-
ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం (ఫోటోలు)
-
హార్దిక్ ఆల్రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం
సౌతాంప్టన్: ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. బౌలింగ్, బ్యాటింగ్లో మెరిసిన హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 వికెట్లు) ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(33 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ హుడా(17 బంతుల్లో 33 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అంతకముందు రోహిత్ శర్మ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఇన్ఫామ్ బ్యాట్స్మన్.. కొత్త కెప్టెన్ జాస్ బట్లర్ భువనేశ్వర్ బౌలింగ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హారీ బ్రూక్ 28, మొయిన్ అలీ 36 పరుగులు చేసినప్పటికి ఇంగ్లండ్ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు. హార్దిక్ పాండ్యా సహా అర్షదీప్(2 వికెట్లు), చహల్(2 వికెట్లు) వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ను ముప్పతిప్పలు పెట్టారు. చివర్లో జోర్డాన్ 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో టీమిండియా1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 శనివారం(జూలై 9న) జరగనుంది. For his brilliant show with the bat and ball, @hardikpandya7 is adjudged Player of the Match as #TeamIndia win the first T20I by 50 runs. Take a 1-0 lead in the series. Scorecard - https://t.co/Xq3B0KTRD1 #ENGvIND pic.twitter.com/oEavD7COnZ — BCCI (@BCCI) July 7, 2022 Vintage Mo. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/AQ8cK5sTph — England Cricket (@englandcricket) July 7, 2022 Brilliance from Sam! India have set us 199 for victory in the first @vitality_uk IT20. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/ZfwdPi6VGf — England Cricket (@englandcricket) July 7, 2022 -
WTC Final: మూడేళ్ల తర్వాత టీమిండియా చెత్త రికార్డు
సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్షిప్ పైనల్లో టీమిండియా ఒక చెత్త రికార్డును నమోదు చేసింది. మూడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో టీమిండియా నుంచి ఒక్క ఆటగాడు కూడా అర్థసెంచరీ మార్క్ను చేరుకోలేకపోయాడు. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సరైన ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ బౌలర్ల దాటికి పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. ఇంతకముందు 2018లో ఇంగ్లండ్ గడ్డపైనే లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో టీమిండియా నుంచి ఒక్క అర్థ సెంచరీ నమోదు కాలేదు. ఇక టీమిండియా ప్రపంచటెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్లో భాగంగా టీమిండియా ఓవర్నైట్ స్కోరు 64/2 తో ఆరో రోజు ఆటను ప్రారంభించిన కాసేపటికే పుజారా, కోహ్లిల రూపంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్కడినుంచి ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేయని టీమిండియా 170 పరుగులకే చాప చుట్టేసింది. పంత్ 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రోహిత్ 30 పరుగులు చేశాడు. మొత్తంగా 138 పరుగుల లీడ్ సాధించిన టీమిండియా కివీస్ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా కివీస్ ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. ఓపెనర్లు డెవన్ కాన్వే(19), టామ్ లాథమ్(9) పరుగులు చేసి ఔటవ్వగా.. కేన్ విలియమ్సన్(8), రాస్ టేలర్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: గ్రౌండ్లోనే టవల్ చుట్టుకున్న షమీ.. కారణం ఏంటంటే WTC Final: కివీస్ ఈ పాటికే గెలవాల్సింది.. -
రాస్ టేలర్పై జాత్యహంకార వ్యాఖ్యలు
సౌథాంప్టన్: ఇంగ్లండ్లో సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాడ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 5వ రోజున న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్కి చేదు అనుభవం ఎదురైంది. రాస్ టేలర్పై ఇద్దరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఓ మహిళ ట్వీట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తెలిపింది. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు.. ఆ ఇద్దరిని మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఇక ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు చదవండి: WTC Final: ఆడతారా...ఓడతారా! -
WTC ఫైనల్: నాలుగో రోజు వర్షార్పణం
సౌతాంఫ్టన్: ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ పైనల్కు వరుణుడు అడ్డంగా మారాడు. ఇక నాలుగో రోజైన సోమవారం ఆట ప్రారంభమవుతుందని ఆశించిన ప్రేక్షకుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ మెగా ఫైనల్కు వేదికైన సౌతాంప్టన్లో ఉదయం నుంచి వర్షం కురవడంతో పిచ్పై కప్పిన కవర్లపై నీరు నిలిచిపోయింది. దీంతో పాటు ఔట్ఫీల్డ్ చిత్తడిగా మారింది. ఈ క్రమంలోనే నాల్గో రోజు మ్యాచ్ జరిగే సూచనలు లేవని ఫీల్డ్ ఎంపైర్లు తెలపడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా నాలుగో రోజు ఆట వర్షార్పణం అయ్యింది. చదవండి: WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!
Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్
ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం
ఎడారి దేశంలో మళ్లీ వర్షం.. విమాన సర్వీసులు రద్దు
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్
అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..
ఎక్కువరోజులు బతకలేడు అని డాక్టర్లు చేతులెత్తేశారు: నటుడు
వైట్ శారీలో బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ హోయలు.. ఫోటోలు
తప్పక చదవండి
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- SRH: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్రెడ్డి సూపర్: కమిన్స్
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- మోసాల బాబు మరో అబద్ధం..
Advertisement