సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్‌ కుట్ర | Sakshi
Sakshi News home page

సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్‌ కుట్ర

Published Fri, May 10 2024 3:35 PM

సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్‌ కుట్ర

గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రయివేట్‌ వ్యక్తులకు అమ్మేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొగ్గు బ్లాకులను వేలం ప్రక్రియలోనే దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ, గుర్తింపు యూనియన్‌ ఏఐటీయూసీ చెప్పడం అన్యాయమన్నారు. వేలంలో బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కకుండా ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలకు దక్కితే జరుగబోయేది విధ్వంసమే అన్నారు. సంస్థకు అవసరం లేని విదేశీ యంత్రాలను కొనిపించిన ఆనాటి కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్ల సింగరేణి సంస్థ నష్టాల పాలైందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు నూనె కొమురయ్య, మాదాసి రామమూర్తి, పర్లపల్లి రవి, పల్లె సురేందర్‌, బొగ్గుల సాయి, పులిపాక శంకర్‌, రాజ్‌కుమార్‌, పాశం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement