-
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్నైట్ రిస్క్లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్కు గతేడాది సెప్టెంబర్లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
అనధికారిక ఫారెక్స్ ప్లాట్ఫాంలపై నిఘా పెంచాలి..
న్యూఢిల్లీ: అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల విషయంలో అప్రమత్తత వహించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. కొందరు వ్యక్తులు, సంస్థలు వీటిలో లావాదేవీలు నిర్వహించేందుకు నిధుల కోసం బ్యాంకింగ్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరహా ప్లాట్ఫామ్లలో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిల్లో ట్రేడింగ్ చేయరాదంటూ ఆర్బీఐ ఇప్పటికే సూచన జారీ చేసినట్లు దాస్ చెప్పారు. బార్సెలోనాలో జరిగిన ఎఫ్ఐఎంఎండీఏ–పీడీఏఐ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు వివరించారు. మరోవైపు, రూపీ డెరివేటివ్స్లో భారతీయ బ్యాంకుల పాత్ర మరింతగా పెరగాలని దాస్ సూచించారు. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా లింక్లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్లు..రెండేళ్ల తర్వాత తొలిసారి
ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ (Bitcoin) సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. వరుసగా ఐదవ రోజు మళ్లీ పుంజుకొని రెండేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒక్కో బిట్ కాయిన్ ధర 60వేల డాలర్ల మార్కుకు చేరుకుంది. ఫలితంగా ఈ ఫిబ్రవరి నెలలో బిట్కాయిన్ విలువ 39.7శాతం పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా ట్రేడింగ్తో బిట్కాయిన్ 4.4శాతం వృద్దిని సాధించింది. దీంతో డిసెంబర్ 2021లో అత్యధిక స్థాయిలో ఉన్న ఒక్కో బిట్ కాయిన్ విలువ 59,259వేల డాలర్లకు పైకి చేరుకుంది. అదే సమయంలో మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఈథర్ 2.2శాతం పెరిగి 3,320కి చేరుకుంది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి 26న బిట్కాయిన్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో గరిష్ట స్థాయికి చేరుకుని 57,000డాలర్లను దాటింది. కాయిన్ డెస్క్ ప్రకారం నవంబర్ 2021 తర్వాత తొలిసారిగా గణనీయంగా 57,000డాలర్ల మార్కును తాకింది. అయితే, మార్కెట్లో నెలకొన్న భయాలతో ఇది ఆ తర్వాత సుమారు 56,500 డాలర్లకు తగ్గింది. తాజాగా మరోసారి తిరిగి పుంజుకుని 60వేల డాలర్ల మార్క్ను దాటి రికార్డ్లు సృష్టించింది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ బిట్సేవ్ సీఈఓ జఖిల్ సురేష్ ప్రకారం.. ఎఫ్టీఎక్స్ సంఘటన తర్వాత నవంబర్ 2022లో బిట్కాయిన్ దాని కనిష్ట స్థాయిల నుండి 200 శాతానికి పైగా పెరిగినట్లు చెప్పారు. -
ఆటో, ఐటీ షేర్ల జోరు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. ఐటీ, ఆటో షేర్లు రాణించడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో రికవరీ ర్యాలీ కలిసిరావడంతో మంగళవారం అరశాతం లాభపడ్డాయి. సెన్సెక్స్ 305 పాయింట్లు పెరిగి 73,095 వద్ద నిలిచింది. నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 22,200 స్థాయి చేరువులో 22,198 వద్ద స్థిరపడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ప్రథమార్థంలో నష్టాలతో ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు రాణించడంతో నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. ఒక దశలో సెన్సెక్స్ 371 పాయింట్లు దూసుకెళ్లి 73,161 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగి 22,218 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కమోడిటీ, ఫైనాన్షియల్ సర్విసెస్, టెలీ కమ్యూనికేషన్, యుటిలిటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.25 %, 0.10 % నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,509 కోట్ల షేర్లు అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,861 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడవుతున్నాయి. కాగా పేటీఎం షేరు ఆరంభ లాభాలు నిలుపుకోలేకపోయింది. ఇంట్రాడేలో 5% ఎగసి రూ.449 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. అయితే ఆరంభ లాభాలు నిలుపుకోవడంలో విఫలమైంది. చివరికి 0.11% నష్టపోయి రూ. 427.50 వద్ద నిలిచింది. ట్రేడింగ్లో రూ.449 వద్ద గరిష్టాన్ని, రూ.413.55 వద్ద కనిష్టాన్ని తాకింది. టీసీఎస్ షేరు 2.50% ర్యాలీ చేసి రూ.4103 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ ఈ షేరు రేటింగ్ను ‘న్యూట్రల్’ నుంచి ‘బై’కు అప్గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్ ధరను రూ.4,000 నుంచి రూ.4,700కు పెంచింది. ట్రేడింగ్లో 3.25% పెరిగి రూ.4,125 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ప్రముఖ టీవీ ఛానల్ ద్వారా షేర్ల రిగ్గింగ్!
ప్రముఖ బిజినెస్ చానల్లో స్టాక్ సిఫార్సులిచ్చే పది మంది నిపుణులతోపాటు ఐదుగురు గెస్ట్ అనలిస్ట్లపై నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. షేర్ రిగ్గింగ్కు పాల్పడి చట్టవిరుద్ధంగా వారు ఆర్జించిన రూ.7.41 కోట్ల స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. సెబీ దర్యాప్తు వివరాల ప్రకారం జీ బిజినెస్ న్యూస్ ఛానల్లో ఏ స్టాక్స్ను సిఫార్సు చేస్తున్నామన్నది గెస్ట్ నిపుణులు ముందుగానే కొంతమంది ప్రాఫిట్ మేకర్స్కు చెబుతారు. సమాచారం అందుకున్న ప్రాఫిట్ మేకర్స్ తొలుత ఆ షేరు లేదా డెరివేటివ్ కాంట్రాక్టులో పొజిషన్లు తీసుకుంటారు. దాంతో రిటైలర్లు సైతం అందులో ఇన్వెస్ట్చేసిన తర్వాత లాభాలు స్వీకరించి పొజిషన్లను విక్రయిస్తారు. గెస్ట్ అనలిస్టులు కిరణ్ జాదవ్, అశీష్ కేల్కర్, హిమాన్షు గుప్తా, ముదిత్ గోయల్, సిమి భౌమిక్ల సిఫార్సులు ఛానల్లో ప్రసారం అయిన తర్వాత ఆ పొజిషన్లను మార్చి లాభం సంపాదించినట్లు సెబీ గుర్తించింది. ఈ ఉదంతంలో నిర్మల్ కుమార్ సోని, పార్థసారథి ధర్, శార్ కమోడిటీస్, మానన్ షేర్కామ్, కన్హా ట్రేడింగ్ కంపెనీలు ప్రాఫిట్ మేకర్స్గా వ్యవహరించారని సెబీ పేర్కొంది. ఆ లావాదేవీల్లో వచ్చిన లాభాల్ని అందరూ పంచుకున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. దర్యాప్తు అనంతరం సెబీ 127 పేజీల ఆర్డర్ను జారీచేస్తూ వారిని సెక్యూరిటీ లావాదేవీల నుంచి నిషేధించింది. గెస్ట్ నిపుణులకు సంబంధించిన కంటెంట్తో సహా వీడియో రికార్డులు, ఇతర రికార్డుల్ని భద్రపర్చాలని జీ మీడియాను ఆదేశించింది. -
ట్రేడింగ్ సమయం పెంపు.. సెబీ చీఫ్ ఏమన్నారో తెలుసా..
దేశీయ స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ సమయాన్ని పెంచాలనే సూచనపై మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. సెబీ ఇప్పటి వరకు దీనిపై ఒక అభిప్రాయానికి రాలేదని సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ అన్నారు. అయితే ఏ ఒక్కరి నుంచీ తమకు ట్రేడింగ్ సమయానికి సంబంధించి ప్రతిపాదన రాలేదన్నారు. స్టాక్ బ్రోకర్లు నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే బ్రోకింగ్ కంపెనీ యజమాన్యం మాత్రం వారివారి మదుపర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలను సేకరించి ఫిబ్రవరి నెలాఖరులోపు తమ అభిప్రాయం చెబుతామన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని సెబీ చీఫ్ హెచ్చరించారు. ప్రస్తుతం సెబీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలతో ట్రేడింగ్ సమయాన్ని పెంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రేడింగ్ సమయం పెంచితే ఈక్విటీ మార్కెట్లకు, కమోడిటీస్ మార్కెట్కు తేడా లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతోంది. -
ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్స్కు ఉద్యోగాలివ్వని జెరోధా.. కారణం చెప్పిన కామత్
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధాలో ఉద్యోగాలపై సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థలో ఐఐటీ, ఐఐఎంలో చదివినవారిని ఎందుకు నియమించుకోలేదని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ తోమర్తో జరిపిన సంభాషణలో కామత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. జెరోధా కంపెనీలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులు ఎందుకు లేరనే ప్రశ్నకు స్పందిస్తూ ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను నియమించుకోకూడదనే నిబంధనేమీ సంస్థలో లేదని కామత్ స్పష్టం చేశారు. అయితే కంపెనీలో వారిని నియమించుకుని జీతభత్యాలు చెల్లించేంత డబ్బు లేదని తెలిపారు. చదువు అయిపోయాక వారు భారీ జీతాలు ఆశిస్తారని పేర్కొన్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థికంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నట్లు కామత్ చెప్పారు. అయితే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరుచుకుని రానున్న రెండేళ్లు, ఐదేళ్లు.. అలా ప్రణాళిక ప్రకారం కష్టపడుతూ వెళ్తే విజయం దానంతటదే వస్తుందని చెప్పారు. ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..! డేట్రేడింగ్ చాలా ప్రమాదకరమని కామత్ అన్నారు. దీర్ఘకాల పెట్టుబడితో మంచి రాబడులు పొందవచ్చని చెప్పారు. కంపెనీలు, ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్..వంటి మంచి లాభాలు తీసుకొచ్చే ఎన్నోమార్గాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. -
డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం!
ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించి నిత్యం నిబంధనలు తీసుకొస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చేసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజీలతో నెట్ బేసిస్లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్కు అర్హులని వివరించింది. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. అధిక నష్టభయం ఉండే డెరివేటివ్స్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విషయంలో, మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించాలని గతంలో ఎన్ఎస్ఈ సూచించింది. స్టాక్ మార్కెట్లో తరచు (ఫ్రీక్వెంట్) ట్రేడింగ్ చేయడం మంచిదికాదని సలహా ఇచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో 90 శాతం మంది మదుపర్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిల్లోనే ట్రేడింగ్ చేసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. -
ముకేశ్ అంబానీకి సెబీ జరిమానా సరికాదు
న్యూఢిల్లీ: రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్) షేర్లలో అవకతవకల ట్రేడింగ్ వివాదం విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ, మరో రెండు సంస్థలపై సెబీ విధించిన జరిమానాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్– శాట్ సోమవారం తోసిపుచి్చంది. 2007లో ఒకప్పటి రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్లలో అవకతవకల ట్రేడింగ్కు పాల్పడినట్లు వచి్చన ఆరోపణలపై ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా– సెబీ జనవరి 2021లో జారీ చేసిన ఉత్తర్వుపై ట్రిబ్యునల్లో దాఖలైన అప్పీల్లో 87 పేజీల ఈ తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో సెబీ జనవరి 2021 కీలక రూలింగ్ ఇస్తూ, ఆర్ఐఎల్పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ రెండింటినీ ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేశారు. ఒకవేళ రెగ్యులేటర్ వద్ద జరిమానాను డిపాజిట్ చేసినట్లయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా సెబీని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆర్ఐఎల్కు లభించని ఊరట.. అయితే ఈ కేసు విషయంలో ఆర్ఐఎల్ వేసిన అప్పీల్ను శాట్ తోసిపుచి్చంది. కంపెనీ విషయంలో సెబీ ఉత్తర్వు్యలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని భావిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ తరుణ్ అగర్వాలా, ప్రిసైడింగ్ ఆఫీసర్ మీరా స్వరూప్లతో కూడిన ధర్మాసనం కంపెనీ అప్పీల్ను తోసిపుచ్చుతూ, ‘కంపెనీ ఆర్ఐఎల్కు సంబంధించినంతవరకు సెబీ ఆర్డర్లో జోక్యం చేసుకోవడానికి మాకు ఎటువంటి కారణం లేదు‘ అని స్పష్టం చేసింది. నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలుకు సంబంధించిన కేసు ఇది. 2009లో ఆర్ఐఎల్తో ఆర్పీఎల్ విలీనమైంది. అంతక్రితం 2007 మార్చిలో ఆర్ఐఎల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ... ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. అటు తర్వాత నవంబర్ 2007లో నగదు– ఫ్యూచర్స్ సెగ్మెంట్లలో ఆర్పీఎల్ షేర్ల అమ్మకం–కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. 2007 నవంబర్లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని సెబీ తన జనవరి 2021 ఆర్డర్లో పేర్కొంది. ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అయితే కంపెనీ (ఆర్ఐఎల్) నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని పేర్కొంది. నగదు, ఎఫ్అండ్ఓ లావాదేవీలు రెండింటిలోనూ ఆర్పీఎల్ షేర్లను విక్రయించడం ద్వారా అనవసరమైన లాభాలను ఆర్జించడానికి తాను నియమించిన ఏజెంట్లతో ఆర్ఐఎల్ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్లోకి ప్రవేశించిందని వివరించింది. ఇది పీఎఫ్యూటీపీ (మోసపూరిత– అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నిషేధం) నిబంధనలను ఉల్లంఘించడమేనని సెబీ తన ఉత్తర్వు్యల్లో పేర్కొంది. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ నిధులు సమకూర్చాయని పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో ముకేశ్ అంబానీ, రెండు కంపెనీల పాత్రపై తగిన ఆధారాలు లేవని శాట్ బెంచ్ అభిప్రాయపడింది. -
సినిమా కోసం రూ.91 కోట్లు ఇస్తే రూ.50 కోట్లు పోగొట్టిన దర్శకుడు
ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ చేయడానికి ఒక దర్శకుడికి రూ.91 కోట్లు చెల్లించింది. కానీ అతడు స్టాక్మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి దాదాపు రూ.50 కోట్లు నష్టపోయినట్లు గురువారం కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 2018లో నెట్ఫ్లిక్స్ కార్ల్రిన్చ్ అనే దర్శకుడి నుంచి ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్ను కొనుగోలు చేసింది. 2020 నాటికి ఆ సిరీస్ కోసం రూ.366 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఆ డబ్బు సరిపోలేదని మరింత కావాలని రిన్చ్ అడగడంతో నెట్ఫ్లిక్స్ రూ.91 కోట్లు ఇచ్చింది. కానీ ఆ డబ్బును ఫార్మాస్టాక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసి రూ.50 కోట్లు నష్టపోయాడు. అయితే మిగతా రూ.33 కోట్లను డోజికాయిన్ అనే క్రిప్టోకరెన్సీలో ట్రేడింగ్చేసి రూ.220 కోట్లు సంపాదించినట్లు సమాచారం. తర్వాత తాను ఖరీదైన ఐదు రోల్స్రాయిస్ కార్లు, ఒక ఫెరారీ కారు, ఫర్నీచర్, డిజైనర్ దుస్తులను కొనుగోలు చేసినట్లు కొన్ని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. 2021లో బయోటెక్ సంస్థకు చెందిన గిలియడ్ సైన్సెస్ షేర్లు పెరుగుతాయని రిన్చ్ పందెం వేసినట్లు కొన్ని కథనాలు ద్వారా తెలిసింది. తాజాగా అమెరికా మార్కెట్ ఎస్అండ్పీ 500 ఇండెక్స్ మరింత పడిపోతుందని ఆప్షన్ ట్రేడింగ్ చేసి కొన్ని వారాల వ్యవధిలోనే తాను రూ.50 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. తాజా ఘటనపై నెట్ఫ్లిక్స్ తన ప్రాజెక్ట్కు నిధులు ఇవ్వడం మానేసి రిన్చ్పై దావా వేయనుందని సమాచారం. ఇదీ చదవండి: అందుకే వృద్ధులకు ఉపాధి కరవు: మెకిన్సే నివేదిక ఇదిలాఉండగా కార్ల్రిన్చ్ గతంలో కేవలం ‘47 రొనిన్’ అనే ఒకే సినిమా రూపొందించడం గమనార్హం. ఈ మొత్తం ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రిప్లైలు వైరల్గా మారుతున్నాయి. రిన్చ్ జీవితంపైనే మంచి సినిమా తీయచ్చని కొందరు, తాను స్కామ్ చేశాడని ఇంకొందరు పోస్ట్ చేస్తున్నారు. -
చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తక్కువ శ్రామిక శక్తితో అధిక ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. దాంతో వినియోగదారులు వారి ఆదాయాలను అధికం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ పరిధిదాటి వ్యవహరిస్తుంది. జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓపెన్ఏఐ విప్లవాత్మక మోడల్ చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల యూకేలో నిర్వహించిన ఏఐ సేఫ్టీ సమ్మిట్లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఏఐ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఏఐ బోట్ సదరు సంస్థకు చెప్పకుండా స్టాక్లను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేయడానికి అంతర్గత సమాచారాన్ని ఉపయోగించింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ను ఉపయోగించారా అని బోట్ను అడిగినప్పుడు అది వాస్తవాన్ని తిరస్కరించింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇదీ చదవండి: 22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్ఫోర్స్ ఈ డెమోను ఆవిష్కరించింది. అభివృద్ధి అధునాతన సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. ఏఐ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను ఓపెన్ఏఐతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది. -
ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే...
ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మంగళవారం అరశాతం పతనమైంది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకశాతానికి పైగా క్షీణించి సూచీలను నష్టాల వైపు నడిపించాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 65,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 19,529 వద్ద నిలిచింది. 3 రోజుల వరుస సెలవుల తర్వాత స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 65,345 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 19,480 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాకులు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా, రియల్టి, కన్జూ్యమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,034 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ క్యూ2 ఫలితాల ప్రకటనకు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ లభించింది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, పీఎస్బీ, ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5–3% ర్యాలీ చేశాయి. యుకో బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% లాభపడ్డాయి. ఎస్బీఐ బ్యాంక్ షేరు ఒకశాతం పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ రెండున్నర శాతం ర్యాలీ చేసింది కేంద్ర పెట్రోలియం శాఖ దేశీయ సహజ వాయువు ధరలు 7% పెంచడంతో ఓఎన్బీసీ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య రికవరీ సైతం ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఈ షేరు బీఎస్ఈలో 4% నష్టపోయి రూ.185 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 4.50% క్షీణించి రూ.184 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండెక్సుల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఐషర్ మోటార్స్ షేరు 3% నష్టపోయి రూ.3351 వద్ద స్థిరపడింది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు సెపె్టంబర్లో తగ్గిపోవడం షేరు పతనానికి కారణమైంది. హిట్... ఫ్లాట్ నష్టాల మార్కెట్లోనూ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిస్టింగ్ బంపర్ హిట్ కొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.119)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు 32.18% ర్యాలీ చేసి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.157 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.33,033 కోట్లుగా స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 57.99 లక్షల ఈక్విటీ షేర్లను చేతులు మారాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెలర్స్ షేరు ఫ్లాటుగా లిస్టయింది. ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే బీఎస్ఈలో లాభ, నష్టాలు లేకుండా రూ.215 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.210–222 మధ్య ట్రేడైంది. చివరికి 0.30% స్వల్ప లాభంతో రూ.216 వద్ద క్లోజైంది. మార్కె ట్ విలువ రూ.1,053 కోట్లుగా నమోదైంది. -
ట్రేడింగ్పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
ట్రేడింగ్లో దూసుకుపోతున్న మహిళలు.. ఇన్వెస్టర్లుగా సత్తా
విజేతల విజయాలు ఇతరులకు స్ఫూర్తి ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ ఉమెన్ ఇన్వెస్టర్ల నుంచి స్ఫూర్తి పొందిన ఈతరం అమ్మాయిలు ‘లెర్నింగ్ అండ్ చేజింగ్’ సూత్రంతో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్లలో విజయం సాధిస్తున్నారు. తమదైన గెలుపు ప్రణాళికను పక్కాగా రూపొందించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్ గేమ్లో పురుషాధిక్యత కనిపిస్తుంది. ఒక ఆన్లైన్ వెల్త్ మేనేజ్మెంట్ స్టడీ ప్రకారం అయిదుమందిలో ఒకరు మాత్రమే ఉమెన్ ఇన్వెస్టర్. అయితే ఈ పరిస్థితులలో ఇప్పుడు ఆశాజనకమైన మార్పు కనిపిస్తుంది. ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాలోకి మహిళలు వచ్చి సత్తా చాటుతున్నారు. మన దేశం విషయానికి వస్తే పాండమిక్ సమయంలోనూ ఉమెన్ ఇన్వెస్టర్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. రాజస్థాన్లోని జైపుర్కు చెందిన వర్ష శ్రీవాస్తవకు ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్లో రాణించాలనేది భవిష్యత్ లక్ష్యం. ఇన్వెస్ట్మెంట్లో అద్భుత విజయాలు సాధించిన మహిళలు ఎంబీఏ చేస్తున్న వర్షకు స్ఫూర్తి. బెంగళూరుకు చెందిన ఏంజెల్ ఇన్వెస్టర్ అంకిత వశిష్ఠ ఔత్సాహిక మహిళా ఇన్వెస్టర్లకు స్ఫూర్తిగా నిలిచింది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ‘సహ ఫండ్’ కు అంకిత ఫౌండర్, సీయివో. వీసీ ఫర్మ్ ‘స్ట్రాంగ్హర్’ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్. పద్మజ రూపరెల్ ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్(ఐఏఎన్) కో–ఫౌండర్, ప్రెసిడెంట్. ‘ఐఏఎన్’ పది దేశాలలో ఫైనాన్స్, వ్యవసాయం, అంతరిక్షం, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, వైద్యపరికరాలు... మొదలైన రంగాలలో పెట్టుబడులు పెడుతోంది. పద్మజ ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్’గా గుర్తింపు పొందింది.... ఈ ఇద్దరు మాత్రమే కాదు భారతీ జాకబ్, నీతా మీర్చందానీ, సాక్షి చోప్రా, బాలా దేశ్ పాండే...లాంటి ప్రముఖ ఇన్వెస్టర్లు వర్షకు స్ఫూర్తి.ముంబైకి చెందిన చైత్రకు లారెన్ సీమన్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. ‘సీమన్స్ గురించి చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది. ఆమె మాటల్లో ఎంతో స్ఫూర్తి దొరుకుతుంది’ అంటుంది చైత్ర. ఇరవై మూడు సంవత్సరాల వయసులో వాల్స్ట్రీట్లో యంగెస్ట్ ఫుల్–టైమ్ ఫిమేల్ ట్రేడర్గా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది లారెన్ సీమన్స్. కెరీర్ మొదలుపెట్టినప్పుడు సీమన్స్కు ఎలాంటి అనుభవమూ లేదు. కుటుంబ సభ్యులు, బంధువులలోనూ ఆ రంగంలో ఎవరూ లేరు. జెనెటిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన సీమన్స్ న్యూయార్క్ సిటీకి వెళ్లి ఫైనాన్స్ రంగంలో అడుగు పెట్టింది,.‘డైరెక్షన్లెస్’ ‘కన్ఫ్యూజ్డ్’ అంటూ ఆమెకు పేర్లు తగిలించేవాళ్లు కొందరు పురుషులు. ఈ పేర్ల వెనుక ఉద్దేశం ఆమెకు ఏమీ తెలియదు అని. అయితే ‘రోసెన్బ్లాట్ సెక్యూరిటీస్’ సీయీవో జో గౌరోస్కి మాత్రం ఆమెపై నమ్మకం ఉంచాడు. ‘జార్జియా నుంచి ఇక్కడికి వచ్చిన ఈ అమ్మాయికి ఫైనాన్స్లో డిగ్రీ లేదు. అయితే ఏదో సాధించాలనే ఉత్సాహం ఉంది. అంకితభావం ఉంది’ అన్నారు. రోసెన్ బ్లాట్ సెక్యూరిటీస్లోకి అడుగుపెట్టి ప్రయాణం ప్రారంభించింది సీమన్స్. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ కీనోట్ స్పీకర్గా ఫైనాన్స్కు సంబంధించి అమ్మాయిలకు స్ఫూర్తి ఇస్తుంది. వారి కోసం ఎన్నో రచనలు చేసింది. సీమన్స్లాగే మన దేశానికి చెందిన మహెక్ షాకు వెటకారం మాటలు ఎదురయ్యాయి. పందొమ్మిది సంవత్సరాల వయసులోనే ట్రేడింగ్లోకి వచ్చిన మహెక్ వాటిని పట్టించుకోలేదు. తన పనితోనే సమాధానం చెప్పాలనుకుంది. ఇంట్రాడే ట్రేడింగ్తో స్టాక్మార్కెట్లో తొలి అడుగు వేసింది. టెక్నికల్ టర్మ్స్ను అర్థం చేసుకోవడం నుంచి సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం వరకు ఎన్నో విషయాలను తన ప్రయాణంలోనే నేర్చుకుంది. హైయెస్ట్ ప్రాఫిట్ చూసిన రోజు తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యేది. ట్రేడింగ్లో డబ్బు కోల్పోయిన సందర్భాలు కూడా లేక΄ోలేదు. ‘చాలా నిరుత్సాహానికి గురయ్యాను. అయితే అంతలోనే తేరుకొని తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను’ అంటుంది 26 సంవత్సరాల మహెక్. పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు చేతిలో ల్యాప్టాప్తో పనిలో తలమునకలై ఉంటుంది మహెక్. డిగ్రీ తరువాత ఫుల్టైమ్ ట్రేడర్ అయింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా తాను సంపాదించిన డబ్బుతో యూకేలో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసింది. చార్టెడ్ ఎకౌంటెన్సీ ట్రైనింగ్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చిన ప్రియల్ అనిల్ బర్గీ ఈక్విటీ ఇన్వెస్టింగ్లోకి అడుగు పెట్టింది. తండ్రి నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని స్టాక్మార్కెట్లోకి వచ్చిన ప్రియల్ ఆ మొత్తాన్ని కొంతకాలానికే రెట్టింపు చేసింది. అంతమాత్రాన ఆమెకు నష్టాలు ఎదురు కాలేదని కాదు. ఒకేరోజు కొన్ని లక్షలు పోగొట్టుకొని షాక్కు గురైంది. అయితే నిరాశతో వెనకడుగు వేయకుండా, తాను వేసిన తప్పటడుగును లోతుగా విశ్లేషించుకుంది. ‘ఇతరుల ద్వారా తెలుసుకునే టిప్స్ మాత్రమే మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడవు. అతిపెద్ద సవాలు ఏమిటంటే దురాశకు దూరంగా ఉండడం. అదే సమయంలో ఆశావాదాన్ని కోల్పోకుండా ఉండడం. భయం ఉండాలి. అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే భయం కాకూడదు. మనల్ని హద్దుల్లో పెట్టే భయమై ఉండాలి’ అంటున్న 27 సంవత్సరాల ప్రియల్ బర్గీ నాగ్పుర్ కేంద్రంగా ‘నతిభాయి తులసీదాస్ ఇన్వెస్ట్మెంట్స్’ సంస్థను ప్రారంభించింది. పవర్ ఆఫ్ ట్రేడింగ్ తెలుసుకున్నాను. ఫారిన్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో నేర్చుకున్న విషయాలు నాకు ఉపకరిస్తాయి. – మహెక్ షా ఇతరుల ద్వారా తెలుసుకునే టిప్స్ మాత్రమే మనం నిలదొక్కుకోవడానికి ఉపయోగపడవు. అతిపెద్ద సవాలు ఏమిటంటే దూరాశకు దూరంగా ఉండడం. అదే సమయంలో ఆశావాదాన్ని కోల్పోకుండా ఉండడం. – ప్రియల్ బర్గీ -
ప్రపంచ వాణిజ్యంలో ఎక్కడున్నాం..?
జూన్ నెలలో దేశ ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా 2 శాతమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ప్రపంచంలోని ఏ దేశానికైనా ఇది అత్యధికం. దేశంలోని చాలా పరిశ్రమలు స్థానిక అవసరాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదు. దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం ఎగుమతులు పెరగకపోవడానికి మరో కారణం. అయితే ఐటీ, వ్యాపార సేవల విషయంలో మాత్రం చాలా మెరుగ్గా ఉన్నాం. ఇది సానుకూలాంశం. విదేశాలతో వ్యాపారం చేయడం భారత్కు చాలా పాతవిద్య. ఆర్థిక వ్యవస్థ గణనీయంగా, వేగంగా క్షీణించిన వలస పాలకుల ఏలుబడిలోనూ చైనా సహా ఇతర ఇరుగు పొరుగు దేశాలతో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించిన ఘనత మనది. అయితే శతాబ్దాల విదేశీ వ్యాపార అనుభవమున్నప్పటికీ పలు దశాబ్దాలుగా విదేశీ వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థలో అతి బలహీనమైన లంకెలా మిగిలిపోయింది. 2022–23లో వర్తకపు సరుకుల ఎగు మతులు 45,000 కోట్ల డాలర్లకు చేరడంతో విదేశీ వ్యాపారం పరిస్థితి కొంత మెరుగైనట్లు కనిపించింది. కానీ ఈ రికార్డు స్థాయి వ్యాపారం కోవిడ్ తదనంతరం అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్లనే అని తేలింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారం మళ్లీ తగ్గి పోయింది. జూన్ నెలలో ఎగుమతులు 22 శాతం తగ్గిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మంద గమనానికి, అధిక ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానాలకు ఇది నిదర్శనం. అయితే ఇక్కడ ఓ సానుకూల అంశం లేకపోలేదు. సేవల ఎగు మతులు ఇప్పటికీ పెరుగుతున్నాయి. ఈ విషయంలో భారత వాణిజ్యం ప్రతికూల పరిస్థితులను కాదని ముందుకు సాగుతున్నది. సమీప భవిష్యత్తులోనే కాకుండా దీర్ఘకాలంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. సేవల రంగంలో భారత్ భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 4.9 శాతానికి చేరుకున్నట్లు మోర్గన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక తెలియజేయడం చెప్పుకోవాల్సిన అంశం. ఇది ప్రధానంగా ఐటీ సేవల (46 శాతం) వల్లనే. దీంతోపాటు వ్యాపార సేవలు కూడా 24 శాతంతో తమదైన ముద్ర వేశాయి. సేవల విషయంలో పరిస్థితి ఇలా ఉంటే, వస్తువుల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. వస్తువుల ఎగుమతులు అమెరికా, యూరప్ వంటి మార్కెట్ల డిమాండ్లపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. గూడ్స్ మార్కెట్లో భారత్ వాటా కేవలం రెండు శాతం మాత్రమే. ఐర్లాండ్ లాంటి చిన్న దేశాల కంటే ఇది తక్కువ. మన పొరుగునే ఉన్న చైనా వాటా ఏకంగా 12.5 శాతం. ఒక దేశానికి సంబంధించి ప్రపంచంలోనే ఇది ఎక్కువ. శేష ప్రశ్నలు ఎన్నో... దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశ్రమలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో మన పాత్ర పెంచుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఎగుమతుల విషయంలో వెనుకబడి ఉండేందుకు కారణాలేమిటి? మొదటిది... దేశీ మార్కెట్ ఒకటి లేకపోవడం. దేశీ మార్కెట్ ఒకటి ఉండి ఉంటే స్థానిక చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ఇక్కడే వ్యాపారం చేసుకునేందుకు వీలు ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలకు ఓర్చి విదేశీ మార్కెట్లను వెతుక్కునే శ్రమ తగ్గుతుంది. దేశంలో కొన్ని పరిశ్రమలు కేవలం ఎగుమతులపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి. వీటిల్లో కొన్ని సంప్రదాయ రంగాలకు చెందినవీ ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్, హస్తకళలు, జ్యువెలరీ, రంగురాళ్లు వంటివి. వీటితోపాటు ఫార్మా, ఇంజినీరింగ్ వస్తువులు, రిఫైన్డ్ నూనె ఉత్పత్తులు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చాలా పరిశ్రమలు స్థానికంగా మార్కెట్ అవస రాలు తీరి వస్తువులు అదనంగా ఉన్నప్పుడు మాత్రమే ఎగుమతుల గురించి ఆలోచిస్తున్నాయి. ఇంకోలా చెప్పాలంటే స్థానిక పరిశ్రమలు సహజ సిద్ధంగా ఎగుమతులకు మొగ్గు చూపడం లేదన్నమాట. ఎగుమతులు పెరగకపోవడానికి రెండో లోపం... దేశం ఏదో ఒక భారీ ప్రాంతీయ వ్యాపార గ్రూపులో భాగంగా లేకపోవడం. ప్రపంచ వాణిజ్య సంస్థపై మనం చాలాకాలం ఆశలు పెట్టుకున్నాం. ఎదుగు తున్న మార్కెట్లకు కొన్ని లాభాలు అందిస్తుందని ఆశపడ్డాం. ఈ క్రమంలో ప్రాంతీయ లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు చేసుకునే సమయం కాస్తా మాయమైపోయింది. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగ స్వామ్యం (రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్ట్నర్షిప్–ఆర్సీఈపీ) నుంచి వైదొలగాలన్న నిర్ణయం కూడా ఆచితూచి తీసుకున్నదే. ఏదో ఒక దేశం ద్వారా చైనా తన చౌక వస్తువులను దేశంపై గుమ్మరిస్తుందన్న ఆందోళన కూడా ఉండింది. అయినా కూడా... ఇతర ప్రాంతీయ వాణిజ్య గ్రూపుల్లోకి చేరే దిశగా చాలాకాలం క్రితమే ప్రయత్నాలు చేసి ఉండాల్సింది. ఉదాహరణకు... పదకొండు మంది సభ్యులున్న ‘కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్’ (సీపీటీపీపీ). ఈ వ్యాపార వర్గంలో చేరి ఉంటే దేశ విదేశీ వ్యాపారం, ఎగుమతులు పెరిగేందుకు తగిన సహకారం లభించి ఉండేది. ఇప్పటికీ సమయం మించిపోలేదు. ఆస్ట్రేలియా, జపాన్, మలేసియాలు భాగస్వాములుగా ఉండి... అతి జాగ్రత్తగా చైనా లేకుండా చేసుకున్న వ్యాపార వర్గంలో చేరేందుకు భారత్ ప్రయత్నించాలి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే... యూరోపి యన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందం పదేళ్లుగా అమల్లో లేకుండా పోయింది. భారత్కున్న అతి పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైన ఈ ప్రాంతంతోనూ వాణిజ్య ఒప్పందం విషయమై ఇటీవలే చర్చలు మొదలయ్యాయి. అదృష్టవశాత్తూ దేశంలోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భాగం కావడం దేశ హితం కోసమే అన్న భావన ప్రబలుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియాలతో ఇలాంటి ఒప్పందాలు ఇటీవలే కుదరడం గమనార్హం. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్, యునైటెడ్ కింగ్డమ్లతోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. మళ్లీ వెనక్కి? యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఏడేళ్లుగా స్తబ్ధుగా ఉంది. ఒప్పందం చేసు కోవడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు చర్చలు ఒక్కటే మార్గమని ఇటీవలే గుర్తించి ఆ దిశగా ముందుకు కదులుతూండటం హర్షించదగ్గ విషయం. పర్యావరణం, లేబర్, డిజిటల్ వాణిజ్యం వంటి వాణిజ్యేతర అంశాలను కూడా ఇప్పుడు చర్చి స్తున్నారు. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఒప్పందం కుదిరితే చాలా లాభాలుంటాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ వంటి హైటెక్ దేశాల్లో మన దేశానికి చెందిన నిపుణులు పనిచేయడం సులువు అవుతుంది. చివరగా... ఎగుమతులు మరింత జోరు అందుకునేందుకు ఉన్న ఇంకో అవరోధం ఇటీవలి కాలంలో పెరిగిపోయిన రక్షణాత్మక ధోరణులు. దిగుమతులకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది. విదేశీ తయారీదారుల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు భారతీయులు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. స్థానికంగా పారిశ్రామిక రంగానికి సహాయం అవసరమని అనుకుంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల వంటివి ఉండనే ఉన్నాయి. దిగుమతి చేసుకునే వస్తువులు మరింత ఖరీదు చేయడం కంటే దేశీ తయారీ రంగం ఊపందుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు సరిపోతాయి. ఆత్మ నిర్భర్ భారత్ విధానం కూడా గతంలోని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్(దిగుమతికి ప్రత్యామ్నాయం) విధానాన్ని గుర్తు చేస్తోంది. లైసెన్స్ రాజ్ కాలంలో ఇది చాలా ప్రధానమైందన్నది తెలిసిందే. దేశంలో ఇప్పటికే దిగుమతి సుంకాలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అవి చైనా, ఆగ్నేయాసియా దేశాల సుంకాలకు రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ పరిస్థితి మారితేనే భారత్ అంతర్జాతీయ వాణిజ్య విపణిలో కీలక పాత్ర పోషించగలుగుతుంది. వ్యాసకర్త: సుష్మా రామచంద్రన్ ఆర్థిక వ్యవహారాల సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మార్కెట్లో ‘ఫెడ్’ అప్రమత్తత
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం(నేటి రాత్రి), కీలక కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ ఉదయం 146 పాయింట్ల లాభంతో 66,531 వద్ద మొదలైంది. ట్రేడింగ్లో 381 పాయింట్ల పరిధిలో 66,178 వద్ద కనిష్టాన్ని, 66,559 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పాయింట్ల స్వల్ప లాభంతో 66,356 వద్ద నిలిచింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 19,729 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,616 – 19,729 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఎనిమిది పాయింట్ల స్వల్ప నష్టంతో 19,681 వద్ద నిలిచింది. బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో రియల్టీ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. మెటల్, ఇంధన, ఆటో, ఫార్మా, మీడియా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు 0.39%, 0.31 శాతం చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,089 కోట్ల షేర్లను కొన్నారు.., దేశీ ఇన్వెస్టర్లు రూ.334 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆర్థిక వేత్తలు అంచనాలకు తగ్గట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ చైనాలో కోవిడ్ అనంతరం నెలకొన్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలతో దేశీయ మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ మూడుశాతం ర్యాలీ చేసింది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో షేర్లు 5.50 – 4% ర్యాలీ చేశాయి. జేఎస్డబ్ల్యూ, ఏపీఎల్ అపోలో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, నాల్కో షేర్లు 3% లాభపడ్డాయి. సెయిల్, వేదాంత, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ జింక్ షేర్లు రెండు శాతం ర్యాలీ చేశాయి. ♦ దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అదానీ గ్రూప్ షేర్లు లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ పవర్ 9.3% ర్యాలీ చేశాయి. అదానీ ట్రాన్స్మిషన్ 8%, అదానీ విల్మార్ 5%, అదానీ టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ షేర్లు పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఈ గ్రూప్ చెందిన అంబుజా సిమెంట్స్ 4%, ఏసీసీ 5%, లాభపడ్డాయి. అదానీ ఎంటర్ప్రైజస్, అదానీ పోర్ట్స్ 2% పెరిగాయి. పది కంపెనీల షేర్ల ర్యాలీతో గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్క రోజులోనే రూ.50,501 కోట్లకు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు చేరింది. ♦ టాటా స్టీల్ షేరు ఆరంభ నష్టాల నుంచి కోలుకొని లాభాల్లోకి వచ్చింది. చివరికి 3% లాభపడి రూ.119 వద్ద స్థిరపడింది. -
ఆర్ఐఎల్ కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ.. ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్కు తెరతీస్తోంది. ఫైనాన్షియల్ సర్వి సెస్ బిజినెస్ను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఆర్ఐఎల్ విడదీయనుంది. తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్గా మార్పు చేయనుంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకూ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరును కేటాయించనుంది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 20కాగా.. అదే రోజు కొత్తవిధానంలో ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్ను ఎన్ఎస్ఈ నిర్వహించనుంది. దీని ప్రకారం నిఫ్టీ ఇండెక్స్లో ఆర్ఐఎల్ కొనసాగనుంది. 19 ఇండెక్సులలో..: జియో ఫైనాన్షియల్ను తాత్కాలికంగా నిఫ్టీ–50లో కొనసాగించడంతోపాటు.. 19 ఇండెక్సులలో చోటు కల్పించనుంది. దీంతో జూలై 20 నుంచి కనీసం మూడు రోజులపాటు నిఫ్టీకి తాత్కాలికంగా 51 షేర్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. జియో ఫైనాన్షియల్ లిస్టయిన రోజు నుంచి మూడు రోజులు( ఖీ+3) పూర్తయ్యాక ఇండెక్సుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నిఫ్టీ ఇండెక్సుల కొత్త విధానం ప్రకారం ఎన్ఎస్ఈ చేపట్టనుంది. ఏప్రిల్లో ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ కొన్ని సవరణల ద్వారా కొత్త విధానానికి తెరతీసింది. కంపెనీల విడదీతసహా కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా తాజా విధానానికి రూపకల్పన చేసినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్ను నిర్వహిస్తే నిఫ్టీలో విడదీత కంపెనీకి చోటు కల్పించవచ్చు. రికార్డ్ డేట్ ఎఫెక్ట్.. అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వి సెస్ విడదీతకు రికార్డ్ డేట్ జూలై 20 కాగా.. 19 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకు జియో ఫైనాన్షియల్ షేర్లు పొందేందుకు వీలుంటుంది. ఇక గురువారం (20న) ఎన్ఎస్ఈ రెగ్యులర్ ట్రేడింగ్ కంటే ముందుగా ప్రత్యేక ప్రీ–ఓపెన్ సెషన్ను నిర్వహిస్తోంది. ఉదయం 9–10 మధ్య జియో ఫైనాన్షియల్ షేరు ధర నిర్ణయానికి ఇది సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన ఉదాహరణను చూద్దాం.. 19న (టీ–1) ఆర్ఐఎల్ ముగింపు ధర రూ. 2,800 అనుకుంటే.. 20న రూ. 2,600 ధర పలికిందనుకుందాం.. వెరసి జియో ఫైనాన్షియల్ షేరు ధరను రూ. 200గా పేర్కొనవచ్చు. -
సెకండరీ మార్కెట్ ట్రేడింగ్లోనూ ‘అస్బా’
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సొమ్ముకు రక్షణ కల్పించే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సెకండరీ మార్కెట్లోనూ అస్బాకు తెరతీసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. షేర్ల జారీ తదుపరి ఖాతాలో నిలిపి ఉంచిన సొమ్ము బదిలీ(అస్బా) పద్ధతికి దన్నుగా ప్రస్తుతం అనుబంధ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా ప్రైమరీ మార్కెట్లో వినియోగించే అస్బా సౌకర్యాన్ని 2024 జనవరి 1కల్లా సెకండరీ మార్కెట్లోనూ అమలు చేసే చర్యలకు తెరతీసింది. అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్డ్ అమౌంట్(అస్బా) అమలు చేయడం ద్వారా ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాలోని సొమ్ము ట్రేడింగ్ సభ్యునికి బదిలీకాకుండా నిలిచిపోతుంది. వెరసి లావాదేవీ తదుపరి ఇన్వెస్టర్లకు షేర్లు బదిలీ అయ్యాక మాత్రమే అతని ఖాతా నుంచి నిలిపి ఉంచిన సొమ్ము సంబంధిత ఖాతాకు విడుదల అవుతుంది. ప్రైమరీ మార్కెట్లో ఇప్పటికే అస్బా అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా మార్గదర్శకాల ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్(సీసీ)కు అనుగుణంగా క్లయింట్ ఖాతాలోని సొమ్మును నిలిపి ఉంచుతారు. లావాదేవీ గడువు ముగిశాక లేదా సీసీ విడుదల చేశాక నిధులు బదిలీ అవుతాయి. దీంతో అటు సభ్యుల నుంచి సెక్యూరిటీలు, ఇటు క్లయింట్ల నుంచి నిధులు బదిలీ ద్వారా కాకుండా సీసీ ద్వారా లావాదేవీ సెటిల్మెంట్ జరుగుతుంది. ఫలితంగా క్లయింట్ల సొమ్ము అక్రమ వినియోగానికి చెక్ పడే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. -
సెబీకి రూ. 72.64 కోట్లు కట్టిన ఎన్ఎస్ఈ..
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ 2021 ఫిబ్రవరిలో ఎదురైన ట్రేడింగ్ అవాంతర కేసును పరిష్కరించుకుంది. సొంత అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ క్లియరింగ్ లిమిటెడ్(ఎన్సీఎల్)తో కలసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రూ. 72.64 కోట్లు చెల్లించడం ద్వారా ట్రేడింగ్ అవాంతర వివాదాన్ని సెటిల్ చేసుకుంది. ఎన్ఎస్ఈ దాదాపు రూ. 50 కోట్లు, ఎన్సీఎల్ సుమారు రూ. 23 కోట్లు చొప్పున చెల్లించాయి. 2021 ఫిబ్రవరి 24న ఎన్ఎస్ఈలో దాదాపు నాలుగు గంటలపాటు ట్రేడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టెలికం లింకులు విఫలంకావడంతో ఎన్సీఎల్కు చెందిన ఆన్లైన్ రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులో లేకుండా పోయినట్లు ఎన్ఎస్ఈ వివరించింది. ఎన్ఎస్ఈలో నమోదయ్యే అన్ని లావాదేవీలనూ క్లియరింగ్తోపాటు సెటిల్మెంట్ బాధ్యతలను ఎన్సీఎల్ నిర్వహిస్తుంది. -
ట్రేడింగ్ ట్రెండ్: సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరే చాన్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈ వారంలో జీవితకాల గరిష్ట స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల వార్తలు మినహా దేశీయంగా ట్రేడింగ్ను ప్రభావితం చేసే ఇతర అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ధోరణికి అనుగుణంగానే కదలాడతాయని చెబుతున్నారు. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 759 పాయింట్లు, నిఫ్టీ 263 పాయింట్లు పుంజుకున్నాయి. వారాంతం రోజైన శుక్రవారం మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్త రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ జీవితకాల గరిష్ట స్థాయి (63,583)కి 198 పాయింట్లు, నిఫ్టీ ఆల్టైం హై (18,888)కి 62 పాయింట్లు చేరువులో ఉన్నాయి. సరికొత్త రికార్డు స్థాయిల నమోదు ఇప్పుడు నామమాత్రమే. సరికొత్త రికార్డులు సృష్టించిన తర్వాత ర్యాలీ కొనసాగుతుందా..? లేక గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరిగి వెనక్కి వస్తుందా అనేది వేచి చూడాల్సి అంశం. ఒకవేళ మొమెంటమ్ కొనసాగితే నిఫ్టీ 19,000 స్థాయికి చేరవచ్చు. అమ్మకాలు జరిగితే దిగువ స్థాయిలో 18,676 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ అని ఏంజెల్ వన్ టెక్నికల్, డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సమీత్ చవన్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు యూరోజోన్ నిర్మాణ ఉత్పాదక, కరెంట్ అకౌంట్ డేటా, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం (జూన్ 21న) అమెరికా దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ (టెస్టిమోనీ) ఇవ్వనున్నారు. పావెల్ వ్యాఖ్యలను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించే వీలుంది. అదే రోజున జపాన్ కేంద్ర బ్యాంక్ పాలసీ సమావేశ నిర్ణయాలు, బ్రిటన్ మే ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. గురువారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లు వెల్లడవుతాయి. వారాంతం రోజున యూఎస్ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు, జపాన్ ద్రవ్యోల్బణ, బ్రిటన్ రిటైల్ అమ్మకాలు విడుదల కానున్నాయి. వర్షపాత వార్తలపై దృష్టి స్టాక్ మార్కెట్ కదలికపై నైరుతి రుతుపవనాల వార్తలూ ప్రభావం చూపే అవకాశం ఉంది. రుతుపవనాల విస్తరణలో మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్నినో ప్రభావం వర్షపాతంపై ఉండదని, దేశంలో సాధారణ వర్షపాతం నమోదవ్వొచ్చంటున్నారు. సాధారణ రుతుపవనాలు ద్రవ్యోల్బణాన్ని తగ్గించగలవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎఎంసీజీ, ఎరువులు, వ్యవసాయం, వినియోగ, ఆటో రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. రెండు వారాల్లో రూ.16,405 కోట్లు భారత మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. గత మూడు నెలలుగా భారత ఈక్విటీలపై ఆసక్తి కనబరుస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ జూన్లో భారీ ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటి వరకు (116 తేదీల మధ్య) రూ.16,405 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ, వృద్ధిపై పలు రేటింగ్ ఏజెన్సీల సానుకూల ప్రకటనల అంశాలు ఎఫ్పీఐల కొనుగోళ్లకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. -
‘రూపే’ చెల్లింపులపై భారత్, రష్యా కసరత్తు
న్యూఢిల్లీ: సీమాంతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించి భారత్, రష్యా తమ తమ స్వంత పేమెంట్ విధానాలను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఇరు దేశాల అత్యున్నత స్థాయి కమిషన్ (ఐఆర్ఐజీసీ–టీఈసీ) ఇటీవల సమావేశమైన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రూపే (భారత్), మిర్ కార్డుల (రష్యా) వినియోగం ద్వారా ఇరు దేశాల ప్రజలు తమ తమ కరెన్సీల్లో చెల్లింపులు జరిపేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి. భారత ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ), రష్యాకు చెందిన ఫాస్టర్ పేమెంట్స్ సిస్టమ్ (ఎఫ్పీఎస్)ను అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అలాగే, సీమాంతర చెల్లింపుల కోసం బ్యాంక్ ఆఫ్ రష్యాకు చెందిన సర్వీసెస్ బ్యూరో ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ను ఉపయోగించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. భారత్ ప్రస్తుతం ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్విఫ్ట్ నెట్వర్క్ను ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో తాజా భేటీలో ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ తమ దేశాల కరెన్సీల్లో సీమాంతర చెల్లింపులను జరిపేందుకు తోడ్పడేలా భారత్, సింగపూర్ ఇటీవలే యూపీఐ, పేనౌ (సింగపూర్ వ్యవస్థ)ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. సింగపూర్లోని ప్రవాస భారతీయులు తక్కువ లావాదేవీ వ్యయాలతో, సత్వరం అక్కడి నుంచి ఇక్కడికి డబ్బును పంపించేందుకు ఇది తోడ్పడుతోంది. -
3 నెలల గరిష్టానికి మార్కెట్
ముంబై: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో సూచీలు మూడు నెలల గరిష్టం వద్ద ముగిశాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడం కలిసొచ్చాయి. ఒకరోజు సెలవు తర్వాత ప్రారంభమైన సూచీలు లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు పెరిగి 61,302 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 18,125 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 374 పాయింట్లు ర్యాలీ చేసి 61,486 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు దూసుకెళ్లి 18,180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే యూరప్ మార్కెట్ల బలహీన ట్రేడింగ్ ప్రభావంతో చివర్లో కొంత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆఖరికి సెన్సెక్స్ 242 పాయింట్ల లాభంతో 61,355 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా ఎనిమిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 18,148 వద్ద ముగిసింది. కాగా ఈ ఇండెక్స్కిది అయిదోరోజూ లాభం ముగింపు కావడం విశేషం. వరుస ర్యాలీ క్రమంలో సూచీలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసీసీ, టెలీకమ్యూనికేషన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1997 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్ల రూ.394 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఐదుపైసలు బలహీనపడి 81.87 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన సమావేశ ప్రారంభానికి ముందు(మంగళవారం రాత్రి) ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ప్రోత్సాహకర కార్పొరేట్ క్యూ4 ఆదాయాలు, మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు దన్నుతో దేశీయ స్టాక్ సూచీలు లాభాలు గడించాయి. ప్రస్తుతం సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18180 – 18200 శ్రేణిలో కీలక నిరోధం కలిగి ఉంది. దిగువ స్థాయిలో 18050 – 18000 పరిధిలో తక్షణ మద్దతు కలిగి ఉందని’’ జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ షేరు 16 శాతం పెరిగి రూ.566 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో 18 శాతం ఎగిసి రూ.595 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 63% వృద్ధితో రూ.79 కోట్లను సాధించడం ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ♦ ఏప్రిల్లో ఎన్ఎండీసీ ఉత్పత్తి, అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడంతో ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేరు రాణించింది. బీఎస్ఈలో ఒకటిన్నర శాతం బలపడి రూ.110 వద్ద స్థిరపడింది. ♦ కేంద్రం ముడి చమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ ట్యాక్స్ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఓఎన్జీసీ షేరు మూడున్నర శాతం లాభపడి రూ.164 వద్ద ముగిసింది. -
సింగిల్ ట్రాన్సాక్షన్లో కోటి తగలెట్టేశా, ఈ ఘోర తప్పిదం నావల్లే!
సాక్షి, ముంబై: ట్రేడింగ్ అంటేనే చాలా అవగాహన అంతకుమించిన అప్రతమత్తత అవసరం. అందులోనూ ఇక క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా క్రిప్టో లావాదేవాల్లో చోటుచేసుకున్న ఒక్క పొరపాటు అతని జీవితాన్ని నాశనం చేసింది. అనుకోకుండా కోటిరూపాయల ఎన్ఎఫ్టీలని కోల్పోయాడు. అంతేకాదు అతని నికర విలువ దాదాపు మూడో వంతు తుడిచి పెట్టుకు పోయింది. ఆనక పొరబాటు గుర్తించి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలను పరిశీలిస్తే.. బ్రాండన్ రిలే ఎన్ఎఫ్టీ కలెక్టర్. ఈక్రమంలో CryptoPunk #685 అనే NFTని 77 ఈథర్లు లేదా దాదాపు 1 కోటి రూపాయలకు కొన్ని వారాల కిందట కొనుగోలు చేశాడు. దీన్ని ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం మార్కట్ ప్లేస్లో ర్యాపింగ్ (ర్యాపింగ్అంటే ఓపెన్సీ లేదా రారిబుల్ వంటి Ethereum మార్కెట్ప్లేస్లలో NFTల ట్రేడింగ్) చేసే సమయంలో పొరపాటున బర్న్ ఎడ్రస్కి షేర్చేశాడు. (బర్న్ ఎడ్రస్ కి చేరితే ఇక జీవితంలో అది తిరిగి రాదు. ప్రైవేట్ కీ లేని దీన్ని యాక్సెస్ చేయలేరు) డిజిటల్ వాలెట్లోని నిధులను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ కీ..వర్చువల్ వాలెట్ ‘బర్న్’ అడ్రస్కి చేరితే సంబంధిత ఎన్ఎఫ్టీ శాశ్వతంగా నాశన మవుతుంది. రిలే విషయంలో అదే జరిగింది. తనుకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రిలే తనకు ఈ విషయాలపై అవగాహన లేదనీ అన్ని సూచనలను కచ్చితంగా పాటించినప్పటికీ లావాదేవీలో చిన్న పొరపాటు నాశనం చేసిందని వాపోయాడు. అసలు ర్యాప్డ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో అవగాహన లేదు..ఇది కచ్చితంగా నేను చేసిన తప్పే..అదే నన్ను ముంచేసింది..దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. Today I accidentally burned a @cryptopunksnfts trying to wrap punk 685. I was so focused on following the instructions exactly, that I slipped up, destroying a third of of my net worth in a single transaction. @yugalabs please sell me the @v1punks 685 as a consolation. 🙏🏼 pic.twitter.com/jHoTGvlc7j — Brandon Riley (@vitalitygrowth) March 25, 2023
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
48 గంటల ముందు ప్రచారం నిలిపివేత
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
●తీరనున్న తాగునీటి సమస్య
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి
ప్రచారం.. పరిసమాప్తం!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- ఎన్నికల వేళ సినిమా రేంజ్లో పోలీసులు ఛేజింగ్.. భారీగా డబ్బు స్వాధీనం
- మథర్స్ డే వెనకాల మనసును కథలించే కథ!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement