-
Macallan: విస్కీ బాటిల్ రూ. 22.5 కోట్లు!
లండన్: అవున్నిజమే. మెకాలన్ బ్రాండ్కు చెందిన ప్రీమియం స్కాచ్ బాటిల్ ఒకటి ఏకంగా రూ.22.5 కోట్లు పలికింది! శనివారం సోత్బే వేలంలో ఇది అక్షరాలా అంత మొత్తానికి అమ్ముడైంది! దాంతో ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన విస్కీగా కొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రత్యేకతలే ఇంతటి ధరకు కారణమయ్యాయి. ఈ సింగిల్ మాల్ట్ విస్కీ 1926 నాటిది. మెకాలన్ కంపెనీ ఇలాంటి 40 బాటిళ్లను మాత్రమే తయారు చేసింది. వాటిని ఏకంగా 60 ఏళ్ల పాటు డార్క్ ఓక్వుడ్ పెట్టెల్లో నిల్వ చేసి ఉంచి 1986లో బయటికి తీశారట. కొన్నింటిని మెకాలన్ తన వీఐపీ కస్టమర్లకు విక్రయించిందట. -
ప్రిన్సెస్ డయానా స్వెటర్ ధర రూ. 9.14 కోట్లు
లండన్: దివంగత బ్రిటిష్ యువరాణి డయానా ధరించిన స్వెటర్ ఒకటి వేలంలో రికార్డు స్థాయిలో రూ.9.14 కోట్లు పలికింది. రాజ కుటుంబానికి చెందిన వస్తువుకు అంచనాకు మించి ఇంతటి ధర పలకడం ఇదే మొదటిసారి. ప్రముఖ సోథ్బీ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ ఫ్యాషన్ ఐకాన్ సేల్ వేలంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రూ.9,14,58,510కి ఈ స్వెటర్ను సొంతం చేసుకున్నారు. గురువారం ఆఖరి రోజు చివరి 15 నిమిషాల వరకు ఈ స్వెటర్కు అత్యధికంగా 1.90 లక్షల డాలర్ల వరకు పలికింది. చివరి నిమిషాల్లో ఒక్కసారిగా 11 లక్షల డాలర్లకు బిడ్ వేశారని సోథ్బీ తెలిపింది. జనవరిలో సోథ్బీ సంస్థ నిర్వహించిన డయానా ధరించిన బాల్ గౌన్ సైతం రూ.5 కోట్లకు పైగా పలకడం గమనార్హం. -
పగిలితే అతికించలేం.. కానీ ధర మాత్రం రూ.200 కోట్లు! ఎవరు కొన్నారంటే?
పింగాణీ గిన్నె! పగిలితే అతికించలేం. కానీ రెండు పక్షులు, ఆఫ్రికాట్ చెట్టు పెయింటింగ్ ఉన్న పింగాణీ గిన్నె వేలం పాటలో అక్షరాల 25 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. అంటే భారత కరెన్సీలో రూ.200 కోట్లు అమెరికాకు చెందిన పూరాతన వస్తువుల్ని వేలం నిర్వహించే ప్రముఖ సంస్థ సోథిబె 40 దేశాల్లో 80 ప్రాంతాల్లో కార్యకాపాలు నిర్వహిస్తుంది. అయితే ఈ కంపెనీ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో హాంకాంగ్లో ప్రత్యేకంగా ఓ వేలం పాట నిర్వహించింది. ఆ ఆక్షన్లో చైనా రాజధాని బీజింగ్లో 18 శతాబ్ధంలో అంటే? 1722-35 మధ్య యోంగ్జింగ్ రాజు చనిపోయిన కొద్ది కాలానికి 'ఫలాంగ్కాయ్,' 'ఫారిన్ కలర్స్' అని పిలిచే సంప్రదాయంలో భాగంగా సిరామిక్స్తో ఈ పింగాణీ గిన్నెను తయారు చేశారు. గిన్నె మీద రెండు పక్షులు, ఆప్రికాట్ చెట్టు బొమ్మలు యోంగ్జెంగ్ వంశానికి చెందిన రాజు పద్యం నుంచి కొన్ని పదాలు ఉన్నాయి. ఇలాంటివి రెండు గిన్నెలను తయారుచేయగా.. 19వ శతాబ్దం చివరలో షాంఘైకి చెందిన షిప్పింగ్ వ్యాపారి కెప్టెన్ చార్లెస్ ఓస్వాల్డ్ లిడ్డెల్ నుంచి వీటిని సేకరించినట్లు తెలుస్తోంది. 1929లో వీటిని 150 పౌండ్లకు వేర్వేరుగా విక్రయించారు. వీటిలో లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉందని సోథెబీస్ తెలిపింది. రెండో దానిని హాంకాంగ్లో తాజాగా వేలం వేశారు. ఈ గిన్నె దశాబ్దాలుగా అనేక మంది చేతులు మారింది. వీరిలో అమెరికాకు చెందిన బార్బరా హట్టన్ సైతం వేలం పాటలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 8న వేసిన వేలంలో ఆ గిన్నెను వ్యాపారవేత్త, కలెక్టర్ అలిస్ చెంగ్ కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. View this post on Instagram A post shared by Sotheby's (@sothebys)
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement