-
Lok sabha elections 2024: ఒక్క ఓటు కోసం 39 కిలోమీటర్ల ట్రెక్కింగ్..
ఈటానగర్: ప్రజాస్వామ్యం మామూలు వ్యక్తిని సైతం మెహమాన్ను చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ 44 ఏళ్ల సొకేలా తయాంగ్. అరుణాచల్ ప్రదేశ్లోని అంజ్వా జిల్లాలోని మారుమూలన ఉన్న మలోగాం ఆమె గ్రామం. హయులియాంగ్ అసెంబ్లీతోపాటు, అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి ఆ గ్రామం వస్తుంది. అక్కడ ఎన్నికలు మొదటి ఫేజ్లో జరగనున్నాయి. ఇంతకీ ఆమె మెహమాన్ ఎందుకయ్యారంటే.. ఆ ఊరులో ఓటరు ఆమె ఒక్కరే. ఆమె కోసం పోలింగ్ సిబ్బంది అంతా.. ఎన్నికలు జరిగే ఏప్రిల్ 19వ తేదీ కంటే ఒకరోజు ముందు.. అంటే ఏప్రిల్ 18న 39 కిలోమీటర్ల ఎత్తు కొండలు ఎక్కాల్సి ఉంటుంది. చైనా సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఆ గ్రామంలో తయాంగ్ కోసం తాత్కాలికంగా ఓ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మలోగామ్లో ఇంకొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ వారిలో ఎవరూ ఓటు కోసం నమోదు చేసుకోలేదు. దీంతో వారికి ఓటర్ల జాబితాలో చోటు దక్కలేదు. ఒక్కరికోసం బూత్ ఎందుకని.. సమీపంలోని ఏదైనా పోలింగ్ బూత్లో ఓటు వేయాల్సిందిగా అధికారులు ఆమెను కోరారు. కానీ అందుకు తయాంగ్ అంగీకరించలేదు. దీంతో ఆమె ఓటు కోసం అధికారులు, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో సహా పోలింగ్ బృందం హయులియాంగ్ నుంచి అనూహ్య వాతావరణం మధ్య ప్రమాదకరమైన భూభాగం గుండా కష్టతరమైన ప్రయాణం చేయనుంది. హయులియాంగ్ నుంచి మలోగామ్కి కాలి నడకన వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. పోలింగ్ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బూత్ తెరచి ఉంటుంది. ‘‘నేను మా గ్రామంలో చాలా అరుదుగా ఉంటాను. ఏదైనా పని ఉన్నప్పుడు లేదా ఎన్నికల సమయంలో మాలోగాం వస్తుంటా. మిగతా సమయంలో మాకు వ్యవసాయ భూములు ఉన్న లోహిత్ జిల్లాలోని వక్రోలో ఉంటాను. ఏప్రిల్ 18 సాయంత్రంలోగా ఇంటికి చేరుకుని ఓటు వేస్తా’’ అని చెబుతున్నారు. -
యాంగ్షూ ప్రకృతి చేసిన విన్యాసం
చెట్టులెక్కగలవా... ఓ నరహరి పుట్టలెక్కగలవా అంటూ చెంచులక్ష్మి ఆట పట్టించడాన్ని సినిమాల్లో చూశాం. ట్రెకింగ్, మౌంటెనీరింగ్ అంటూ కొండ వాలులు, పర్వత సానువుల వెంట పరుగులు తీసే సాహసికులను బయట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు... అడ్వెంచర్ టూరిజం రాక్ క్లైంబింగ్ మీద సరదా పడుతోంది. అందుకు అనువైన శిఖరాల కోసం చైనా బాట పడుతోంది. చైనా దక్షిణభాగంలో గువాన్గ్జీ రీజియన్లో గుయిలిన్ నగరానికి సమీపంలో ఉంది యాంగ్షూ. ప్రకృతి చేసిన విచిత్రమైన విన్యాసాలే ఈ ఊరిని ప్రపంచం దృష్టిలో పడేటట్లు చేశాయి. యాంగ్షూ పట్టణానికి చుట్టూ పచ్చటి శిఖరాలు చీమల పుట్టల్లా ఉంటాయి. వాటి మధ్యలో కొద్దిపాటి సమతల ప్రదేశం, ఓ పక్క ‘లీ’ నది ప్రవాహం. కొండవాలులో కట్టిన ఇళ్లు, వాటిని తొంగి చూడడానికే అన్నట్లు అర్ధచంద్రాకారంలో పెద్ద రంధ్రం. కొండకు ఇంత చక్కగా ఏ శిల్పకారుడో చెక్కినట్లు అర్ధవృత్తాకారం ఎలా వచ్చిం దని ఆశ్చర్యంగా చూసేలోపు గైడ్లు ఓ సైన్సు పాఠం చెప్పేస్తారు. ఈ కొండల్లోని లైమ్స్టోన్, డోలమైట్, జిప్సమ్ వంటివి నీటిలో కరిగిపోవడంతో ఏర్పడిన రంథ్రం అది. వర్షాలు కురిసి నీటిలో డోలమైట్ వంటివి కరిగిపోగా మిగిలిన రాతి రూపాలివి. చీమ పుట్టలను తలపించే కొండశిఖరాలు, గుహలు, భూగర్భ జలప్రవాహాలు, సహజంగా రూపొందిన విచిత్రమైన రూపాలు కూడ. యాంగ్ షూ కే ఎందుకంటే... ఇది పొల్యూషన్ ఫ్రీ టూరిస్టు స్పాట్. ఓ సైకిల్ అద్దెకు తీసుకుని పట్టణ వీధుల్లో తిరగవచ్చు. వాటర్ కేవ్లో మునిగి మడ్ బాత్, మడ్ ఫైట్ చేయవచ్చు. ఇది పెద్ద వాళ్లను చిన్నపిల్లలుగా మార్చేసే సరదా ఆట. మడ్ఫైట్ చేసిన తర్వాత ఆ పక్కనే ఉండే వేడినీటి గుండాల్లో సేదదీరడంలో ఉన్న హాయిని ఫీలవ్వాల్సిందే. ఇక్కడ మోటర్బైక్ ట్యాక్సీలను యువతులు నడుపుతుంటారు. గైడ్కు కానీ, ట్యాక్సీలకు కానీ బేరమాడకపోతే పది ‘రెన్మిన్బి’ల బదులు యాభై వరకు సమర్పించుకోవాలి. అచ్చమైన చీనీ వంట! రెస్టారెంట్లలో చైనీస్ఫుడ్తోపాటు పశ్చిమ దేశాల ఆహారం కూడా దొరుకుతుంది. చాలా రెస్టారెంట్లలో మెనూ చైనాభాషలోనే ఉంటుంది. పేరు పలకడానికి వచ్చినవే ఆర్డర్ చేయడం లేదా గైడ్ సహాయంతో ఆర్డర్ చేయడమే మార్గం. చైనా వాళ్ల వంటలను వారి ఇళ్లలోనే రుచి చూడాలంటే యాంగ్షూ నుంచి పది నిమిషాలు ప్రయాణించాలి. అక్కడ రైతులు ఇళ్లలో పర్యాటకులకు వండి పెట్టడంతోపాటు కలిసి భోజనం చేస్తారు. లీ నదిలో పడవ ప్రయాణం! యాంగ్షూ చిన్న పట్టణం. గుయిలిన్ లియాన్గ్జియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. దీనికంటే అద్భుతమైన ప్రయాణం లీ నదిలో పడవలో వెళ్లడమే. కాలుష్య రహితమైన ప్రదేశంలో ప్రవాహ వేగం తెలియని నిశ్శబ్దమైన నదిలో పడవలో విహరిస్తుంటే... ఆకాశం కనిపిస్తుంది కానీ అందదు. నేల ఉందని తెలుసు కానీ తాకలేం. తీరం మాత్రం నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు ఉంటుంది. ఏ నదిలో పయనిస్తున్నా ఇలాంటి అనుభవమే ఉంటుంది. కానీ లీ నదిలో పయనించేటప్పుడు, కొండలెక్కేటప్పుడూ పక్కనే యాంగ్షూ పట్టణంలో వీధులు, ఇళ్లు కనువిందు చేస్తుంటాయి. రాక్ క్లైంబింగ్! కొండల పైకి ఎక్కుతూ మంద్రంగా ప్రవహించే లీ నదిని చూస్తూ మధ్యలో వైవిధ్యమైన ఆర్కిటెక్చర్తో ఉన్న చైనా ఆలయాలను చూడడానికి ఆసియా దేశాలతోపాటు పాశ్చాత్య దేశాల నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement