-
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
సూధామూర్తి ఆస్తి విలువ ఎంతో తెలుసా..
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఎంపీగా నియమితులైన సుధామూర్తికి ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్లో 0.83% వాటాకు సమానమైన 3.45 కోట్ల షేర్లు ఉన్నాయి. ప్రస్తుత షేరు ధర రూ.1,616.95 ప్రకారం, సుధామూర్తి షేర్ల విలువ రూ.5,600 కోట్ల వరకు ఉండొచ్చు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి ఇన్ఫోసిస్లో 1.66 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.2,691 కోట్లు. 2006లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న సుధామూర్తికి.. ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ పురస్కారమూ లభించింది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఈమె కుమార్తె. ఇదీ చదవండి: అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం ‘సుధామూర్తిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక కార్యకలాపాలు, దాతృత్వం, విద్య.. ఇలా పలు విభాగాల్లో ఆమె అందించిన సేవలు అమోఘం. రాజ్యసభ సభ్యురాలిగా దేశ భవిష్యత్తును మార్చడంలో నారీశక్తికి నిదర్శనంగా ఆమె తన వంతు పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్లో తెలిపారు. -
International Womens Day 2024: రాజ్యసభకు సుధామూర్తి
సాక్షి, న్యూఢిల్లీ/బనశంకరి: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి(73) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమెను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్ చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రాజ్యసభకు నామినేట్ చేయడం తనకు డబుల్ సర్ప్రైజ్ అని సుధామూర్తి పేర్కొన్నారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదని చెప్పారు. రాష్ట్రపతి తనను పెద్దల సభకు నామినేట్ చేయడానికి గల కారణం తెలియదని అన్నారు. ఉన్నత చట్టసభకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇది తనకు కొత్త బాధ్యత అని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యురాలిగా తన వంతు సేవలు అందిస్తానని వివరించారు. ప్రధాని మోదీకి సుధామూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం థాయ్లాండ్లో పర్యటిస్తున్న సుధామూర్తి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సుధామూర్తిని రాష్ట్రపతిద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అనాథ ఆశ్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రంగాల్లో ఎన్నెన్నో సేవలు అందించిన సుధామూర్తి చట్టసభలోకి అడుగు పెడుతుండడం నారీశక్తికి నిదర్శనమని మోదీ ఉద్ఘాటించారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు. టెల్కోలో తొలి మహిళా ఇంజనీర్ డాక్టర్ సుధామూర్తి 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని హావేరి జిల్లా శిగ్గావిలో జని్మంచారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ ఆర్హెచ్ కులకరి్ణ, విమలా కులకరి్ణ. సుధామూర్తి హుబ్లీలోని బీవీబీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో బీఈ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్లో ఎంఈ చేశారు. టాటా ఇంజినీరింగ్ లోకోమోటివ్ కంపెనీ(టెల్కో)లో ఉద్యోగంలో చేరారు. దేశంలోనే అతి పెద్దవాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సుధామూర్తి సహ వ్యవస్థాపకురాలు. సంస్థ ప్రారంభించే సమయంలో రూ.10వేలు తన భర్తకు ఇచ్చి ప్రోత్సహించారు. సేవా కార్యక్రమాలు.. పురస్కారాలు 1996లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను సుధామూర్తి ప్రారంభించారు. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో పలు పుస్తకాలు రాశారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వరద బాధితుల కోసం 2,300 ఇళ్లు నిర్మించారు. పాఠశాలల్లో 70 వేల గ్రంథాల యాలు నిర్మించారు. భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ,, 2023లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు స్వీకరించారు. సాహిత్యంలో ఆమె చేసిన సేవకుగానూ ఆర్కే నారాయణ సాహిత్య పురస్కారం, శ్రీరా జా–లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. భర్త నారాయణమూర్తి (2014)తో సమానంగా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా తాను అందుకున్న మొత్తాన్ని టోరంటో విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. నాన్ఫిక్షన్ విభాగంలో క్రాస్వర్డ్ బుక్ అ వార్డు, ఐఐటీ–కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులకు అక్షతామూర్తి, రోహన్మూర్తి సంతానం. అక్షతామూర్తి భర్త రిషి సునాక్ బ్రిటన్ ప్రధాన మంత్రి. వీరిది ప్రేమ వివాహం. రాజ్య సుధ – ప్రత్యేక కథనం ఫ్యామిలీలో.. -
Infosys Sudha Murty: రాజ్య సుధ
సాటి మనుషుల కోసం పని చేయడం సామాజిక సేవ ద్వారా పరిస్థితులను మెరుగుపరచడం యువతకు స్ఫూర్తిగా నిలవడం.. రచయితగా ఎదగడం ఇన్ఫోసిస్ దిగ్గజంగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందడం సుధామూర్తిని నేడు రాజ్యసభకు చేర్చాయి. ఉమెన్స్ డే రోజు ఆమెను రాష్ట్రపతి ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి జీవన విశేషాలు. ► తొలి పాఠాలు సుధామూర్తి బాల్యం హుబ్లీలో గడిచింది. తండ్రి కులకర్ణి డాక్టర్. ఆయన రోజూ టీ సేవించేవాడు. ఒకరోజు పాలు రాలేదు. తండ్రి టీ తాగక వేరే ఏ పనీ మొదలుపెట్టలేక కూచుని ఉన్నాడు. ‘ఏంటి నాన్నా?’ అని అడిగింది సుధామూర్తి. ‘ఉదయాన్నే టీకి నేను అలవాటు పడ్డానమ్మా. ఇవాళ టీ తాగక తలనొప్పి వచ్చింది. నువ్వు మాత్రం దేనికీ అతిగా అలవాటు పడకు.. కాఫీ, టీలకైనా సరే’ అన్నాడు. సుధామూర్తి ఆ పాఠాన్ని గుర్తు పెట్టుకుంది. ఇవాళ ఆమెకు డెబ్బై నాలుగు ఏళ్లు. నేటికీ ఉదయాన్నే లేచి టీగానీ కాఫీ గాని తాగి ఎరగదు. సుధామూర్తి హుబ్లీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే షిగావ్లో పుట్టింది. అక్కడ ఆమె అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. తాతయ్య స్కూల్ టీచర్. ఆయన తనకంటే వయసులో ఎంత చిన్నవారినైనా ‘మీరు’ అని బహువచనం వాడేవారు. ‘నీ కంటే చిన్న కదా తాతయ్య’ అని సుధామూర్తి అంటే ‘లోపలి ఆత్మ పెద్దదే కదమ్మా’ అనేవారు. ఎదుటివారిని గౌరవించడం అలా నేర్చుకుందామె. తాతయ్య ఆమెకు మూడు జీవన పాఠాలు నేర్పారు. 1.సింపుల్గా జీవించు 2.జ్ఞానాన్ని సముపార్జిస్తూనే ఉండు 3. పుస్తకాలు చదువు. ఇవి సుధామూర్తి నేటికీ పాటిస్తూనే ఉంది. అమ్మమ్మ ‘ఆకలితో ఉన్నవారిని గమనించు’ అని చెప్పింది. వాళ్ల ఇంటికి రోజూ ఒక భిక్షకుడు వస్తే ఇంట్లో మంచి బియ్యం నిండుకుని ముతకబియ్యం ఉన్నా అమ్మమ్మ మంచి బియ్యమే భిక్షకుడికి వేసేది. ‘ముతక బియ్యం మనం తినొచ్చులే’ అనేది. ఇదీ సుధామూర్తికి తొలి పాఠమే. ఇక అమ్మ విమల నేర్పిన పాఠం– ‘ఎంతో అవసరమైతే తప్ప డబ్బు ఖర్చు పెట్టకు’ అని. అంతే కాదు నీకు బాల్యంలో మంచి అలవాట్లు ఉంటే అవే కాపాడతాయి అని కూడా ఆమె అనేది. ఉదయాన్నే లేచి కాగితం మీద 10 సార్లు ‘దేవుడికి నమస్కారం’ అని రాయించేదామె. నేటికీ సుధా మూర్తి ఆ అలవాటును మానలేదు. ఇక స్కూల్ టీచరు రాఘవేంద్రయ్య... ‘నీకు లెక్కలు భలే వస్తున్నాయి. లెక్కల్ని వదలకు. పైకొస్తావ్‘ అన్నాడు. ఆమె ఆనాటి నుంచి లెక్కల్నే రెక్కలుగా చేసుకుంది. ► కుతూహలమే గురువు చిన్నప్పుడు సుధామూర్తికి ప్రతిదీ కుతూహలమే. వీధుల్లో కొట్లాటలు అవుతుంటే అక్కడకు పరిగెత్తి వెళ్లి నిలబడేది. వినోదం కోసం కాదు. కారణం ఏమై ఉంటుందా అని. చిన్న ఊళ్లో ప్రతి ఇల్లూ అందరికీ పరిచయమే. అందరి జీవితాలనూ ఆమె పరిశీలిస్తూ ఉండేది. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగితే ఆమె తప్పని సరిగా ఒక స్టీలు క్యారేజీ తీసుకుని బయలుదేరేది. విందులో ఏ పదార్థాలు బాగున్నాయో ఏ పదార్థాలు బాగలేవో మొత్తం రుచి చూసి వస్తూ వస్తూ బాగున్న వాటిని క్యారేజీలో అడిగి తెచ్చుకునేది. కాలేజీ రోజుల వరకూ కూడా పెళ్ళిళ్లకు క్యారేజీ తీసుకోకుండా సుధామూర్తి వెళ్లేది కాదు. ‘ఎందుకో నాకు గిన్నెల క్యారేజీ అంటే నేటికీ ఇష్టం’ అంటుందామె. ► మసాలా దోసె పార్టీ లెక్కలు బాగా నేర్చుకున్న సుధా హుబ్లీలోని బి.వి.బి. కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేరింది. ఇక ఆ రోజు నుంచి ఊళ్లోని పెద్ద మనుషులంతా ఆమె తండ్రి దగ్గరకు వచ్చి వాపోవడమే. ‘అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నావ్. పెళ్లెవరు చేసుకుంటారు’ అని బెంగపడటమే. తండ్రి కూడా ఒక దశలో తప్పు చేశానా అనుకున్నాడు. కాని సుధామూర్తి మొదటి సంవత్సరానికి ఫస్ట్ క్లాస్లో పాసైంది. తండ్రికి సంతోషం కలిగింది. ‘ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావ్ కదా... పద మసాలా దోసె పార్టీ చేసుకుందాం’ అని తీసుకెళ్లాడు. ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్క్లాస్ తెచ్చుకోవడం.. తండ్రి తీసుకెళ్లి మసాలా దోసె తినిపించడం. ఆ తండ్రీ కూతుళ్ల జీవితంలో పార్టీ చేసుకోవడం అంటే అదే. అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ‘కాని ఆ పార్టీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. అపురూపం అనిపించేది’ అంటుందామె. ► చరిత్ర మార్చిన కార్డు ముక్క 1974లో టాటా వారి ‘టెల్కో’ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడ్డాయి. పేపర్లో ఆ యాడ్ చూసింది సుధామూర్తి. అర్హతలు అన్నీ ఆమెకు ఉన్నాయి. కాని యాడ్ కింద ‘స్త్రీలు అప్లై చేయాల్సిన పని లేదు’ అని ఉంది. అప్పుడు సుధామూర్తికి ఆగ్రహం వచ్చింది. రోషం కలిగింది. జె.ఆర్.డి.టాటాకు ఒక కార్డు గీకి పడేసింది. ‘దేశంలో ఉన్న ఇంతమంది స్త్రీలకు పని చేసే హక్కు లేకపోతే వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారు?’ అని ప్రశ్న. ఆ కార్డు జె.ఆర్.డి. టాటాకు చేరింది. ఆ వెంటనే ఆమెకు ఇంటర్వ్యూకు పిలుపు, ఆపై ఉద్యోగం వచ్చాయి. పూణెలో సుధామూర్తి తొలి ఉద్యోగం చేసింది. ఆమె రాసిన లేఖను టాటా సంస్థ నేటికీ భద్రపరిచి ఉంచింది. 1974లో టెల్కోలో సుధామూర్తి ఒక్కతే మహిళా ఉద్యోగి. దాదాపు 50 ఏళ్ల తర్వాత సుధామూర్తి పూణెలో ఆ సంస్థను సందర్శిస్తే (ఇప్పుడు టాటా మోటార్స్) 900 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ‘నేను అక్కడ నిలబడి మా తండ్రిని తలుచుకుని ఉద్వేగంతో కన్నీరు కార్చాను. ఎవరు భయపెట్టినా నన్ను ఆయన చదివించాడు. నా వల్ల ఇవాళ ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో ఉన్నారు అని’ అందామె. ► జీవితం అంతులేని పోరాటం ‘జీవితం అంటే అంతులేని పోరాటం. ఎవరికీ ఏ వయసులో ఉన్నా కన్సెషన్ ఉండదు. పోరాటం చేయాలి. ఓడిపోయినా పోరాట అనుభవం మిగులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. క్షమిస్తే మంచిది. మర్చిపోతే ఇంకా మేలు. కాని ముందుకు సాగడమే అన్నింటికన్నా ఉత్తమమైనది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని మెరిపిస్తాయి. ప్యాషన్తో పని చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. ఒక మనిషిని పైకి తెచ్చేది డబ్బు కాదు ప్యాషన్. నమ్మిన పనిని విలువలతో ఆచరిస్తే ఎవరైనా పైకి రావాల్సిందే’ అంటుందామె. ► రాజ్యసభ సభ్యురాలు ‘ఇది ఊహించలేదు. రాష్ట్రపతి నన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీని గురించి నేను కూచుని ఆలోచించాలి. అర్థం చేసుకోవాలి. ఏం చేయగలనో అంతా చేయాలి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వ సేవకురాలిని’ అని కొత్త బాధ్యతకు సిద్ధమవుతోంది సుధామూర్తి. ఇల్లాలే శక్తి నారాయణ మూర్తితో వివాహం అయ్యాక ఇన్ఫోసిస్ సంస్థను ఆయన స్థాపించాలనుకున్నప్పుడు 10 వేల రూపాయలు పెట్టుబడి తనే ఇచ్చింది సుధామూర్తి. అయితే ఆమెను ఇన్ఫోసిస్కు బయటి వ్యక్తిగానే ఉండటం మంచిదని సూచించాడు నారాయణమూర్తి. ఆమె కొంచెం బాధపడింది. ఎప్పటికైనా ఇన్ఫోసిస్ సంస్థలో చేరతాననే భావించింది. అదే సమయంలో చాలా కాలం పాటు పిల్లల కోసం గృహిణిగా ఉండిపోయింది. ‘సంవత్సరంలో 200 రోజులు ప్రయాణాల్లో ఉండేవాడు నారాయణమూర్తి. ఆ రోజుల్లో ఫోన్ లేదు. కారు లేదు. పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్కదాన్నే వెళ్లాలి. సంస్థ ఆర్థిక కష్టాలు.. ఇంటి కష్టాలు.. అన్నీ తట్టుకుని నారాయణమూర్తికి వెన్నుదన్ను అందించాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్మన్ అయ్యాను. ఆ ఫౌండేషన్తో వేలాది మంది జీవితాల్లో వెలుగు తెచ్చే వీలు నాకు కలిగింది. ఈ సంతృప్తి ఇన్ఫోసిస్ డైరెక్టర్గా పని చేసి ఉంటే నాకు దక్కేది కాదు’ అంటుందామె. -
ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ద్వారా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయినందుకు శ్రీమతి సుధామూర్తిగారికి నా హృదయపూర్వక అభినందనలు. పరోపకారిగా, సామాజిక సేవకురాలిగా, వ్యాపారవేత్తగా, రచయిత్రిగా ఆమె చేసిన అమూల్యమైన సేవలు ఎనలేనివి. భవిష్యత్ లో సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారాయన. My heartfelt congratulations to @SmtSudhaMurty garu on being nominated to the Rajya Sabha on International Women’s Day. Her invaluable contributions as a philanthropist, social worker, entrepreneur and author are immeasurable. I earnestly hope that she achieves even greater… — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటంతో డబుల్ సర్ప్రైజ్గా.. చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సుధా మూర్తి ఓ మీడియా సంస్థ ద్వారా స్పందించారు. -
అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ నిర్ణయం వెలువడడం విశేషం. సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితం. ఈమె గొప్ప రచయిత్రి. కంప్యూటర్ ఇంజినీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధామూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను చేరేలా తోడ్పడుతున్నారు. ఆమె గతంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. ఆమె నవలే సీరియల్గా.. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ప్రారంభించారు. ఆమె కాల్పనిక రచనలు కూడా రాస్తారు. ఆమె రచించిన కన్నడ నవల ‘డాలర్ సొసే’ ఇంగ్లిష్లో డాలర్ బహుగా ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత ఆ నవల 2001లో ‘జీ టీవీ’లో సీరియల్్గా ప్రసారం చేశారు. భూరి విరాళాలు.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి ఐఐటీ కాన్పూర్లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉండే హెచ్.ఆర్.కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్ ఏర్పాటుకు, నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాలకు భూరి విరాళాలను అందజేశారు. కర్ణాటకలోని బి.వి.బి.టెక్నికల్ కాలేజీలో ఎలక్టికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్మెడల్ సాధించారు. పోరాడితే దక్కిన ఉద్యోగం.. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆటో పరిశ్రమలో పేరొందిన టెల్కో కంపెనీలో మహిళా ఇంజినీర్గా ఉద్యోగం సాధించారు. అంతా ఈజీగా ఈ ఉద్యోగం రాలేదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి పోస్టుకార్డు రాశారు. దానికి స్పందించిన ఆయన తనకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థకు పుణె బ్రాంచిలో పనిచేస్తున్నపుడే ఆవిడకు నారాయణ మూర్తితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహం చేసుకున్నారు. అందుకున్న పురస్కారాలు.. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్కు క్యాపిటలిస్ట్గా ఉన్న కెటారామన్ వెంచర్స్ సంస్థలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు. 2004 - సామాజిక సేవకుగాను శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం 2006 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. (సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగం) దేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందజేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. సాహితీ సేవ, ఆమె రచనలకు ఆర్.కె.నారాయణన్ పురస్కారం అందుకున్నారు. 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అట్ఠిమబ్బే (Attimabbe) అవార్డు అందుకున్నారు. 2023 -పద్మ భూషణ్ అవార్డు 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ ప్రముఖ రచనలు మదర్ ఐ నెవెర్ న్యూ మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ వైస్ అండ్ అదర్ వైస్ మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్ 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రార్డినరీ లైవ్స్ గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్ -
రాజ్యసభకు సుధామూర్తి.. ‘నారీ శక్తికి నిదర్శనం’: మోదీ
న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజిక వేత్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం భారత ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శమని మోదీ పేర్కొన్నారు. సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్య, దాతృత్వంతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి ఆపారమైనదని ప్రశంసించారు. మహిళల శక్తి, సామర్థ్యాలను చాటిచెప్పేలా ఆమె పార్లమెంట్ పదవీకాలం ఉన్నతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పోస్టు చేశారు. I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F— Narendra Modi (@narendramodi) March 8, 2024 కాగా సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. -
Sudha Murty: ఇన్ఫోసిస్ డైరెక్టర్గా రిటైరయ్యేదాన్ని..
దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి. అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి. అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు. నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. -
Infosys Sudha Murty: పుస్తకం కలిపింది ఇద్దరినీ
1974. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం మొదటిసారి సుధామూర్తి, నారాయణమూర్తి పూణెలో కలిశారు. వారి మధ్య ప్రేమ చిగురించడానికి దోహదం చేసింది పుస్తక పఠనం. ఆ ప్రేమ కథ ఏమిటో 50 ఏళ్ల తర్వాత ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2024’లో పంచుకున్నారు సుధామూర్తి. తమ సుదీర్ఘ వైవాహిక జీవితం సఫలం కావడానికి ఇద్దరూ తీసుకున్న జాగ్రత్తలు చెప్తూ ఈనాటి యువతకు అనుభవంతో నిండిన సూచనలు చేశారు. అందమైన ప్రేమకథలు, సఫలమైన ప్రేమకథలు తెలుసుకోవడం బాగుంటుంది. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో ఫిబ్రవరి 5న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పాల్గొన్నారు. చిత్రా బెనర్జీ దివాకరుని రాసిన బయోగ్రఫీ ‘యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ డేస్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ విడుదలైన సందర్భంగా తనకు నారాయణమూర్తికీ మధ్య ఎలా ప్రేమ పుట్టిందో కొద్దిగా సిగ్గుపడుతూ, ముసిముసిగా నవ్వుకుంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేమ కథ వినండి. 1974 అక్టోబర్. పూణెలోని ‘టెల్కొ’లో మొదటి మహిళా ఇంజనీరుగా చేరిన సుధ రోజూ కంపెనీ బస్లో వచ్చి వెళుతుండేవారు. ప్రసన్న ఆమె కొలీగ్. అతను ఏదో ఒక పుస్తకం చదువుతుంటే ఏ పుస్తకమా అని సుధ తొంగి తొంగి చూసేవారు. అతను చదివే ప్రతి పుస్తకం మీద ఒకే పేరు ఉండేది... మూర్తి అని. ఒకరోజు ఉండబట్టలేక ‘ఎవరీ మూర్తి’ అని అడిగారు సుధ. ‘నా రూమ్మేటు. పుస్తకాల పిచ్చోడు. చాలా పుస్తకాలు చదువుతాడు’ అన్నాడు ప్రసన్న. ‘నీకూ పుస్తకాల పిచ్చేగా. కావాలంటే పరిచయం చేస్తానురా’ అన్నాడు. ‘అమ్మో... బేచిలర్ల రూముకు వెళ్లడమా’ అని సుధ జంకారు. కాని కుతూహలం పట్టలేక ‘ఫలానా రోజున ఐదు నిమిషాలకు వచ్చి వెళతా’ అని ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు రకరకాలుగా సాగాయి. ఈ మూర్తి ఎలా ఉంటాడు? పొడవుగా ఉంటాడా... రింగుల రింగుల జుట్టుతో ఉంటాడా.. షోగ్గా (అప్పటికి హిందీ సినిమాల ఫ్యాన్ కాబట్టి) రాజేష్ ఖన్నాలా ఉంటాడా అని ఒకటే ఊహలు. తీరా రూముకు వెళ్లేసరికి దళసరి కళ్లద్దాల బక్కపలచటి యువకుడు ఎదురుపడ్డాడు. సుధని చూసి, ఆమెకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి తన దగ్గరున్న పుస్తకాలన్నీ చూపించాడు. ఆమె బయల్దేరే ముందు అబ్బాయిలు వేసే పాచిక ‘కావాలంటే తీసుకెళ్లి చదివి ఇవ్వు’ అన్నాడు. కొన్నిరోజుల తర్వాత ‘మనం డిన్నర్ చేద్దామా’ అని ఆహ్వానించాడు. దానికీ భయమే సుధకు. ‘వస్తా. కాని మన కామన్ఫ్రెండ్ ప్రసన్న కూడా మనతో ఉండాలి. నా వాటా బిల్లు డబ్బులు నేనే కడతా’ అందామె. వారి స్నేహం బలపడింది. ఒకరోజు నారాయణమూర్తి ధైర్యం చేసి సుధతో చెప్పాడు– ‘ఆరోజు నువ్వు మొదటిసారి నా రూమ్కు వచ్చి వెళ్లాక అంతవరకూ లేని వెలుగు వచ్చినట్టయ్యింది. జీవితం పట్ల ఇంత ఆసక్తి ఉన్న అమ్మాయిని నేను చూళ్లేదు’... ఆ మాటలే ప్రేమను ప్రపోజ్ చేయడం. ఆమె సంతోషంగా నవ్వడమే ప్రేమను అంగీకరించడం. ప్రేమ మొదలైన నాలుగేళ్లకు సుధ.. సుధామూర్తి అయ్యారు. ‘నారాయణమూర్తి, నేను భిన్నధృవాలం. నేను అన్నింటికీ మాట్లాడతాను. అతను అసలు మాట్లాడడు. నాకు అన్నింట్లో జోక్యం కావాలి. అతను అవసరమైతే తప్ప జోక్యం చేసుకోడు. మా జీవితంలో అనంగీకారాలు, ఆర్గ్యుమెంట్లు లేవని కాదు. ఇన్ఫోసిస్ మొదలెడుతున్నప్పుడు నువ్వు ఇందులో ఉండకూడదు అన్నాడు నారాయణమూర్తి. ఐదేళ్లు నేను పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోయాను. అప్పుడప్పుడు కొంత చివుక్కుమంటూండేది. కాని తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్మన్గా నేను సామాజిక సేవతో ఎందరి జీవితాలకో చేయూతనిచ్చి తృప్తి పొందాను. వైవాహిక బంధంలో భార్యాభర్తలు ఎవరిని వారులా ఉండనివ్వాలి. నారాయణమూర్తి కోరుకున్నట్టుగా నేను అతణ్ణి ఉండనిచ్చాను, నాలా నన్ను అతను ఉండనిచ్చాడు’ అన్నారామె. ‘ఇన్ఫోసిస్ పెట్టాక అతి కష్టమ్మీద ఒక క్లయింట్ దొరికాడు. కాని పేమెంట్స్ ఇష్టమొచ్చినప్పుడు ఇచ్చేవాడు. నారాయణమూర్తికి ఉద్యోగుల జీతాలు సమయానికి చెల్లించాలని నియమం. అతను టెన్షన్ పడుతుంటే– ఎందుకంత టెన్షన్... నగలు బ్యాంకులో కుదవ పెట్టి డబ్బు తెస్తాను. సర్దుబాటు చేసుకో అన్నాను. నారాయణమూర్తి కదిలిపోయాడు. ఎందుకంటే ఏదో అవసరం వచ్చి గతంలో తల్లి నగలు కుదువ పెట్టాల్సి వచ్చిందట. అవి విడిపించుకోలేకపోయారు. అది గుర్తొచ్చి వద్దు వద్దు అన్నాడు. ఏం పట్టించుకోకు.. లోను తీసుకోవడానికి సెంటిమెంట్లు ఏమిటి అని తెచ్చి ఇచ్చాను. ఆ రోజు గాజులు లేని నా బోసి చేతులను చూసి నారాయణమూర్తి చాలా బాధ పడ్డాడు. కొన్నాళ్లకు విడిపించాడనుకోండి. ఈ మాత్రం సర్దుబాట్లు కాపురంలో అవసరం’ అన్నారామె. వైవాహిక బంధం ఎలా నిలబడుతుంది? ఆడియెన్స్లో ఎవరో అడిగారు. ‘నమ్మకం, సహనం, సర్దుబాటుతనం వల్ల మాత్రమే. జీవితంలో సహనం ముఖ్యమైనది. సహనంగా ఉంటే జీవితం మనకు కావలసినవి ఇస్తుంది. వైవాహిక జీవితంలో అనుకున్నవన్నీ చేసే స్వేచ్ఛ, వీలు లేకపోవచ్చు. అప్పుడు ఉన్న పరిమితుల్లోనే ఎలా ఆనందంగా ఉండాలో తెలుసుకోవాలి. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ మొదలుపెట్టి బిజీగా ఉండగా నేను ఐదేళ్లూ పిల్లల్ని చూసుకుంటూ కూడా పుస్తకాలు రాసి సంతోషపడ్డాను. వీలైనంతగా కొత్త ప్రాంతాలు చూశాను. మగవాళ్లకు సాధారణంగా ఆడవాళ్లు తమ కంటే తెలివితక్కువగా ఉండాలని ఉంటుంది. అవసరమైతే వారిని అలా అనుకోనిచ్చేలా చేస్తూ స్త్రీలు తమ సామర్థ్యాలను వీలైనంత ఉపయోగించుకోవాలి. జీవితంలో, వైవాహిక జీవితంలో రాణించాలి’ అన్నారు సుధామూర్తి. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
సుధా-నారాయణమూర్తి లవ్ స్టోరీ: పెళ్లికి తండ్రి నో....చివరికి పెళ్లి ఖర్చు కూడా!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు టెక్ ప్రపంచంలో తెలియని వారుంటారు. ఆయన భార్య, ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి రిటైర్డ్ చైర్పర్సన్ సుధామూర్తి కూడా చాలామందికి ఇన్సిపిరేషన్. తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్గా మారింది. నాలుగేళ్ల డేటింగ్ తరువాత 1978, ఫిబ్రవరి 10న నారాయణ, సుధా మూర్తి మూడుముళ్ల బంధంలో ఒక్కటైనారు. అయితే అన్ని విషయాల్లో గుంభనం, దూరదృష్టితో ఉండే నారాయణమూర్తి, భోళాగా, డబ్బు విషయంలో చాలా ప్రణాళికా బద్దంగా ఉండే సుధ పరిచయం ప్రేమ విచిత్రంగానే జరిగింది. కొన్ని భేదాభిప్రాయాలున్నప్పటికీ, ఒకరిపై మరొకరు నమ్మకం వారి ప్రేమను శాశ్వతం చేసింది. పూణేలో తమ కామన్ ఫ్రెండ్ విప్రో ప్రసన్న ద్వారా తామిరువురం కలుసుకున్నామని జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పూణే బ్రాంచ్లో టెల్కోగా పనిచేస్తున్నారు. ఒక సాయంత్రం పూణేలోని గ్రీన్ ఫీల్డ్స్ హోటల్లో భోజనానికి ప్రసన్న ద్వారా సుధ , ఆమె స్నేహితులను నారాయణ ఆహ్వానించారు. ఈ బృందంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో మొదట్లో వెళ్లేందుకు ఇష్టపడలేదు కానీ నారాయణ ఆమెను ఒప్పించారట. అలాగే ప్రసన్న దగ్గరినుంచి చాలా పుస్తకాలను తీసుకోవానే వారట సుధ. ఆ పుస్తకాలపై ఎక్కువగా నారాయణమూర్తి పేరు ఉండేదట. అలా తన మనస్సులో నారాయణ ఊహాచిత్రం ముందే ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది.. ముఖ్యంగా ఆయనలోని వినయం, ముక్కు సూటిగా ఉండే తత్వం తననను ప్రేమలో పడేసిందని ఆమె చెప్పారు. ‘‘నా పొడవు 5'4" పొడవు ఉన్నాను . దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను నా జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేను,నేను మీకు ఏ సంపదను ఇవ్వలేను. మీరు అందంగా ఉన్నారు. పైగా తెలివైనవారు కూడా. నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగారట నారాయణమూర్తి. పెళ్లి ఖర్చు సమంగా పంచుకున్నాం రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నారాయణమూర్తి మొదట్లో వీరిద్దరి వివాహాన్ని సుధ తండ్రి వ్యతిరేకించారు. జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారు అని సుధ తండ్రి అడిగితే, కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా ఎదగాలని, అనాథాశ్రమాన్ని తెరవాలనుకుంటున్నానని మూర్తి చెప్పారట. దీంతో ఆయన ససేమిరా అన్నారట. చివరికి 1977 చివరిలో నారాయణ పాట్నీ కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్గా జాయిన్అయిన తరువాత మాత్రమే ఆయన అంగీకరించారు. అమెరికా వెళ్లే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మేరకు వబెంగుళూరులోని నారాయణ ఇంట్లో కుటుంబ సన్నిహితుల పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పారు. అలా తనకు తొలి పట్టు చీర వచ్చిందని గుర్తు చేసు కున్నారు. అంతేకాదు ఆనాటి తమ పెళ్లి ఖర్చును ఇద్దరమూ సమానంగా పంచుకున్నామని సుధామూర్తి వెల్లడించారు. ఒక్కొక్కరు రూ.400 చొప్పున మొత్తం పెళ్లి ఖర్చు రూ.800 అయిందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన పాత జ్ఞాపకాల గురించి మీడియాతో పంచుకుంటున్న నారాయణమూర్తి కూడా . తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మధ్యతరగతి నేపథ్యం తాము ఎక్కువగా ఆటోలోనే ప్రయాణించే వారమంటూ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. కన్నడ రాని డ్రైవరున్న ఆటోలో తాము కన్నడలోమాట్లాడుకుంటూ తమ జీవితంలో కీలక మైన విషయాలను షేర్ చేసుకున్నట్టు నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. 1981లో పూణేలో తన సహచరులతో కలిసి ఇన్ఫోసిస్ను స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలన్న తన భర్త కల సాకారం కోసం 10 వేల రూపాయలను సుధామూర్తి అప్పుగా ఇచ్చారు. అదే ఆ తరువాత కోట్లాది రూపాయల విలువ చేసే దేశంలో అనే అత్యున్నత ఐటీ సంస్థగా అవతరించింది. అలాగే ఇటీవల తన భార్య సుధ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని మరీ నారాయణ మూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. -
మూడు నెలల బిడ్డను అక్కడ విడిచిపెట్టి.. ఇన్ఫోసిస్ కోసం సుధామూర్తి..
నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే.. ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన 'ఇన్ఫోసిస్' (Infosys). ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. ఈ రోజు 83.92 బిలియన్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి చెబుతూ.. తమ కుమార్తె అక్షతా మూర్తిని 90 రోజుల వయసున్నప్పుడు తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది. టెక్ కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సుధామూర్తి, నారాయణ మూర్తి ముంబైకి మారారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు ఎలా మారతాయో ఊహకందని సమయంలో.. నా బిడ్డ అక్షతా మూర్తి తన తాతయ్యల వద్ద పెరగడం మంచిదని భావించిన సుధామూర్తి.. చిన్నారిని ముంబై నుంచి కర్ణాటకలోని తన తల్లిదండ్రులు, సోదరి వద్ద వదిలి పెట్టింది. ఎంతో గారాబంగా పెంచుకోవాల్సిన చిన్నారిని విడిచిపెట్టడం చాలా కష్టమైన నిర్ణయమని సుధామూర్తి చెబుతూ.. ఆ రోజు నుంచి అక్షతకు నా తల్లి, సోదరి తల్లులుగా మారారని తెలిపింది. ఈ రోజు ఇన్ఫోసిస్ ఇంత పెద్ద సంస్థగా అవతరించినదంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు. ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి మీరు ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు. ఈ రోజు యూకే ప్రధాని భార్యగా.. వెంచర్ క్యాపిటలిస్ట్గా ఎదిగిన 'అక్షతా' కర్ణాటకలోని హుబ్లీలో తన తాతయ్యలతో కలిసి పెరిగింది. ఏదైనా విలువైనది చేయాలని ఆకాంక్షించినప్పుడు త్యాగాలు అనివార్యమని మూర్తి దంపతులు స్పష్టం చేశారు. -
స్టోర్రూంలో పడుకోబెట్టిన క్లయింట్.. ‘దాన్ని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుంది’
Infosys Narayana Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన ఏదో ఒక విశేషం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే వస్తోంది. ప్రారంభ రోజుల్లో ఆయన పడిన అవమానం గురించిన అంశం తాజాగా బయటకు వచ్చింది. భార్య సుధామూర్తికి కోపం తెప్పించిన ఈ ఘటన గురించి నారాయణమూర్తి ఏం చెప్పారంటే.. ఇన్ఫోసిస్ ప్రారంభ రోజులలో క్లయింట్ వర్క్ కోసం నారాయణ మూర్తి ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు, ఒక అమెరికన్ వ్యాపారవేత్త తన ఇంటిలో నాలుగు బెడ్రూమ్లు ఉన్నప్పటికీ నారాయణమూర్తిని స్టోర్రూంలో పడుకోబెట్టాడు. కిటికీలు లేని ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్య ఒక పెట్టెపైనే ఆ రాత్రి ఆయన నిద్రించారు. సుధా మూర్తి, నారాయణ మూర్తి జీవితాల్లో తొలినాళ్ల గురించి భారతీయ-అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివాకరుణి రచించిన "యాన్ అన్కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి" జీవితచరిత్ర పుస్తకంలో ఈ విశేషాలు వెల్లడయ్యాయి. న్యూయార్క్కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ అధినేత డాన్ లీల్స్.. నారాయణమూర్తి పట్ల కొన్ని సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించేవాడు. తరచుగా చెల్లింపులను ఆలస్యం చేసేవాడు. మ్యాన్హట్టన్ వెళ్లినప్పుడు తనకే కాకుండా ఇతర ఇన్ఫోసిస్ సహచరులకు సైతం హోటల్లను బుక్ చేసుకోవడానికి అనుమతినిచ్చేవాడు కాదు. ఇలా మూర్తి ఒకసారి క్లయింట్ వర్క్ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు, డాన్ లీల్స్ ఆయన్ను స్టోర్రూమ్లో పడుకోబెట్టాడు. కిటికీలు కూడా లేని ఉన్న ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్యే ఆ రాత్రి ఆయన నిద్రించాడు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కంపెనీ కోసం నారాయణమూర్తి ఇలాంటి అవమానాలను ఎన్నో సహించారు. అతిథి దేవుడిలాంటివారని తన అమ్మ అంటుండేదని, అతిథులతో వ్యవహరించిన తీరుని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుందని చెబుతూ ఈ ఘటన గురించి భార్య సుధా మూర్తితో నారాయణమూర్తి చెప్పారు. అనుకోకుండా వాళ్ల నాన్న ఎవరినైనా ఇంటికి ఆహ్వానించినప్పుడు తన తల్లి తాను తినకుండా అతిథికి అన్నం పెట్టేదని గుర్తు చేసుకున్నారు. కానీ డాన్ లీల్స్ తాను విలాసవంతమైన బెడ్పై పడుకుని తనను మాత్రం స్టోర్రూంలో పెట్టెపై పడుకోబెట్టాడని నారాయణమూర్తి చెప్పగా సుధామూర్తికి మాత్రం ఈ ఘటన కోపం తెప్పించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. -
‘తప్పు చేశాను సుధా.. నన్ను క్షమించవా!’
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాణయ మూర్తి పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్ధాల పాటు టెక్నాలజీ రంగంలో విశేష కృషి చేసిన ఆయన తన అభిప్రాయాలను తెలపడంలో ఎప్పుడూ మెుహమాట పడరు. ఇలా చేయడం వల్ల అనేకసార్లు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. ఆయినప్పటికీ ఆయన మాత్రం తనపని తాను చేసుకుపోతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కష్టపడి పనిచేసే వారికి రుణ పడి ఉండాలి కొద్ది రోజుల క్రితం భారత యువత వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణ మూర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేశంలోని విద్యావంతులు అత్యంత ఎక్కువగా కష్టపడే వారికి తక్కువగా కష్టపడి పనిచేసే వారు రుణ పడి ఉండాలని అన్నారు. ‘రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తారు’ అంటూ తన వైఖరిని సమర్థించుకున్నారు. చాలా మంది భారతీయులు, ఎన్ఆర్ఐలు చాలా మంది ప్రజలు శారీరకంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుంటారు. కాబట్టి భారత్లో కష్టపడి పనిచేయడం అనేది ఓ సర్వ సాధారణం. అలాగే భారీ రాయితీలతో విద్యను పూర్తి చేసిన మనలో చాలా మంది ప్రభుత్వం అందించే సబ్సీడీలకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తాను చేసే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చినప్పటికీ భారత్లో చాలా మంది, ఎన్ఆర్ఐలు తన వ్యాఖ్యల్ని ఏకీభవిస్తారని చెప్పారు. ఈ వ్యాఖ్యల్లో తప్పు ఏమైనా ఉందా? నా ఫీల్డ్లో నా కంటే మెరుగ్గా ఉన్నవారు ఎవరైనా ఉంటే నేను వారిని గౌరవిస్తాను. వారితో మాట్లాడుతాను. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంలో తప్పు ఎక్కడ జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేనైతే తప్పు ఉందని అనుకోను అని అన్నారు. నేను చేసిన పనికి చింతిస్తున్నా పనిలో పనిగా తన భార్య సుధా మూర్తి విషయంలో తాను చేసిన పనికి చింతిస్తున్నట్లు తెలిపారు. 1981లో కేవలం తన వాటాగా రూ.10,000తో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నారాయమూర్తి మారారు. అయితే ఈ డబ్బును తన భార్య సుధా మూర్తి దాచుకున్న సొమ్మని పలుమార్లు గతంలోనే వెల్లడించారు. భార్య దాచుకున్న మెుత్తాన్ని వ్యాపార పెట్టుబడిగా పెట్టి దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఇన్ఫోసిస్ను తీర్చిదిద్దటంలో ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. సహా వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి తాజా ఇంటర్వ్యూలో పెట్టుబడిగా డబ్బులిచ్చిన భార్యకు కంపెనీలో ఎందుకు అవకాశం కల్పించలేదని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన భార్య డబ్బుతో కంపెనీని ప్రారంభించినప్పటికీ ఆమెతో పాటు కుటుంబాన్ని ఇన్ఫోసిస్కు దూరంగా ఉంచాలనే తన నిర్ణయం సరైంది కాదన్నారు. ఇదే విషయంలో తాను చింతిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇతర సహ వ్యవస్థాపకుల కంటే సుధా మూర్తికి ఎక్కువ అర్హత ఉందని నమ్మినప్పటికీ.. తన భార్యను సంస్థలో చేరడానికి ఎప్పుడూ అనుమతించలేదని అన్నారు. ఈ సందర్భంగా నారాయణ మూర్తి.. తన భార్య సుధా మూర్తిని క్షమాపణలు కోరేలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. -
సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి 'సుధామూర్తి' (Sudha Murthy) ఇటీవల కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా.. లేదా అనే విషయాన్ని గురించి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుధా మూర్తి కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి, భవన నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని.. కళ, సంస్కృతి, భారతీయ చరిత్ర మొత్తం ఉట్టిపడేలా ప్రతిదీ చాలా అందంగా ఉన్న ఈ నిర్మాణం గురించి చెప్పడానికి మాటలు చాలవని తెలిపింది. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడం తన కల అని.. ఆ కల ఇప్పటికి నిజమైందని విలేకరులతో వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకరులు మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని సుధా మూర్తిని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు నవ్వుతూ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన కోడలు గురించి ప్రస్తావిస్తూ అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులకు ముందు అపర్ణ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. #WATCH | Delhi | As Sudha Murty visits the Parliament, she says, "It is so beautiful...No words to describe. I wanted to see this for a long time. It was a dream come true today. It is beautiful...It's art, culture, Indian history - everything is beautiful..." pic.twitter.com/P2kKp2Wj2o — ANI (@ANI) December 8, 2023 -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
పిల్లలు ఇష్టపడే యానిమేటెడ్ సిరీస్.. ఫ్రీగా చూసేయండి..
చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేసినా, నిద్రపోకుండా ఏడుస్తున్నా పెద్దవాళ్లు కథలు చెప్పేవారు. మరీ ముఖ్యంగా నానమ్మలు, అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు బాల్యం నుంచే నీతి పాఠాలు బోధించేవారు. బడిలో చెప్పని ఎన్నో విషయాలను కథల రూపంలో తెలుసుకునేవారు. ఇప్పుడు ఫోన్ల వాడకం పెరిగిపోయాక కథలు చెప్పేవాళ్లే కరువయ్యారు. కథలు చెప్తానంటున్న సుధామూర్తి అయితే టీవీ, ఫోన్లోనూ పిల్లల కోసం బోలెడన్ని కార్టూన్ చిత్రాలు, యానిమేషన్ కథలు, పాటలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాను కూడా కథలు చెప్తానంటోంది ఇన్ఫోసిస్ చైర్ పర్సన్, రచయిత్రి సుధామూర్తి. ఆమె చిన్నపిల్లల కోసం ఎన్నో కథల పుస్తకాలు తీసుకొచ్చింది. పిల్లలకు అర్థమయ్యేలా సరళ భాషలో కథలు రాసి ఆకట్టుకుంది. ఈసారి ఓ అడుగు ముందుకువేసి యానిమేటెడ్ సిరీస్ చేసింది. తను రాసిన కథలకు, పాత్రలకు ప్రాణం పోసి పిల్లల ముందుకు తీసుకొచ్చింది. 'స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ' పేరిట యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేసింది. మూర్తి మీడియా, కాస్మోస్ మాయ సంస్థల భాగస్వామ్యంతో ఈ సిరీస్ తెరకెక్కింది. మూర్తి మీడియా యూట్యూబ్ ఛానల్లో ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసారమవుతోంది. ఈ సిరీస్లో మొత్తం 52 కథలు ఉంటాయి. స్టోరీ టైమ్ విత్ సుధా అమ్మ సిరీస్ అక్టోబర్ 31 నుంచి యూట్యూబ్లో ప్రసారమవుతోంది. చదవండి: ఆదిపురుష్కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు.. దేశం వదిలి వెళ్లిపోయా.. -
ఇన్ఫోసిస్ సుధామూర్తి పేరుతో వసూళ్లు.. పూజారి అరెస్ట్!
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్.నారాయణమూర్తి సతీమణి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి పేరుతో డబ్బు వసూళ్లు చేస్తున్న బెంగళూరుకు చెందిన అరుణ్కుమార్(34) అనే పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి బెంగళూరు సమీపంలోని మల్లేశ్వరంలో అరుణ్కుమార్ను అరెస్ట్ చేసినట్లు జయానగర్ పోలీసులు తెలిపారు. అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలోని కన్నడ కూట నుంచి అరుణ్కుమార్ రూ.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నిర్వహించబోయే కన్నడ కూటాలో సుధామూర్తిని ముఖ్య అతిథిగా తీసుకొస్తానని చెప్పి వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. అయితే సదరు సంస్థ నుంచి ఏప్రిల్లో వచ్చిన ఆహ్వానాన్ని సుధామూర్తి తిరస్కరించారు. అయిన్పటికీ ఆమె సమావేశానికి హాజరవుతున్నట్లు ఓ మహిళ ఫొటోలు, వీడియోలను వైరల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాలోని మిల్పిటాస్లో సెప్టెంబరు 26న సేవా ఇంటర్నేషనల్ అనే స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ డాక్టర్ సుధామూర్తి’ ఈవెంట్ను తప్పడు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు మరో మహిళ కారణమని తెలిపారు. ఆ ఈవెంట్కు టిక్కెట్ ధర రూ.3,330 నిర్ణయించినట్లు చెప్పారు. -
సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు
ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించారు.రెండు వేర్వేరు ఘటనల్లో తన పేరును ఉపయోగించి లావణ్య, శ్రుతి అనే పేరుతో ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడ్డారంటూ ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమత సంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మమత సంజయ్ ఫిర్యాదు మేరకు .. 2023 ఏప్రిల్ 5న సుధా మూర్తికి ఓ ఈమెయిల్ వచ్చింది. కన్నడ కూట ఆఫ్ నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్సీ) సంఘం 50వ వార్షికోత్సవానికి అధితులుగా రావాలనేది ఆ మెయిల్ సారాంశం. అయితే అదే నెల ఏప్రిల్ 26న ఆ మెయిల్కు సుధా మూర్తి ఆఫీస్ ప్రతినిధులు స్పందిస్తూ.. బిజీ షెడ్యూల్ వల్ల కేకేఎన్సీ ఈవెంట్కు రాలేరని సమాధానం ఇచ్చారు. సుధా మూర్తి పర్సనల్ అసిస్టెంట్గా కానీ ఆగస్టు 30న మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారంటూ ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధా మూర్తి కేకేఎన్సీ నిర్వాహకుల నుంచి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా తాను సుధామూర్తి పర్సనల్ అసిస్టెంట్గా పరిచయం చేసుకున్న లావణ్య అనే మహిళ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తేలింది. అంతేకాదు ఆమె పలువురిని నుంచి నగదు వసూలు చేసినట్లు తేలింది. ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు అమెరికాలో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి సుధా మూర్తి హాజరవుతున్నారంటూ శ్రుతి అనే మరో మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై సుధా మూర్తి వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ మోసానికి పాల్పడిన మహిళలు ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఆ ఇద్దరు మహిళలపై ఐపీసీ-419 (మోసం), 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-66(సి), 66(డి) సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
24 ఏళ్ల కింద కొన్న చీరే.. మళ్ళీ కొనలేదు - ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు సైతం వారానికో, నెలకో షాపింగ్ చేస్తూ ఉంటారు. అయితే వందల కోట్లకు అధిపతి అయినప్పటికీ చాలా సింపుల్గా, ఎంతో మందికి ఆదర్శమైన ఒక మహిళ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఇన్ఫోసిస్ అనగానే గుర్తొచ్చేది 'నారాయణ మూర్తి', కానీ ఈ రోజు ఇన్ఫోసిస్ ఆ స్థాయిలో ఉందంటే దానికి పెట్టుబడి 'సుధా మూర్తి' ఇచ్చినదే అని చాలామందికి తెలియకపోవచ్చు. సుధా మూర్తి నేడు సుమారు రూ. 775 కోట్లు సంపద కలిగి ఉన్నప్పటికీ గత 24 సంవత్సరాల్లో ఒక్క చీర కూడా కొనలేదు అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. నిజానికి సింప్లిసిటీ గురించి మాట్లాడాల్సి వస్తే తప్పకుండా ఎవరైనా సుధా మూర్తి గురించి మాట్లాడతారు. 1950 ఆగష్టు 19న జన్మించిన సుధామూర్తి ఉన్నత భావాలు కలిగిన విద్యావేత్త, రచయిత్రి మాత్రమే కాదు.. ఎంతో మందికి సహాయం చేసే పరోపకారి కూడా. ఈమెకు 2023లో భారత ప్రభుత్వం దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అందించింది. చీరలు కొనకపోవడానికి కారణం.. 24 సంవత్సరాలుగా చీరలు కొనకపోవడానికి వెనుక ఒక కారణం కూడా ఉందని తెలుస్తోంది. కాశీకి వెళ్ళినప్పుడు పవిత్ర గంగా స్నానం చేసి షాపింగ్ (ముఖ్యంగా చీరలు కొనడం) మానేస్తాని చెప్పుకోవడమే అని తెలుస్తోంది. ఎవరైనా గంగా నదిలో తమకు ఇష్టమైన వాటిని వదిలిపెడితే మంచి జరుగుతుందని నమ్ముతారు. కానీ సుధా మూర్తి చీరలు కొనటం మానేసింది. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? సుధా మూర్తి ఇష్టాలతో నారాయణ మూర్తి కూడా ఏకీభవించారు. ఈ కారణంగానే వారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారు. వీరిరువురూ పుస్తకాలు మాత్రం విరివిగా కొనుగోలు చేస్తారు. ఇప్పటికి వీరు 20,000కంటే ఎక్కువ బుక్స్ సేకరించినట్లు తెలుస్తోంది. -
ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' కంపెనీ ఇలా మొదలైంది..!
ఈ రోజు సుధామూర్తి గురించి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా మాత్రమే కాకుండా.. సమాజసేవలో తమవంతు కృషి చేస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే నేడు లక్షల కోట్ల ఐటీ కంపెనీగా అవతరించిన సంస్థ ఒక చిన్న గదితో ప్రారంభమైనట్లు, కేవలం రూ. 10,000 పెట్టుబడితో ముందుకు కదిలినట్లు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగిన నారాయణ మూర్తి విజయం వెనుక సుధామూర్తి ఉందని అందరికి తెలుసు. కంపెనీ ప్రారంభించాలని కలలు కన్న రోజుల్లోనే ఆమె వద్ద రూ. 10,000 అప్పుగా తీసుకుని స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడే భారత్ ఐటీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో భవిష్యత్తుని చూసి కంపెనీ ప్రారంభించారు. నేడు లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆ రోజు చిన్న గదిలో ప్రారంభమైనట్లు చెబుతారు. అదే ఈ రోజు వేలమందికి ఉద్యోగాలు కల్పించి ముందడుగు వేస్తోంది. 1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ఈ రోజు ప్రపంచంలో పేరుగాంచిన పెద్ద ఐటీ కంపెనీగా రూ. 5 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైనదిగా నిలబడింది. ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్లీ.. ధర తెలిస్తే షాకవుతారు! ఇంజినీర్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు.. అయితే స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని టెల్కో కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ ఉద్యోగంలో చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. నేడు టాటా కంపెనీలో మహిళలు కూడా పనిచేస్తున్నారంటే అది సుధామూర్తి చలవే. -
Sudha Murty Photos: అమృతమూర్తి 'సుధామూర్తి' అరుదైన ఫోటోలు
-
టాటా కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ - ఎవరో చెప్పుకోండి చూద్దాం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన ఈ ఆదర్శమూర్తి ఇప్పుడు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. అయితే చదువుకునే వయసులో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు. సుధామూర్తి 1974లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది. 150 మంది విద్యార్థులలో ఈమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కోగలిగిన ధీశాలి. మహిళల హక్కుల కోసం పాటుపడి అప్పట్లో ఏకంగా జేఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఈ రోజు టాటా కంపెనీలో మహిళలు పనిచేస్తున్నారంటే దాని వెనుక సుధామూర్తి హస్తం ఉండటమే. ఇప్పటికే కళ, సంస్కృతి, ప్రజా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పేదరికం తగ్గింపు, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తనదైన రీతిలో సామజిక ఈమె సేవ చేసింది. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! సుధామూర్తి హార్వర్డ్ యూనివర్శిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొంది, అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అండ్ లైబ్రరీ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నిరాడంబరమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఈమెకు పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది. -
కరీనా కపూర్ కనీసం పట్టించుకోలేదు: నారాయణ మూర్తి వీడియో వైరల్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్పై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్స్టా పేజీలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి కరీనా కపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు. అభిమానుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును నారాయణ మూర్తి తీవ్రంగా తప్పుబట్టారు. అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని నారాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు. ‘నేను ఓసారి లండన్ నుంచి వస్తుండగా విమానంలో నా పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నారు. ఆమెను చూసి చాలా మంది అక్కడకు వచ్చి హాయ్ అంటూ పలకరించారు. కానీ, ఆమె కనీసం స్పందించలేదు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మన దగ్గరకు వచ్చి పలకరిస్తే కనీసం లేచి నిల్చొని నిమిషమో, అర నిమిషమో మాట్లాడుతాం. మననుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే’నన్నారు నారాయణ మూర్తి. చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే! ఇంతలో సుధామూర్తి కల్పించుకొని.. కరీనాకు కోట్లలో అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉంటుందని అన్నారు. ‘నారాయణ మూర్తి ఓ సాఫ్ట్వేర్ వ్యక్తి, కంపెనీ ఫౌండర్.. నీకు 10వేల మంది అభిమానులు ఉంటారేమో.. కానీ, సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు కదా’’ అని అన్నారు. సుధామూర్తి మాటలకు అక్కడున్న వారంతా నవ్వులు చిందించారు. ఆమెను ప్రశంసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టారు. అయినప్పటికీ నారాయణ మూర్తి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఇక్కడ సమస్య అది కాదు. ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం కూడా ఆ ప్రేమను తిరిగి ప్రదర్శించాలి. ఏ రూపంలోనైనా సరే.. అది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మనలోని అహాన్ని తగ్గించే మార్గాలు అంతే’ నని అన్నారు. చదవండి: 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళను ఉరితీయనున్న సింగపూర్ View this post on Instagram A post shared by ENTREPRENEURS OF INDIA (@eoindia) -
ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..
రచయిత్రి, ప్రముఖ ఆదర్శ మూర్తి 'సుధామూర్తి' (Sudha Murthy) గత కొంత కాలంగా తన ప్రేమ గురించి, పారిశ్రామిక వేత్త భర్తగా ఉంటే భార్య ఎలా నడుచుకోవాలి అనే చాలా వివరాలు వెల్లడించింది. కాగా ఇప్పుడు తాను ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, నాన్వెజ్ ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా ఇష్టపడుతుందా అనే వివరాలు తెలిపింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఖానే మే కౌన్ హై (Khaane Mein Kaun Hai) ఎపిసోడ్లో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన ఫుడ్ తానే తీసుకెళుతుందని వెల్లడించింది. శాఖాహారానికి, మాంసాహారానికి ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదని.. ఆఖరికి గుడ్లు, వెల్లులి కూడా తినదని తెలిపింది. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని కూడా చెప్పింది. తన వద్ద కుకింగ్ బ్యాగ్ కూడా ఉందని, అందులో ఆహారాన్ని వండడానికి ఉపయోగించే చిన్న కుక్కర్ ఉంటుందని చెప్పారు. (ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!) కొన్ని సంవత్సరాల క్రితం సుధామూర్తి తన అమ్మమ్మతో.. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు మీ తినుబండారాలను మీతో తీసుకెళ్లకూడదు, బయట ఎందుకు తింటారు అని సరదాగా అడిగిందని.. చివరకు ఆ విధానాన్నే నేను అనుసరిస్తున్నానని సుధామూర్తి చెప్పింది. కావున ఇప్పుడు ఏ దేశానికీ వెళ్లినా దాదాపు తన ఫుడ్ తానే తీసుకెళుతుందని స్పష్టం చేసింది. -
సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!
Sudha Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రముఖ రచయిత్రిగా, మానవతామూర్తిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఆధునిక కాలంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలలో తన ప్రేమ గురించి వెల్లడించింది. కాగా ఇటీవల ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎప్పుడూ సినిమాలలోని ఎమోషనల్ సీన్లు చూసి కంటతడి పెట్టుకోలేదని, 'అలియా భట్' (Alia Bhatt) నటించిన 'రాజీ' మూవీలో తన నటనకు ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదటి సారి 1958లో సినిమా చూసినట్లు, అప్పటి నుంచి వైజయంతిమాలకు అభిమానిగా మారానని చెప్పింది. ఈ తరం వారిలో 'అలియా భట్' నటనను అభిమానిస్తానని.. ఆమె గ్రేట్ యాక్టర్ అని కొనియాడింది. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, మ్యూజిక్ వంటి వాటని గురించి ఇంట్లో చర్చించుకుంటామని సుధామూర్తి తెలిపారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 190 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా 64 వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి కావడం గమనార్హం.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- రొమాంటిక్ సీన్స్.. ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్
- ‘అద్భుతం కంటే తక్కువేం కాదు’.. కేజ్రీకు మద్యంతర బెయిల్పై
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement