-
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
-
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
సాక్షి, విజయవాడ: డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటమాడుతోంది. లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై ఒత్తిళ్లు చేస్తోంది. ఈసీ ఉత్తర్వులను ఇవాళ్టి వరుకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిన్న అర్థరాత్రి హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని అధికారులు సంప్రదించారు. క్లారిఫికేషన్ కోసం ఈసీని అధికారులు కోరగా, ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమని అధికారులు అంటున్నారు. ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరో వైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో టీడీపీ అప్పీల్ వేసింది. తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొనగా, దీంతో టీడీపీ బాగోతం బయటపడింది. -
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
-
అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారం.. కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 దాకా కనపడని ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు ఆ తర్వాత ఒకటొకటిగా కళ్లకు కడుతున్నాయి. కరోనా లాంటి అనూహ్య ఉత్పాతం దాదాపు రెండేళ్ల కాలాన్ని మింగేసినా.. కేవలం మూడేళ్ల కాలంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని కొనసాగుతుండగా కొన్నింటిని పూర్తి చేయడం జరిగింది. అయినప్పటికీ తెలుగుదేశం ఆ పార్టీ మద్దతుదారులు ‘అభివృద్ధి లేదు’ అనే మాటనే గోబెల్స్ను తలదన్నేలా ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?ఏ ప్రభుత్వం మీదనైనా పోరాటం చేయాలంటే పేదల సమస్యలనే ప్రతిపక్షాలు తలకెత్తుకోవడం సర్వసాధారణం. పేదరికం పెరిగిందనో..పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోయిందనో, పేదల బ్రతుకులు దుర్భరంగా మారాయనో..విమర్శలతో ఇరుకునపెట్టడం సహజం. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఆ పనికి బదులు.. అభివృద్ధి లేదు అంటూ సరికొత్త రాగం ఆలపించడానికి కారణం.. ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అంటే నమ్మేవారు లేకపోవడం.ఇప్పుడు బడుగువర్గాల నుంచి జగన్ ప్రభుత్వంపై ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడం, పథకాలు అందడం లేదనో, పక్కదారి పడుతున్నాయనో, ఇబ్బందుల్లో ఉన్నామనో ఉద్యమాలు, ఆందోళనలు వారు చేపట్టకపోవడం.. అడగకుండానే అన్నీ అమర్చిపెడుతున్న వైఎస్ జగన్ పాలన నిరుపేదలకు ఎక్కడ లేని భరోసా ఇచ్చింది. దీంతో పేదల్ని వంచించే, మాటలతో రెచ్చగొట్టి ప్రభుత్వంపై ఉసిగొల్పే ప్రయత్నాలు ఫలించవని ప్రతిపక్షాలకు పూర్తిగా అర్ధమైంది. తత్ఫలితంగానే అభివృద్ధి లేదు అంటూ ఈ ఆరున్నొక్కరాగాలు.నాడు ‘కట్టుబట్టలతో’ కల్లబొల్లి కబుర్లు తప్ప అభివృద్ధి ఏదీ..ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలించిన కాలం ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఎప్పుడు చూసినా ఆయన నోటి వెంట వచ్చే కొన్ని రొడ్డకొట్టుడు వ్యాఖ్యల్లో ‘లోటుబడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మనకు ఇచ్చారు.. మనల్ని కట్టుబట్టలతో తరిమేశారు. మనకు రాజధాని లేదు. ఇప్పటికి 26 సార్లు ఢిల్లీకి వచ్చాను అయినా ఫలితం లేదు’. ఇవేగా ఆయన తాను ఇచ్చిన రైతు రుణమాఫీ, నిరుద్యోగభృతి.. వగైరా హామీల్ని ఎగవేయడం కోసమే ముందస్తుగా ఇలాంటివన్నీ పాడిందే పాట అన్నట్టు వినిపించేవారు.అలాంటి అబద్ధాలతోనే ఐదేళ్ల పాటు పనికిరాని పాలన సాగించారు. తన హయంలో దాదాపుగా 2.50లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఇచ్చిన హామీల్లో పావుశాతం కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిందీ లేదు. కొత్త రాజధాని పేరుతో రకరకాల డ్రామాలు ఆడారే తప్ప రాజధాని కాదు కదా అక్కడ ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు.చంద్రబాబులా ఏడుపులు పెడబొబ్బలు లేవు..ఖాళీ ఖజానాకి తోడు రూ.లక్షల కోట్ల రుణభారం ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన తదుపరి ముఖ్యమంత్రికి అందించి వెళ్లారు. తొలిసారి ముఖ్యమంత్రిగా అంత పెద్ద బాధ్యతలు తలకెత్తుకున్నా.. తొణకకుండా బెణకకుండా వైఎస్ జగన్ పాలనను పరుగులు పెట్టించారు. గద్దెనెక్కిన కొన్ని నెలలకే కరోనా మహమ్మారి వచ్చి మీద పడింది. అయినా ఎక్కడా అదరలేదు బెదరలేదు. ఎందరు శ్రేయోభిలాషులు చెప్పినా కరోనా సమయంలో కూడా పథకాలను ఆపలేదు. కట్టుబట్టలతో వచ్చాం, మన పరిస్థితి బాగోలేదు అంటూ చంద్రబాబులాగా ఏ రోజూ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా మాట్లాడలేదు. చుట్టూ సమస్యల్ని ఎదుర్కుంటూనే ఇచ్చిన ప్రతీ హామీని తూచా తప్పకుండా అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.ఓ వైపు సరికొత్త శైలి సంక్షేమ పధాన్ని అనుసరిస్తూనే మరోవైపు మూలాల నుంచి అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పాలనా ఫలాలు ప్రతీ చోటా కళ్లకు కడుతున్నాయి. గ్రామసెక్రటేరియల్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, వైద్య కళాశాలలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు.. చంద్రబాబు పాలనలో కనపడని ఎన్నో అభివృద్ధి సూచికలు ఆంధ్రప్రదేశ్లో కళ్లకు కడుతున్నాయి.పదేపదే అదే మాట అందుకే..ఓం భూం హాం ఫట్ అంటే ప్రత్యక్షమైపోవడానికి పైన పేర్కొన్నవేవీ ఇంద్రజాల టక్కుటమార ఫలితాలు కావు. ఎంతో దూరదృష్టితో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రజల మేలు కోసం కళ్ల ముందుకు తెచ్చిన బంగారు భవిష్యత్తు దీపికలు. అయినప్పటికీ అభివృద్ధి లేదనే పాచిపాట ఎందుకు పాడుతున్నారంటే.. పల్లెల్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు.. ఇవన్నీ కళ్లారా చూసి పాలనను బేరీజు వేసుకునేంత తీరిక ఓపిక ప్రజలకు ఉండదని సో.. చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ప్రచార ప్రభావానికి వీరు లోనవుతారనేదే ఈ అభివృద్ధి లేదనే ప్రచారం వెనుక దాగున్న కుయుక్తి.అయితే గతంలోలాగ ఏది పడితే అది నమ్మే అవసరం, పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రజల్లో రాజకీయాలపై, నేతల పాలనా దక్షతపై అవగాహన పెరిగింది. ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు– వైఎస్ జగన్ పాలనలోని వ్యత్యాసాలను బేరీజు వేసుకునేందుకు వీలుగా వారికి ఇప్పుడు ఎన్నో రకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా గోబెల్స్ ప్రయత్నాలను నీరుగారుస్తున్నాయి. నిజాలను నిర్ద్వంద్వంగా గెలిపించనున్నాయి.–సత్యార్థ్. -
కూటమితో లాభం లేదు..
-
బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..
-
అరాచకాల అసత్యమూర్తి
సాక్షి, టాస్క్ఫోర్స్ : సత్యం...శివం..సుందరం...అంటారు...ఈ టీడీపీ మాజీ మంత్రి పేరులో మాత్రమే సత్యముంది.. మనిషి స్వభావమే అసత్యం. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదు.. సాటి మహిళా ప్రజాప్రతినిధులను అసభ్యకరమైన భాషలో నిందిస్తుంటారు. ఈయన తాను ఏలిన నియోజకవర్గంలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయన తనయుడూ తండ్రికి తగ్గవాడే. ఓ దళిత మహిళపై దుశ్శాసన పర్వం సాగించి, ఆమె భూమిని కబ్జా చేసిన చరిత్ర ఈ తండ్రీ కొడుకులది. నియోజకవర్గంలో భూములను కాజేశారు. క్వారీలను కొల్లగొట్టారు. ఎన్టీఆర్ గృహకల్ప పేరిట ప్రభుత్వ భూములనూ కబళించారు.ఇన్ని ఆగడాలు చేసిన ఈ మాజీకి ఇటీవల టికెట్ విషయంలో టీడీపీ అధినేత నుంచి అవమానాలూ ఎదురై ...మంచంపట్టి...కన్ను లొట్టపోయి.. ఇప్పుడు మళ్లీ మరోసారి మరింతగా దోచుకోవడానికి పక్క నియోజకవర్గం నుంచి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో మూడు కబ్జాలు.. ఆరు ఆక్రమణలుగా సాగింది ఈ మాజీ ప్రజాప్రతినిధి పాలన. ముఖ్యంగా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈయన తనయుడు రెచ్చిపోయారు. రెవెన్యూ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని భూములను కొల్లగొట్టారు.అసైన్డ్, బీ–ఫారం భూములతో పాటు దళితులకు చెందిన భూములనూ విడిచిపెట్టలేదు. నీరు–చెట్టు పథకంలోనూ అడ్డంగా దోచుకుతిన్నారు. అక్రమంగా తవ్వుకున్న క్వారీలు వీరికి అదనపు ఆదాయం తెచి్చపెట్టాయి. ఈ దోపిడీ వ్యవహారాల్లో అవసరమైతే దాడులకూ దిగిన సందర్భాలూ ఉన్నాయి. పోలీసులను ఉపయోగించుకుని కేసులు పెట్టిన ఘటనలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెర్రిపోతులపాలెం దాషీ్టకం.. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపిన భూదోపిడీలు ఆ మాజీ మంత్రి పనితీరుకు మచ్చుతునకలు. 2017 డిసెంబర్ 19న జెర్రిపోతులపాలెంలో దళితుల ఆ«దీనంలో ఉన్న భూమిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహకల్ప పేరిట దోచుకోవడానికి యతి్నంచారు. ఆ భూమికి హక్కుదారైన దళిత మహిళ వీరిని అడ్డుకోబోగా ఆగ్రహానికి గురైన టీడీపీ నాయకులు మాజీ మంత్రి తనయుడి ప్రోద్బలంతో ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, దాడికి తెగబడ్డారు. దీనిపై కేంద్ర ఎస్సీ కమిషన్ ప్రతినిధులు రంగంలోకి దిగడంతో ఏడుగురు టీడీపీ నాయకులు అరెస్ట్ అయ్యారు. ఆరు క్రిమినల్ కేసులు మాజీ మంత్రిపై ఆరుక్రిమినల్ కేసులు ఉన్నాయి. దీనితోపాటు మరో కేసూ ఉంది. వీటిని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో 2023, అక్టోబర్ 1న గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్స్టేషన్లో 153ఏ, 354(ఏ), 504, 505, 506, 509, 499 ఐపీసీ, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే నేరంపై 2023, సెపె్టంబర్ 30న విజయవాడ సీఐడీ–2 పోలీసులు 153ఏ, 504, 505(2), 506, 509, ఆర్/డబ్ల్యూ 120బీ ఐపీసీ, 67 ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెందుర్తి మండలం పినగాడి గ్రామంలో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగిస్తున్న క్రమంలో తహసీల్దార్, వీఆర్వోలను అడ్డుకొని వారి విధులకు ఆటంకం కలిగించినందుకు 2020, ఫిబ్రవరి 17న 341, 353 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. హౌసింగ్ పేరుతో భూ ఆక్రమణలు.. అక్రమంగా అమ్మకాలు... అవినీతికి మారుపేరైన జన్మభూమి కమిటీలు మాజీ మంత్రి అండతో చెలరేగిపోయాయి. ఎనీ్టఆర్ హౌసింగ్ పథకం పేరుతో భూ ఆక్రమణలకు తెగబడ్డారు. సబ్బవరం, పెందుర్తి, పరవాడ మండలాల్లో ఈ పథకం పేరు చెప్పుకుని వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అమ్ముకున్నారు. ప్రతి పంచాయతీలోనూ టీడీపీ నాయకులు ఓ జాబితా తయారు చేసి, అందులో అర్హులను వదిలేసి, తమ బినామీల పేర్లు రాయించుకున్నారు.. ఆ తర్వాత అక్రమంగా లేఅవుట్లు వేసి స్థలాలు పంచుకుని తెగనమ్ముకున్నారు. క్వారీలనూ తవ్వేసుకున్నారు మాజీ మంత్రి అండతో టీడీపీ నాయకులు క్వారీలనూ వదల్లేదు. జెర్రిపోతులపాలెం, సబ్బవరం, నరవ, పొర్లుపాలెం ప్రాంతాల్లో క్వారీలను తవ్వుకుని దోపిడీ చేసే క్రమంలో అక్కడి రైతుల భూముల్లో ఫలసాయాన్నీ ధ్వంసం చేశారు. పెందుర్తి మండలం చింతగట్లలో స్థానిక రెవెన్యూ అధికారుల కక్కుర్తిని సొమ్ము చేసుకున్న టీడీపీ నాయకులు 117 ఎకరాల్లో క్వారీ అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో క్వారీకి ఆనుకునే ఉన్న ఊరిని సైతం అక్కడ ఊరే లేదని నివేదికలో అధికారులతో రాయించారు. ఇదే తరహాలో సబ్బవరం మండలం అమృతపురంలో క్వారీకి అనుమతి తెచ్చుకున్న టీడీపీ నాయకులు దానికి దారి కోసం ఏకంగా రైతులకు ఫలసాయం అందిస్తున్న మొక్కలనూ అప్పట్లో తొలగించారు. -
మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
» కృష్ణాజిల్లా గన్నవరం మండలం మెట్టపల్లిలో టీడీపీ నేత తులసీమోహన్ నివాసంలో అక్రమంగా నిల్వచేసిన రూ.79 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన అనుచరుడైన ఆయన నివాసంలో 1,210 బాక్సుల్లో ఉన్న 58,080 మద్యం బాటిళ్లను అధికారులు జప్తుచేశారు.» ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మరో టీడీపీ నేత భీమ వెంకటేశ్వరరావు నివాసంలో అక్రమంగా నిల్వచేసిన రూ.12.48 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...ఇవీ సెబ్ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం వివరాలు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులు, సెబ్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విస్తృతంగా జరుపుతున్న సోదాల్లో ఇప్పటివరకు రూ.28.83 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా టీడీపీ నేతలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్నవే. ఇవి ఇప్పటివరకు పోలీసులు, సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం నిల్వలు మాత్రమే. కానీ, పోలీసుల కళ్లుగప్పి ఇప్పటికే భారీగా అక్రమ మద్యాన్ని టీడీపీ ముఠా రాష్ట్రంలోకి తరలించేసింది. అంటే.. టీడీపీ ఎంత భారీస్థాయిలో రాష్ట్రంలోకి అక్రమ మద్యాన్ని కుమ్మరిస్తోందన్నది తేటతెల్లమవుతోంది. ఎన్నికల్లో అక్రమాలకు ఇప్పటికే నల్లధనాన్ని గుట్టలు గుట్టలుగా కుమ్మరిస్తున్న చంద్రబాబు.. ఓటర్లను చిత్తు చేసేందుకు అక్రమ మద్యాన్ని కూడా భారీగా పారిస్తున్నారు. ఇందుకోసం పకడ్బందీగా కుట్రను అమలుచేస్తున్నారు.పొరుగు రాష్ట్రాల నుంచి రూ.వేయి కోట్ల అక్రమ మద్యం.. మద్యం ద్వారా ఓటర్లను చిత్తుచేయాలన్న కుతంత్రాన్ని అమలుచేసే బాధ్యతను కూడా బాబే తన భుజానికెత్తుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ పూర్తి పారదర్శకంగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దుచేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలను ఏర్పాటుచేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాష్ట్రంలోని డిస్టిలరీలు, ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ అంతా ఈసీ పర్యవేక్షణ కిందకు వచ్చాయి. విజయవాడలో ఎక్సైజ్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేసింది. డిస్టిలరీలు, బ్రూవరీలు, బెవరేజస్ కార్పొరేషన్కు చెందిన మద్యం డిపోలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా మద్యం సరఫరా, విక్రయాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సమకూర్చలేమని భావించిన బాబు.. పొరుగు రాష్ట్రాలపై కన్నేశారు. తెలంగాణ, కర్ణాటకల్లోని కాంగ్రెస్ పెద్దల అండదండలతో ఈ కుట్రకు తెరతీశారు. తక్కువ ధర ఉండే నాసిరకరమైన గోవా మద్యాన్ని భారీగా అక్కడి నుంచి తెప్పించారు. ఇలా దాదాపు రూ.వేయి కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. మద్యం మత్తుతో చిత్తుచేయండి..ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే తన కుంతంత్రాన్ని చంద్రబాబు మరోసారి తెరపైకి తెచ్చారు. పేద, దిగువ మధ్య తరగతి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆయన మద్యం మాయోపాయానికి పాల్పడుతున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న ఓటర్లు ఈ సమయంలో విచక్షణా శక్తిని కోల్పోయి మద్యం మత్తులో ఉండేట్లు చేయాలన్నది ఆయన పన్నాగం. ప్రధానంగా మహిళా ఓటర్లు వైఎస్సార్సీపీకి పూర్తి అనుకూలంగా ఉండటం చంద్రబాబును హడలెత్తిస్తోంది. దాంతో పురుషులను గోవా మద్యం మత్తులో ముంచి వారితో మహిళలను బెదిరించి.. వేధించైనా సరే టీడీపీకి అనుకూలంగా మలచుకోవాలన్నది ఆయన ఎత్తుగడ. అందుకోసం నియోజకవర్గాల వారీగా పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. అక్కడ అక్రమ మద్యాన్ని పంపిణీ చేసేందుకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వీటిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఓ ప్రత్యేక కమిటీని నియమించారు. ఇక ఏఏ నియోజకవర్గాలకు ఏమేరకు మద్యం సరఫరా చేయాలి.. అందుకు ఏఏ మార్గాల్లో దానిని తరలించాలి.. ఎక్కడెక్కడ నిల్వచేయాలి.. ఎన్నికలకు మూడ్రోజుల ముందు మండలాలు, పంచాయతీలకు ఎలా చేర్చాలి.. అన్నదానిపై పకడ్బందీగా స్కెచ్ వేశారు. సాధారణంగా.. పోలింగ్ కోసం బూత్ కమిటీలను నియంమించడం అన్ని రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహమే. కానీ, చంద్రబాబు అందుకు అదనంగా కేవలం మద్యం పంపిణీకి ప్రత్యేకంగా కమిటీలను నియమించడం గమనార్హం. రాష్ట్రంలోకి రూ.వెయ్యికోట్ల నాసిరకం మద్యం..నాసిరకమైన గోవా మద్యం తాగితే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని తెలిసినా స రే.. పోయేవి సామాన్యుల ప్రాణాలే కదా అన్న రీతిలో చంద్రబాబు ఎన్నికల అక్రమాలకు బరితెగించారు. ఆ విధంగా తెప్పించిన రూ.వేయి కోట్ల విలువైన గోవా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల మీదుగా.. కర్ణాటక నుంచి శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల మీదుగా ఏపీలోకి తరలించారు. అప్పటికే స్టాక్ పాయింట్లుగా గుర్తించిన టీడీపీ నేతల నివాసాలు, వ్యాపార సంస్థల గిడ్డంగుల్లోకి వాటిని చేర్చారు. పోలింగ్కు ఎక్కువ సమయం లేనందున ఆ గిడ్డంగుల నుంచి మండలాలు, పంచాయతీల వారీగా పంపిణీ మొదలుపెట్టారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్పై కోటంరెడ్డి దాడి చేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని ప్రొఫెసర్ వసుంధర అన్నారు. డోలేంద్రపై దాడి చేసిన అనంతరం తనను, మరో మహిళను కోటంరెడ్డి కారులో ఎత్తుకెళ్లాడని తెలిపారు.సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మోసానికి, కపటానికి ప్యాంటు, షర్టు వేసి చేతిలో బీరు బాటిల్ పెడితే అతడే కోటంరెడ్డి అని.. కోటంరెడ్డి పైకి మాత్రం వేదాలు వల్లిస్తాడంటూ మండిపడ్డారు.‘‘కోటంరెడ్డి సోదరులు నియోజకవర్గంలో అనేక దందాలకు, అరాచకాలకు పాల్పడ్డారు. ఎంపీడీఓ సరళపై దాడికి పాల్పడి, ఆ దాడి నేనే చేయించానని కోటంరెడ్డి ఫోన్ చేసి మరీ ఆమెకు చెప్పారు. తిరుమల నాయుడు సహా అనేక మందిపై దాడులు జరిపారు. కోటంరెడ్డి లాంటి నీచుడికి ఓటు వేయొద్దు’’ అని వసుంధర పేర్కొన్నారు.‘‘రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి దుకాణాల వరకూ మామూళ్లు వసూలు చేశారు. మహిళల జీవితాలను నాశనం చేశారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు ఉంది. నెల్లూరు రూరల్ ప్రజలంతా ఆదాలకు ఓటు వేయాలి’ అని వసుంధర విజ్ఞప్తి చేశారు. -
ఇది అభివృద్ధి కాదా? చంద్రబాబూ: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మంచి జరిగిందంటేనే ఓటేయమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఐదేళ్లలో ఏం చేశామో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నామన్నారు.‘‘నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదు. అభివృద్ధి జరగలేదని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలందిస్తున్నాం. రెండేళ్లు కరోనా సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు ఆపలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మార్పు వాళ్లకు కనిపించడం లేదు. ప్రతి సచివాలయం పరిధిలోనూ రూ. 20 కోట్ల నుంచి రూ.30 కోట్ల మేర సంక్షేమం అందింది’’ అని సజ్జల వివరించారు.‘‘బాబు హయాంలో డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు.. సున్నా వడ్డీ ఆపేశారు. పేదల కుటుంబాలు బాగుపడేలా సంక్షేమ పథకాలు అందించాం. 16 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందించాం. మహిళలకు రూ.75 వేలతో చేయూత కల్పించాం. పేదలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం అండగా నిలిచింది. మహిళల పేరు మీదే 31 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. కియాను మించిన పర్రిశమలు చాలా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. దేశ జీడీపీలో ఏపీ వాటా 4.82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. -
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
సాక్షి, అనంతపురం: చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయమని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కల్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం సిద్ధమేనా.. టైము రెండు కావస్తోంది. ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్యే ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలను పంచి పెడుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ,ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, నా ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం.కేవలం మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కానేకావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడం. ఇదే చరిత్ర చెబుతున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్ధం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే? పొరపాటున చంద్రబాబు నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతిఒక్కరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్దం చెప్పిన మీ జగన్.దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలలో మీ బిడ్డ ఈ 59 నెలల్లో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడనివిధంగా ఈరోజు రూ.2.70 లక్షల కోట్లు, మళ్లీ చెబుతున్నాను రూ.2.70 లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కడం, వివిధ పథకాలకు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే, వారి చేతికే ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా పంపించాడు అని ఈ సందర్భంగా సగర్వంగా చెబుతున్నాను. నేను అడుగుతున్నాను.. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా ఈ మాదిరిగా జరిగిందా? ఈమాదిరిగా బటన్లు నొక్కడం నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్లిపోవడం.. గతంలో ఎప్పుడైనా చూశామా? అని మీబిడ్డ అడుగుతున్నాడు. ఏకంగా 2 లక్షల 31 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి మీ జగన్. ఇలా అర్థం చెప్పిన పాలన కేవలం ఈ 59 నెలలకాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. గతంలో మేనిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చింది ఈ 59 నెలలకాలంలోనే కాదా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ప్రతీదీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో జరగనివిధంగా నాడు-నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, గవర్నమెంట్ బడులల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూములో కూడా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలోనూ ఈరోజు ట్యాబ్లు కనిపిస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియంతో మొదలు 3 తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, ఇంగ్లీష్ మీడియంతో మొదలుపెడితే ఐబీ దాకా ఈరోజు ప్రయాణం జరుగుతోంది. ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగనివిధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ అంటే పిల్లల టెక్స్ట్ బుక్కుల్లో ఒక పేజీ ఇంగ్లీష్ మరో పేజీ తెలుగుతో పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి. బడులు తెరిచే టైమ్కే పిల్లలకు విద్యాకానుక అందుతోంది, బడులు మొదలయ్యేసరికే పిల్లలకు గోరుముద్ద అనే కార్యక్రమంతో పిల్లలను చూసుకుంటున్నాం, ఈరోజు నేను అడుగుతున్నాను.. మొట్టమొదటిసారిగా తల్లులను ప్రోత్సహిస్తూ తమ పిల్లలను బడికి పంపండి చాలు బడికి పంపించినందుకు తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి అనే కార్యక్రమం,పెద్ద చదువులకు ఏ తల్లి, తండ్రి కూడా తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదని, అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన అనే కార్యక్రమం, ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను మన డిగ్రీలతో అనుసంధానం, డిగ్రీలో ఇంటర్న్షిప్ తప్పనిసరి చేయడం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగిందా? పిల్లల చదువుల మీద ప్రభుత్వం ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఏం అన్నా గతంలో జరిగిందా? అక్కా గతంలో జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా తమ్ముడూ?.అక్కచెల్లెమ్మలు ఆర్దిక స్వావలంబన దిశగా...మొట్టమొదటిసారిగా అక్కచెల్లెమ్మలను తమ కాళ్ల మీద తాము నిలబడేట్టుగా ఆ అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా, ఓ సున్నావడ్డీ,చేయూత, కాపునేస్తం,ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, అందులో చేపట్టిన ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇక్కడున్న ఇన్ని వేలమంది నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెమ్మలను అడుగుతున్నాను.. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు అందాయా? అన్నా జరిగాయా? జరిగాయా అక్కా? జరిగాయా తమ్ముడూ?.గతంలో లేని విధంగా రైతన్నను చేయిపట్టుకుని నడిపించాం.అవ్వాతాతలకు గతంలో ఎప్పుడూ జరగనివిధంగా అవ్వాతాతలకు నేరుగా ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, ఇంటివద్దకే రేషన్, ఇంటివద్దకే పథకాలు.. నేను అడుగుతున్నాను ఇప్పుడిలా జరుగుతున్న కార్యక్రమాలు ఇంటికే పెన్షన్, ఇంటివద్దకే రేషన్, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు ఇలా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం.. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. అన్నా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా? మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ కూడా జరగనివిధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా ఓ రైతుభరోసా, రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ.. నేను అడుగుతున్నాను ఇంతగా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్న పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడూ? జరిగిందా అక్కా.స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ.. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనివిధంగా ఆటోలు, ట్యాక్సీలు తోలుకునే నా అన్నదమ్ములకు ఈరోజు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్ననేస్తం, మత్స్యకారులకు మత్స్యకారభరోసా,చిరువ్యాపారులకు, శ్రమజీవులకు అండగా ఓ తోడు, చేదోడు, లాయర్లకు కూడా లా నేస్తం.. ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? అని మీబిడ్డ అడుగుతున్నాడు .పేదవాడు ఆరోగ్యం పరంగా అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని, పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఏకంగా రూ.25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆపరేషన్ తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ప్రతి ఇంటి తలుపు తడుతూ కూడా ఈరోజు ఇంటికే ఓ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం.. నేను అడుగుతున్నాను పేదవాడికి ఆరోగ్యంపట్ల ఇంత శ్రద్ధ చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. వీటన్నింటికీ తోడు ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ప్రతి గ్రామంలోనూ ఈరోజు గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ, నాలుగు అడుగులు అక్కడి నుంచి వేస్తే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, మరో నాలుగు అడుగులు ముందుకుపోతే అదే గ్రామంలో నాడు-నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి అక్కడే కనిపిస్తుంది, గ్రామానికే ఈరోజు ఫైబర్ గ్రిడ్ వచ్చింది, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్కచెల్లెమ్మలకు రక్షణగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తోంది. నేడు అడుగుతున్నాను.. ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్లెదుటే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈ విప్లవాలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా చూశారా? అని కూడా మీ బిడ్డ అడుగుతున్నాడు. ఈ మాదిరిగా ఇంటికే వచ్చే పాలన, లంచాలు వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని మీబిడ్డ అడుగుతున్నాడు . మరోవంక చూడండి.. చంద్రబాబు 14 ఏళ్లు, ౩ సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానంటాడు. ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీలో ఏఒక్కరికైనా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు మీలో ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకొస్తుందా అని అడుగుతున్నాడు మీబిడ్డ. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు మరి అలాంటి వ్యక్తి పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఒక్క హామీని అమలు చేయని బాబు.అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఆయన ముఖ్యమైన హామీలు అనంటూ ఆయన మీ ప్రతిఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా? (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) అని అడుగుతున్నాను. గుర్తుందా అన్నా ఈ పాంప్లెట్? ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడూ? అక్కా ఈ పాంప్లెట్ గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తోందా? 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించాడు. పంపించిన తర్వాత 2014లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు. వేసిన తర్వాత చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన హామీలంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫొటోలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా? అని అడుగుతున్నాడు మీబిడ్డ.చంద్రబాబు విఫల హామీలు.ఇందులో చెప్పిన హామీలు.. మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతున్నా రూ.87,612 కోట్ల మేర రైతుల రుణమాఫీ జరిగిందా? అని అడుగుతున్నాడు మీబిడ్డ. రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అన్నాడు. అక్కా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా రూ.14,205 కోట్ల డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతున్నాను. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఇన్నివేల మంది ఉన్నారు నేను అడుగుతున్నారు మీ ఇళ్లల్లో ఏ ఒక్కరికైనా కూడా రూ.25 వేల కథ దేవుడెరుగు, ఒక్క రూపాయి అయినా బ్యాంకుల్లో వేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు.ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి నెలనెలా అన్నాడు. ఐదేళ్లు ఆయన పరిపాలన చేశాడు 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇక్కడున్నవాళ్లల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? అర్హులందరికీ మూడు సెంట్ల ఇంటి స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. నేను అడుగుతున్నాను ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు. అన్నా నేను అడుగుతున్నా?, అక్కా నేను అడుగుతున్నా ? మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా?.రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు చేసిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, నిర్మించాడా? కళ్యాణదుర్గంలో కనిపిస్తోందా ? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ ఈ పాంప్లెట్ పంపించి... 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? అనిమీబిడ్డ అడుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? మళ్లీ కొత్త మేనిఫెస్టోతో వస్తున్న బాబు.మరి ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే వ్యక్తి, ఇప్పుడు ఏమంటున్నాడు ఇదే చంద్రబాబు.. మళ్లీ కొత్త మేనిఫెస్టో అంటున్నాడు. సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? అన్నా నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? అక్కా నమ్ముతారా? నమ్ముతారా అమ్మా? సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? అక్కా నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారమంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజి కార్ కొనిస్తారట నమ్ముతారా? అన్నా నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఏ ఒక్క మంచి చేయలేదు. 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఏ ఒక్కపేదవాడికి ఏ రోజూ కూడా ఏ స్కీమూ తీసుకొచ్చి ఏ పేదవాడికి మంచి చేసిన పుణ్యం కట్టుకోలేదు చంద్రబాబు. ఆయన జీవితమంతా కూడా మోసాలు, ఆయన జీవితమంతా కూడా అబద్ధాలు. ఆయనకు అధికారం వచ్చిన ప్రతీసారి కూడా పేదవాడు బాగు పడింది లేదు. అధికారాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ ఆయన చేసిందేమిటంటే దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే చంద్రబాబు చేశాడు.మంచి కొనసాగాలంటే ఫ్యానుకే ఓటేయండి.కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండి ఉన్నాయి. మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బుల్లేవు. కానీ చంద్రబాబు ఆ బటన్లు నొక్కలేదు పేదవాడికి డబ్బులు ఇచ్చింది లేదు పేదవాడికి స్కీములు ఇచ్చింది లేదు. చంద్రబాబు చేసిందల్లా అదే డబ్బు మీకు ఇవ్వాల్సిన డబ్బును తాను దోచుకున్నాడు, దోచుకున్నది పంచుకున్నాడు. కాబట్టి చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి ఆ దోచుకున్న డబ్బులోనుంచి ఓటుకు రూ.2వేలు, 3వేలు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఓటుకు రూ.4వేలు కూడా ఇస్తాడు. చంద్రబాబు ఆ డబ్బులు మీకు ఇస్తే ఏ ఒక్కరూ ఆ డబ్బులు వద్దు అని చెప్పొద్దు. ఎందుకంటే ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీలో ప్రతిఒక్కరూ కూడా ఆలోచన చేయండి. మీ ఇంటికి వెళ్లండి. మీ భార్యలతో కూర్చొండి, మీ ఇంట్లో ఉన్న అవ్వాతాతలతో మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ చిన్నపిల్లలతో కూడా మాట్లాడండి. ఓటు లేదు కదా అని పిల్లలను పెట్టొద్దు. వాళ్లతో కూడా మాట్లాడండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి. మీ ఆడపడుచులతో మాట్లాడండి. అందరితో కూడా మాట్లాడి ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. ఎవరు ఉంటే మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరిగింది? మీకు మంచి జరిగింది? ఆ మంచి కొనసాగాలంటే ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మిమ్మల్ని ఓటు వేసే విషయంలో ఈ ఆలోచన చేసిన తర్వాతనే ఓటు వేయండి అని మాత్రం మీఅందరితో కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను.ఇది విన్నవించుకుంటూ వాలంటీర్లు మళ్లీ ఇంటికి రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ రూ.3వేలు మళ్లీ ఇంటికే రావాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్లీ మీకు రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, వారి చదువులు, వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు... సిద్ధమేనా?మన గుర్తు ఫ్యాను. ఇక్కడో, అక్కడో, ఎక్కడో మన గుర్తు తెలియని వారు ఎవరైనా ఉంటే..మన గుర్తు ఫ్యాను. ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ తమ్ముడూ, అక్కా మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అవ్వా మన గుర్తు ఫ్యాన్, తాత మన గుర్తు ఫ్యాన్.. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి.మన అభ్యర్ధులను ఆశీర్వదించండి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగయ్యను మీకు పరిచయం చేస్తున్నాను. మీలో ఒకడు, వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు, మంచివాడు, సౌమ్యుడు.. నేను ఇంతకు ముందే చెప్పా.. చంద్రబాబు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి. బాబు ఇచ్చే రూ.2 వేలకో, రూ.3 వేలకో పొరపాటున మోసపోకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. జగన్ మళ్లీ ఉంటేనే ప్రతినెల కేలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ముందే చెప్పి ప్రతి నెలా ఇదుగో ఈనెల రైతు భరోసా, ఇదిగో ఈనెల అమ్మఒడి, ఇదిగో ఈనెల చేయూత అంటూ ప్రతి సంవత్సరమూ..ఐదు సంవత్సరాలూ ప్రతి పథకమూ కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రూ.2వేలకు, రూ.3వేలకు మోసపోవద్దండీ. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే..ప్రతి నెలా ప్రతి ఇంట్లో పండుగే అని గుర్తుపెట్టుకోండి. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే...మళ్లీ జగనే రావాలి..జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంపీ అభ్యర్థిగా శంకరన్న నిలబడుతున్నాడు. తాను కూడా మీలో ఒకడు. వెనుకబడిన కులాలకు సంబంధించిన వాడు. మంచివాడు సౌమ్యుడు, మంచి చేస్తాడు. మీరు ఇక్కడ నొక్కే బటన్ ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు ఇంటికి నేరుగా పంపుతా ఉంటే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. మీ బిడ్డ బటన్లు నొక్కితే అడ్డుకున్న ఢిల్లీదాకా సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా ఖచ్చితంగా సౌండ్ వినిపించేట్లుగా మీ మెజారిటీతో ఇద్దరినీ గెలిపించాలని సవినయంగా మీఅందర్నీ రెండు చేతులు జోడించి పేరుపేరునా మీబిడ్డ ప్రార్థిస్తున్నాడు అంటూ ముఖ్యమంత్రి శ్రీ.వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
-
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తెలుగుదేశం కూటమి డబుల్ గేమ్ అనాలా? లేక దొంగ నాటకాలని అనలా? అమరావతి రాజధాని అంటే ఇతర ప్రాంతాల ప్రజలలో వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారా? బుధవారం నాడు తెలుగుదేశం కూటమి వివిధ పత్రికలలో ప్రచార ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ, కలికిరి రాక సందర్భంలో ఈ అడ్వైర్టైజ్ మెంట్ ఇచ్చారు. కేవలం విజయవాడ ప్రాంత ఎడిషన్లలో మాత్రం అమరావతి రాజధాని అని ప్రస్తావించి, ఇతర ప్రాంత ఎడిషన్లలో మాత్రం రాష్ట్ర వికాసానికి అని పేర్కొన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? అమరావతి రాజధాని అంటే ఉత్తరాంధ్రలో, రాయలసీమలలో ప్రజలలో వ్యతిరేకత బహిర్గతమై, ఓట్ల రూపంలో ప్రభావితం చేస్తుందని భయపడడమే కదా!విజయవాడ పత్రికలలో ఇచ్చిన ప్రకటన ఇలా ఉంది. 'మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు పాల్గొంటున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు లక్షలాదిగా తరలిరండి' అని ఉంది. అదే విశాఖపట్నం ఏరియాలో ఇచ్చిన ప్రకటనలో మాత్రం అందుకు భిన్నంగా 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి మోదీ గ్యారంటీ...' అని రాశారు. అంటే విజయవాడకు మోదీ వస్తున్నది కేవలం అమరావతి గురించేనని అనుకోవాలా? రాష్ట్ర వికాసం కోసం కాదా? విశాఖకు అమరావతి కలల రాజధాని కాదని చెప్పడమే కదా! ఒకపక్క అమరావతితోనే అభివృద్ది అంటూ సొల్లు పురాణం చెప్పే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎందుకు ఇలా డ్రామా ఆడుతున్నారంటే వారికి తమపై తమకే నమ్మకం లేదనే కదా?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా స్పష్టంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తద్వారా వికేంద్రీకరణ జరిగి అభివృద్దికి బాటలు వేస్తుందని చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని ఆయన మానిఫెస్టోలో కూడా చెప్పారు. విశాఖ ఎక్జిక్యూటివ్ కాపిటల్ అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టనవసరం లేదని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.విశేషం ఏమిటంటే ప్రముఖ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీభరత్ కూడా విశాఖ రాజధాని అయితే బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. శ్రీభరత్ విశాఖ నుంచి టీడీపీ పక్షాన పార్లమెంటుకు పోటీచేస్తున్నారు. ఆయన అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ది కాదని, ఇరవై ఏళ్లయినా పడుతుందని, విశాఖ అయితే ఆ ఇబ్బంది ఉండదని అన్నారు. అంటే తెలుగుదేశం కూటమి అభ్యర్ధులు ఒక్కోచోట ఒక్కోరకంగా ప్రచారం చేస్తున్నారని తేలిపోతోంది. నిజానికి అమరావతి రాజధాని అని గతంలో హడావుడి చేసినా తెలుగుదేశంను ప్రజలు ఓడించారు. చివరికి అమరావతి గ్రామాలు ఉన్న తాడికొండ నియోజకవర్గంలోను, మంగళగిరి నియోజకవర్గంలోను టీడీపీ ఓడిపోయింది.స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరిలో ఓటమిపాలయ్యారు. దానికి కారణం అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు జరిపిన భూదందానే. ఈ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం పలు కేసులు కూడా పెట్టింది. ఇదంతా ఒక కులం వారికోసం, ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొని లాభపడ్డవారి కోసమేనని ఇక్కడి ప్రజలు కూడా అనుమానించారు. దాంతో అమరావతి రాజధాని అన్న కాన్సెప్ట్కు ప్రజామోదం లేకుండా పోయింది. అయినా 2019 తర్వాత కూడా రాజధాని రైతుల పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా అండతో కల్పిత ఉద్యమాలను టీడీపీ నడిపింది. అయినా ఇప్పుడు అమరావతి అంటే జనం నమ్మడం లేదని గ్రహించి ఈ రకంగా డబుల్ గేమ్ ఆరంభించారని భావించాలి.అమరావతికి లక్షల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రచారం చేసేవారు. బీజేపీతో చెడ్డాక ప్రధాని మోదీ అమరావతికి ఏమీ ఇవ్వలేదని, చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారని కూడా ఆయన విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి గాను ప్రజలు మోదీ రోడ్షో కు రావాలని కోరారు. గతంలో బీజేపీ నేతలు కూడా అమరావతి భూ స్కామ్ చాలా పెద్దదని విమర్శించేవారు. ఇప్పుడు మోదీ అమరావతికి ఏమైనా లక్ష కోట్ల నిధులు ఇస్తానని కూటమి నేతలకు హామీ ఇచ్చారా? అసలు ఏపీలో ఫలానా అభివృద్ది చేస్తానని మోదీ గ్యారంటీ ఇవ్వడం లేదు. అయినా వీరు మాత్రం ప్రజలను రకరకాలుగా మోసం చేయడానికి యత్నిస్తున్నారు.రాజమండ్రి, అనకాపల్లిలలో జరిగిన ప్రధాని సభలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ఆయనపై నేరుగా అనివీతి ఆరోపణలు చేయలేదు. కాకపోతే జనరల్గా ఏవో కొన్ని విమర్శలు చేయాలి కాబట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతి అంటూ ఇంతకాలం టీడీపీ ఏమి ఆరోపిస్తుందో వాటినే ఆయన కూడా చెప్పి వెళ్లారు. విశేషం ఏమిటంటే మోదీ కానీ, అమిత్ షా కానీ చంద్రబాబు ఉపన్యాసం వినకుండానే నిష్క్రమించడం. బహుశా చంద్రబాబు మాటల మీద వీరికి నమ్మకం పోయిందేమో తెలియదు. మోదీని ఏపీకి తీసుకు రావడం ద్వారా తమకు పలుకుబడి ఉందని, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను సహేతుక కారణాలు చూపకుండానే బదిలీ చేయడం, నాలుగేళ్లుగా అమలు అవుతున్న స్కీముల ద్వారా లబ్ది దారులకు డబ్బు విడుదల చేయకుండా ఆదేశాలు ఇవ్వడం, వలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయడం, చంద్రబాబు ఎంత నీచంగా ఉపన్యాసాలు చేస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో రాలేదు. అయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ద్వారా రాయబేరాలు సాగించి కాళ్లా, వేళ్ల పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడానికే అని అర్దం అవుతుంది.తమపై ఉన్న కేసులు ముందుకు వెళ్లకుండా చంద్రబాబు జాగ్రత్తపడడానికే అని ప్రజలంతా భావిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలోనే కాదు. పలు విషయాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల అంతా వినాశనమేనని గతంలో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దారుణమైన ఆరోపణలు ఆ చిన్నస్థాయి వలంటీర్లపై గుప్పించారు. తదుపరి ఎన్నికల సమయానికి తాము కూడా వలంటీర్లను కొనసాగిస్తామని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తామని ప్రకటించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంక అవుతోందని చంద్రబాబు, పవన్ లు విమర్శించేవారు. కానీ వారి ఎన్నికల మానిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికన్నా మూడు రెట్ల వ్యయంతో సంక్షేమ స్కీములు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అసెంబ్లీలో మద్దతు ప్రకటించారు. ఎన్నికల వేళ మాత్రం అదేదో ప్రమాదకరమైనదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రానికి సంబంధించిన ఈ చట్టం గురించి మోదీ, అమిత్ షా సభలలో మాత్రం నోరు విప్పరు.ఇన్ని రకాలుగా డ్రామాలు ఆడుతున్న, అబద్దాలు చెబుతున్న టీడీపీ కూటమికి ఎవరైనా ఓటు వేస్తే, వారి అబద్దాలకు ఆమోద ముద్ర వేసినట్లే అవుతుంది. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ పెద్ద కవి మాదిరిగా పర్వతం ఎవరికి తలవంచదు. సముద్రం ఎవరి కాళ్ల వద్దకు వెళ్లదు.. అంటూ సినిమా డైలాగులు చెబుతుంటారు. కానీ మోదీ పాల్గొన్న సభలో ఈయన వంగి, వంగి ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని విస్తుపరిచింది. ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అచ్చం చంద్రబాబు స్టైల్ లోనే పవన్ ఉన్నారని ప్రజలకు క్లారిటీ వచ్చింది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ... వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పారీ్టలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు. ఏం చేస్తాడో స్పష్టత లేదు... మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
విశాఖకే జై కొట్టిన టిడిపి
-
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు. -
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్కు చెప్పా. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.చంద్రబాబు, టీడీపీ నేతలపై వంశీ సెటైర్లు‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్లో పెట్టింది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు. -
కొలికపూడికి ప్రజా ప్రతిఘటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దురుసు స్వభావం, అహంకారపూరిత ధోరణి ఓటర్లను మరింత దూరం చేస్తోంది. గతంలో ఆయన ట్రాక్ రికార్డు సైతం ప్రజల్లో భయందోళన రేకెత్తిస్తోంది. దీంతో పారీ్టల కతీతంగా సామాన్య ఓటర్లు సైతం ఈయనను ఎమ్మెల్యేగా భరించగలమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ సామాజికవర్గ నేతలు సైతం కొలికపూడి విషయంలో కినుకు వహిస్తున్నారు. కొలికపూడి సైతం వారిని కలుపుకొనిపోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలను టీడీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతోంది. దీంతో చివరి అస్త్రంలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలను సైతం పసిగట్టిన ఓటర్లు తిప్పికొడుతుండటంతో ఆయన విలవిల్లాడుతున్నాడు. ప్రతి సారీ ఎన్నికల సమయంలో పారాచ్యూట్ నేతలను తెచ్చి తమవైపు రుద్దుతున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, చినబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. హంగామా చేసి... టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం అందోళన చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఏకొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా, గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావిడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తరువాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారు. ఇలా కొలికిపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గంపలగూడెం మండలం మంచిరాలపాడులో కొలికపూడికి మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఆయన ప్రచారంలో భాగంగా నోటి దురుసుతో సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి.. అని అనగానే అక్కడ ఉన్న మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు. ఫ్యానుకే మా ఓటు అంటూ మహిళలు చేతులు చూపుతూ కౌంటర్ ఇచ్చారు. ఊహంచని పరిణామం నుంచి వెంటనే తేరుకొని ఇంకా అక్కడ ఉంటే మహిళల నుంచి పరాభవం తప్పదని గ్రహించి రోడ్షో చేయకుండానే జారుకున్నాడు. ప్రలోభాలకు తెర.. ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అనే భావనకు వచ్చిన కొలికపూడి ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలల్లో తొలుత హోలి కానుకల పేరుతో మభ్యపెట్టే యత్నం చేశారు. పలు సామాజిక వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి రకరకాల హామీలు గుప్పించారు. స్థలాలు కొని, సామాజిక భవన నిర్మాణాలు చేపడతానని మభ్య పెట్టారు. ఇప్పుడేమో ఎన్నికల తరువాత చూస్తానని నాలుక మడతేశారు. పదో తరగతిలో 500 కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు పారితోíÙకం ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల తరువాత డబ్బులు ఇస్తామని చెబుతున్నాడు. ప్రచారంలో సైతం జనాలు లేకపోవడంతో, ఆ గ్రామాల్లో అద్దె మనుషులను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని టీడీపీలోని నేతలే పేర్కొంటున్నారు. -
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను టీడీపీ ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటిషన్ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించి, హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకుగానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. -
పచ్చ మద్యం స్వాధీనం..
-
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..
-
AP: భారీగా మద్యం స్వాధీనం.. టీడీపీ నేతలు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీ ఎన్నికల వేళ టీడీపీ పార్టీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, భారీగా మద్యం పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల నుంచి సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సెబ్ అధికారులు. తిరువూరు జిల్లాలో 21 సంచుల్లో 4200 మద్యం బాటిల్స్ను పట్టుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ నేతలు తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మోదుగు వెంకటేశ్వరరావు, షేక్ షాహిన్ పాషా, జీనుగు అశోక్ను అరెస్ట్ చేశారు. -
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
జి.కొండూరు: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ టీడీపీ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకటకృష్ణప్రసాద్ సహనం కోల్పోతున్నారు. పైన పటారం.. లోన లొటారం అన్నట్లు పైకి సౌమ్యుడిగా కలరింగ్ ఇచ్చే వసంత, తన అసలు నైజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతి సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓటమి భయంతో వసంత తన ఎన్నికల ప్రచారాల్లో బూతు పురాణం అందుకుంటున్నారు. గత ఐదేళ్ల పాటు తన ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులపై సగటు మనిషి వినలేని భాషలో బూతు పురాణాన్ని వండివార్చిన వసంత, నేడు మరలా అదే తీరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారాల్లో వసంత మాట్లాడుతున్న తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.బ్లేడు బ్యాచ్ అంటూ...వసంత వెంకటకృష్ణప్రసాద్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా వైఎస్సార్ సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. సామాన్యుడు సర్నాల తిరుపతిరావుకి నైతికంగా మద్దతిచ్చేందుకు వచ్చిన నాయకులను బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సర్నాల తిరుపతిరావుని ఉద్దేశించి గంగిరెద్దు, కుక్కిన పేను అంటూ వసంత చేసిన అవమానకర వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్నే రేపాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ర్యాలీలో రంగులు మార్చే ఊసరవెల్లిలా మీరు పార్టీలు మారుస్తున్నట్ల బయట చర్చ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వసంత మాట్లాడిన బూతు పురాణం విని పక్కనే ఉన్న ఆయన అనుచరులే విస్తుపోయారు. ఎన్నికల దగ్గర పడే కొద్దీ తిరుపతిరావుకి పెరుగుతున్న గ్రాఫ్తో పాటు సొంత పార్టీలో ఉన్న వర్గపోరు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డంపు చేసిన మద్యం, నగదు పట్టబడడంతో ఓటమి ఖాయమని భావించి సహనం కోల్పోతున్నాడు.ఏం చేస్తాడో స్పష్టత లేదు...మైలవరం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత వెంకటకృష్ణప్రసాద్ ప్రజలకు ఏనాడూ అందుబాటులో లేరు. ఐదేళ్లపాటు ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వసంత, నేడు మరలా పార్టీ మార్చి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతూ నియోజకవర్గానికి తానేమి చేస్తాడో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం వైఎస్సార్ సీపీ నాయకులు, సర్నాల తిరుపతిరావు, ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడటం మినహా ఎటువంటి హామీలను ఇవ్వలేకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వసంత మాట్లాడుతున్న బూతు పురాణం వింటున్న స్థానిక ప్రజలే కాకుండా ఆయన పక్కన ఉంటున్న సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.బ్లేడు బ్యాచ్, లుంగీ బ్యాచ్, కడప రౌడీలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైనం గంగిరెద్దు, కుక్కినపేను అంటూ సర్నాలపై ఇప్పటికే అవమానకర వ్యాఖ్యలు ఐదేళ్లు దేవినేని ఉమాపై వినలేని భాషలో బూతు పురాణం ఓటమి ఖాయమనే భావనతో వసంత సహనం కోల్పోతున్నారని చర్చ
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కదిరి నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల స్టాండ్..కూటమిని ఓడిద్దాం..
డీబీటీ లబ్ధిదారులతో టీడీపీ ముఠా చెలగాటం
ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్ కేసులో 2 బిగ్ ట్విస్టులు
పాలేరు పవన్..
మంగళగిరిలో సీఎం జగన్ సభ
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే ఇలా..!
గోల్డ్ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?
నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement