-
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్బీఎన్బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవి బయోపిక్కు అనుమతి ఇవ్వను
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్లో అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు. ‘‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ను తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాతో బోనీ కపూర్ మాట్లాడినట్లుగా బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’కు బోనీ కపూర్ ఓ నిర్మాత. ఈ నెల 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా శ్రీదేవి బయోపిక్ ప్రస్తావన వచ్చినప్పుడు బోనీ పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్లో మరణించిన సంగతి తెలిసిందే. -
శ్రీదేవిపై ఫీలింగ్స్.. అమ్మకు తెలిసి రాఖీ తీసుకొచ్చింది: నిర్మాత
దివంగత నటి శ్రీదేవి.. ఈమె అందాన్ని ఆరాధించినవాళ్లెందరో! నిర్మాత బోనీ కపూర్ సైతం శ్రీదేవిని చూడగానే ప్రేమలో పడిపోయాడు. మనసులో తన పేరు లిఖించుకున్నాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయింది. అతడి భార్య పేరు మోనా షౌరీ. ఈ జంటకు అర్జున్, అన్షులా కపూర్ సంతానం. బోనీ ప్రేమ విషయం భార్యకు కూడా తెలుసు. దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవిని ఐదారేళ్లపాటు ఆరాధించాను. నా ప్రేమ విషయం నా భార్యకు సైతం తెలుసు. అబద్ధాలు చెప్పి తనను మోసం చేయాలనుకోలేదు. శ్రీదేవిని పెళ్లాడటానికి ముందు కూడా ఆమెను నా భార్య ఇంట్లోనే ఉంచాను. రాఖీ కట్టించాలని చూసింది శ్రీదేవిపై నాకున్న ఫీలింగ్స్ మా అమ్మ పసిగట్టేసింది. రాఖీ పండుగ రోజు పెద్ద పళ్లెంలో అక్షింతలు, రాఖీ పెట్టి తీసుకొచ్చి శ్రీదేవికి ఇచ్చి నాకు రాఖీ కట్టమని చెప్పింది. ఆమె వెంటనే తన గదిలోకి వెళ్లింది. నువ్వేం బాధపడకు, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్లేటు నీ గదిలోనే ఉంచమని చెప్పాను. అసలు నాకు రాఖీ ఎందుకు కట్టమని చెప్పిందో తనకేం అర్థం కాలేదు' అని నవ్వేశాడు. కాగా బోనీ తన మొదటి భార్య మోనాకు 1996లో విడాకులిచ్చాడు. అదే ఏడాది జూన్ 2న శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: బాడీ షేమింగ్.. ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: హీరోయిన్ -
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. మళ్లీ కనిపిస్తే బాగుండు!
మంజుల-విజయ్ కుమార్ల వారసురాలిగా వెండితెరపై మెరిసిన ముద్దుగుమ్మ శ్రీదేవి విజయ్కుమార్. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తెలుగులో 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్గా నటించింది. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్ లాంటి చిత్రాల్లోను కనిపించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అయితే ప్రభాస్కు మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి ప్రస్తుతం టీవీ షోల్లో సందడి చేస్తోంది. అయితే ప్రభాస్కు జంటగా నటించిన ఈశ్వర్ చిత్రం 2002లో రిలీజైంది. ఈ మూవీ విడుదలై దాదాపు 22 ఏళ్లు అవుతోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినా.. వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. తాజాగా వీరిద్దరిపై ఓ అభిమాని చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈశ్వర్ సినిమా రిలీజై 22 ఏళ్లు అవుతున్నా ఇద్దరు ఏమాత్రం గ్లామర్ తగ్గలేదు.. రాబోయే ప్రభాస్ అన్నయ్య సినిమాల్లో ఏదో ఒక రోల్ చేస్తే బాగుండు అని రాసుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే శ్రీదేవి పెళ్లి తర్వాత దాదాపు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడని వెల్లడించింది. ప్రస్తుతం టీవీ షోల్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది ముద్దుగుమ్మ. Prabhas 1st Heroine #SrideviVijayKumar ❤️🔥 Eeshwar release ayyi 22 years ayna still they both look good together 😍#Prabhas Anna future movies lo edho okka chinna role lo ayna kanapadithe bagundu ❤️#Kalki2898AD #Spirit #TheRajaSaab pic.twitter.com/o3Hhm7Ne8l — Ayyo (@AyyAyy0) March 29, 2024 -
ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
వాలెంటైన్ డే మూడ్లో రష్మిక.. బ్లాక్ డ్రెస్లో నిహారిక లుక్స్ వైరల్!
వాలెంటైన్ డే ప్లాన్ చెప్పమంటోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. బ్లూ కలర్ శారీలో శ్రీదేవి స్మైలీ లుక్స్.. బ్లాక్ డ్రెస్లో నిహారిక డిఫరెంట్ లుక్స్.. చిన్ననాటి పుస్తకాల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటోన్న సామ్ బాలీవుడ్ భామ మౌనీ రాయ్ పోజులు View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) -
ఈమె ఒకప్పటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడేమో ఫ్యాషన్ డిజైనర్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. మంచి మంచి హిట్ సినిమాలు చేసింది. జస్ట్ ఐదేళ్లలో ఏకంగా 30 సినిమాలు చేసింది. కానీ ఏమైందో ఏమో సడన్గా యాక్టింగ్ కెరీర్కి టాటా చెప్పేసింది. అయితే ఈమె పేరు చెబితే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. అలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా గుర్తొస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మహేశ్వరి. గుర్తొచ్చిందా? అవును మీరనుకున్న బ్యూటీనే. అతిలోక సుందరి శ్రీదేవికి ఈమె బంధువు అవుతుంది. అంటే ఈమె.. శ్రీదేవి అక్కకు పుట్టిన కూతురు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేశ్వరి.. 1994లో ఇండస్ట్రీలోకి వచ్చింది. తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చాలావరకు తెలుగు చిత్రాలే చేసింది. ఈమె చేసిన వాటిలో 'పెళ్లి', గులాబీ, దెయ్యం లాంటి హిట్ సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో అకస్మాత్తుగా నటన పూర్తిగా పక్కనబెట్టేసింది. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) 1994-2000 వరకు దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన మహేశ్వరి.. యాక్టింగ్ పక్కనబెట్టేసిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉంది. అలా 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక 2010లో సీరియల్ యాక్టర్గా కెరీర్ షురూ చేసింది. ఓ నాలుగేళ్లు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన తర్వాత దాన్ని కూడా పక్కనబెట్టేసింది. ఇక ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం మహేశ్వరి.. ఫ్యాషన్ డిజైనర్గా డిఫరెంట్ కెరీర్ని ఎంచుకుంది. హైదరాబాద్లో ఈమెకు ఓ స్టోర్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్తో మహేశ్వరి అప్పుడప్పుడు కనిపిస్తోంది. వరసకు వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు అవుతారు. కానీ మహేశ్వరి ఒకప్పుడు హీరోయిన్ కాగా.. జాన్వీ మాత్రం ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అమ్మ నన్ను తిట్టేది:జాన్వీ కపూర్
దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయేది.. పక్కింటి అమ్మాయిగా కనిపించేది, కల్మషం లేని నవ్వుతో కవ్వించేది.. అమ్మాయిలు అసూయ చెందేలా అందంతో అల్లాడించేది.. కంటిచూపుతో చంపడం, నవ్వుతుంటే ముత్యాలు రాలడం ఈమె విషయంలో నిజమయ్యేది.. ఆవిడే అందాల తార శ్రీదేవి. ఈమె తల్లిది తిరుపతి.. తండ్రిది తమిళనాడులోని శివకాశి. దీంతో చిన్నప్పటినుంచే తెలుగు, తమిళ భాషల్లో శ్రీదేవి అనర్గళంగా మాట్లాడేది. కాందన్ కరుణై అనే తమిళ చిత్రంతో ఈమె బాలనటిగా మారింది. మా నాన్న నిర్దోషి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హీరోల కంటే ఎక్కువ పారితోషికం తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో బాలనటిగా, హీరోయిన్గా మెప్పించింది. రజనీకాంత్, కమల్ హాసన్, అంబరీష్, కృష్ణ, నందమూరి తారక రామారావు, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, అమితాబ్ బచ్చన్, జితేంద్ర, రాజేశ్ ఖన్నా, అనిల్ కపూర్.. ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ఒకానొక దశలో హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. 1996లో నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడింది. బోనీకి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సంతానం. దొంగతనం చేసి దొరికిపోయేదాన్ని జాన్వీ ఇప్పటికే హీరోయిన్గా క్రేజ్ సంపాదించగా ఖుషీ ఈ మధ్యే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మ గదికి వెళ్లి తన లిప్స్టిక్లు దొంగిలించి జేబు నిండా నింపుకునేదాన్ని. అమ్మ నన్ను ఆపి నీ జేబు చూపించు అని అడిగేది. నేనేమో ఏమీ తెలియనట్లు జేబులో ఏం లేదమ్మా.. అని అబద్ధం చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ.. నా కొడకా.. అని తిట్టేది. తను ఎప్పుడూ అలాగే తెలుగులో తిడుతూ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఎంత క్యూట్గా తిట్టిందో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా జాన్వీ.. దేవర సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయం కానుంది. Naa Kodaka... 😁 pic.twitter.com/dReIBc6Urw — Imho (@Artoo_Detwo) January 3, 2024 చదవండి: సామ్కు బాలీవుడ్లో ఆఫర్.. ఊ అంటుందా? ఉఊ అంటుందా? -
అమ్మ చనిపోయిన కాసేపటికే ఏడుపు ఆపేశా: శ్రీదేవి చిన్నకూతురు
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్- దివంగత హీరోయిన్ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ 2018లో 'ధడక్' సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. అటు జాన్వీ సోదరి ఖుషీ కపూర్ ఈ మధ్యే 'ద ఆర్చీస్' చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా వీరిద్దరూ హాట్స్టార్లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మ చనిపోయిన క్షణాలని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. 'నాకు బాగా గుర్తుంది. నేను నా గదిలో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఇంతలో ఖుషి ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. ఓపక్క రోదిస్తూనే తన గదిలోకి వెళ్లాను. అప్పుడు ఖుషి నన్ను చూడగానే ఏడుపు ఆపేసింది. తను నా పక్కనే కూర్చుని నన్ను ఓదార్చడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తను కన్నీళ్లు పెట్టుకోవడం నేను చూడనేలేదు' అని చెప్పుకొచ్చింది. ఖుషీ మాట్లాడుతూ.. 'నేను కన్నీళ్లను ఆపుకోవాలని చూశాను. ఎందుకంటే అందరూ నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. అందుకే ఏడవకూడదని బలంగా ఫిక్సయ్యాను' అని చెప్పుకొచ్చింది. కాగా అందాల తార శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో కన్నుమూసింది. చదవండి: హీరో కూతురి పెళ్లి.. 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వెళ్లిన వరుడు -
దివంగత శ్రీదేవి చిన్నకూతురు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
దివంగత నటి శ్రీదేవి లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికే పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా దూసుకుపోతుంది. బాలీవుడ్తో పాటు తాజాగా టాలీవుడ్లోనూ జాన్వీ గ్రాండ్గా అరంగేట్రం చేసింది. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్ ‘ద ఆర్చీస్’ మూవీతో బీటౌన్లో గ్రాండ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్లో ఖుషీ ధరించిన డ్రెస్ అండ్ జ్యువెలరీ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమాలు చేయకపోయినా శ్రీదేవి కూతురిగా, ఫ్యాషన్ ఐకాన్గా ఖుషీ కపూర్కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా తన తొలి డెబ్యూ సందర్భంగా ఖుషీ అరుదైన డ్రెస్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆమె కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తల్లికి నివాళులు అర్పిస్తూ శ్రీదేవి ఐకానిక్ గౌను ధరించి తళుక్కున మెరిసింది ఖుషీ. గతంలో ఇదే డ్రెస్ను దివంగత శ్రీదేవి 2013 ఐఫా అవార్డు ప్రధానోత్సవంలో ధరించింది. ఇప్పుడు ఖుషీ సైతం అదే డ్రెస్ను రిపీట్ చేసింది. దీంతో పాటు తల్లి ధరించిన డైమండ్ చోకర్నే వేసుకొని దేవకన్యలా మెరిసిపోయింది. కాగా ఆర్చీస్లో ఖుషి కపూర్తో పాటు సుహానా ఖాన్, వేదాంగ్ రైనా, అగస్త్య, మిహిర్ అహుజా, యువరాజ్ మెండాలు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు స్టార్ కిడ్స్ ఉండటంతో ది ఆర్చీస్పై ఇప్పటికే హైప్ నెలకొంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చిన్నారి శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది.. గతంలో చంద్రమోహన్ పంచుకున్న విశేషాలు
చంద్రమోహన్ మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్న చంద్రమోహన్.. నేడు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. అనారోగ్యంతో శనివారం (నవంబర్ 11) తుది శ్వాస విడిచారు. తన 55 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్ని చేశారు.వారిలో దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూడా ఉన్నారు. ఆమె గురించి గతంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు చంద్రమోహన్. శ్రీదేవి మరణించిన రోజు(2018) ‘సాక్షి’తో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు చంద్రమోహన్ శ్రీదేవి గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే .. (ఇది 2018లో శ్రీదేశి మరణించిన రోజు చంద్రమోహన్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ) శ్రీదేవిగారికి తెలుగులో మీరు ఫస్ట్ హీరో. ‘పదహారేళ్ల వయసులో’ మీ ఇద్దరు జంటగా చేసినప్పటి జ్ఞాపకాలు పంచుకుంటారా? చంద్రమోహన్: ఆ సినిమాకి శ్రీదేవిని హీరోయిన్గా తీసుకుందామని అనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కానీ కమల్హాసన్తో ఇదే సినిమాలో తమిళంలో బాగా చేసిందని రాఘవేంద్రరావుగారు కన్విన్స్ చేశారు. నాక్కూడా శ్రీదేవితో చేయడానికి అభ్యంతరం అనిపించలేదు. తననే కథానాయికగా తీసుకున్నాం. బ్రహ్మాండంగా నటించింది. హీరోయిన్గా అందనంత దూరం వెళ్లిపోయింది. ఆమె చైల్డ్ ఆర్టిస్ట్గా మీతో ఒక సినిమా చేసినట్లున్నారు? అవును. ‘యశోద కృష్ణ’ సినిమాలో చిన్ని కృష్ణుడు పాత్ర చేసింది. ఆ సినిమాలో నేనేమో నారదుడి పాత్ర చేశాను. అప్పుడు శ్రీదేవికి ఏడెనిమిదేళ్లు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే చాలా క్రమశిక్షణగా ఉండేది. చాలా ముచ్చటేసేది. బిస్కెట్లు తింటూ కూర్చునేది. నా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన తను ఆ తర్వాత మూడేళ్లకు నా పక్కన హీరోయిన్ (‘పదహారేళ్ల వయసులో)గా చేస్తుందని మాత్రం ఊహించలేదు. అయితే ‘యశోద కృష్ణ’ సినిమా చేస్తున్నప్పుడు తను పెద్ద స్థాయికి వెళుతుందనుకున్నాను. (చదవండి: నటుడు చంద్రమోహన్ మృతికి కారణాలివే!) బాలనటిగా ఆమె మీ సినిమాలో చేసినప్పుడు జరిగిన సంఘటనలేమైనా గుర్తు చేసుకుంటారా? ‘యశోద కృష్ణ’ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి వేరే తమిళ సినిమా ఒప్పుకుంది. మర్నాడు మద్రాసు వెళ్లాలి. ట్రైన్ టికెట్స్ దొరకలేదు. అప్పట్లో మేం మద్రాసులో ఉండేవాళ్లం. నా షెడ్యూల్ కంప్లీట్ అయిపోవడంతో నా కారులో శ్రీదేవిని తీసుకు రావడానికి వీలు పడుతుందా? అని ఆమె అమ్మగారు అడగడంతో సరే అన్నాను. దాదాపు 14 గంటలు జర్నీ చేశాం. ఆ ప్రయాణంలో శ్రీదేవి నా ఒళ్లో నిద్రపోయింది. జాగ్రత్తగా వాళ్ల అమ్మకు అప్పజెప్పాను. (చదవండి: హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!) మీతో సినిమా చేయకముందు నుంచే శ్రీదేవిగారి కుటుంబంతో మీకు పరిచయం ఉందా? మద్రాసు టీ నగర్లో మావి పక్క పక్క ఇళ్లే. మా పిల్లలతో శ్రీదేవి ఆడుకునేది. వాళ్ల అమ్మగారికి కూతుర్ని పెద్ద హీరోయిన్ని చేయాలని ఉండేది. అమ్మ కలని కూతురు నెరవేర్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. హిందీలో చాలా బాగా సక్సెస్ అయిన మన తెలుగు పిల్ల అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరి శ్రీదేవి. తనలా ఎవరూ ఉండరు. పుట్టరు. శ్రీదేవి శ్రీదేవే. మీ పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా ఆ తర్వాత స్టార్ అవుతారనే సెంటిమెంట్ శ్రీదేవిగారి విషయంలో కూడా నిజమైంది కదా? అప్పట్లో ఆ సెంటిమెంట్ ఉండేది. ‘పదహారేళ్ల వయసులో’ సూపర్ డూపర్ హిట్టయి శ్రీదేవికి చాలా మంచి పేరొచ్చింది. అప్పుడు తన అమ్మగారు ‘చంద్రమోహన్గారి సినిమాతో హీరోయిన్గా మా అమ్మాయి అరంగేట్రం అయింది. స్టార్ అయిపోయింది’ అనేవారు.జయప్రద, జయసుధ.. ఇలా చాలామంది హీరోయిన్లకు ఆ సెంటిమెంట్ని ఆపాదించారు. ‘నాదేం లేదు.. అంతా మీ స్వయంకృషి’ అనేవాణ్ణి. విశేషం ఏంటంటే... తన భర్త బోనీకపూర్కి నన్ను పరిచయం చేసినప్పుడు ‘నా ఫస్ట్ హీరో’ అని చెప్పింది. ఓసారి నా తెలుగు సినిమా షూటింగ్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి చేస్తున్న సినిమా షూటింగ్ పక్క పక్కనే జరిగాయి. అప్పుడు అమితాబ్కి ‘నా ఫస్ట్ హీరో. లక్కీ హీరో’ అని నన్ను పరిచయం చేసింది. ‘పదహారేళ్ల వయసులో’ తమిళ మాతృకలో కమల్హాసన్గారు చేశారు. ఎప్పుడైనా నటనపరంగా మీ ఇద్దరికీ శ్రీదేవిగారు పోలిక పెట్టారా? ఆ సినిమా విజయోత్స వేడుకలో నాకన్నా చంద్రమోహన్గారు బాగా చేశారు అని కమల్హాసన్ అన్నారు. ‘నేను తప్ప ఆ క్యారెక్టర్ని వేరే ఎవరూ బాగా చేయలేరనుకున్నా. ఆ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. చంద్రమోహన్గారు గొప్పగా నటించారు’ అని కమల్గారు అన్నారు. శ్రీదేవి కూడా ఆ మాటే అంది. వాస్తవానికి ‘స్వాతిముత్యం’ సినిమాలో నేనే చేయాల్సింది. ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ‘పదహారేళ్ల వయసు’ క్యారెక్టర్లానే ఉంటుంది. అయితే ఆ సినిమాని తమిళ్లో కూడా ప్లాన్ చేశారు. అక్కడ కమల్గారికి మార్కెట్ ఉంది కాబట్టి, బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో ఆయనతో చేయించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. నటిగా శ్రీదేవిగారిలో ఉన్న మంచి లక్షణాల గురించి? నేను భానుమతిగారు, సావిత్రిగార్లతో సినిమాలు చేశాను. వాళ్లు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ విషయంలో కూడా రాజీపడేవారు కాదు. ఆ లక్షణాలను శ్రీదేవిలో చూశాను. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అమ్మాయిలు ఆ తర్వాత శ్రీదేవి స్థాయిలో హీరోయిన్లుగా సక్సెస్ కాలేకపోయారు. శ్రీదేవి గొప్ప నటి. ఎన్టీఆర్, ఏయన్నార్, కమల్హాసన్, రజనీకాంత్.. ఇలా ఎవరి పక్కన చేసినా తన నటన ప్రత్యేకంగా ఉండేది. ఆడియన్స్ తననే చూసేంత గొప్పగా నటించేది. అందుకే అన్ని లాంగ్వేజెస్లో రాణించగలిగింది. చివరిసారిగా మీరు ఆమెను ఎప్పుడు కలిశారు? వైజాగ్లో జరిగిన టీయస్సార్ అవార్డు ఫంక్షన్లో కలిశాం. అప్పుడు సన్నిహితులెవరో ‘నీ ఫస్ట్ హీరోయిన్ వచ్చారు’ అంటే, ‘నా ఫస్ట్ హీరో వచ్చారు’ అని శ్రీదేవి నా దగ్గరకు నవ్వుతూ వచ్చింది. ఎంత స్టార్ అయినా తనలో ఎప్పుడూ నేను భేషజం చూడలేదు. నటిగా అందనంత దూరానికి వెళ్లింది. ఇప్పుడు కూడా అందనంత దూరానికి వెళ్లింది. క్షణాల్లో మిస్సయిసోయింది. అని చద్రమోహన్ ఎమోషనల్కు గురయ్యారు. -
హీరోయిన్లకు లక్కీ బోణీ.. ఆయనతో నటిస్తే చాలు స్టార్స్ అయిపోతారు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ని ఆరంభించి.. హీరోగా పదుల సంఖ్యలో సినిమాలు తీసి మెప్పించిన సీనియర్ నటుడు చంద్రమోహన్. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్..ఇలా ఏ పాత్రలో అయినే ఒదిగిపోయే దిగ్గజ నటుడాయన. 55 ఏళ్ల తన సినీ కెరీర్ లో 932 సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. (చదవండి: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత) ♦ఇప్పటి తరానికి చంద్రమోహన్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే తెలుసు కానీ.. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో. ఆయనతో నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించేవారు. అతన్ని నిర్మాత హీరో అనేవాళ్లు. ఎందుకంటే ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువశాతం విజయవంతం అయినవే. అందుకే నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. ఒకే ఏడాదిలో మూడు నాలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. ♦ చంద్రమోహన్పై ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన్ను హీరోయిన్లకు లక్కీ హ్యాండ్ అనేవాళ్లు. ఎందుకంటే ఆయనతో కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ స్టార్ అయిపోతుంది. అందుకే చాలా మంది హీరోయిన్లు చంద్రమోహన్తో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. ♦ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్ హీరో. జయప్రద హీరోయిన్. అప్పటి వరకు జయప్రదకు గుర్తింపు లేదు. కానీ ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ♦దివంగత నటి శ్రీదేవి తొలి హీరో కూడా చంద్రమోహన్గారు. ‘పదహారేళ్ల వయసు’చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ చిత్రం తర్వాత శ్రీదేవి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్తో చేదు అనుభవం.. కానీ మంచే జరిగింది ♦ జయసుధకు కూడా చంద్రమోహన్ సినిమాతోనే స్టార్డమ్ వచ్చింది. 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి భళే కాపురం, స్వర్గం, శ్రీమతి ఒక బహుమతి తదితర చిత్రాల్లో నటించారు. ♦ లేడి మెగాస్టార్ విజయశాంతి సైతం...చంద్రమోహన్తో నటించిన తర్వాతే స్టార్గా ఎదిగింది. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు. ఆ తర్వాత విజయశాంతికి వరుసగా అవకాశాలు లభించాయి. వీరిద్దరు కాంబోలో వచ్చిన ‘ప్రతి ఘటన’ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇలా చాలామంది హీరోయిన్లను స్టార్స్ చేస్తూ..‘లక్కీ హ్యాండ్’గా పేరు సంపాదించుకున్నాడు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న శ్రీదేవి'
ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించిన అందాల తార శ్రీదేవి. ఆమె మరణించినా నేటికి శ్రీదేవి పేరు చిరస్మరణీయం. భారతీయ దిగ్గజ నటీమణులలో ఒకరిగా శ్రీదేవి పరిగణించబడ్డారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా మెరిసిన శ్రీదేవి 1990ల చివరలో నటనకు విరామం తీసుకుంది. ఆ తర్వాత 2012 మళ్లీ ఇంగ్లీష్ వింగ్లీష్తో ఆమె పవర్-ప్యాక్డ్ పునరాగమనం చేసింది. ఈ చిత్రంలో శ్రీదేవికి సహనటుడిగా నటించిన ఆదిల్ హుస్సేన్ ఇటీవల పలు ఆసక్తకరమైన విషయాలు పంచుకున్నాడు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవిని ఆదిల్ గుర్తుచేసుకున్నాడు. ఆమెతో పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె నటించిన సద్మా చిత్రం తనకు గుర్తుకు వచ్చిందట. వేశ్యాగృహంలో చిక్కుకున్న నేహలతగా శ్రీదేవి నటన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆ చిత్రం తనపై ఎంత ప్రభావం చూపిందని, సినిమా చూసిన తర్వాత కొన్ని రోజులుగా తాను తినలేకపోయానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 'మొదటగా డైరెక్టర్ గౌరీ షిండేనే నన్ను శ్రీదేవికి పరిచయం చేశారు. అప్పుడు ఆమె తన పెద్ద అందమైన కళ్లతో నన్ను చూసింది. సద్మా సినిమా చూసిన తర్వాత నేను ఏమీ తినలేను అని నేను ఆమెకు మొదట చెప్పాను. శ్రీదేవిని చూడగానే అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడు నా మాటలు విన్న తర్వాత, ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి.. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆమె కొద్దిగా మృదువైన తడి కళ్లు కలిగి ఉంది. అలా చాలా సమయం తర్వాత మేము రిహార్సల్స్కు వెళ్లాము.' అని చెప్పాడు. మెరిల్ స్ట్రీప్తో సమానంగా శ్రీదేవి: ఆదిల్ హుస్సేన్ శ్రీదేవిని హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్తో పోలుస్తూ.. ఆమె 'చాలా సెన్సిటివ్' అని పాశ్చాత్య దేశాల మాదిరిగానే ఆమెకు కథలు ఆఫర్ చేసి ఉంటే, శ్రీదేవికి ఆస్కార్ లభించేదని అన్నారు. ఇంగ్లిష్ వింగ్లీష్ గౌరీ షిండే రచించి దర్శకత్వం వహించింది. 2012లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని సాధించింది. శ్రీదేవి, జాన్వీ కపూర్ల మధ్య పోలికలు శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ఉన్న సారూప్యత గురించి కూడా ఆదిల్ వివరించాడు. జాన్వీ తన తన తల్లి నుంచి చాలా "గుణాలను" వారసత్వంగా పొందిందని చెప్పాడు. "శ్రీదేవిని మరోకరు మ్యాచ్ చేయడం చాలా కష్టమైన పని.. కానీ జాన్వీ కష్టపడి పనిచేస్తే శ్రీదేవికి దక్కినంత గౌరం, పేరు తప్పకుండా వస్తాయి. జాన్వీలో ఆ టాలెంట్ ఉంది. కచ్చితంగా భవిష్యత్లో ఆమె భారత వెండితెరపై తిరుగులేని రాణిలా గుర్తింపు పొందుతుందని ఆదిల్ తెలిపాడు. టాలీవుడ్లో జూ.ఎన్టీఆర్ సరసన దేవరలో జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. -
నటి శ్రీదేవి విజయ్కుమార్ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే!
శ్రీదేవి ఆ పేరు వింటే చాలు. తనదైన అందంతో వెండితెరపై అలరించింది. అటు బాలీవుడ్.. ఇటు దక్షిణాది సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అప్పట్లోనే తన స్టార్ డమ్తో సినీ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. కేవలం ఆమెను తెరపై చూడటానికి మాత్రమే అభిమానులు థియేటర్లకు వచ్చేవారట. నటిగా అత్యంత అభిమానుల ఆదరణ దక్కించుకున్న నటి అనూహ్యంగా 2018 ఫిబ్రవరిలో దుబాయ్లోని ఓ హోటల్ గదిలో మరణించింది. (ఇది చదవండి: ప్రభాస్ బర్త్డే నాడు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా..?) హీరోల కంటే ఎక్కువ పారితోషికం శ్రీదేవి నటించే రోజుల్లో బాలీవుడ్లో మహిళా నటీనటుల పారితోషికం.. పురుషుడి కంటే చాలా తక్కువ ఉండేది. కానీ శ్రీదేవి మాత్రం చాలా మంది స్టార్ నటుల కంటే ఎక్కువ రుసుము వసూలు చేసే నటిగా నిలిచింది. అప్పట్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశంలోనే ఒక చిత్రానికి కోటి రూపాయలు వసూలు చేసిన మొట్టమొదటి నటిగా పేరు సంపాదించింది. అప్పట్లో కొంతమంది మేల్ ఆర్టిస్టులు కూడా అంత డబ్బు సంపాదించేవారు కాదట. అప్పట్లో శ్రీదేవిని ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అని కూడా పిలిచేవారట. అంతే కాదు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాలకు ఆమె సంతకం ఇంటి వద్దే వరుసలో ఉండేవారట. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్స్టార్ కూడా శ్రీదేవితో పనిచేయడానికి భయపడేవారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్, శ్రీదేవి జంటగా 'చంద్రముఖి', 'చంద్ కా తుక్డా' అనే రెండు చిత్రాలలో నటించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఐదు దశాబ్దాల తన సినీ కెరీర్లో శ్రీదేవి అలాంటి ఎన్నో పాత్రలు పోషించారు. కాగా.. ఆమె చివరిసారిగా 'మామ్' చిత్రంలో తెరపై కనిపించింది. (ఇది చదవండి: బూతులు బిగ్ బాస్లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ) -
షూటింగ్ టైంలో ఆమె నాకు వార్నింగ్ ఇచ్చింది
-
పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందా?.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
అలనాటి అందాల నటి శ్రీదేవి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత బోనీ కపూర్ను పెళ్లాడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శ్రీదేవి భర్త బోనీ కపూర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జాన్వీ కపూర్ పుట్టిన రోజుపై వస్తోన్న రూమర్స్పై ఆయన స్పందించారు. (ఇది చదవండి: వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?) గతంలో కూడా జాన్వీకపూర్ కూడా వారికి పెళ్లికి ముందే పుట్టారని వార్తలొచ్చాయి. అయితే బోనీ కపూర్ తాజాగా ఇంటర్వ్యూలో ఆ వార్తలపై నోరు విప్పారు. ఆ రూమర్స్ ఎలా వచ్చాయో స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే శ్రీదేవి-బోనీ కపూర్ వివాహంపై ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ మాట్లాడుతూ..'నేనూ శ్రీదేవి 1996లో షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నాం. కొద్ది నెలలకే మా పెళ్లి విషయాన్ని బయటికి చెప్పాం. ఆ తర్వాత 1997లో జనవరిలో మరోసారి అందరి సమక్షంలో పెళ్లిచేసుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాం కూడా. మాకు జాన్వీ కపూర్ 1997 మార్చిలో పుట్టింది. అయితే జాన్వీ మా పెళ్లికి ముందే పుట్టిందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అవీ ఇప్పటీకీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. తన పుట్టినరోజు గురించి స్వయంగా నేను చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు' అంటూ వెల్లడించారు. అలాగే శ్రీదేవికి దైవభక్తి ఎక్కువని అన్నారు. తన పుట్టినరోజున కచ్చితంగా తిరుమల వెళ్లేవారని తెలిపారు. (ఇది చదవండి: 'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!) -
శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!
అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు శ్రీదేవి. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ.. కొన్ని దశాబ్దాల పాటు మన దేశవ్యాప్తంగా సినిమాలకు మకుటం లేని మహారాణిగా పేరు సంపాదించింది. పెళ్లి-ఫ్యామిలీ కోసం కొన్నాళ్లకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి.. రెండో ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. కానీ 2018లో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో అభిమానులకు లెక్కలేనన్ని అనుమానాలు. ఇప్పుడు ఆ సంఘటన గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్రీదేవి భర్త బోనీ కపూర్. ఏం జరిగింది? 2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, తన ఫ్యామిలీతో కలిసి దుబాయి వెళ్లింది. అయితే బాత్టబ్లో జారిపడి చనిపోయిందన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమె ప్రమాదవశాత్తూ మృతి చెందడంతో చాలామంది బోనీ కపూర్ని అనుమానించారు. కానీ ఇన్నాళ్లుగా ఆ సంఘటన గురించి పెద్దగా తలుచుకోని ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) బోనీ ఏం చెప్పారు? 'స్క్రీన్పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుండేది. మా పెళ్లి తర్వాత ఈ విషయం నాకు తెలిసింది. ఉప్పు లేకుండా భోజనం చేసేది. దీంతో చాలాసార్లు నీరసించి కింద పడిపోయేది. లో-బీపీ సమస్య ఉందని, జాగ్రత్తగా ఉండమని ఆమెని డాక్టర్స్ ఎంతగానే చెప్పారు. కానీ అస్సలు సీరియస్గా తీసుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు చనిపోయింది' 'దీంతో దుబాయి పోలీసులు నన్ను ఓ రోజంతా విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా నన్ను అన్ని విధాల పరీక్షిస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్నిరోజులు తర్వాత నాగార్జున ఓసారి కలిశారు. డైట్ కారణంగా ఓసారి సెట్లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు' అని బోనీ కపూర్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో రతిక రెమ్యునరేషన్ ఎన్ని లక్షలో తెలుసా?) -
శ్రీదేవి అంటే నాకు చాలా గౌరవం : రామానాయుడు
-
చిరంజీవి, శ్రీదేవి సినిమా ఎందుకు చేయలేదు అంటే..!
-
కోలీవుడ్ కబురు?
దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్కు కోలీవుడ్ నుంచి కబురు వెళ్లిందట. తమిళ నటుడు అథర్వ హీరోగా ఆకాష్ అనే కొత్త దర్శకుడు ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఖుషీ కపూర్ను సంప్రదించిందట చిత్ర యూనిట్. ఖుషీకి ఈ కథ నచ్చిందని, ఆమె దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ సినీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఖుషీ కపూర్ నటించే తొలి తమిళ సినిమా ఇదే అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘పయ్యా (‘ఆవారా’)’ సినిమాకు సీక్వెల్గా ‘పయ్యా 2’ రానుందని, ఇందులో ఆర్య హీరోగా నటిస్తారని, ఖుషీ కపూర్ హీరోయిన్గా ఎంపికయ్యారనే టాక్ గతంలో కోలీవుడ్లో వినిపించింది. అయితే ‘పయ్యా 2’ సీక్వెల్లో ఖుషీ కపూర్ నటిస్తుందనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక హిందీలో ‘ఆర్చీస్’ అనే వెబ్ ఫిల్మ్లో ఖుషీ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. -
'శ్రీదేవి చనిపోయినా రాని సొంత చెల్లెలు'... అసలు కారణం అదేనా!
అతిలోకసుందరి అనగానే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీదేవి. జగదేకవీరుడు-అతిలోక సుందరి చిత్రంలో తన అమాయకపు మాటలతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో స్టార్ హీరోలందరితో పాటు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. అప్పటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే శ్రీదేవికి ప్రత్యేకస్థానం ఉంటుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. సినీ కెరీర్లో తెలుగు ప్రేక్షకులు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!) అయితే తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో శ్రీదేవి జన్మించారు. రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వీరిలో శ్రీదేవి పెద్దకూతురు. అయితే ఆమె సోదరి శ్రీలత గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే శ్రీదేవిలాగా ఆమె సినిమాల్లోకి రాలేదు. అయితే ఏ సినిమా సెట్కు వెళ్లినా అక్కతో పాటే కనిపించేవారు. తల్లి రాజేశ్వరితో పాటు, శ్రీలత కూడా శ్రీదేవితో పాటే ఉండేవారు. శ్రీలత దాదాపు 1972 నుంచి 1993 వరకు సినిమా సెట్స్లో శ్రీదేవితో పాటు వెళ్లేవారు. అలా 21 ఏళ్ల పాటు అక్క సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచారు. అప్పట్లో వీరి కుటుంబం తమిళనాడులో శివకాశిలో ఉండేది. శ్రీదేవి కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమా సెట్స్లో శ్రీలత కనిపించారు. శ్రీలత కూడా శ్రీదేవి లాగే నటి కావాలనుకుంది. కానీ ఆమె ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత శ్రీదేవికి మేనేజర్గా మారింది. తల్లి మరణంతో విభేదాలు అయితే శ్రీదేవి తల్లి రాజేశ్వరి మరణం వారి మధ్య దూరాన్ని పెంచింది. తల్లి మరణంతో ఇద్దరు సోదరీమణుల మధ్య విభేదాలు పెరిగాయి. శ్రీదేవి తల్లి అనారోగ్యంతో ఉండగా ఒకసారి ఆపరేషన్ చేయించాలని ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో డాక్టర్ చేసిన తప్పుకు ఆమె తల్లి జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేక రాజేశ్వరి 1996లో మరణించింది. దీంతో శ్రీదేవి ఆసుపత్రిపై కేసు పెట్టవలసి వచ్చింది. ఈ కేసులో చివరికీ శ్రీదేవిని గెలిచింది. తల్లి మరణంతో పరిహారంగా రూ.7.2 కోట్లు పొందింది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్ ) డబ్బుల కోసం కేసులు ఆస్పత్రి పరిహారంగా చెల్లించిన రూ.7.2 కోట్లు శ్రీదేవి తన వద్దే ఉంచుకుందని సోదరి శ్రీలత ఆరోపించింది. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శ్రీలత తన వాటా డబ్బుల కోసం శ్రీదేవిపై కోర్టులో కేసు కూడా వేసింది. తన తల్లి మానసిక పరిస్థితి బాగా లేదని.. అందుకే తన ఆస్తి మొత్తాన్ని శ్రీదేవికి బదిలీ చేసిందని ఆరోపించింది. శ్రీలత ఈ కేసులో గెలిచి తన వాటాగా రూ.2 కోట్లు దక్కించుకుంది. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం అక్కా, చెల్లెల్ల బంధాన్ని చెరిపేసింది. అంతా అన్యోన్యంగా ఉండేవారు కేవలం డబ్బువల్లే శత్రువులుగా మారిపోయారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బోనీకపూర్ కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కాగా.. సూపర్ స్టార్గా ఎదిగిన శ్రీదేవి 2018లో దుబాయ్లో ఓ హోటల్లో మరణించారు. ఈ వివాదం వల్లే శ్రీదేవి మరణం తర్వాత చెన్నైలో జరిగిన ప్రార్థనా సమావేశంలో శ్రీలత కనిపించలేదని చెబుతున్నారు. -
తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. 'దఢక్' సినిమాతో హీరయిన్ అయిపోయింది. కానీ ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటీ లేదు. అయితే కెరీర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్లో నటించే ఛాన్స్ ఈమెకు దక్కింది. నటిగా పక్కనబెడితే గ్లామరస్ ఫొటోలతోనూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) మరోవైపు బాయ్ఫ్రెండ్తోనూ షికారు చేస్తూ చాలాసార్లు కెమెరాకి చిక్కింది. అయితే ఈమెకు ఇదివరకే ఒక బాయ్ఫ్రెండ్ ఉండేవాడు. కాకపోతే అతడితో బ్రేకప్ అయ్యింది. దీని గురించి నటి జాన్వీ కపూర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయటపెట్టింది. తన ఫస్ట్ లవ్ కొన్ని రోజుల్లోనే ముగిసిపోయిందని చెబుతూ బాధపడింది. 'పరిణితి లేని వయసు కారణంగా ఇద్దరం ఓ రకమైన అయోమయానికి గురయ్యాం. దీంతో మా మధ్య ప్రేమలో నిజాయితీ లోపించింది. అబద్దాలతోనే మా లవ్, రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో నా తల్లిదండ్రులు చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా హెచ్చరించారు. వారి మాటలు వింటే భవిష్యత్తు బాగుంటుందని అర్థమైంది. దీంతో నా తొలిప్రేమకు ముగింపు పలికాను' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ.. తెలుగులో ఎన్టీఆర్ 'దేవర'లో హీరోయిన్గా చేస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త
ఇప్పటి జనరేషన్కి ఆమె గురించి పెద్దగా తెలియదు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా ఏ పాయింట్ తీసుకున్నా సరే అతిలోక సుందరి శ్రీదేవి ఫెర్ఫెక్ట్గా ఉండేది. తెలుగులో రెండు మూడు జనరేషన్ స్టార్ హీరోలతో నటించిన ఆమె.. 2018లో అనుకోని విధంగా ఓ ప్రమాదంలో చనిపోయింది. అప్పటికే ఆమెకు ఓ కోరిక ఉండేది. ఇన్నాళ్లకు ఆ డ్రీమ్ ని ఆమె భర్త బోనీ కపూర్ తీర్చారు. ఏంటా కోరిక? 80ల్లో హీరోయిన్గా మంచి ఊపు మీదున్నప్పుడు శ్రీదేవి.. చెన్నైకి దగ్గర్లోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్లోని బీచ్ దగ్గర ఐదు ఎకరాల ప్లేస్ కొనుగోలు చేసింది. అక్కడ తన డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని అనుకుంది. చాలా ఆశపడింది. కానీ 2018లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు చనిపోయింది. దీంతో ఆ డ్రీమ్ అలానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్ల కంటే మైనస్లే ఎక్కువ!) ఇన్నాళ్లకు అలా శ్రీదేవి చివరి కోరికను భర్త బోనీ కపూర్.. ఆమె చనిపోయిన ఐదేళ్లకు నెరవేర్చాడు. తాజ్ గ్రూప్ పార్ట్నర్షిప్తో అందమైన భవనం కట్టించారు. 'ఇది శ్రీదేవి కల. అది నెరవేర్చినందుకు రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేశాం. ఫైనల్గా బీచ్ హౌస్ని పూర్తి చేశాం. చాలా ఆనందంగా ఉంది' అని బోనీ కపూర్ చెప్పారు. తల్లిలా కూతురు అయితే అమ్మ శ్రీదేవి అడుగుజాడల్లోనే కూతురు జాన్వీ కపూర్ వెళ్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దేవర'లో జాన్వీనే హీరోయిన్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం జాన్వీకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. In the late 80's during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai. Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 Boney Kapoor is happy to fulfilling Sri Devi's dream. He says, "Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house."@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf — BA Raju's Team (@baraju_SuperHit) August 20, 2023 (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
నీకు ఇంకా 35 ఏళ్లే.. అమ్మను తలుచుకుంటూ జాన్వీ ఎమోషనల్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకుంటోంది. అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో దఢక్ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన జాన్వీ.. కొద్ది కాలంలోనే తనదైన నటనతో మెప్పించింది. అంతేకాకుండా గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ.. ఇటీవల వరుణ్ ధావన్ సరసన బవాల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే బవాల్ నేరుగా ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ శ్రీదేవి 60 జయంతి కావడంతో తన తల్లిని గుర్తు చేసుకుంది జాన్వీ కపూర్. ఈ సందర్భంగా అమ్మను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్ ) జాన్వీ కపూర్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'నీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా. నానమ్మతో సినిమా సెట్లో దిగిన ఈ ఫోటో మీకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి అని నాకు తెలుసు. ఈ రోజు నేను కూడా సినిమా సెట్లో ఉన్నా. మీరు నాతో ఇలాగే ఉండాలని నేను గతంలో కంటే ఎక్కువగా కోరుకున్నా. వాస్తవానికి మీ 35వ పుట్టినరోజని మేము అందరినీ ఒప్పించగలము. నేను నిన్ను చూసి గర్విస్తున్నా. ఈ ప్రపంచాన్ని నీ కళ్లతో చూడగలుగతున్నా. మమ్మల్ని చూసి మీరు కూడా సంతోషిస్తారని నాకు తెలుసు. ప్రతి రోజు నిన్ను ప్రేమిస్తునే ఉంటా అమ్మా. మీరు ఈ భూమి మీద అత్యంత ప్రత్యేకమైన మహిళ. మీరు ఇప్పటికీ మాతో ఉన్నారని నాకు తెలుసు. మేము జీవితంలో ఎదగడానికి కారణం నువ్వే. ఈ రోజు నీకిష్టమైన పాయసం, ఐస్ క్రీములు తింటావని ఆశిస్తున్నా.' అంటూ ఎమోషనల్ పోస్టే చేశారు. కాగా.. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోని స్టార్ హీరోలతో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు బోనీ కపూర్ను పెళ్లి చేసుకున్న శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా.. 2018లో దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఓ హోటల్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఇవాళ ఆమె 60వ జయంతి కావడంతో గూగుల్ సైతం ప్రత్యేక డూడుల్తో ఆమెకు ఘన నివాళి అర్పించింది. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
ఓటు హక్కుకు భంగం కలిగిస్తే సహించం
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
రూ.1 కోటి విరాళమిచ్చిన హీరో ధనుష్
సార్వత్రిక పోరుకు సర్వం సిద్ధం
ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలి ●
ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
ఐదేళ్ల భవితకు ఒక్కవేలుపై చుక్క!
నకిలీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురి అరెస్టు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement