-
నా కాబోయే భర్త అలా చెప్పే ఛాన్సే లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్
ఒక సినిమాలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయి. సినిమా కూడా చూడొచ్చు అనే ఆలోచన ప్రేక్షకుల్లో ఉంటుంది. దీనంతటికి ప్రధాన కారణం వైవిధ్య కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో నటిస్తూ ఆమె చాలా హిట్లు అందుకున్నారు. ఈ వరుసలో క్రాక్, నాంది, యశోద, వీర సింహా రెడ్డి, కోట బొమ్మాళి పీ.ఎస్, హను మాన్ వంటి చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలన్నింటిలో ఆమె మెయిన్ లీడ్గా కనిపిస్తుంది. తాజాగా శబరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. మే 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...'శబరి' ప్రయాణం ఎలా, ఎప్పుడు మొదలైంది? 'క్రాక్'కు సంతకం చేయడానికి ముందు 'శబరి' కథ విన్నా. నాకు బాగా నచ్చింది. కథపై నమ్మకంతో ఈ సినిమా చేస్తానని చెప్పాను. అయితే, షూటింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా. టిపికల్ రెగ్యులర్ నెగిటివ్ షేడ్ రోల్ కాకుండా కొత్త పాత్ర చేశా. ఆర్టిస్టుగా నేను ఈ పాత్ర చేయగలనని దర్శక నిర్మాతలు నమ్మారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి వాళ్లు ముందుకు వచ్చారు. అందుకు వాళ్లను మెచ్చుకోవాలి. ఖర్చు విషయంలో నిర్మాత రాజీ పడకుండా సినిమా తీశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది. దర్శక నిర్మాతలు కొత్తవాళ్లు... ఈ సినిమా చేయడం రిస్క్ అనిపించలేదా?లైఫే రిస్క్ అండీ. హిట్టూ ఫ్లాపులను ఎవరూ జడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. కొత్త నిర్మాతలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొన్ని భయాలు ఉంటాయి. నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీకు ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు? 'శబరి' ప్రెస్మీట్ చూస్తే అందరూ నిర్మాత గురించి మాట్లాడారు. ఎందుకంటే... ఆయన జెన్యూన్ పర్సన్. ఎవరినీ చీట్ చేసే మెంటాలిటీ లేదు. అడగక ముందు పేమెంట్ వస్తుంది. బడ్జెట్ దాటినా మధ్యలో వదలకుండా సినిమా పూర్తి చేశారు.గణేష్ వెంకట్రామన్ సినిమాలో మీకు అపోజిట్ క్యారెక్టర్ చేశారా? మీ మధ్య యాక్షన్ సీన్లు ఉన్నాయా? సినిమాలో చూడండి. స్క్రీన్ ప్లే డ్రివెన్ సినిమా 'శబరి'. ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇస్తుంది. డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. నేచురల్ ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. యాంగ్రీ విమన్ రోల్స్, హీరోతో ప్యారలల్ రోల్స్ చేస్తున్నారు. ఈ సమయంలో తల్లి పాత్ర అంటే ఎలా ఫీలయ్యారు? నా తొలి సినిమా 'పొడా పొడి'లో మదర్ రోల్ చేశా. 'పందెం కోడి 2'లో చేశా. నేను ఓ యాక్టర్. నచ్చిన క్యారెక్టర్ వచ్చినప్పుడు చేస్తాను. ఇమేజ్ వంటివి పట్టించుకోను. సినిమాలో ప్రేక్షకులకు ఏం చూపిస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు సినిమా చూస్తారు. 'శబరి' సినిమాలో మీ రోల్ ఏమిటి? ఛాలెంజింగ్ అనిపించిన మూమెంట్? యాంగ్రీ యంగ్ లేడీ కాదు. ఓ సాధారణ అమ్మాయి. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి వేరుపడి కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది. ఆమెకు ఏమైంది? అనేది కథ. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ కనెక్షన్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. మెయిన్ లీడ్ చేసేటప్పుడు ప్రెజర్ ఏమైనా ఉంటుందా? హిట్టూ ఫ్లాపులు నా చేతుల్లో లేవు. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. వాళ్లకు మంచి సినిమాలు ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. ప్రేక్షకులు నచ్చే విధమైన నటన ఇవ్వాలనే ప్రెజర్ ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు ఆమె పెర్ఫార్మన్స్ బాలేదని అనుకోకూడదు.నిర్మాతకు మరో సినిమా చేస్తానని మాటిచ్చారట! చేస్తాను. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తా.మీ సినిమాల గురించి కాబోయే భర్త నికోలయ్ ఏం చెబుతారు? బాలేదంటే బాలేదని చెబుతారు. బావుందంటే బావుందని చెబుతారు. ఆయనకు బాలేదని చెప్పే అవకాశం లేదు (నవ్వులు). ఇప్పటి వరకు బావుందని చెప్పారు. పెళ్లి ఎప్పుడు?ఈ ఏడాది ఉంటుంది. నెక్స్ట్ సినిమాలు?'కూర్మ నాయకి' సినిమా విడుదలకు సిద్ధమైంది. తమిళంలో ధనుష్ గారి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నా. కన్నడలో సుదీప్ గారి 'మ్యాక్స్' చేశా. మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యాక ఆ వివరాలు చెబుతా. -
వరలక్ష్మి శరత్ కుమార్ ‘వర ఐపీఎస్’ ఫస్ట్లుక్ విడుదల
క్రాక్, నాంది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. లేడీ ప్రధానమైన పాత్రలు ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘వర ఐపీఎస్’. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్లుక్ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీ లలితాంబికా ప్రొడక్షన్ నిర్మిస్తున్నఈ సినిమా తెలుగు హక్కులను శ్రీలక్ష్మి జ్యోతి బ్యానర్ వారు దక్కించుకున్నారు. శ్రీ లక్ష్మి జ్యోతి బ్యానర్ అధినేత ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుండగా.. నేడు(ఏప్రిల్ 3) ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో నటిస్తున్న ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్.. సినిమాపై అంచనాలను పెంచింది. ఒరేయ్ బామ్మర్ది వంటి విజయవంతమైన సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ నుంచి మరో ఆసక్తి పరిచే సినిమా రావడం విశేషం. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ఫుల్ ఐపీఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జగదీష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి భారీ సినిమాకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో తలైవసల్ విజయ్, రవి కాలే, సుమిత్ర, భరత్ రెడ్డి, బ్లాక్ పాండి, రాజేష్ తదితరులు నటిస్తున్నారు. -
'శక్తి'గా వస్తున్న స్టార్ వారసురాలు
కోలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కోలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల మీద దృష్టి పెట్టింది. విశాల్ తో ప్రేమాయణం నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఈ భామ త్వరలో ఓ తెలుగు సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. శక్తి పేరుతో తెరకెక్కుతున్న ఈ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్ ను టాలీవుడ్ హీరో రానా రిలీజ్ చేశాడు. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి డిఫరెంట్ మేకోవర్ లో దర్శనమిస్తోంది. #shakthivaru good luck my friend!! @varusarath@sharanyalouis@priyadhaarshini@papertalestory pic.twitter.com/vtprTtMcSe — Rana Daggubati (@RanaDaggubati) 5 October 2017 -
వేకువజాము వరకూ ఎంజాయ్
డిసెంబర్ 31 వస్తుందంటేనే యువతలో సందడి వాతావరణం ఉరకలేస్తుంది. ఆ రోజు రాత్రిని ఒక మరపురాని విధంగా ఫుల్ జోష్లో ఎంజాయ్ చేయడానికి పిల్లల నుంచి పెద్దల వరకూ సిద్ధం అయిపోతారు. అందుకు ముందుగానే ప్రణాళికలను రెడీ చేసుకుంటారు. గతేడాదికి గుడ్బై చెబుతూ, నూతన సంవత్సరానికి వెల్కమ్ పలికే విధంగా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేస్తారు. ఇక ఆ రాత్రి పబ్లు, ఫాం హౌస్లు, నక్షత్ర హోటళ్లు అందంగా ముస్తాబై యువత వినోదాలకు వేదికగా నిలుస్తాయి. అదే విధంగా శనివారం కూడా యువత విందులు, వినోదాలతో మునిగి పోయారు. అలాంటి వారి ఎంజాయ్మెంట్కు పెద్ద నోట్ల రద్దు కూడా అడ్డురాలేదు. నక్షత్ర హోటళ్లలో నీలిరంగు కాంతుల్లో ఆట పాటలతో ఓలలాడి యువత ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక నటి వరలక్ష్మీ శరత్కుమార్ తన స్నేహితులతో తెల్లవారే వరకూ ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఆ వీడియోను సోషల్మీడియాలో విడుదల చేశారు. అదిప్పుడు అన్ని వెబ్సైట్లలో హల్చల్ చేస్తోంది. వరలక్ష్మీ, నటుడు విశాల్ల మధ్య ప్రేమాయణం నడుస్తోందనే ప్రచారం మొన్నటి వరకూ సాగింది. ఇటీవల వారి ప్రేమకు బ్రేక్అప్ అయ్యిందనే ప్రచారం హల్చల్ చేసింది. అయితే అంతకుముందు వరకూ పెద్దగా బహిరంగంగా పార్టీల్లో కనిపించని నటి వరలక్ష్మీ ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. కాగా నటి త్రిష అయితే 30వ తేదీ రాత్రి నుంచే తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ యమాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే మరి కొందరు తారామణులు డిసెంబర్ 31 రాత్రిని ఫుల్గా ఎంజాయ్ చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర ప్రమాదం
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
- IPL 2024: కోల్కతాకే కిరీటం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement