-
మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు
ప్రసిద్ధ కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్కోటక్ కుమారుడు జైకోటక్ మాజీ మిస్ ఇండియాను పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వివాహం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన ‘అంబానీ_అప్డేట్’ ఇన్స్టా హ్యాండిల్లో అంబానీ దంపతులు వివాహానికి హాజరైన చిత్రాలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. మే 24, 2023లో జైకోటక్ తనకు కాబోయే భార్య అదితిఆర్య(మాజీ మిస్ ఇండియా) యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిందని తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు. జైకోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. అదితిఆర్య దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సాధించింది. 2015లో అదితి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎంబీఏ చదివేందుకు యూఎస్ వెళ్లడానికి ముందు కొన్ని హిందీ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కల్యాణ్రామ్తో కలిసి ఇజం సినిమాలో నటించారు. Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా విలీనం
న్యూఢిల్లీ: పెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా.. మరో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐఎన్జీ వైశ్యాను విలీనం చేసుకోనుంది. ఇందుకు బుధవారం పూర్తిస్థాయి షేర్ల మార్పిడి ద్వారా డీల్ను కుదుర్చుకుంది. విలీనానికి వాటాల నిష్పత్తిని 725:1000 చొప్పున ఖరారు చేసింది. డీల్లో భాగంగా వాటాదారుల వద్ద ఉన్న రూ. 10 ముఖ విలువగల ప్రతి 1000 ఐఎన్జీ వైశ్యా బ్యాం క్ షేర్లను రద్దుచేసి రూ. 5 ముఖ విలువగల 725 కొటక్ మహీంద్రా షేర్లను జారీ చేయనుంది. తద్వారా ఐఎన్ఎజీ వైశ్యాను పూర్తిస్థాయిలో కొటక్ బ్యాంక్ విలీనం చేసుకోనుంది. విలీనం తర్వాత కొటక్ బ్యాంక్ ప్రైవేటు రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ల తర్వాత 4వ పెద్ద బ్యాంక్గా అవతరిస్తుంది. మార్కెట్ ముగిశాక... గురువారం మార్కెట్ ముగిశాక కొటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ ఉదయ్ కొటక్ డీల్ వివరాలను వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తామని, పారదర్శక పాలనా విధానాలు అవలంబిస్తామని కొటక్ బ్యాంక్ ఈ సందర్బంగా ఒక ప్రకటనలో వివరించింది. విలీనం వల్ల లభించే ప్రయోజనాలను ఉద్యోగులు, కస్టమర్లు, వాటాదారులకు అందించనున్నట్లు తెలి పింది. విలీనం తరువాత కొటక్ మహీంద్రా బ్రాంచీల సంఖ్య 1,214కు చేరనుండగా, ఐఎన్జీ వైశ్యా కనుమరుగుకానుంది. డీల్ను రెండు బ్యాంకుల వాటాదారులతోపాటు, ఆర్బీఐ, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించాల్సి ఉంది. కాగా, విలీనం అంచనాలతో బీఎస్ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 7.3% ఎగసి రూ. 1,157 వద్ద నిలవగా, ఐఎన్జీ వైశ్యా షేరు సైతం 7% జంప్చేసి రూ. 814 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండు షేర్లూ ఏడాది గరిష్టాలను తాకాయి. కొటక్ మహీంద్రా గరిష్టంగా రూ. 1,164ను తాకగా, ఐఎన్జీ వైశ్యా దాదాపు 14% దూసుకెళ్లి రూ. 865కు చేరింది. నవంబర్ 19తో ముగిసిన నెలరోజుల్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు సగటు ముగింపు ధర ఆధారంగా ఐఎన్జీ వైశ్యాబ్యాంక్ షేరును రూ. 790గా విలువకట్టి విలీన నిష్పత్తిని నిర్ణయించారు. కోటక్, ఐఎన్జీ వైశ్యాలు వేరువేరుగా నియమించిన వాల్యుయేటింగ్ సంస్థలు ఎస్ఆర్ బాట్లిబాయ్, ప్రైస్ వాటర్హౌస్లు ఈ విలీన నిష్పత్తిని సిఫార్సుచేసాయి. విలీనాల చరిత్ర ఇది... 2008లో అంతర్జాతీయ సంక్షోభం చెలరేగాక లాభాల్లో ఉన్న రెండు బ్యాంకుల మధ్య విలీనం జరగడం ఇదే తొలిసారికాగా, ఇంతక్రితం కూడా పలు బ్యాంకుల మధ్య విలీనాలు జరిగాయి. 2010లో బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్... ఐసీఐసీఐలోనూ, ఎస్బీఐ అనుబంధ సంస్థలు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండోర్, సౌరాష్ట్రలు ఎస్బీఐలోనూ విలీనమయ్యాయి. ఇక 2008లోనే సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సొంతం చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్, సెంచూరియన్ బ్యాంక్లు నష్టాల్లో ఉండేవి. విలీనం తరువాత... కొన్ని మెట్రో నగరాలలో మినహాయిస్తే విలీనం వల్ల దేశవ్యాప్తంగా కొటక్ మహీంద్రా కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ఐఎన్జీ వైశ్యా శాఖల్లో 66% దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకల్లో విస్తరించగా, కొటక్ మహీంద్రా పశ్చిమ, ఉత్తర భారతంలో విస్తరించింది. విలీన బ్యాంకు 1,214 శాఖ లు, 1,794 ఏటీఎంలను కలిగి ఉంటుంది. చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్ఎంఈ) విభాగంపై పట్టుచిక్కుతుంది. ఐఎన్జీ వైశ్యా రుణాల్లో ఈ విభాగానికి 38% వాటా ఉంది. రూ. 2 లక్షల కోట్ల బ్యాలన్స్ షీట్తో నాలుగో పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా పటిష్టంకానుంది. విలీన బ్యాంకులో నెదర్లాండ్స్ దిగ్గజం ఐఎన్జీ గ్రూప్నకు 6.5% వాటా లభిస్తుంది. తద్వారా కొటక్ బ్యాంక్లో రెండో పెద్ద వాటాదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం ఐఎన్జీ వైశ్యాలో ఈ సంస్థ వాటా 42.73%.కొటక్ బ్యాంక్లో ప్రమోటర్ ఉదయ్ కొటక్ వాటా ప్రస్తుత 39.71% నుంచి 34%కు తగ్గనుంది. ఆర్బీఐ నిబంధనల మేరకు 2016కల్లా 30%కు వాటా పరిమితం చేసుకోనున్నారు. కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా మధ్య విలీన అంశాన్ని ప్రకటించడంలో ఉద్వేగానికి లోనవుతున్నా. వాటాదారులకు అత్యుత్తమ విలువ చేకూర్చే లక్ష్యంతో పనిచేస్తాం. -ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వైస్చైర్మన్ ఈ డీల్ కుదుర్చుకున్నందుకు ఉదయ్ను అభినందిస్తున్నా. ఇది ఓ అద్భుతమైన ముందడుగు. - ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ సీఎండీ రెండు బ్యాంకులూ సరైన సమయంలో సరైన విధంగా జత కలుస్తున్నాయి. సంయుక్త సంస్థ ద్వారా మా కస్టమర్లకు అద్భుత విలువ చే కూరుతుంది. దేశ, విదేశాలలో మరింతగా విస్తరించేందుకు వీలు చిక్కుతుంది. - శైలేంద్ర భండారీ, ఐఎన్జీ వైశ్యా ఎండీ 84 ఏళ్ల మా బ్యాంకింగ్ ప్రస్థానంలో చరిత్రాత్మకమైన రోజు. జాతీయ సంస్థగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. - ఉదయ్ శరీన్, ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కాబోయే సీఈఓ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎప్పుడు ఏర్పాటైంది: 2004 మార్కెట్ విలువ: రూ.89,252 కోట్లు శాఖలు: 641 ఏటీఎంలు: 1103 ప్రమోటర్ వాటా: 40.07% పబ్లిక్ వాటా: 56.26% మొత్తం ఆస్తులు: రూ.1,22,237 కోట్లు 2013-14 ఏడాదికి మొత్తం ఆదాయం: రూ. 10,167 కోట్లు నికర లాభం: రూ. 1,503 కోట్లు షేరు ఏడాది గరిష్టం: రూ. 1,164 షేరు ఏడాది కనిష్టం: రూ. 631 ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ మార్కెట్ విలువ: రూ. 15,513 కోట్లు శాఖలు: 573 విదేశీ ప్రమోటర్ల వాటా: 42.73% పబ్లిక్ వాటా: 57.27% 2013-14 మొత్తం ఆదాయం: రూ. 6,072 కోట్లు నికర లాభం: రూ. 658 కోట్లు షేరు ఏడాది గరిష్టం: రూ. 865 షేరు ఏడాది కనిష్టం: రూ. 493
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
‘మిరల్’ మూవీ రివ్యూ
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
'దర్శిని' సినిమా రివ్యూ
ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
నాన్న రెండో పెళ్లి.. మా అమ్మ వెళ్లి ఆశీర్వదించింది!: నటి
ఓటమి భయం.. ఏపీ బీజేపీలో నిశ్శబ్ద వాతావరణం
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
తప్పక చదవండి
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
- వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
- IPL 2024: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement