగ్స్ తొలి బంతా, ఆఖరి బంతా.. స్పిన్ బౌలరా, ఫాస్ట్ బౌలరా అన్న తేడా లేకుండా ఎడాపెడా సిక్సర్లు బాదేస్తున్నారు. ఒక్కో మ్యాచ్లో సగటున 10 నుంచి 20 సిక్సర్లు వస్తుంటాయి. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, పోలార్డ్, వార్నర్ లాంటి భారీ హిట్టర్లయితే ఆడింది 200లోపు మ్యాచ్లే అయినా మ్యాచ్ల సంఖ్యకు మించి సిక్సర్లు కొట్టారు. మ్యాచ్లో ఏదో ఒక సందర్భంలో సిక్సర్ కొట్టడం ఒకెత్తైతే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సిక్సర్లు బాదడం మరో ఎత్తు. ఆఖరి ఓవర్ అనగానే సహజంగా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తెగువ చూపి సిక్సర్లు బాదడం మన మహేంద్రుడికే చెల్లింది. అందుకే అతను చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా చివర్లో ధోని కొట్టినన్ని సిక్సర్లు కొట్టలేదు. చెన్నై సూపర్ కింగ్స్ సారధి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రికార్డు స్థాయిలో 57 సిక్సర్లు బాదాడు. ధోని తర్వాత పోలార్డ్ అత్యధికంగా 33 సిక్సర్లు, రవీంద్ర జడేజా 26, హార్ధిక్ పాండ్యా 25, రోహిత్ శర్మ 23 సిక్సర్లు కొట్టారు. ఓవరాల్గా ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. యూనివర్సల్ బాస్ 142 ఐపీఎల్ మ్యాచ్ల్లో 357 సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఏబీ డివిలియర్స్ (251), రోహిత్ శర్మ (245), ధోని (235), కోహ్లి (227) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని 17 బంతుల్లో 3 సిక్సర్లు, ఫోర్ సాయంతో అజేయమైన 32 పరుగులు సాధించినప్పటికీ సీఎస్కే గెలువలేకపోయింది. ధోని, జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చివరివరకు అద్భుతంగా పోరాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సందీప్ శర్మ ఆఖరి మూడు బంతులను అద్భుతంగా బౌల్ చేసి ధోని, జడ్డూలను కట్టడి చేశాడు. ఫలితంగా ఆర్ఆర్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement