-
విక్రమ్ తంగలాన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా నటించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా రోజుల ముందే తెరపైకి రావాల్సింది. అయి తే గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పటికీ దర్శక, నిర్మాతలు తంగలాన్ చిత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈనెల 17న విక్రమ్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తంగలాన్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఆదివాసి ప్రాంతాలలో నటుడు విక్రమ్ గుర్రమెక్కి వెళుతున్న పోస్టర్ను విడుదల చేశారు. అందులో విక్రమ్ కొండవాసీ గెటప్లో కనిపించిన దృశ్యం తంగలాన చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యాయన్నారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారన్నారు. ఇతర నటీనటులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఇది గోల్డ్ మైన్స్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పా.రంజిత్ చెప్పారు. -
Malavika Mohanan: 'తంగలాన్' బ్యూటీ మాళవిక మోహనన్ గ్లామర్ ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్!
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగాఈ సినిమా రూపొందించారు. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పార్వతీ తిరువోతు బర్త్ డే సందర్భంగా తంగలాన్లో ఆమె నటించిన గంగమ్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తే మహిళా రైతు క్యారెక్టర్లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. తంగలాన్ సినిమాను త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చియాన్ విక్రమ్ను విభిన్నమైన క్యారెక్టర్లో దర్శకుడు పా.రంజిత్ చూపించబోతున్నారు. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా..తంగలాన్' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నాప్పటికీ కుదరలేదు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. Happy birthday # Gangamma, @parvatweets stay happy n blessed 💥💥💥#HBDParvathyThiruvothu#Thangalaan pic.twitter.com/nNWvFpihfv — pa.ranjith (@beemji) April 7, 2024 -
తంగలాన్ భామ స్పెషల్ లుక్.. బంగారు వర్ణంతో మెరిసిన భామ!
సినీ కుటుంబం నుంచి వచ్చిన మలయాళ భామ మాళవిక మోహనన్. మొదట్లో మాతృభాషలో నటించిన ముద్దుగుమ్మ.. ఆ తరువాత పేట చిత్రంతో కోలీవుడ్కు పరిచయమైంది. పేట చిత్రంలో రజనీకాంత్ మిత్రుడు శశికుమార్ భార్యగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో నటించారు. అందులో పాత్ర పరిమితే అయినా, హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ధనుశ్కు జంటగా మారన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కరోనా కాలంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. మరోపక్క మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ బహు భాషా నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్కు జంటగా తంగలాన్ చిత్రంలో నటించారు. ఇందులో గిరిజన అమ్మాయి పాత్రలో నటించడం విశేషం. దీంతో తంగలాన్ చిత్రంపై అభిమానుల్లో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్గా తెరపైకి రావలసిన ఈ చిత్రం ఎన్నికల కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. కాగా ఈమె నటించిన చిత్రాల విడుదల ఆలస్యమైనప్పటికీ.. ఈ బ్యూటీ మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్లో ఉండే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తరచు ప్రత్యేక ఫొటో షూట్ చేసుకుంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. అదే విధంగా తాజాగా 24 క్యారెట్ల బంగారంలా మెరిసి పోయే దుస్తులు ధరించి స్పెషల్ ఫొటో షూట్ చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
విక్రమ్ క్రేజీ మూవీ.. డైరెక్టర్ లేటేస్ట్ అప్డేట్!
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమాకు పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పా.రంజిత్ సినిమా విడుదలపై స్పందించారు. దర్శకుడు పా. రంజిత్ మాట్లాడుతూ.. 'తంగలాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఎన్నికల తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నాం. ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాను సినీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని తెలిపారు. కాగా.. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ డిఫెరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి కీలక పాత్రలు పోషించారు. -
పాన్ ఇండియా సినిమాలు.. 'కంగువా, తంగలాన్' విడుదలకు ఇబ్బందులు
తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడెక్షన్పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు. కంగువా చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'తంగలాన్' చిత్రాన్ని ఆస్కార్కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్లకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
వేసవికి వాయిదా పడిన 'తంగలాన్'.. ఈసారైనా పక్కానా
-
మళ్లీ మళ్లీ వాయిదా పడుతున్న స్టార్ హీరో సినిమా
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. మాళవిక మోహనన్ హీరోయిన్. పశుపతి ముఖ్యపాత్ర పోషించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించగా.. స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలార్లోని కేజీఎఫ్ నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. అయితే వచ్చే వారంలో రిలీజ్ కావాల్సిన చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఈ సినిమా కోసం విక్రమ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. షూటింగ్ అయితే చాన్నాళ్ల నుంచి చేస్తూ వచ్చారు. తొలుత సంక్రాంతి అన్నారు. ఆ తర్వాత జనవరి 26 అని డేట్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు వేసవికి 'తంగలాన్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇలా మళ్లీ మళ్లీ వాయిదా పడటంతో విక్రమ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. అయితే ఈ వాయిదాకు కారణం ఏమిటో తెలియలేదు. అదేవిధంగా అందులో తేదీని చెప్పలేదు. ఒకవేళ చెప్పినట్లు వేసవికి రిలీజ్ చేస్తారా? మళ్లీ అప్పుడు వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అయితే తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 1న మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేసింది. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) In the darkness of Kolar Gold mines is a story waiting to be told. 👷#Thangalaan is coming soon on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada, Hindi after theatrical release! #NetflixPandigai pic.twitter.com/8JXA9sEvdI — Netflix India South (@Netflix_INSouth) January 17, 2024 -
తిరుత్తణి నేపథ్యంలో విక్రమ్ 62వ చిత్రం
కోలీవుడ్ నటుడు విక్రమ్ చిత్రం అంటే కచ్చితంగా కొత్తగా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు విశ్వసిస్తారు. దాన్ని ఆయన వమ్ము కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకోసం విక్రమ్ శాయశక్తులా శ్రమిస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2024 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ చిత్రంలో విక్రమ్ అసాధారణ నటనను చూడవచ్చని ఆయన గెటప్, టీజర్ చూస్తే అనిపిస్తోంది. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇది విక్రమ్ నటించే 62వ చిత్రం అవుతుంది. దీనికి అరుణ్కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు పన్నైయారుమ్ పద్మినియుమ్, సేతుపతి, చిత్రా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. విక్రమ్ 62వ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని రియా శిబు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనతో కూడిన టీజర్ను ఇటీవలే విడుదల చేశారు. ఇది తిరుత్తణి నేపథ్యంలో సాగే కథా చిత్రం అని సమాచారం. చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దర్శకుడు అరుణ్కుమార్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రా చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో ఈయన విక్రమ్ హీరోగా తెరకెక్కించనున్న చిత్రంపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. -
చిన్నారి ఆపరేషన్ కోసం సాయం చేసిన ప్రముఖ హీరో
కోలీవుడ్లో జివి ప్రకాష్ కుమార్ తమిళ చిత్రసీమలో మల్టీటాలెంటెడ్గా గుర్తింపు పొందాడు. ఎ.ఆర్.రహమాన్ మేనళ్లుడిగా ఆయన ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత చిత్రసీమలో తనదైన ముద్ర వేశాడు. చిన్న వయస్సులోనే సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, తన 25 ఏళ్లకే 25 చిత్రాలకు మ్యూజిక్ అందించి రికార్డు సాధించాడు. ఆ తర్వాత 'డార్లింగ్' మూవీతో హీరోగా సత్తా చాటి సింగర్, యాక్టర్,నిర్మాతగా కోలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', విక్రమ్ 'తంగళన్' సహా పలు చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. సినిమాలతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను జివి ప్రకాష్ కుమార్ షేర్ చేస్తాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు విప్పి, సహాయం కోరిన వారికి చేతనైనంత సాయం చేస్తుంటాడు. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన సోదరి బిడ్డను ఎవరైనా కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఏడాది బిడ్డ ఇబ్బంది పడుతుందని తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో సహాయం కోరుతూ.. ఇలా పోస్ట్ చేశాడు. 'ఆన్లైన్లో ఇలా ఆర్థిక సహాయం అడగడానికి ఇబ్బందిగా ఉందని అయినా ఆ బిడ్డ ప్రాణాల కోసం ఎలాగైనా అడుగుతాను. నా సోదరి అబ్బాయి (1 సంవత్సరం) మెదడు వైపు కణితి ఉందని వైద్యులు చెప్పారు. ఇది కొంచెం భయంగా ఉంది. మధురై అపోలో ఆసుపత్రికి బాబును తీసుకెళ్తే అక్కడ వెంటనే ఆపరేషన్ అవసరం అన్నారు. రూ. 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. మా కుటుంబం నుంచి 2 లక్షల వరకు సిద్ధం చేశాను. మీరు నాకు కొంత సాయం చేసినా.. నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీకు తోచినంత చేయండి మిత్రులారా.' అని ఆ యువకుడు తెలిపాడు. సినీనటుడు జివి ప్రకాష్ కుమార్ ఆ పోస్ట్కు రియాక్ట్ అయ్యాడు. ఆ చిన్నారి ఆపరేషన్ కోసం తన వంతుగా రూ.75 వేలు పంపారు. దీన్ని తన ఎక్స్ సైట్లో పోస్ట్ చేసి ' నా నుంచి ఇది చిరు సాయం' అని పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో జివి ప్రకాష్ చర్యను పలువురు అభినందిస్తున్నారు. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్కు మరికొందరు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. -
Thangalaan Teaser Launch: విక్రమ్ ‘తంగలాన్’ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
తంగలాన్ గురించి బిగ్ సీక్రెట్ రివీల్ చేసిన విక్రమ్
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన తంగలాన్ టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్లో విక్రమ్ చాలా వైల్డ్గా కనిపించాడు. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజర్ను చూపించారు. కానీ యాక్షన్ సీన్స్,బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని చెప్పవచ్చు. టీజర్లో పామును పట్టుకుని చేతితోనే విక్రమ్ రెండు ముక్కలు చేస్తాడు.. ఈ సీన్ భారీగా వైరల్ అవుతుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత తంగలాన్ గురించి విక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆయన రివీల్ చేశాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్కు డైలాగ్స్ ఉండవట. గతంలో శివపుత్రుడు చిత్రంలో కూడా ఆయనకు ఎలాంటి డైలాగ్స్ లేవు కానీ తన నటనతో సినిమాను మరో రేంజ్కు తీసుకెళ్లాడు. ఆ సినిమాతోనే తెలుగులో ఆయనకు క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ గురించి విక్రమ్ ఇలా అన్నాడు. 'తెలుగు అభిమానులకు సినిమా అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు.. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా వారు ఆదరిస్తారు. దానికి నిదర్శనమే శివపుత్రుడు. ఆ సినిమాను వారు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నాకు ఎంతపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తంగలాన్ కూడా అంతే పేరు తెస్తుంది. ఈ చిత్రంలో నాకు ఎలాంటి డైలాగ్స్ లేవు.. అంతా అరవడమే. దానికి కారణం ఉంది. అదేంటో సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. శివపుత్రుడు మాదిరే తంగలాన్లో కూడా ఎలాంటి డైలాగ్స్ ఉండవు.' అని విక్రమ్ తెలిపాడు. -
తంగలాన్ నాకో కొత్త అనుభవం
‘‘నేను విదేశాలు వెళ్లినప్పుడు మీరు బాలీవుడ్డా అని అడుగుతుంటారు. నేను కోలీవుడ్, టాలీవుడ్ అని చెబుతుంటాను. అంటే... వారు ఎక్కువగా హిందీ చిత్రాలే చూసేవారు. కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు చూస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’..లాంటి సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. దక్షిణాది సినిమాలు ఇప్పుడు ఓ మార్క్ని క్రియేట్ చేస్తున్నాయి. రాజమౌళిగారు ఆస్కార్ను మనకు తీసుకొచ్చారు. ఆయనతో ఓ సినిమా చేయాలని ఉంది’’ అన్నారు విక్రమ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. పా. రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. బుధవారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో విక్రమ్ మాట్లాడుతూ– ‘‘తంగలాన్’ ఎమోషనల్ అండ్ రా ఫిల్మ్. రెగ్యులర్ సాంగ్స్, ఫైట్స్.. ఇలాంటి తరహా సినీ గ్లామర్ ‘తంగలాన్’లో లేదు. నా పాత్రకు డైలాగ్స్ అంతగా ఉండవు. లైవ్ సౌండింగ్లో సినిమా చేశాం. నాకు కొత్త ఎక్స్పీరియన్స్. మేకప్కు మూడు గంటలు పట్టేది. మీనింగ్ఫుల్ సినిమాలు చేస్తుంటారు పా. రంజిత్గారు. ‘తంగలాన్’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. ఇక నేను చేసిన ‘9 నెలలు’ చిత్రానికి సురేందర్రెడ్డి, వినయ్లు అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేశారు. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఈ ఈవెంట్కు వచ్చారు. లైఫ్ సర్కిల్లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘విక్రమ్గారితో నేను చేసిన తొలి చిత్రమిది. ఆయన అంకితభావం, టైమింగ్ సూపర్. ‘తంగలాన్’ సినిమా ప్రేక్షకులను మెప్పి స్తుంది’’ అన్నారు పా. రంజిత్. ‘‘విక్రమ్ ట్రెమండస్ యాక్టర్. వరల్డ్ సినిమా లవర్స్కు ‘తంగలాన్’ ఓ గ్రేట్ ట్రీట్లా ఉంటుంది’’ అన్నారు కేఈ జ్ఞానవేల్ రాజా. ‘‘విక్రమ్ సార్ ఓ నటుడుగా తనను తానే మళ్లీ ఆవిష్కరించుకుంటుంటారు’’ అని అతిథిగా పాల్గొన్న సత్యదేవ్ అన్నారు. దర్శకులు వేణు ఊడుగుల, కరుణకుమార్, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు. -
తంగలాన్ టీజర్.. పామును రెండు ముక్కలు చేసిన విక్రమ్
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సిరీస్ల తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్ కోసం సౌత్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్లో ఎలాంటి డైలాగ్స్ లేకున్నా విజువల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో దుమ్ములేపాడు. ఇందులో విక్రమ్ను చాలా భయంకరంగా చూపించారని తెలుస్తోంది. యుద్ధంలో కత్తి పట్టుకొని యోధుడిలా చేతికి దొరికిన వారందరినీ హతమారుస్తు కనిపించాడు. ఓ సీన్లో కోబ్రా లాంటి పాముని చేతపట్టుకుని రెండు ముక్కలుగా చేసి కింద పడేస్తాడు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఒక డిఫరెంట్ కథనంతో తంగలాన్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. -
'కేజీఎఫ్' స్టోరీతో మరో సినిమా.. జాతీయ అవార్డుకి గురిపెట్టిన హీరో
పాత్రలకు ప్రాణం పోయడానికి ఎంత కష్టమైన పడే అతి కొద్దిమంది నటుల్లో చియాన్ విక్రమ్ ఒకడు. ఇంతకు ముందు 'శివపుత్రుడు', 'ఐ' సినిమాలే ఇందుకు ఉదాహరణ. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంత దూరం వెళ్లడానికైనా వెనుకాడడు. అందుకే తన విలక్షణ నటనకు జాతీయ అవార్డు వచ్చింది. తాజాగా మరోసారి జాతీయ అవార్డుకు విక్రమ్ గురి పెట్టినట్లు అనిపిస్తుంది. తంగలాన్ చిత్రం కోసం ఈయన అంతలా మేకోవర్ అయ్యారు. (ఇదీ చదవండి: కన్నప్ప’ షూటింగ్లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!) తాజాగా రిలీజ్ చేసిన 'తంగలాన్' సినిమా పోస్టర్లో విక్రమ్.. ముడులు పడిన పొడవైన జుత్తు, నెరిసిన గెడ్డం, వేలాడే గోచీ, చేతిలో మెలికలు తిరిగిన కర్ర, ముఖంలో ఆక్రోశంతో గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఈయనెవరో చెప్పుకోండి చూద్దాం అనేలా ఆదివాసిలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తుంటే సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో అర్థమవుతోంది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహన్ హీరోయిన్లు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్య కథతో ఈ సినిమా తీశారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ జనవరి 24న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. టీజర్ను నవంబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) #Thangalaan from 26-1-24 in cinemas worldwide 💥💥💥💥❤️ @Thangalaan @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @PasupathyMasi @DanCaltagirone @thehari___ @ActorMuthukumar @preethy_karan @arjun_anbudan @gvprakash @Lovekeegam @kishorkumardop @EditorSelva… pic.twitter.com/Nh0iAKgDyJ — pa.ranjith (@beemji) October 27, 2023 -
విక్రమ్ డబుల్ సర్ప్రైజ్.. తంగలాన్ క్రేజీ అప్డేట్!
పొన్నియిన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. పార్వతి, మాళవిక మోహన్, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. తాజాగా తంగలాన్ చిత్రానికి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్స్ ఇచ్చేశారు. ఓకేసారి టీజర్, మూవీ రిలీజ్ తేదీలను ప్రకటించారు. నవంబర్ ఒకటో తేదీన తంగలాన్ టీజర్ విడుదల చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేస్తూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A fiery story of a bygone era that’s waiting to be told & cherished #Thangalaan teaser dropping on 1st November &#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/pDfT6HiNs4 — Vikram (@chiyaan) October 27, 2023 A film that will touch your heart & blow away your mind!#Thangalaan coming to you on 26th January 2024🔥🔥🔥 Teaser out on Nov 1st! 💃🏻🔥💃🏻 pic.twitter.com/wEf3MaabqF — Malavika Mohanan (@MalavikaM_) October 27, 2023 -
విక్రమ్ తంగలాన్ అప్డేట్ వచ్చేసింది
పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రక కథా చిత్రం తరువాత విక్రమ్ నటించిన చిత్రం తంగలాన్. నటి పార్వతి, మాళవిక మోహన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కర్ణాటక రాష్ట్రంలోని బంగారు గనుల నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు పా.రంజిత్ ఇది వరకే తెలిపారు. చిత్ర పోస్టర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని విక్రమ్ గెటప్ చాలా డిఫరెంట్గా ఉండి తంగలాన్ చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ చిత్రంపై నటి మాళవిక మోహన్ చాలా ఆశలు పెట్టుకుంది. కాగా తంగలాన్ చిత్రం అప్డేట్ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ వెల్లడించారు. ఆయన తన ట్విట్టర్లో తంగలాన్ సంభవం చిత్ర టీజర్ అతి త్వరలో అని పేర్కొన్నారు. ఇది విక్రమ్ అభిమానులకు తీపి వార్తే అవుతుంది. కాగా తంగలాన్ చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దిగడానికి నిర్మాత సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా నటుడు విక్రమ్ నటించిన మరో చిత్రం ధృవ నక్షత్రం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నటి రీతూ వర్మ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలిసింది. -
ఆ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా: మాళవిక మోహనన్
ప్రస్తుతం సక్సెస్ కోసం తహతహలాడుతున్న నటీమణుల్లో మాళవికా మోహనన్ ఒకరు. నిజం చెప్పాలంటే ఈ మలయాళ బ్యూటీ కోలీవుడ్లో ఇప్పటివరకూ ఒక్క సరైన హిట్ను అందుకోలేదనే చెప్పాలి. పేట చిత్రంతో కోలీవుడ్కు అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ఒకే అనిపించుకుంది. అయితే ఈ సినిమాతో నటిగా మాళవికా మోహనన్ మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్ సరసన జగమే తంతిరం చిత్రంలో నటించింది. అది ఓటీటీలో స్ట్రీమింగ్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. (ఇది చదవండి: ఇదే నా చివరి సినిమా: జాతిరత్నాలు డైరెక్టర్) తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్కు జంటగా తంగలాన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దర్శకుడు పా.రంజిత్ చిత్రాల్లో కథానాయికలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇక తంగలాన్ చిత్రంలో విక్రమ్ గెటప్ నుంచి.. ఆయన నటన వరకూ అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది అంటోంది. దీని గురించి ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె పేర్కొంటూ తాను ఇప్పటివరకూ నటించిన చిత్రాల్లో ఛాలెంజింగ్ పాత్రను తంగలాన్ చిత్రంలో పోషించినట్లు చెప్పింది. తన జీవితంలో ఇంత ఉద్వేగాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. ఇందులోని తన నటన మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ పాత్రలో అంత అర్థం ఉందని, అందుకే తంగలాన్ చిత్రం విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్రం తన కెరీర్కు టర్నింగ్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా తంగలాన్ చిత్రం సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: సెన్సార్ బోర్డుకు లంచం.. విశాల్ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు! ) -
తంగలాన్ కోసం ఎదురుచూస్తున్నా: మాళవిక
తంగలాన్ చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నటి మాళవిక మోహన్ పేర్కొన్నారు. విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం తంగలాన్. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి పార్వతి మాళవిక మోహన్ హీరోయిన్గా నటించారు. పశుపతి హాలీవుడ్ డేనియల్ కాల్టజీరోనో తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: మంచు విష్ణుకు నా కృతజ్ఞతలు: అల్లు అర్జున్) కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో తెరపైకి తీసుకురావడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చిత్రంలో నటుడు విక్రమ్ పాత్ర, ఆయన గెటప్ చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటి వరకు నటించనటువంటి వినూత్న పాత్రలో విక్రమ్ను దర్శకుడు పా.రంజిత్ తెరపై ఆవిష్కరిస్తున్నారు. కాగా ఈ చిత్ర విడుదల కోసం ప్రేక్షకులతో పాటు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నటి మాళవిక మోహన్ పేర్కొన్నారు. ఆమె ఇటీవల ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తంగలాన్ చిత్ర అప్డేట్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదని, తానూ అలాంటి దాని కోసమే ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై దర్శకుడు ఓ మెసేజ్ పంపిస్తానని చెప్పారు. గత ఏడాది అక్టోబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. తంగలాన్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు చూడాలని తాను కోరుకుంటున్నానని మాళవిక మోహన్ పేర్కొన్నారు. -
బెస్ట్ గిఫ్ట్
‘తంగలాన్’ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు హీరోయిన్ మాళవికా మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘తంగలాన్’. ఈ చిత్రంలో పార్వతి, మాళవికా మోహనన్ హీరోయిన్లు. కేజీ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఆగస్టు 4) మాళవికా మోహనన్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘తంగలాన్’లోని ఆమె ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ‘బెస్ట్ బర్త్ డే గిఫ్ట్’ అని ఈ పోస్టర్ని ఉద్దేశించి మాళవిక ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్నప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణలకు ఎదురు నిలిచిన ఓ గిరిజన తెగ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టండి చూద్దాం? ఇలా తయారైందేంటి!
దాదాపు హీరోయిన్లు అందరూ వీలైనంత గ్లామర్ చూపించేందుకు తహతహలాడుతుంటారు. కుదిరితే సినిమాల్లో.. లేదంటే సోషల్ మీడియాలో రెచ్చిపోతుంటారు. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా బ్యూటీస్ అందరూ ఫొటోషూట్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఆ బాపతే. కాకపోతే ఆమె, ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఎక్కువసేపు సస్పెన్స్ ఉంచకుండా చెప్పేస్తున్నాం. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరేవరో కాదు మాళవిక మోహన్. కేరళకు చెందిన ఈమె.. దాదాపు పదేళ్ల నుంచి సినిమాలు చేస్తోంది. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలా ఓ ఆరేళ్లపాటు మలయాళంలో మూడు, కన్నడ-హిందీలో తలో మూవీ చేసింది. 2019లో రజినీకాంత్ 'పెట్టా'లో నటించడం ఈమె కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) సూపర్స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిన తర్వాత మాళవిక మోహనన్కు దళపతి విజయ్ 'మాస్టర్', ధనుష్ 'మారన్' చిత్రాల్లో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగా ఆడినప్పటికీ ఈమెకు ఓ మాదిరి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఈమె, ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. చియాన్ విక్రమ్ 'తంగలాన్'లోనూ ఈమెనే కథానాయిక. ఈ చిత్రంలోని ఈమె ఫస్ట్లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో మాళవికని చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఓ ఆయుధం, మెడ-నడుము-తల చుట్టూ తాళ్ల లాంటివి ఉన్నాయి. పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో మాళవిక.. ఆరతి అనే పాత్రలో కనిపించబోతుంది. నార్మల్గా హాట్ అండ్ గ్లామర్గా కనిపించే ఈ బ్యూటీని ఇలా మార్చేయడం చూసి ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఏదేమైనా మాళవిక లేటెస్ట్ లుక్ మాత్రం క్రేజీగా ఉంది. Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb — pa.ranjith (@beemji) August 4, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) -
రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్
మోడలింగ్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన నటి మాళవిక మోహన్. తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉండే ఈమె మొదట్లో మాతృభాష అయిన మలయాళంలో దుల్కర్ సల్మాన్కు జంటగా పట్టం బోల చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయింది ఈ బ్యూటీ. ఆ చిత్రం 2013లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం పేట ద్వారా కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. అలా అక్కడ కూడా తొలి చిత్రంతోనే తన నటనతో సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. (ఇదీ చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) ఆ తర్వాత విజయ్ సరసన మాస్టర్ చిత్రంలోనూ, ధనుష్కు జంటగా మారన్ చిత్రం లోనూ నటించింది. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ చిత్రంలో విక్రమ్తో జతకట్టింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటోంది. తంగలాన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి మాళవిక మోహన్ కూడా చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. తంగలాన్ చిత్రం కలిగించిన నమ్మకమో ఏమో గానీ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తను సినీ రంగప్రవేశం చేసి ఇప్పటికి దశాబ్దం పూర్తయిందని గుర్తుచేసుకుంది. (ఇదీ చదవండి: 'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు) ఇకపై తన కథ పాత్రలకు ప్రాముఖ్యత ఉండే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అది రూ.500 కోట్ల వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రం అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అందులో నటించడానికి అంగీకరించనని చెప్పారు. అలాంటి చిత్రాలు సూపర్ హిట్ అయినా తన పాత్రకు గుర్తింపు ఉండదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నటి మాళవిక మోహన్ పేర్కొన్నారు. -
ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాలీవుడ్ బ్యూటీల హవా కొనసాగుతూనే ఉంది. నటి నయనతార, ప్రియాంక మోహన్ వంటి మలయాళం భామలు పలు భాషల్లో నటిస్తున్నారు. తాజాగా నటి మాళవికమోహన్ కథానాయకిగా ఉన్నత స్థాయికి ఎదగడానికి శ్రాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ కేరళ జాణ సీనియర్ మలయాళ ఛాయాగ్రాహకుడు మోహన్ వారసురాలు. 2013లో మలయాళ చిత్ర పరిశ్రమలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. తరువాత హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో శశికుమార్కు భార్యగా కీలక పాత్రలో నటించి గుర్తింపు పొందారు. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో) ఆ తరువాత విజయ్తో మాస్టర్, ధనుష్కు జంటగా మారన్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ సరసన 'తంగలాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త మాళవికమోహన్ చూస్తారని చెబుతున్న ఈ భామ ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ స్టార్ హీరోలతో జత కడితేనే హీరోయిన్లకు క్రేజ్ వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన తల్లి 1970, 80 ప్రాంతంలో మలయాళం చిత్రాలు ఎక్కువగా చూసే వారన్నారు. హీరోయిన్లు మంచి కథా పాత్రల్లో నటిస్తే అభినందించే వారని చెప్పారు. అలాంటి పాత్రల కోసం ప్రార్థించుకోవాలని చెప్పేవారని, అప్పట్లో ఆమె చెప్పింది తను మనసుకు ఎక్కేది కాదని, ఇప్పుడు అర్థం అవుతోందని అన్నారు. అయితే తాను ఇప్పటికే నటిగా ఒక రౌండ్ చుట్టేశానని, ఇకపై మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానని మాళవికమోహన్ పేర్కొన్నారు. (ఇదీ చదవండి: వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు) -
తంగలాన్ సినిమా షూటింగ్ పూర్తి, విక్రమ్ పోస్ట్ వైరల్
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం తంగలాన్. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ నట విశ్వరూపం చూపించారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. పార్వతీ, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్న ఇందులో నటుడు పశుపతి, ముత్తుకుమార్, హరికృష్ణన్, ప్రీతి, అర్జున్ ప్రభాకరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. ఈయన చిత్రాలు చాలా భిన్నంగా సామాజిక పరమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. పా.రంజిత్, విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్, పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, కిశోర్కుమార్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆది నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇందులో నటుడు విక్రమ్ గెటప్ సినిమాపై హైప్ను పెంచుతోంది. ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి ఆయన నటనను తంగలాన్ చిత్రంలో చూస్తారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. విక్రమ్ గెటప్ చూస్తేనే తంగలాన్ చిత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుందని అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని విక్రమ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. 'తంగలాన్ చిత్రీకరణ పూర్తైంది. ఇది అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో మంచి వ్యక్తులతో కలిసి పని చేశాను. నటుడిగా నాకు మంచి అనుభవాలు కూడబెట్టుకున్నాను. మొదటి ఫోటో షూటింగ్ ప్రారంభానికి ముందు తీసినది కాగా మరొకటి 118 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నాక తీసిన ఫోటో. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు రంజిత్కు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. View this post on Instagram A post shared by 🕺 Mic Srav 🧑🎤 (@sravan_entertainer) And it’s a wrap!! What a journey!! Worked with some of the most amazing people & had some of the most evocative experiences as an actor. Was it just 118 working days between the first pic & the last. Thank you Ranjit for making us live this dream. Every single day. #thangalaan pic.twitter.com/LijMehsZeF — Vikram (@chiyaan) July 4, 2023 చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్నారు. వినూత్నమైన కథా నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మాళవిక మోహనన్ కనిపించనుండగా.. పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: ఉప్పెన హీరోయిన్కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో! ) అయితే ఈ ఏడాది తమిళంలో తెరకెక్కుతోన్న సినిమాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రమిది. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో లేదా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్లో తంగలాన్ చోటు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల ఓ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు. అయితే ఆస్కార్ రేసుకు సంబంధించిన ఇంకా ఎలాంటి వివరాలు ఆయన వెల్లడించలేదు. ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఈ సినిమాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ స్వరాలు సమకుర్చారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్!)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement