-
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసులో కోల్కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ ముందు వరుసలో ఉన్నాయి. కేకేఆర్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లలో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రాజస్తాన్ పదింట ఎనిమిది గెలిచి ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది.పాయింట్ల పరంగా సమంగా ఉన్నా నెట్ రన్రేటు విషయంలో కేకేఆర్(1.453) కంటే రన్రేటు పరంగా రాజస్తాన్(0.622) వెనుకబడి ఉన్నందు వల్లే స్థానాల్లో ఈ వ్యత్యాసం. ఇక ప్రస్తుతం మూడో స్థానంలో సీఎస్కే(12 పాయింట్లు), నాలుగో స్థానంలో సన్రైజర్స్(12 పాయింట్లు) కొనసాగుతున్నాయి.లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లు అనగానే ముందుగా గుర్తొచ్చేవి ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో కూడా ఈ జాబితాలోనే ఉన్నా ఆ జట్టు ఎంట్రీ ఇచ్చింది 2022లో! ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరింది కూడా! కానీ మిగతా మూడు కనీసం ఒక్కసారి ఫైనల్ చేరినా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాయి.ఇదిలా ఉంటే.. పంజాబ్ కింగ్స్ ఆదివారం నాటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్ ఖాతాలో ఏడో పరాజయం చేరింది.ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు ఆమె బదులిచ్చిన తీరు వైరల్గా మారింది. ‘మీ జట్టు ప్రదర్శన పట్ల మీ స్పందన ఏమిటి?’ అని ఓ యూజర్ ప్రీతి జింటాను ట్యాగ్ చేశారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఏమాత్రం సంతోషంగా లేను. నాలుగు మ్యాచ్లలో మేమే ఆఖరి బంతికి ఓడిపోయాం. మా కెప్టెన్ గాయం బారినపడ్డాడు.కొన్ని మ్యాచ్లు మాత్రం అత్యద్భుతంగా సాగాయి. కానీ మేము అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయాం. తదుపరి సొంత మైదానంలో నాలుగు మ్యాచ్లు గెలిస్తేనే ముందుకు వెళ్లగలం. ఏదేమైనా ఎల్లవేళలా మాకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని ప్రీతి జింటా పేర్కొంది. Thank you all for a wonderful #pzchat . It was very nice talking to you all after so long. Kids have woken up from their nap so I have to run. Till then take care, be happy & loads of love always ❤️❤️— Preity G Zinta (@realpreityzinta) May 6, 2024 -
కోహ్లిపై పాక్ మాజీ పేసర్ ట్రోలింగ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఆర్సీబీ గెలుపొందింది. ముంబై ఇండియన్స్తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. వాంఖడే మ్యాచ్లో తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో ముంబైతో మ్యాచ్లో కోహ్లి వైఫల్యాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఎక్స్ వేదికగా.. ‘‘స్ట్రైక్రేటు 33.33’’ అంటూ కోహ్లి బ్యాటింగ్పై జునైద్ ఖాన్ విమర్శలు సంధించాడు. కాగా జునైద్ కోహ్లిపై సెటైర్లు వేడయం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రాజస్తాన్ రాయల్స్తో విరాట్ కోహ్లి సెంచరీ చేసినపుడు కూడా ఇలాగే కామెంట్ చేశాడు. ‘‘ఐపీఎల్ చరిత్రలో స్లోయెస్ట్ 100 సాధించినందుకు శుభాభినందనలు’’ అంటూ జునైద్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కాగా రాజస్తాన్తో మ్యాచ్లో కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. భారత గడ్డపై ఐపీఎల్లో శతకం చేసేందుకు అత్యధిక బంతులు తీసుకున్న బ్యాటర్ కోహ్లినే కావడం గమనార్హం. ఓవరాల్గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జునైద్ ఖాన్ కోహ్లిని ఇలా విమర్శించాడు. కాగా జునైద్ ఖాన్ ట్వీట్పై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి ఒక్క మ్యాచ్లో ఏ ఆటగాడూ రాణించలేడని.. అటెన్షన్ కోసమే కోహ్లి పేరు వాడుకుంటున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి శతకం సాధించిన రాజస్తాన్తో మ్యాచ్లో.. తాజాగా అతడు విఫలమైన ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఇక పదిహేడో ఎడిషన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి కోహ్లి 319 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండటం విశేషం. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 Strike rate 33.33 😶#RCBvsMI — Junaid khan (@JunaidkhanREAL) April 11, 2024 -
అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్ పోస్ట్ వైరల్
భారత మహిళా క్రికెటర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ శ్రేయాంక పాటిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్లు గాల్లోతేలిపోయే అనుభూతిని ఆస్వాదిస్తోంది. తన రోల్ మోడల్ను నేరుగా కలవడమే గాకుండా.. అతడితో ప్రశంసలు అందుకోవడమే ఇందుకు కారణం. ఐపీఎల్ తర్వాత బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ ద్వారా లైమ్లైట్లోకి వచ్చిన బెంగళూరు అమ్మాయి శ్రేయాంక. దేశవాళీ క్రికెట్లో సొంత రాష్ట్రం కర్ణాటకకు ఆడుతున్న 21 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్ బౌలర్ గతేడాది భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది. గతేడాది ఆరంభమైన వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీకి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. రూ. 10 లక్షలకు తనను కొనుక్కున్న ఆర్సీబీకి తాజా ఎడిషన్లో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసింది. తద్వారా డబ్ల్యూపీఎల్-2024లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటోంది. ఇక సీజన్లో మొత్తంగా 9 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తీసిన శ్రేయాంక పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) విజేతగా నిలిచింది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2024 అంతేకాదు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన మహిళా జట్టును ఆర్సీబీ పురుష జట్టు గార్డ్ ఆఫ్ ఆనర్తో సముచితంగా గౌరవించింది. ఇక ఈ ఈవెంట్లో పేరు, లోగో మార్పులతో కొత్త జెర్సీని రివీల్ చేసింది ఆర్సీబీ. ఈ కార్యక్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది శ్రేయాంకకు! ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనైందామె. ‘‘అతడి వల్లే క్రికెట్ చూడటం అలవాటు చేసుకున్నా. అతడిలాగే క్రికెటర్ కావాలని కలలు కంటూ పెరిగాను. ఎట్టకేలకు.. జీవితకాలానికి సరిపడా సంతోషాన్నిచ్చే క్షణం నిన్న రాత్రి చోటుచేసుకుంది. ‘హాయ్.. శ్రేయాంక.. అద్భుతంగా బౌల్ చేశావు’ అని విరాట్ నాతో అన్నాడు. అతడికి నా పేరు కూడా తెలుసు’’ అంటూ రోల్మోడల్తో కలిసి ఫ్యాన్గర్ల్ మూమెంట్ను ఆస్వాదించినట్లు శ్రేయాంక పాటిల్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టగా వైరల్గా మారింది. చదవండి: Sachin Tendulkar: నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా? Started watching cricket cos of him. Grew up dreaming to be like him. And last night, had the moment of my life. Virat said, “Hi Shreyanka, well bowled.” He actually knows my name 😬😬😬#StillAFanGirl #rolemodel pic.twitter.com/z3DB0C8Pt0 — Shreyanka Patil (@shreyanka_patil) March 20, 2024 -
భారత్లోకి టెస్లా.. పేరు మార్చుకుంటేనే పనవుతుంది! వైరల్ ట్వీట్
ఎలాన్ మస్క్ ( Elon Musk ) నేతృత్వంలోని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ( Tesla ) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ ( Nothing Phone ) సీఈఓ కార్ల్ పీ ( Carl Pei ).. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కి ఓ ఫన్నీ సలహా ఇచ్చారు. భారత్లో ఫ్యాక్టరీని ఎలా తెరవాలో చమత్కారంగా సూచించారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే ముందుగా ‘ఎక్స్’ (ట్విటర్) ప్లాట్ఫారమ్లో తన యూజర్ నేమ్ను "ఎలాన్ భాయ్"గా మార్చుకోవాలని కార్ల్ పీ సూచించారు. ఈయన కూడా స్వయంగా తన ‘ఎక్స్’ యూజర్ నేమ్ను 'కార్ల్ భాయ్'గా మార్చుకున్నారు. "ఎలాన్ మస్క్.. మీ యూజర్ నేమ్ను ఎలాన్ భాయ్గా మార్చకుండా భారత్లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొచ్చనుకుంటున్నారా?" ఎలాన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్గా మారింది. 6.7 లక్షల వీవ్స్, వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్కు యూజర్లు సైతం అంతే ఫన్నీగా స్పందించారు. "మీరు భాయ్, అతను (మస్క్) మామూ అవుతాడు" అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు. "ప్రాంతాన్ని బట్టి పేరు ఆధారపడి ఉంటుంది. గుజరాత్ అయితే ఎలాన్ భాయ్, మహారాష్ట్ర అయితే ఎలాన్ భావ్, తెలంగాణ అయితే ఎలాన్ గారు, హర్యానా అయితే ఎలోన్ టౌ, పంజాబ్ అయితే ఎలాన్ పాజీ, తమిళనాడు అయితే ఎలాన్ అన్నా, అలాగే పశ్చిమ బెంగాల్ అయితే ఎలాన్ దాదా" అని మరొక యూజర్ పేర్కొన్నారు. "ఎలాన్ దాదా బాగా సరిపోతుంది!" ఇంకొక యూజర్ చమత్కరించారు. ఇంకా రకరకాల పేర్లను యూజర్లు సూచించారు. .@elonmusk did you really think you could build a Tesla factory in India without changing your username to Elon Bhai? — Carl Bhai (@getpeid) February 18, 2024 ది ఎకనామిక్ టైమ్స్ తాజా నివేదిక ప్రకారం.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే అంచున ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై రూ.30 లక్షలకు మించిన రాయితీ దిగుమతి సుంకాలను 2-3 సంవత్సరాల పాటు పొడిగించే విధానాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తోంది. ప్రస్తుతం భారత్ రూ.33 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని, ఆ శ్రేణి కంటే తక్కువ ఉన్న కార్లపై 60 శాతం విధిస్తోంది. కార్యకలాపాల ప్రారంభ సంవత్సరాల్లో విదేశీ ఈవీలపై ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించినట్లయితే భారత్లో 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి టెస్లా సుముఖతను వ్యక్తం చేసింది. -
కేటీఆర్ దురుసు: సీతక్క స్ట్రాంగ్ కౌంటర్, ట్వీట్ వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సుమతీ పద్యాన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేసిన నేపథ్యంలో సీతక్క ట్విటర్ ద్వారా స్పందించారు. అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమ ముసుగు కప్పుకొని, అధికారంలోకి వచ్చాక ప్రజలని బానిసల కంటే హీనంగా చూసిన మీ చరిత్రని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరంటూ ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్.. నీ ప్రతిమాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది.. అహంకారానికి బ్రాండ్ అంబాసిడరే మీ కుటుంబం.. అందుకే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. 'దొర'హంకారానికి ప్రతిరూపం మీ పాలన .. ప్రజాపాలనకి నిలువెత్తు నిదర్శనం మా పాలన..@revanth_anumula @RahulGandhi — Danasari Seethakka (@seethakkaMLA) January 26, 2024 ప్రతిమాటా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది, అసలు మీ కుంటుంబమే అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కేటీఆర్పై ధ్వజమెత్తారు సీతక్క. తెలంగాణా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా, ఇంకా దొర అహంకారం పోలేదంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ పరోక్షంగా కామెంట్ చేసినప్పటికీ, సీతక్క మాత్రం డైరెక్ట్గా కేటీఆర్ నుద్దేశించి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు అంటూ ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి…’ పద్యాన్ని కేటీఆర్ ట్విటర్లో షేర్ చేశారు. దీంతో పెద్ద దుమారం రేగింది. తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గానే ఈ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ రాజకీయవర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా దీనికి కౌంటర్గా సీతక్క డైరెక్ట్ ఎటాక్ ట్వీట్ మరింత కాక పుట్టిస్తోంది. పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు 👇 pic.twitter.com/G1Xl7AEeHt — KTR (@KTRBRS) January 26, 2024 -
తెలంగాణాలో కాంగ్రెస్ జోరు: సీతక్క ట్వీట్ల జోరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకుపోతోంది. కౌంటింగ్లో ఆదినుంచీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ఫలితాల్లో తన జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయంతో తొలి బోణీ కొట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ.. అలియాస్ సీతక్క సంచలన ట్వీట్లతో సందడి చేస్తున్నారు. వరుస ట్వీట్లతో అటు కేసీఆర్పైనా, బీఆర్ఎస్ పార్టీపైన విమర్శలు గుప్పించారు. ఇవి ట్విటర్లో వైరల్గా మారింది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన సీతక్క ప్రస్తుతం భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. TRS = BRS = VRS #TelanganaElectionResults — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 ఇది ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితురాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ వెనుకంజలో ఉన్నారు. 200 cr Kcr money Vs seethakka After completing 13 rounds 20 thousand majority to seethakka .. More 9 rounds to go.. #TelanganaElectionResults @RahulGandhi @priyankagandhi @kharge @revanth_anumula @srinivasiyc — Danasari Seethakka (@seethakkaMLA) December 3, 2023 -
అలాంటి ఉద్యోగులు అక్కర్లేదు.. యువ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు 'ఎన్ఆర్ నారాయణ మూర్తి' గత కొన్ని రోజులకు ముందు భారతదేశం అభివృద్ధి చెందాలంటే వారానికి 70 గంటల పని అవసరమని వెల్లడించారు.. ఈ విషయం మీద సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రముఖ వరకు పెద్ద ఎత్తున స్పందించారు. ఇదిలా ఉండగానే ఇటీవల ఓ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసేవారు అవసరం లేదంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికంటే కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'అనుభవ్ దూబే' (Anubhav Dubey). 23 ఏళ్ల వయసులోనే స్టార్టప్ కంపెనీ ప్రారభించి కోట్లు సంపాదిస్తున్నారు. చాయ్ సుత్తా బార్ (Chai Sutta Bar) పేరుతో ఒక చాయ్ కంపెనీ ప్రారంభించాడు, ఇది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 500 అవుట్లెట్లను కలిగి ఉంది. ఈ సంస్థ విలువ రూ. 150 కోట్లు కావడం గమనార్హం. తక్కువ వయసులోనే సక్సెస్ సాధించి ఎంతోమంది యువకులకు రోల్ మోడల్గా నిలిచాడు. అనుభవ్ దూబే ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే వారి కోసం వెతకడం లేదని, ఇక్కడ సైన్యం తయారు చేస్తున్నామని, ట్వీట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. దీనిపైన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదీ చదవండి: ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్సీఎల్.. ఎందుకంటే? నిజానికి అనుభవ్ దూబే తన బృందాన్ని మోటివేట్ చేయడానికి ఇలా చెప్పినట్లు తెలుస్తోంది, అయినప్పటికీ ఇది చాలామందికి కోపాన్ని తెప్పించింది. చాయ్ అమ్మడం పెద్ద విషయం కాదని ఒకరు కామెంట్ చేస్తే, మరొకరు చాయ్ అమ్మడానికి సైన్యం ఎందుకని ప్రశ్నించారు. We are not looking for office employees working 9 to 5. No, not at all. We are making f**king Army here. pic.twitter.com/MGBeb9Mk0J — Anubhav Dubey (@tbhAnubhav) November 27, 2023 -
నోబడి - అది నా పేరు.. మస్క్ ట్వీట్ వైరల్!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ఎక్స్.కామ్, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అయితే ఈయన ఇటీవల చేసి ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా 'నోబడి - అది నా పేరు' (Nobody—that’s my name) అంటూ తన అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి ఈ పోస్ట్ని 3 మిలియన్స్ కంటే ఎక్కువమంది చూసారు. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఆలోచించడం 'మస్క్'కి కొత్తేమీ కాదు. ఇప్పటికే త కొడుకుకి ఎక్స్ఏఈఏ-12 మస్క్ అంటూ ఓ కొత్త పేరు పెట్టాడు. ట్విటర్ పేరుని 'ఎక్స్'గా మార్చదు. ఇవన్నీ చూస్తుంటే మస్క్ పేరుని 'నోబడీ'గా పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే! ఇదిలా ఉండగా ఇటీవల మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు కూడా ట్వీట్ చేసాడు. ఐఫోన్ ఫోటోలు & వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయని. అందుకే లేటెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా మస్క్ ఏ మోడల్, ఏ కలర్ కొంటాడనేది తెలియాల్సి ఉంది. Nobody—that’s my name — Elon Musk (@elonmusk) September 26, 2023 -
ఐఫోన్ 15పై మనసుపడిన మస్క్.. రీజన్ ఇదేనట!
మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ విడుదలైనప్పటి నుంచి దానిపై ఉన్న అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అనుకున్న విధంగా విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా మస్క్ కూడా ఒక ఐఫోన్ 15 కొనాలని మనసులో మాట చెప్పాడు. 2023 సెప్టెంబర్ 22 నుంచి ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సేల్స్ ప్రారంభించడానికి ముందే ఐఫోన్ లవర్స్ స్టోర్ల ముందు గంటల కొద్దీ పడిగాపులు కాస్తూ ఎదురు చూసారు. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్.. ఫోటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్కేస్, రూబెన్ వుతో కలిసి ఉన్న ఫోటోలు ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఫోటోగ్రాఫర్లకు ఐఫోన్ పనిని చూపించడం కనిపిస్తుంది. ఇందులో రోడ్ ఐలాండ్లోని వేసవి అందం నుంచి ఉటాలోని ఇతర ప్రపంచ ఎడారుల వరకు ఉత్కంఠభరితమైన వీక్షణలను ఇక్కడ గమనించవచ్చు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. దీనిపైన ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఐఫోన్ ఫోటోలు & వీడియోల అందం అపురూపంగా ఉందని అన్నారు. తాను కూడా ఒకటి కొనబోతున్నట్లు ట్వీట్ చేసాడు. దీనికి కొంతమంది ఏ మోడల్ కొనబోతున్నావు, ఏ కలర్ ఎంచుకోబోతున్నావని అడుగుతున్నారు. అయితే మస్క్ ఐఫోన్ 15 కొంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. The beauty of iPhone pictures & video is incredible — Elon Musk (@elonmusk) September 22, 2023 I’m buying one! — Elon Musk (@elonmusk) September 22, 2023 -
ఆనంద్ మహీంద్రా ట్విటర్ పోస్ట్.. దీనికెవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!
Anand Mahindra Twitter Post: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) గ్రూప్ అధినేత 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఈయన కేవలం ఒక పారిశ్రామిక వేత్త మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మరో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా ఒక స్ఫూర్తిదాయకమైన కథనం షేర్ చేశారు. ఇందులో వీధి పక్కన క్యాండిల్స్ అమ్ముకునే అంధుడైన ఒక వ్యాపారి కోట్ల సామ్రాజ్యం సృష్టించి ఏకంగా 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తన దృష్టికి వచ్చిన స్ఫూర్తిదాయకమైన అంశాల్లో ఇదే ప్రధానమైనదంటూ వెల్లడించినట్లు సమాచారం. ఇదీ చదవండి: మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! తొలిసారి కారు వాడకం ఎప్పుడంటే? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన కథనం ప్రకారం, అతని పేరు భవేష్ చందూలాల్ భాటియా. రెటీనా మాక్యులర్ డీజనరేషన్ కారణంగా పుట్టుకతోనే చూపు పోయింది. అయితే కళ్ళు కనిపించవని నిరాశ చెందకుండా 1994లో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కొవ్వొత్తుల పరిశ్రమ స్థాపించి ఎంతోమందికి మార్గదర్శి అయ్యారు. ప్రస్తుతం భవేష్ చందూలాల్ భాటియా 14 రాష్ట్రాల్లో విస్తరించి.. కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తోంది. ఈ సంఘటన ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకర్షించింది. ఇప్పటి వరకు ఈయన గురించి వినకపోవడం చాలా బాధాకరంగా ఉందని విచారపడ్డాడు. ఈ ట్విటర్ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. “Toh kya Hua ki tum duniya nahin dekh sakte. Kuch aisa karo ki duniya tumhe dekhe.” This has to be one of the most inspiring messages I have ever encountered. I’m embarrassed that I hadn’t heard about Bhavesh until this clip dropped into my inbox. His start-up has the power to… pic.twitter.com/vVQeSMQEp3 — anand mahindra (@anandmahindra) August 9, 2023 -
కార్పొరేట్ ఇంజినీర్ కన్నా క్యాబ్ డ్రైవరే నయం! సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన. రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్కామ్ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్ డ్రైవింగ్తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు. శ్వేత ఆగస్ట్ 6న ఈ ట్వీట్ చేయగా ఇప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్లు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్ జాబ్లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు. I was in a cab yesterday and that driver was an engineer. He said he earns more from the cab driving than his corporate job at Qualcomm. 🥲 — Shweta Kukreja (@ShwetaKukreja_) August 6, 2023 -
ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్ - ఫైట్కి ముందే సర్జరీ అవసరం అంటూ..
Elon Musk Tweet: ఎలాన్ మస్క్ అండ్ మార్క్ జుకర్బర్గ్ మధ్య కేజ్ ఫైట్ జరగనున్న సంగతి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇంతలో మస్క్ చేసిన ట్వీట్ మరింత వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా.. నేను రేపు నా మెడ, అప్పర్ బ్యాక్ ఎమ్ఆర్ఐ చేయించుకుంటున్నాను, బహుశా సర్జరీ అవసరం కావొచ్చు అంటూ ట్వీట్ చేసాడు. ఖచ్చితమైన డేట్ ఈ వారంలో తెలుస్తుందన్నాడు. ఇప్పటికే ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతే కాకుండా ఈ పోరాటానికి తానూ పూర్తిగా సిద్దమవుతున్నట్లు, అయితే వర్కవుట్ చేసే సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మస్క్ జుకర్బర్గ్తో "కేజ్ ఫైట్ కోసం సిద్ధంగా ఉన్నాను" అని పేర్కొన్నాడు, దానికి "నాకు లొకేషన్ పంపండి" అని బదులిచ్చాడు. కాగా జుకర్బర్గ్ తాజాగా బ్రెజిలియన్ ‘జియు-జిట్సు’లో బ్లూ బెల్ట్ సాధించినట్లు తెలిపాడు. ఇక వీరి కేజ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. Exact date is still in flux. I’m getting an MRI of my neck & upper back tomorrow. May require surgery before the fight can happen. Will know this week. — Elon Musk (@elonmusk) August 7, 2023 -
వైరల్ అవుతున్న సాయి పల్లవి పోస్ట్
-
Ind Vs WI: ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి 19 పరుగులు! విరాట్ ట్వీట్ వైరల్
India tour of West Indies, 2023: వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పంచుకున్న ప్రత్యేకమైన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లైకులతో దూసుకుపోతోంది. ఇంతకీ విరాట్కు ఆ ఫొటో ఎందుకంత స్పెషల్ అంటే.. రన్మెషీన్గా పేరొందిన కోహ్లి 2011, జూన్లో టెస్టుల్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నాడు ద్రవిడ్ సెంచరీ.. కోహ్లి విఫలం వెస్టిండీస్తో జమైకాలోని కింగ్స్టన్లో గల సబీనా పార్క్లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడాడు. నాటి భారత జట్టులో ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. వన్డౌన్లో వచ్చిన వాల్.. తొలి ఇన్నింగ్స్లో 40 పరుగులు చేయగా.. కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగి కేవలం 4 పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో ద్రవిడ్ సెంచరీ(112)తో ఆకట్టుకోగా.. కోహ్లి 15 పరుగులు చేశాడు. అలా తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ తర్వాతి కాలంలో టీమిండియా మేటి బ్యాటర్గా, సారథిగా ఎదిగిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 75 శతకాలు పూర్తి చేసుకున్నాడు. హెడ్కోచ్, బ్యాటర్గా కాగా కోహ్లి అరంగేట్రం చేసిన మరుసటి ఏడాదే ద్రవిడ్ ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ఇక 2011 తర్వాత ఈ ఇద్దరూ కలిసి వెస్టిండీస్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి. అప్పుడు సహచర ఆటగాళ్లుగా ఉన్న ద్రవిడ్, కోహ్లి.. ప్రస్తుతం హెడ్కోచ్, కీలక బ్యాటర్లుగా వేర్వేరు హోదాల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కోహ్లి.. రాహుల్ ద్రవిడ్తో ఉన్న ఫొటో ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘గత పర్యాయం 2011లో ఇక్కడికి వచ్చిన ఇద్దరు ఆటగాళ్లు.. వేర్వేరు హోదాల్లో మరోసారి ఇలా! ఎంతో సంతోషంగా ఉంది’’ అని కోహ్లి చేసిన ట్వీట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా వెస్టిండీస్ టూర్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టు జరుగనున్న డొమినికా 2011 నాటి మూడో టెస్టుకు వేదికైంది. ఇక్కడ దిగిన ఫొటోనే కోహ్లి షేర్ చేశాడు. నాడు డొమినికాలో ద్రవిడ్, కోహ్లి చేసిన పరుగులు వరుసగా.. 5, 34- 30. చదవండి: Ind Vs WI: షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే WC 2023: అతడి పేరును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.. అందుకే ఇలా! The only two guys part of the last test we played at Dominica in 2011. Never imagined the journey would bring us back here in different capacities. Highly grateful. 🙌 pic.twitter.com/zz2HD8nkES — Virat Kohli (@imVkohli) July 9, 2023 -
పాపం.. జడేజా హర్ట్ అయి ఉంటాడు.. సీఎస్కే సీఈఓ కామెంట్స్ వైరల్
Ravindra Jadeja- MS Dhoni: ‘‘అతడు బ్యాటింగ్ చేయడానికి వెళ్లే సమయానికి దాదాపు 5-10 బంతులో మిగిలి ఉన్న సమయంలో.. కొన్నిసార్లు షాట్లు ఆడగలడు. లేదంటే మిస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, తన తర్వాత ధోని బ్యాటింగ్కు రావాల్సి ఉంటుందని తనకు తెలుసు. కాబట్టి ఒక్కోసారి తనకు రెండు- మూడు బంతులు మాత్రమే ఆడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ధోని మైదానంలో అడుగుపెట్టగానే ప్రేక్షకులు అతడి నామస్మరణ మొదలుపెట్టడం సహజం. అంతేగాక ధోని రాక కోసం ఒక్కోసారి జడేజా తొందరగా అవుట్ కావాలని కోరుకుంటారు కూడా! బహుశా ఈ విషయం జడేజా మనసును గాయపరిచి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఏ ఆటగాడైనా అలాగే ఫీల్ అవుతాడు. ఒత్తిడిలో కూరుకుపోతాడు. కానీ ఈ విషయం గురించి ఒక్కసారి కూడా అతడు మాకు కంప్లైంట్ చేయలేదు. తను ఆ ట్వీట్ చేసినప్పటికీ ఆ విషయం గురించి మా దగ్గర ప్రస్తావించలేదు’’ అని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. ధోనిపై ప్రేమ.. జడ్డూ మనసుకు గాయం సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విషయంలో అభిమానుల ప్రేమ.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కొన్నిసార్లు బాధపెట్టిన మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో ఎక్కడ చూసినా ధోని నామస్మరణే సాగింది. చెన్నై సొంతమైదానం అనే కాకుండా ఇతర స్టేడియాల్లో కూడా సీఎస్కే మ్యాచ్ ఉందంటే ధోని పేరుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. జడ్డూ ట్వీట్పై అభిమానుల ఆగ్రహం ఇక బ్యాటింగ్ ఆర్డర్లో జడ్డూ తర్వాత ధోని ఎంట్రీ ఇచ్చే నేపథ్యంలో ఫ్యాన్స్ ఒక్కోసారి.. జడేజాను తొందరగా అవుట్ అవ్వాలంటూ కామెంట్లు చేశారు. ధోని మీద వారికున్న ప్రేమ.. జడేజాకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో మనసు చిన్నబుచ్చుకున్న ఈ స్పిన్ ఆల్రౌండర్.. జట్టును గెలిపించి అవార్డు అందుకున్న సందర్భంలో.. ‘‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరో ఇప్పటికైనా తెలిసిందా?’’అన్న అర్థంలో ట్వీట్ చేశాడు. దీంతో జడేజాపై సీఎస్కే అభిమానులు కూడా విరుచుకుపడ్డారు. ధోని మీద ఆప్యాయత చూపినంత మాత్రాన నిన్ను తక్కువ చేసినట్లు కాదని.. అయినా నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తావంటూ చివాట్లు పెట్టారు. ధోనిని అవమానించావంటూ మండిపడ్డారు. ఫైనల్లో బౌండరీ బాది అయితే, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో బౌండరీ బాది జడేజా.. సీఎస్కేను విజయతీరాలకు చేర్చిన తర్వాత ధోని భయ్యా కోసం ఏదైనా చేస్తా అంటూ అతడు చేసిన ట్వీట్ అభిమానుల కోపాన్ని చల్లార్చింది. నిజంగానే జడ్డూకు ధోని అంటే ఎంత ప్రేమో అని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ నేపథ్యంలో జడేజా క్రిప్టిక్ పోస్ట్పై తాజాగా స్పందించిన కాశీ విశ్వనాథన్ ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. జడ్డూ స్థానంలో ఎవరున్నా హర్ట్ అవడం సహజమని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023 విజేతగా నిలిచిన ధోని సారథ్యంలోని సీఎస్కే ఐదోసారి ట్రోఫీ గెలిచింది. చదవండి: Ind Vs WI: విండీస్కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్! ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
మరో ఓలా స్కూటర్ రానుందా? భవిష్ అగర్వాల్ ఏం చెబుతున్నాడంటే?
Ola Upcoming Electric Scooter: భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఇప్పుడు మార్కెట్లో మరో స్కూటర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాన్ని ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్' (Bhavish Aggarwal) తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. భవిష్ అగర్వాల్ ట్విటర్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే నెలలో (2023 జూలై) మరో ఉత్పత్తిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. దీనిని ఎండ్ఐస్ఏజ్ (#endICEAge) షో పార్ట్ వన్ అని అన్నారు. అయితే త్వరలో వెల్లడించనున్న స్కూటర్ ఏది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే మార్కెట్లో విక్రయానికి ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ జాబితాలో మరో స్కూటర్ చేరనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భావిస్తున్నాము. ఇది కూడా ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది. Announcing our next product event in July. Calling it the #endICEAge show, Part 1! Part 1 of the show would end ICE age in scooters! With S1 Pro, S1 Air and … XXXX 😉😎 And maybe one more thing!😀 pic.twitter.com/7Qz5JRg9I7 — Bhavish Aggarwal (@bhash) June 19, 2023 -
15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్
అమెరికాలో చిన్నవయసులోనే స్టార్టప్కి సీఈవో, 15 ఏళ్ల ఎరిక్ ఝూకు వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్లో చోటు దక్కలేదు. లింక్డ్ఇన్లో తననుఎందుకు బ్యాన్ చేసిందో, అకౌంట్ ఎందుకు లేదో తెలుపుతూ స్వయంగా అవియాటో సీఈవో ఎరిక్ తన ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించారు. దీంతో 6 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 4వేలకు పైగా లైక్స్తో ఈ ట్వీట్ వైరలయింది. విషయం ఏమిటంటే... హైస్కూల్లో చదువుతున్న ఎరిక్ ‘ఎవియాటో’ అనే స్టార్టప్ని ఏర్పాటు చేశాడు. బాచ్మానిటీ క్యాపిటల్లో పెట్టుబడిదారుడిగా కూడా ఉన్నాడు. ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఒక ఉద్యోగి “హే ఎరిక్, నేను మీ కంపెనీతో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా. కానీ లింక్డ్ఇన్ పోస్ట్లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయాను, కానీ.. అంటూ వచ్చిన ఒక స్క్రీన్ షాట్ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పారు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు ఇదే కారణంతో స్పేస్ఎక్స్ కైరన్ క్వాజీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లింక్డ్ఇన్ ఖాతాను తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయసుండాలి. ఈ విషయాన్ని తన కంపెనీ కొత్త ఉద్యోగికి చెప్పాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వయసు నిబందనపై లింక్డ్ఇన్ ప్రతినిధి ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. I had to tell my new employee that I got banned from linkedin for being 15 years old today… pic.twitter.com/fskiVDnpWw — Eric Zhu (@ericzhu105) June 15, 2023 -
ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!
Car Owner Tweets to Anand Mahindra: గత కొన్ని రోజులకు ముందు మహీంద్రా కంపెనీకి చెందిన లేటెస్ట్ స్కార్పియో ఎన్ ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ SUV చెట్టుకి ఢీ కొట్టడం వల్ల కారు పై భాగం మొత్తం ఒక పక్కకు వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ లోపల ఉన్న ప్రయాణికులకు ప్రాణ నష్టం జరగలేదు, కానీ గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ ఒక మహిళ ఈ ప్రమాదం గురించి 'ఆనంద్ మహీంద్రా'కి ట్వీట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మహీంద్రా స్కార్పియో-ఎన్ కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రపవడంతో ఈ పెను ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు చూస్తే ఒక్క సారిగా భయం కలుగుతుంది. కారు అటవీ ప్రాంతం గుండా వెల్తూ చెట్టుకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైనపుడు స్కార్పియో ఎన్ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని ఓనర్ వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయం మీదనే బిబేకానంద దాస్ ట్వీట్ చేస్తూ కారులో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదని, ఈ ప్రమాదం వల్ల తన చిన్న కూతురు పరిస్థితి విషయంగా ఉందని, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడమే దీనికి కారణమని, దీని మీద తప్పకుండా మరింత ద్రుష్టి సారించాలని కోరింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ప్రస్తుతానికి ఆనంద్ మహీంద్రా దీనిపైన స్పందించలేదు. కాగా ఇప్పటి వరకు స్కార్పియో ఎన్ కారుకి ఇలాంటి ప్రమాదం సంభవించలేదు, ఇంత ప్రమాదానికి గురైనప్పటికీ ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారంటే అందులో ఉన్న పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ మనకు ఇట్టే అర్థమైపోతాయి. @anandmahindra 🙏Met with a fatal road accident on 11th June while driving Scorpio N with my family my younger daughter is critical. Unfortunately none of the airbags open. Pl take care for further development. pic.twitter.com/yp3tUZGmpp— BIBEKANANDA DASH (@bibek_india) June 13, 2023 సేఫ్టీ రేటింగ్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్యువిలో జరిగిన ఈ సంఘటన ఈ కారు కొనుగోలుదారులతో కొంత భయాందోళనను కలిగించింది. ఈ ఎస్యువి అడల్స్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 34 పాయింట్లకు గానూ 2.25 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో 48 పాయింట్లకు గానూ 28.94 పాయింట్లను సాధించి, మొత్తం మీద సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. సేఫ్టీ ఫీచర్స్ మహీంద్రా స్కార్పియో ఎన్ ఏడు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో సహాయపడతాయి. ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారులో ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ కాలేదనేదానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. పచ్చని పకృతి, పల్లె అందాలకు మురిసిపోతూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. భారతదేశంలోని 10 అత్యంత అందమైన గ్రామాల లిస్ట్ను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పా నుండి మేఘాలయలోని మావ్లిన్నాంగ్ వరకు ఉన్న ఫోటోలు మిమ్మల్ని ఆనంద పరవశంలో ముంచేస్తాయి. దేశంలో పలు ప్రాంతాల శోభను ప్రతిబింబించేలా దేశం నలుమూలలా పరుచుకున్న ప్రకృతి మాత ఒడిలో, ఎనలేని సోయగంతో అలరారే అద్భుత అందాలను చూసి తరించాలని అందరికీ ఉంటుంది. రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి సేదదీరేందుకు సాధారణంగా పల్లెలకు పరుగులు తీస్తాం. అక్కడి అందాలను ఆత్మీయతలను జీవిత మంతా పదిలపర్చుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో ప్రతీ మూలలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) అలాంటి వారికి భారీ ఊరటనిచ్చేలా దేశంలోని అందమైన టాప్ టెన్ పల్లెల అద్భుతమైన ఫోటోలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వీటిని చూసిన ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర వాటిని రీట్వీట్ చేశారు. మండు వేసవిలో చల్లని చిరుజల్లుల్లా ఉన్న ఫోటోలనుచూసి ఆయన మురిసిపోయారు. మన చుట్టూ ఉన్న అందాలు చూసి తనకు మాటలు రావడం లేదంటూ పరశించిపోయారు. భారతలో తాను ఆస్వాదించాల్సిన అందమైన ప్రాంతాల లిస్ట్ పెరిగిపోతోంది అంటూ కమెంట్ చేశారు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) This beauty around us just left me speechless…My bucket list for travel in India now overflows…. https://t.co/WXunxChIKg — anand mahindra (@anandmahindra) June 8, 2023 -
రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు తోటి క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 2017, సెప్టెంబర్ లో ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్ వాపోయారు. సింగ్తోపాటు వినోద్ తోమర్పై ఆరోపణలు గుప్పించారు. (సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) If women will not support other women, who will? If the current iconic cricketers not support their brethren, who will? — Harsh Goenka (@hvgoenka) June 2, 2023 -
మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్ వైరల్
#MS Dhoni- Ravnidra Jadeja: ఐపీఎల్-2023 ఫైనల్.. అసలే వర్షం.. అప్పటికే ఓరోజు వాయిదా పడ్డ మ్యాచ్.. కనీసం రిజర్వ్ డే అయినా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్న సందేహాలు.. పర్లేదు వాతావరణం బాగానే ఉంది.. ఆట మొదలైంది.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. సాయి అద్బుత ఇన్నింగ్స్ సాయి సుదర్శన్ తుపాన్ ఇన్నింగ్స్(47 బంతుల్లో 96 పరుగులు) కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు స్కోరు బోర్డుపై ఉంచగలిగింది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం ఏమవుతుందోనన్న ఆందోళన నడుమ అర్ధరాత్రి మ్యాచ్ మళ్లీ మొదలైంది. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై గెలుపొందాలంటే 171 పరుగులు సాధించాలి. కాన్వే అదరగొట్టాడు సీజన్ ఆసాంతం అదరగొట్టిన సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(16 బంతుల్లో 26 పరుగులు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు) శుభారంభమే అందించారు. వన్డౌన్ బ్యాటర్ శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అజింక్య రహానే 13 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. ఆతర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడు 8 బంతుల్లో 19 రన్స్ తీశాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ధోని గోల్డెన్ డక్గా వెనుదిరగగా.. రవీంద్ర జడేజా మరోసారి మ్యాజిక్ చేశాడు. జడ్డూ విన్నింగ్ షాట్.. ఐదోసారి చాంపియన్గా చెన్నై చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్ శర్మ మొదటి నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. వరుసగా 0, 1,1,1.. మొత్తంగా మూడు పరుగులే వచ్చాయి. సీఎస్కే ఐదోసారి చాంపియన్గా నిలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జడేజా ఉన్నాడు. నరాలు తెగే ఉత్కంఠ.. పదిహేనో ఓవర్ ఐదో బంతిని సిక్సర్గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి ఫోర్ బాదాడు. విన్నింగ్ షాట్తో చెన్నైని ఫైవ్స్టార్ చేశాడు. అంతే.. సూపర్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సారథి ధోని అయితే ఏకంగా జడ్డూను ఎత్తుకుని మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏంటీ విభేదాలా? మహీ అన్న కోసం ఏమైనా చేస్తా! కీలక మ్యాచ్లలో చెన్నైని గెలిపించిన జడేజా.. ఐపీఎల్-2023 ఫైనల్లోనూ అద్భుతం చేసి జట్టును విజయతీరాలకు చేర్చి ధోనికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలంటూ గత కొంతకాలంగా వదంతులు వ్యాపిస్తున్న తరుణంగా రవీంద్ర జడేజా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. జడ్డూ, తన భార్య రివాబా ట్రోఫీతో ధోనితో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఇది కేవలం ఏకైక వీరుడు, ధీరుడు ఎంఎస్ ధోని కోసమే చేశాం. మహీ అన్నా.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే’’ అంటూ ధోనిపై ప్రేమను కురిపించాడు. వేలల్లో రీట్వీట్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్తో రవీంద్ర జడేజా ట్వీట్ దూసుకుపోతోంది. వీరి మధ్య పొరపొచ్చాలు లేవని ఇప్పటికైనా ఇలా చెప్పారంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు We did it for ONE and ONLY “MS DHONI.🏆 mahi bhai aapke liye toh kuch bhi…❤️❤️ pic.twitter.com/iZnQUcZIYQ — Ravindrasinh jadeja (@imjadeja) May 30, 2023 M.O.O.D! 🤗 Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd — IndianPremierLeague (@IPL) May 29, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 𝙒𝙚 𝙬𝙖𝙣𝙩 𝙩𝙤 𝙙𝙚𝙙𝙞𝙘𝙖𝙩𝙚 𝙩𝙝𝙞𝙨 𝙏𝙞𝙩𝙡𝙚 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 𝙩𝙤 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 💛 Men of the moment @imjadeja & @IamShivamDube recap #CSK's glorious win in the #TATAIPL 2023 #Final 👌🏻👌🏻 - By @ameyatilak Full Interview 🎥🔽 #CSKvGT https://t.co/kDgECPSeso pic.twitter.com/yp09HKKCSn — IndianPremierLeague (@IPL) May 30, 2023 -
IPL 2023 Final: విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్
సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్యూవీని శుభ్మాన్ గిల్కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్ కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్లో 60.79 సగటుతో శుభ్మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్ఫామెన్స్తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్మేకర్ స్పందన ఇది!) I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…! — anand mahindra (@anandmahindra) May 28, 2023 -
చాలా కష్టంగా ఉంది.. ఒక్కరూ సాయం చేయడం లేదు.. కనీసం: చేతన్ శర్మ
Chetan Sharma shares cryptic post: భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ నెట్టింట మరోసారి వైరల్గా మారాడు. ఎవరూ సహకారం అందించడం లేదంటూ నర్మగర్భ ట్వీట్తో ముందుకు వచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పరాభవం నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అనూహ్య రీతిలో మరోసారి చేతన్ శర్మనే చీఫ్ సెలక్టర్గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. శివ్సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్కు చేతన్ శర్మ పానెల్లో చోటిచ్చింది. సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇదిలా ఉంటే.. చీఫ్ సెలక్టర్గా మరోసారి నియమితుడైన చేతన్ శర్మ నెల రోజుల్లోనే వివాదంలో చిక్కుకున్నాడు. ఓ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారత క్రికెటర్లు పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించనప్పటికీ ఇంజక్షన్లు వేసుకుని మైదానంలో దిగుతారంటూ సంచలనం రేపాడు. అదే విధంగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో నాటి కెప్టెన్ విరాట్ కోహ్లికి వ్యతిరేకంగా రాజకీయాలు జరిగాయంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో టీమిండియా ప్రతిష్ట, విశ్వసనీయతను దెబ్బతీసేలా మాట్లాడిన చేతన్ శర్మ రాజీనామా చేయడం కూడా చర్చకు దారితీసింది. ఒక్కరు కూడా సాయం చేయడం లేదు ఈ నేపథ్యంలో చేతన్ శర్మను తప్పించాలనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్ ఆపరేషన్కు ప్రణాళికలు రచించారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. తాజాగా ఓ క్రిప్టిక్ పోస్ట్తో చేతన్ శర్మ ముందుకు వచ్చాడు. ‘‘ఇప్పటిదాకా గడిచిన జీవితం చాలా కష్టంగా తోచింది. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి సహకారం లేదు. ఆ మాతా రాణి ఆశీర్వాదాలైనా నాపై ఉంటాయని ఆశిస్తున్నా’’ అని చేతన్ శర్మ ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన ఆయన ఫాలోవర్లు.. ‘‘ధైర్యంగా ఉండండి. జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నీకు గడ్డు దశ నడుస్తుంది కావొచ్చు. కానీ ఏదో ఒకరోజు నీ సమస్యలు తీరిపోతాయి భాయ్’’ అని అండగా నిలుస్తున్నారు. చదవండి: యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. శ్రీలంక క్రికెటర్కు ఊరట చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? Life has been very tough so far. No hope from your near & dear. Hope Mata Rani bless me..... — Chetan Sharma (@chetans1987) May 17, 2023 -
నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్బీ ఫన్నీ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఖాతాల బ్లూటిక్ మాయం కావడంతో ప్రముఖులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా వెరిఫికేషన్ ఫీజు చెల్లించిన తరువాత కూడా బ్లూటిక్ మాయం కావడంతో ఒకింత అవమానంగా భావించారు. అంతేకాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలంతా ట్విటర్ చర్యతో షాక్ అవుతున్నారు. దీంతో మా బ్లూటిక్ మాకు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్గా మారింది. (ఇదీ చదవండి: Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) హే ట్విటర్! మీరు వింటున్నారా?సబ్స్క్రిప్షన్ సేవ కోసం చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందుండే బ్లూటిక్ను తిరిగి ఇచ్చేయండి. తద్వారా నేనే అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. కాళ్లపై పడాలా? అంటూ బిగ్బీ ఫన్నీగా ట్విట్ చేశారు. దీంతో యూజర్లు ఫన్నీ రిప్లైలను పోస్ట్ చేసారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) " సహనం ఉంటేనే బ్లూ టిక్’’ అని ఒకరు, మూడు నాలుగురోజులు ఆగండి అని ఇంకొకరు కామెంట్ చేశారు. మిస్టర్ బచ్చన్, మస్క్ విదేశీయుడు, ఎవరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇంకొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు "బచ్చన్ సాహెబ్ ఉ అంగ్రేజ్ హో కేహు కా నహీ సునత్ హో, అంటూ బిగ్బీ స్టయిల్లోనే మరొకరు సమాధానం ఇచ్చారు. అలాగే నటి ఖుష్బూ కూడా తాను సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ట్విటర్ బ్లూటిక్ పోయిందని ట్వీట్ చేశారు. T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ?? — Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023 My account says subscription will end on 17th March 2024, yet it says canceled. I have paid for a year. Why does it stand canceled @TwitterBlue ??? pic.twitter.com/1BZpOm10aY — KhushbuSundar (@khushsundar) April 21, 2023 సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్లు, వార్తా సంస్థలు ఇలా ఏ ఖాతానూ మస్క్ వదిలిపెట్టలేదు. బాలీవుడ్ స్టార్లు షారూఖ్ఖాన్, సల్మాన్ఖాన్, నటుడు ప్రకాశ్ రాజ్, టాలీవుడ్ హీరో చిరంజీవితోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖాతాల్లో బ్లూటిక్ ఎగిరిపోయింది. అలాగే హీరోయిన్లు సమంత, అలియా భట్ లతో పాటు రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యూపీ యోగి ఆదిత్యనాథ్తోపాటు పలు మీడియా సంస్థలు కూడా బ్లూటిక్ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. As of now, this is my blue tick verification! 😬 https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2 — Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023 -
4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్?
IPL 2023- GT Vs KKR: ‘‘తలెత్తుకో.. ఒక్కోసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీది కాదంతే! నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్వే యశ్. ఇంతకంటే గొప్పగా.. మరింత వేగంగా పుంజుకుని నువ్వేంటో నిరూపించుకుంటావు’’ అంటూ కోల్కతా నైట్ రైడర్స్ క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేసింది. అతడికి అండగా నిలిచి నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అదరగొట్టిన అయ్యర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలో తడబడ్డా.. వెంకటేశ్ అయ్యర్(83), నితీశ్ రాణా(45) రాణించి గెలుపుపై ఆశలు చిగురింపజేశారు. 5 సిక్సర్లతో దుమ్ములేపిన రింకూ ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్కు మర్చిపోలేని విజయం అందించాడు. కాగా రింకూ ఊచకోతకు బలైపోయిన బౌలరే యశ్ దయాల్. రింకూ, యశ్ ఒకే జట్టుకు ఆడతారు! ఉత్తరప్రదేశ్కు చెందిన యశ్ లెఫ్టార్మ్ మీడియం పేసర్. దేశవాళీ క్రికెట్లో రింకూతో కలిసి ఆడాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశ్.. ఆదివారం నాటి మ్యాచ్లో నాలుగు ఓవర్లు పూర్తి చేసి ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ట్వీట్ వైరల్ ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ఇచ్చి తమ జట్టు ఓటమి కారణమయ్యాడు. దీంతో ముఖం చేతుల్లో దాచుకుంటూ యశ్ దయాల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న యశ్ను ఉద్దేశించి చాంపియన్ అంటూ ట్వీట్ చేసింది. బాధ పడొద్దంటూ ధైర్యం చెప్పింది. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ యశ్ దయాల్? ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 1997 డిసెంబరు 13న యశ్ దయాల్ జన్మించాడు. 2018లో యూపీ తరఫున లిస్ట్ ఏక క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్క్లాస్, 14 లిస్ట్ ఏ మ్యాచ్. 33 టీ20లు ఆడిన యశ్ దయాల్ మూడు ఫార్మాట్లలో వరుసగా 58, 23, 29 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ పేస్ బౌలర్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 వేలంలో 3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టైటాన్స్ తరఫున యశ్ దయాల్ 9 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు తీశాడు. గతేడాది బంగ్లాదేశ్తో టీమిండియా వన్డే సిరీస్కు ఎంపికైన యశ్.. దురదృష్టవశాత్తూ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్ IPL 2023: అవును.. బిగ్ ప్లేయర్.. కానీ పాపం నువ్వే బలైపోయావు! Chin up, lad. Just a hard day at the office, happens to the best of players in cricket. You’re a champion, Yash, and you’re gonna come back strong 💜🫂@gujarat_titans pic.twitter.com/M0aOQEtlsx — KolkataKnightRiders (@KKRiders) April 9, 2023 𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌 Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 - By @Moulinparikh Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H — IndianPremierLeague (@IPL) April 10, 2023
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంగళగిరిలో ఓటేసేందుకు వెళ్లిన పవన్ ఓవరాక్షన్
పాముల పుష్ప శ్రీవాణి ఓటు వేశారు
బీహార్ లోక్సభ ఎలక్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
ఓటు హక్కు వినియోగించుకున్న పేర్ని నాని కుటుంబ సభ్యులు
పల్నాడులో బరితెగించిన టీడీపీ నేతలు..
పోలింగ్ టైం : : ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖలు
ఓటు వేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
భారీ సంఖ్యలో తరలివస్తున్న ఓటర్లు
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
తప్పక చదవండి
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement