-
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్-2024 పోటీల్లో శ్రీలంక జట్టు విజేతగా అవతరించింది. అబుదాబీలో నిన్న (మే 7) జరిగిన ఫైనల్లో లంక జట్టు స్కాట్లాండ్పై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక కెప్టెన్ చమారీ ఆటపట్టు మెరుపు శతకంతో (63 బంతుల్లో 102; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక చమారీ రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో చమారీ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. నీలాక్షి డిసిల్వ 26 నాటౌట్, కవిశ దిల్హరి 15, విశ్మి గుణరత్నే 9, హర్షిత మాధవి 8, హాసిని పెరెరా 0 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో రేచల్ స్లేటర్ 2, ప్రయనాజ్, కేథరీన్ ఫ్రేజర్, అబ్తహా మక్సూద్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉదేషిక ప్రబోధని 3 వికెట్లతో చెలరేగగా.. ఇనోశి ప్రియ, సుగందిక కుమారి, కవిశ దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో ప్రియనాజ్ (30) టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఈ ఏడాది అక్టోబర్లో జరుగబోయే మహిళల టీ20 ప్రపంచకప్కు క్వాలిఫై అయ్యాయి. మహిళల పొట్టి ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. -
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత
బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్లను సొంతం చేసుకున్నాయి. సెమీఫైనల్స్లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి. -
ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
స్కాట్లాండ్ మహిళల క్రికెట్ జట్టు తొలిసారి టీ20 ప్రపంచకప్కు అర్హత సాధించింది. నిన్న (మే 5) జరిగిన క్వాలిఫయర్ సెమీస్లో స్కాట్లాండ్ ఐర్లాండ్ను ఓడించి ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. 2015 నుంచి వరల్డ్కప్ బెర్త్ కోసం తపిస్తున్న స్కాట్లాండ్ ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) అనుకున్నది సాధించింది. మరో సెమీస్లో యూఏఈని ఓడించిన శ్రీలంక కూడా స్కాట్లాండ్తో పాటు వరల్డ్కప్ బెర్త్ను దక్కించుకుంది. ఈ రెండు జట్లు క్వాలిఫయర్ పోటీల నుంచి ప్రపంచకప్కు అర్హత సాధించాయి. A special, special group 💜 pic.twitter.com/8BfoqsptAV— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.Flower of Scotland: World Cup Qualification Edition 🤩🏴 pic.twitter.com/zt8Gsm7gr2— Cricket Scotland (@CricketScotland) May 5, 2024 గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది.స్కాట్లాండ్-ఐర్లాండ్ మ్యాచ్ (తొలి సెమీస్) విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా.. స్కాట్లండ్ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేథరీన్ బ్రైస్ ఆల్రౌండ్ షోతో (4-0-8-4, 35 నాటౌట్) ఇరగదీసి స్కాట్లాండ్ను ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చింది.రెండో సెమీస్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన యూఏఈ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. మే 7న జరిగే వరల్డ్కప్ క్వాలిఫయర్లో స్కాట్లండ్, శ్రీలంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర.. అత్యంత అరుదైన రికార్డు
శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో విజయవంతమైన లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్గా నిలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో బుధవారం జరిగిన మూడో వన్డే సందర్భంగా చమరి ఆటపట్టు ఈ ఫీట్ నమోదు చేసింది. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం శ్రీలంక వుమెన్ టీమ్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్ను 2-1తో సొంతం చేసుకుంది పర్యాటక శ్రీలంక. అదే జోరులో వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలని సంకల్పించింది. అయితే, తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో అదరగొట్టి రెండో వన్డేలో ఆతిథ్య సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో శ్రీలంక అద్బుత ప్రదర్శన కనబరిచింది. పోఛెఫ్స్ట్రూమ్లో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన లంక మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఓపెనర్, కెప్టెన్ లారా వల్వార్ట్ అజేయ శతకంతో ఆకట్టుకుంది. 147 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 184 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో లారా గుడాల్ 31, మరిజానే క్యాప్ 36, నదీనే డి క్లెర్క్ 35 రన్స్ చేయగా..మిగతా వాళ్లు నిరాశపరిచారు. వల్వార్ట్ అద్బుత సెంచరీ వృథా అయితే, వల్వార్ట్ అద్భుత సెంచరీ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక గెలుపులో కెప్టెన్ చమరి ఆటపట్టుదే కీలక పాత్ర. ఈ వెటరన్ ఓపెనర్ 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 195 పరుగులతో చివరి వరకూ అజేయంగా నిలిచింది. 44.3 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది లంకను విజయతీరాలకు చేర్చింది. రికార్డు విజయం కూడా ఇక ఈ మ్యాచ్లో ఆటపట్టుకు తోడుగా మరో ఓపెనర్ విష్మి గుణరత్నె(26) రాణించగా.. ఆరో నంబర్ బ్యాటర్ నీలాక్షి డి సిల్వ అజేయ అర్ధ శతకం(50)తో దుమ్ములేపింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న చమరి ఆటపట్టు.. వన్డేల్లో విజయవంతమైన రన్ ఛేజ్లో 195 పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకుంది. ఇక శ్రీలంక వన్డేల్లో ఛేజ్ చేసిన భారీ స్కోరు కూడా ఇదే! వన్డేల్లో సక్సెస్ఫుల్ రన్ఛేజ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు 1. గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- అఫ్గనిస్తాన్ మీద- 2023 వరల్డ్కప్- 201 రన్స్(నాటౌట్) 2. చమరి ఆటపట్టు(శ్రీలంక)- సౌతాఫ్రికా మీద- 2024- 195 రన్స్(నాటౌట్) 3. షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా)- బంగ్లాదేశ్ మీద- 2011- 185 రన్స్(నాటౌట్) 4. మహేంద్ర సింగ్ ధోని(ఇండియా)- శ్రీలంక మీద- 2005- 183 రన్స్(నాటౌట్) 5. విరాట్ కోహ్లి(ఇండియా)- పాకిస్తాన్ మీద- 2012- 183 రన్స్. చదవండి: ‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి -
ముంబై ఇండియన్స్తో మ్యాచ్కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్
ముంబై ఇండియన్స్తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగబోయే కీలక సమరానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీశ పతిరణ గాయం కారణంగా ముంబై మ్యాచ్కు దూరం కానున్నాడు. పతిరణ గాయంపై అప్డేట్ను సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు. పతిరణ సీఎస్కే ఆడబోయే తదుపరి మ్యాచ్ సమయానికంతా కోలుకుంటాడని ఫ్లెమింగ్ తెలిపాడు. పతిరణ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత సీఎస్కే ఆడిన రెండు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. పతిరణ గైర్హజరీలో సీఎస్కే సన్రైజర్స్ చేతిలో ఓడి.. కేకేఆర్పై విజయం సాధించింది. కాగా, ఇవాళ రాత్రి జరుగబోయే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ ఫైట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్ అయిన వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ ఎల్ క్లాసికోగా పిలువబడే ఈ మ్యాచ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ధోని, రోహిత్ మెరుపుల కోసం అభిమానులు వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పుడిప్పుడే (రెండు వరుస విజయాలు) గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్ చేసింది. 5 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించిన సీఎస్కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 36 మ్యాచ్లు జరగగా ముంబై 20, సీఎస్కే 16 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. -
తమిళనాట మోదీ సంచలన ప్రకటన.. డిఫెన్స్లో డీఎంకే!
సాక్షి, చెన్నై: లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రజలకు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా భారత్కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ప్రధాని మోదీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలూరులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఈరోజు దేశం మొత్తం కాంగ్రెస్, డీఎంకే పార్టీల మరో కపట నాటకం గురించి చర్చిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Addressing a public rally in Vellore, PM Narendra Modi says, "Today the whole country is discussing another hypocrisy of Congress and the DMK party. When Congress was in government, these people gave Kachchatheevu Island to Sri Lanka. In which cabinet was… pic.twitter.com/Gr004Zxmea — ANI (@ANI) April 10, 2024 కచ్చాతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అదొక్కటే కాదు మరణ శిక్షలు విధింపబడిన వారిని కూడా సజీవంగా వెనక్కి తీసుకువస్తున్నాం. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత బీజేపీది అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి. డీఎంకేది విభజన రాజకీయం. తమిళులను చీకట్లో ఉంచేసింది. అవినీతి చేయడానికి డీఎంకే కాపీరైట్ తీసుకుంది. కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంటోంది. తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. -
Election 2024: ప్రధాని మోదీ బిగ్ ప్లాన్!
దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికార బీజేపీ ఎన్నికల్లో ప్రచారం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలు, ప్రచార సరళిని క్షేత్రస్థాయిలో చూపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపింది. సుమారుగా 25 విదేశాలకు చెందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపిచినట్లు తెలుస్తోంది. అయితే అందులో 13 పార్టీల ప్రతినిధులు భారత్కు రావడానికి ఆసక్తి చూపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే 13 పార్టీల ప్రతినిధులు ఏయే దేశాలకు చెందినవారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. బీజేపీ ఆహ్వానించిన విదేశీ పార్టీలు.. అమెరికాలోని అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ‘‘అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అధ్యక్ష ఎన్నికలు కోసం తలమునకలై ఉంది. అయితే యూఎస్ పార్టీ ఇండియా, యూరప్లోని ఎన్నికల విధానానికి భిన్నంగా ఉంటుంది. యూఎస్ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ చీఫ్ తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధ్యక్ష కార్యాలయం, యూఎస్ కాంగ్రెస్ (చట్ట సభ)కు అక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది’’అని ఓ బీజేపీ నేత తెలిపపారు. యూఎస్తో పాటు యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల ప్రతినిధులను ఆహానం పంపారు. జర్మనిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఆహ్వానించారు. అయితే పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక్కపార్టీని కూడా పిలువకపోవటం గమనార్హం. భారత్తో పాక్కు సరైన సంబంధాలు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అదేవిధంగా సరిహద్దు వివాదంతో తరుచు కవ్వించే చైనా పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపించలేదు. మరోవైపు పొరుదేశమైన బంగ్లాదేశ్లో కేవలం అధికార అవామీ లీగ్ను మాత్రమే ఆహ్వానించింది. ఇటీవల అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్బీ.. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో భారతీయ ఉత్పత్తులను బాయ్కాట్ చేసిన విషయం తెలిసిందే. నేపాల్, శ్రీలంకకు చెందిన అన్ని ప్రముఖ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది. ఇక.. తాము ఆహ్వానించిన విదేశీ పార్టీల ప్రతినిధులు లోక్సభ ఎన్నికల మూడో లేదా నాలుగో దశ పోలిగ్ సమయం(మే రెండో వారం)లో భారత్ను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. విదేశి పార్టీకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు ముందుగా ఢిల్లీ చేరుకొని భారత్ రాజీకీయ వ్యవస్థ, ఎన్నికల విధానం గురించి తెలుసుకుంటారు. 5-6 మంది ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలో 4-5 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ నేతలను కలుస్తారు. ప్రధాని మోదీ, హోం మంత్రి వంటి నేతల ర్యాలీల్లో విదేశీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. బీజేపీ ప్రాముఖ్యత తెలపటమే లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రాముఖ్యత తెలియచేయటంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆయన విదేశీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులను కలువనున్నారు. ఇప్పటికే.. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండను బీజేపీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం విదేశీ పార్టీలకు చెందిన 4-5 మంది ప్రముఖుల బృందం పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. ఇక.. ప్రపంచం దేశాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చేరువకావటమే లక్ష్యంగా బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిది. ప్రపంచంలోనే అతి పెద్దపార్టీ బీజేపీ. బీజేపీ ఎన్నికల విధానం, ఎన్నికల ప్రచారం, అమలు చేసే వ్యూహాలను ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి’’అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం నేత విజయ్ చౌతైవాలే తెలిపారు. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రీలంక సంచలన బ్యాటర్
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్ కమిందు మెండిస్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్కు దక్కింది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్కు లభించింది. Kamindu Mendis and Maia Bouchier have won the ICC Player of the Month awards for March 2024. 🌟 pic.twitter.com/h2QClz51SA — CricTracker (@Cricketracker) April 8, 2024 మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లే గార్డ్నర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ పోటీ పడగా.. మైయా బౌచియర్ను అవార్డు వరించింది. మెండిస్ మార్చిలో బంగ్లాదేశ్తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైయా బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్లో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్గా నమోదైంది. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. -
IPL 2024: అనుకున్నదే అయ్యింది.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
సన్రైజర్స్ స్టార్ స్పిన్నర్, శ్రీలంక టీ20 జట్లు కెప్టెన్ వనిందు హసరంగ విషయంలో అనుకున్నదే అయ్యింది. గాయం (ఎడమ కాలు మడమ) కారణంగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరిస్తూ బీసీసీఐకి లేఖ రాసింది. గాయం తాలుకా చికిత్స నిమిత్తం హసరంగ దుబాయ్లో ఉన్నాడని లంక బోర్డు పేర్కొంది. చికిత్స అనంతరం హసరంగ స్వదేశంలో రిహాబ్లో ఉంటాడని తెలిపింది. డాక్టర్లు హసరంగను కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారని పేర్కొంది. తప్పనిసరి పరిస్థితుల్లో హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా, కొద్ది రోజుల ముందు వరకు సన్రైజర్స్ యాజమాన్యం హసరంగపై ఆశలు పెట్టుకుని ఉండింది. సీజన్ ఆఖరి మ్యాచ్లకైనా అందుబాటులోకి వస్తాడని అనుకుంది. లంక బోర్డు తాజా ప్రకటన నేపథ్యంలో సన్రైజర్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే పనిలో పడింది. గాయం లేదు ఏమీ లేదు అంతా డ్రామా.. హసరంగ ఐపీఎల్ నుంచి తప్పుకోవడం వెనక గాయం కాకుండా వేరే కారణాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం జరుగుతుంది. వేలంలో అతనికి సరైన రెమ్యూనరేషన్ దక్కకపోడం వల్లే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. హసరంగను గత సీజన్లో (2023) ఆర్సీబీ 10.75 కోట్లకు దక్కించుకోగా.. ఈ సీజన్ వేలంలో అతన్ని సన్రైజర్స్ కేవలం 1.5 కోట్లకే సొంతం చేసుకుంది. వేలంలో అనుకున్న ధర లభించకపోతే చాలా మంది విదేశీ ఆటగాళ్లు రకరకాల కారణాలు చూపి పోటీ నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే, హసరంగ ఉన్నా లేకపోయిన ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతుంది. తాజాగా కమిన్స్ సేన సొంత మైదానంలో (ఉప్పల్) ఫైవ్ టైమ్ ఛాంపియన్ సీఎస్కేను మట్టికరిపించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. సన్రైజర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, రెండు పరాజయాలను మూటగట్టుకుంది. సన్రైజర్స్ ఏప్రిల్ 9న జరిగే తమ తదుపరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢీకొంటుంది. -
శ్రీలంక అమ్మాయి.. కరీంనగర్ అబ్బాయి ఒక్కటయ్యారు
రామడుగు(చొప్పదండి): అమ్మాయిది శ్రీలంక.. అబ్బాయిది రామడుగు మండలంలోని పందికుంటపల్లి. దేశాలు వేరైనప్పటికీ ప్రేమ అనే బంధం ఇరువురినీ ఒక్కటి చేసింది. పందికుంటపలి్లకి చెందిన కట్కం సురేందర్ ఉద్యోగం చేయడానికి లండన్ వెళ్లాడు. తాను పని చేస్తున్న ఆఫీస్లో శ్రీలంక దేశానికి చెందిన జానుషికతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో తమ కుటుంబసభ్యులను పెళ్లికి ఒప్పించారు. బుధవారం కరీంనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఏడడుగులు వేశారు. వివాహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
BAN vs SL, 2nd Test: బంగ్లాదేశ్ను ఊడ్చేసిన శ్రీలంక.. రెండో టెస్ట్లో ఘన విజయం
రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో శ్రీలంక.. బంగ్లాదేశ్ను వారి సొంత దేశంలో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (ఏప్రిల్ 3) ముగిసిన రెండో టెస్ట్లో పర్యాటక జట్టు 192 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన యువ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 122.33 సగటున రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 367 పరుగులు చేశాడు. అలాగే మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 531 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు లంక ఆటగాళ్లు అర్దసెంచరీలు చేశారు. ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకుండా టెస్ట్ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే. లంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు విజృంభించడంతో 178 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్లో జకీర్ హసన్ (54) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో నలుగురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారీ ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ప్రత్యర్ది ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లంక సెకెండ్ ఇన్నింగ్స్లో ఏంజెలో మాథ్యూస్ (56) టాప్ స్కోరర్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 4 వికెట్లు పడగొట్టగా.. ఖలీద్ అహ్మద్ 2, షకీబ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లోలా కాకుండా అద్భుతంగా పోరాడింది. బంగ్లా బ్యాటర్లు తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్లో 318 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ (50), మెహిది హసన్ మీరజ్ (81 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో లహీరు కుమార 4, కమిందు మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2, విశ్వ ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో కూడా శ్రీలంకనే విజయం సాధించింది. -
శాసించే స్థితిలో శ్రీలంక
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మూడో రోజే శాసించే స్థితిలో నిలిచింది. తద్వారా క్లీన్స్వీప్ దిశగా సాగుతోంది. ఓవర్నైట్ స్కోరు 55/1తో సోమవారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన బంగ్లా 68.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. లంక పేసర్లు అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార చెరో 2 వికెట్లు తీశారు. లంకకు తొలి ఇన్నింగ్స్లో 353 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో 6 వికెట్లకు 102 పరుగులు చేసింది. మాథ్యూస్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు), ప్రభాత్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం లంక 455 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. -
లంక పేసర్ల విజృంభణ.. కుప్పకూలిన బంగ్లాదేశ్
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక పేసర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆతిథ్య బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 178 పరుగులకే కుప్పకూలింది. అసిత ఫెర్నాండో 4, విశ్వ ఫెర్నాండో, లహీరు కుమార తలో 2 వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్లో జకీర్ హసన్ (54) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో నలుగురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు. హసన్ జాయ్ 21, తైజుల్ ఇస్లాం 22, మొమినుల్ హక్ 33, షకీబ్ 15 పరుగులు సాధించారు. షాంటో 1, లిటన్ దాస్ 4, షాదత్ హొసేన్ 8, మెహిది హసన్ 7, ఖలీద్ అహ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. దీనికి ముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు బ్యాటర్లు అర్దసెంచరీలు సాధించారు. ఫలితంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 531 పరుగులు చేసింది. టెస్ట్ ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా నమోదైన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. లంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచి శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. టీమిండియా రికార్డు బద్దలు
టెస్ట్ల్లో టీమిండియా పేరిట ఉండిన ఓ భారీ రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండింది. 1976లో టీమిండియా ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేసి భారత్ రికార్డును బద్దలు కొట్టింది.న్యూజిలాండ్తో జరిగిన నాటి మ్యాచ్లో ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఆరుగురు లంక ఆటగాళ్లు అర్ద శతకాలు బాదారు. లంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92 నాటౌట్) సెంచరీలకు చేరువగా వచ్చారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో పర్యాటక శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆరుగురు అర్దశతకాలు సాధించడంతో 531 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటయ్యారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 (నాటౌట్) పరుగులు చేశారు.బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 21 పరుగులు చేసి లహీరు కుమార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. జకీర్ హసన్ (28), తైజుల్ ఇస్లాం (0) క్రీజ్లో ఉన్నారు.బంగ్లాదేశ్.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 476 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచి శ్రీలంక 1-0 కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
కచ్ఛాతీవు రగడ.. భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్ఛాతీవు ద్వీపం విషయంలో అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. దేశ భద్రత ఏమాతం పట్టించుకోకుండా, స్పృహలేకుండా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దీంతో మరోసారి కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం తెరమీదికి వచ్చింది. తాజాగా కచ్ఛాతీవు ద్వీపం విషయంపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. భారత దేశ తొలి ప్రధానమంత్రి అయిన జవహార్లాల్ నెహ్రూ కావాలనే శ్రీలంకకు కచ్ఛాతీవు ద్వీపాన్ని అప్పగించారని విమర్శలు చేశారు.కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ మీడియాతో మాట్లాడారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించి 1974లో పార్లమెంట్లో మాజీ కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి స్వరణ్ సింగ్ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. ‘స్వేచ్ఛ, సమానంగా ఇరుదేశాల (శ్రీలంక, భారత్) మధ్య ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ ఒప్పందాన్ని ముగింపు దశకు తీసుకువస్తాం. గతంలో ఇరుదేశాల మధ్య మత్స్యకారుల వేట, నేవిగేషన్ హక్కులను పొందినట్లుగానే భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు సమానంగా పొందుతాయి’అని అప్పటి కేంద్రమంత్రి చెప్పినట్లు జైశంకర్ మీడియాకు వివరించారు. ఇలా జరిగిన రెండు ఏళ్లలో అప్పటి ప్రభుత్వం మరో ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీలకం సముద్ర జాలాల్లో ఉన్న కచ్ఛాతీవు ద్వీపానికి భారతీయ మత్స్యకారులు, మత్స్యకార ఓడలు వేటకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని కారణంగానే ఇరు దేశాల మధ్య 1974 ఈ ఒప్పందం జరిగితే.. 1976లో అమల్లోకి వచ్చిందన్నారు. అప్పుడు జరిగిన ఈ ఒప్పందం కారణంగా గత 20 ఏళ్ల నుంచి సుమారు 6184 భారత మత్స్యకారులు శ్రీలంక చేతిలో నిర్భందించబడ్డారు. 1175 మత్స్యకార ఓడలను శ్రీలంక అధికారులు సీజ్ చేశారని జైశంకర్ వెల్లడించారు. కచ్ఛాతీవు ద్వీపానికి సంబంధించిన విషయాన్ని గత పదేళ్ల నుంచి తాను పార్లమెంట్లో లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఇదేవిషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తనకు పలుసార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. తాను 21 లేఖలకు సమాదానం ఇచ్చినట్లు తెలిపారు. కచ్ఛాతీవు ద్వీపం వ్యవహారం ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది కాదని.. ఏళ్ల నుంచి కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇక.. కచ్ఛాతీవు ద్వీపం ఒప్పందానికి సంబంధించిన వివరాల కోసం తమిళాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆర్టీఐ పిటిషన్ వేయటంతో దీనికి సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ కాంగ్రెస్ విమర్శలు చేయటంతో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి విమర్శలుపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం బంగ్లాదేశ్తో ఒప్పందం చేసుకొని 111ప్రాంతాలు బంగ్లాకు,55 ప్రాంతాలు భారత్త్ పరస్పరం బదిలీ చేసుకున్న విషయం మర్చి పోయాయా? 1974లో జరిగింది కూడా అచ్చం అలాంటి ఒప్పందమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎమిటీ కచ్ఛాతీవు కథాకమామిషు? కచ్ఛాతీవు తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక దిశగా 55 కిలోమీటర్ల దూరంలో పాక్ జలసంధిలో ఉన్న 163 ఎకరాల అతి చిన్న ద్వీపం. మధ్యయుగంలో శ్రీలంకలోని జాఫ్నా ఆధీనంలో ఉండేది. బ్రిటిష్వారి రాకతో శ్రీలంక, భారత్ రెండింటి ఏలుబడిలోకి వచ్చింది. 1948 దాకా తమిళనాడులోని రామనాథపురం జమీందారీ కింద ఉండేది. తర్వాత మద్రాసు రాష్ట్రం పాలనలోకి వచ్చింది. చేపల వేట పెరగటంతో అది తమదంటే తమదని శ్రీలంక, భారత్ ప్రకటించుకున్నాయి. చదవండి: కచ్ఛాతీవు ద్వీపం.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. టీమిండియా రికార్డు బద్దలు
టెస్ట్ల్లో టీమిండియా పేరిట ఉండిన ఓ భారీ రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండింది. 1976లో టీమిండియా ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేసి భారత్ రికార్డును బద్దలు కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన నాటి మ్యాచ్లో ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించగా.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ ఆరుగురు లంక ఆటగాళ్లు అర్ద శతకాలు బాదారు. లంక ఇన్నింగ్స్లో కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92 నాటౌట్) సెంచరీలకు చేరువగా వచ్చారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో పర్యాటక శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆరుగురు అర్దశతకాలు సాధించడంతో 531 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటయ్యారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 21 పరుగులు చేసి లహీరు కుమార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా.. జకీర్ హసన్ (28), తైజుల్ ఇస్లాం (0) క్రీజ్లో ఉన్నారు. బంగ్లాదేశ్.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 476 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా, ఈ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో గెలిచి శ్రీలంక 1-0 కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శ్రీలంక 531 ఆలౌట్
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్లో 159 ఓవర్లలో 531 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 314/4తో రెండో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 217 పరుగులు సాధించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు దినేశ్ చండీమల్ (59; 5 ఫోర్లు, 2 సిక్స్లు), ధనంజయ డిసిల్వా (70; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కామిందు మెండిస్ (92 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఓవరాల్గా లంక ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు చేశారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ నమోదు కాకుండా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు భారత జట్టు (1976లో కాన్పూర్లో న్యూజిలాండ్పై 524/9 డిక్లేర్డ్) పేరిట ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. -
IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్..
ఐపీఎల్-2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. హసరంగ ప్రస్తుతం ఎడమ కాలి మడమ గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకుని త్వరలోనే సన్రైజర్స్ జట్టుతో చేరుతాడని అంతా భావించారు. కానీ హసరంగా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్ 17వ సీజన్ నుంచి వైదొలిగనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా ధ్రువీకరించారు. "పాడియాట్రిస్ట్ను కలిసిన హసరంగా వారి సలహా మేరకు మరి కొన్ని రోజుల పాటు పునరావాసంలో ఉండనున్నాడు. దీంతో అతడు ఐపీఎల్లో పాల్గొనడం లేదు. అతడి మడమలో వాపు ఉంది. వనిందు ప్రస్తుతం ఇంజెక్షన్లను తీసుకుంటున్నాడు. వరల్డ్కప్కు ముందు పూర్తి ఫిట్నెస్ సాధించాలని హసరంగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఈ ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని మాకు తెలియజేశాడని" డి సిల్వా సండే టైమ్స్ అనే వార్తా పత్రికతో పేర్కొన్నాడు. ఐపీఎల్-2024 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ హసరంగను రూ. 1.5 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
BAN VS SL 2nd Test: ఏకంగా మూడు చేతులు మారి, చివరికి..!
చట్టోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఫీల్డర్లు నవ్వులు పూయించారు. ఓ క్యాచ్ను ఏకంగా ముగ్గురు పట్టుకునేందుకు ప్రయత్నించి చివరికి విజయవంతంగా నేలపాలు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్ 121వ ఓవర్ చివరి బంతికి లంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య కవర్స్ దిశగా డ్రైవ్ చేసే ప్రయత్నం చేయగా బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఇక్కడే డ్రామా మొదలైంది. Dropped x 3🫥pic.twitter.com/PucY2gbLRV — CricTracker (@Cricketracker) March 31, 2024 తొలుత తొలి స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయిన బంతి.. ఆతర్వాత సెకెండ్ స్లిప్ ఫీల్డర్ చేతుల్లో నుంచి, ఆ తర్వాత మూడో స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో నుంచి జారిపోయి విజయవంతంగా నేలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట నువ్వులు పూయిస్తుంది. కాగా, ఇదే మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో క్లియర్గా బ్యాట్కు తాకిన బంతికి ఎల్బీ కోసం రివ్యూకి వెళ్లి నవ్వుల పాలయ్యాడు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో పర్యాటక శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు అర్దసెంచరీలు సాధించారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
కచ్చతీవు ద్వీపం.. కాంగ్రెస్పై ప్రధాని మోదీ విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కచ్చతీవు ద్వీపం విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ఎండగట్టారు. 1970లో కాంగ్రెస్ పార్టీ కచ్చతీవు ద్వీపాన్ని పొరుగు దేశం శ్రీలంకకు నిర్మొహమాటంగా ఇచ్చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ.. దేశ సమగ్రత, సమైక్యత, ప్రయోజనాలను కాంగ్రెస్ పార్టీ బలహీన పరుస్తూ వచ్చిందని ‘ఎక్స్’వేదికగా ధ్వజమెత్తారు. 1974లో కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకు మొండివైఖరితో వదిలేసిన విషయానికి సంబంధించిన ఓ ఆర్టీఐ నివేదికపై ప్రధాని మోదీ ఆదివారం స్పందించారు. ‘కళ్లు తెరిపించే, ఆశ్చర్యకమైన.. కచ్చతీవు ద్వీపానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొండిగా తీసుకున్న నిర్ణయానికి చెందిన కొత్త నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ నిర్ణయం పట్ల భారతదేశ ప్రజలు ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీని ఇక ఎప్పడూ నమ్మొద్దని ప్రజలు భావించారు. ఆనాడు కాంగ్రెస్ అవలంభించిన మొండివైఖరి ప్రజల మదిలో నిలిచిపోయింది. 75 ఏళ్లుగా భారతదేశ సమగ్రత, సమైక్యత, ప్రయోజనాలను బలహీన పరచటమే కాంగ్రెస్ విధానం’అని మోదీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. Eye opening and startling! New facts reveal how Congress callously gave away #Katchatheevu. This has angered every Indian and reaffirmed in people’s minds- we can’t ever trust Congress! Weakening India’s unity, integrity and interests has been Congress’ way of working for… — Narendra Modi (@narendramodi) March 31, 2024 కచ్చతీవు ద్వీపం 1975 వరకు భారత దేశంలో భాగంగానే ఉండేదని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అన్నారు. అక్కడికి తమినాడు మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్తుండేవారు. భారత్ ఒప్పదం అయిపోయాక తమిళమత్స్యకారులను శ్రీలంక అక్కడికి రానివ్వలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కచ్చతీవు ద్వీపంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అదేవింధంగా దీనికి తమ కుటుంబమే బాధ్యతవహిస్తుందని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వేసిన ఆర్టీఐ పిటిషన్ ద్వారా కచ్చతీవు ద్వీపానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 1974లో ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని అప్పటి మాజీ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ శ్రీలంకకు అప్పగించినట్లు అందులో పేర్కొంది. లోక్సభ ఎన్నికల వేళ ఈ వ్యవహరాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తోంది. -
శ్రీలంక 314/4
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్తో మొదలైన రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు నిశాన్ మదుష్కా (57; 6 ఫోర్లు), దిముత్ కరుణరత్నే (86; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (93; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. నిశాన్, కరుణరత్నే తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. నిశాన్ అవుటయ్యాక కుశాల్ మెండిస్తో కలిసి కరుణరత్నే రెండో వికెట్కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం దినేశ్ చండీమల్ (34 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), కెపె్టన్ ధనంజయ డిసిల్వా (15 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. నాలుగు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ 18 ఓవర్లు వేసి 60 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. వీడియో వైరల్
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆటలో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 4 వికెట్లు నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(93), కరుణరత్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు, షకీబ్ ఆల్ హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌలర్, స్లిప్లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్కు కాకుండా ప్యాడ్కు తగిలిందని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. ఈ క్రమంలో షాంటో బౌలర్తో సంప్రదించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్కు స్పష్టంగా తాకుతున్నప్పటికి షాంటో రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 -
బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ పునరాగమనం
రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు. గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
డిసిల్వ, మెండిస్ 'ద్వి'శతక హోరు.. బంగ్లాదేశ్ను చిత్తు చేసిన శ్రీలంక
రెండు మ్యాచ్ల టెస్ట సిరీస్లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో పర్యాటక శ్రీలంక 328 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ధనంజయ డిసిల్వ (102, 108), కమిందు మెండిస్ (102, 164) రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాది శ్రీలంకను గెలిపించారు. వీరికి బౌలర్లు కసున్ రజిత (3/31, 5/56), విశ్వ ఫెర్నాండో (4/48, 3/36), లహిరు కుమార (3/31, 2/39) తోడవ్వడంతో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్, నహిద్ రాణా తలో 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లంక బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. 92 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. డిసిల్వ, మెండిస్ మరోసారి శతక్కొట్టడంతో 418 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మీరజ్ 4, నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం చెరో 2, షోరీఫుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ పేలవ ప్రదర్శనను పునరావృతం చేసి 182 పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (87 నాటౌట్) చివరి వరకు ఒంటి పోరాటం చేశాడు. రెండో టెస్ట్ మార్చి 39 నుంచి ప్రారంభంకానుంది. -
గెలుపు దిశగా శ్రీలంక
సిల్హెట్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం దిశగా పయనిస్తోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 119/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 110.4 ఓవర్లలో 418 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ధనంజయ డిసిల్వా (108; 9 ఫోర్లు, 2 సిక్స్లు), కామిందు మెండిస్ (164; 16 ఫోర్లు, 6 సిక్స్లు) అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్లోనూ శతకాలు బాది చరిత్ర పుటల్లోకి ఎక్కారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే టెస్టులో ఇద్దరు బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీలు చేయడం ఇది మూడోసారి. గతంలో 1974లో న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా బ్యాటర్లు ఇయాన్ చాపెల్ (145, 121), గ్రెగ్ చాపెల్ (247 నాటౌట్, 133)...2014లో అబుదాబిలో ఆ్రస్టేలియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్లు మిస్బా ఉల్ హక్ (101, 101 నాటౌట్), అజహర్ అలీ (109, 100 నాటౌట్) ఈ ఘనత సాధించారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement