-
ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం – బెంగళూరు – విశాఖపట్నం మధ్య సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – ఎస్ఎంవీ బెంగళూరు (08549) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ప్రతీ శనివారం విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 29 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఎస్ఎంవీ బెంగళూరు – విశాఖపట్నం (08550) సమ్మర్ స్పెషల్ ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 30 వరకు నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడ్, జోలర్పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. -
రెండు రోజుల్లో మేనిఫెస్టో
వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి సీతమ్మధార: మరో రెండు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామని వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ విశాఖ ఉత్తర, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థులు కె.కె.రాజు, ఆడారి ఆనంద్కుమార్ నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ర్యాలీలకు ప్రభంజనంలా ప్రజలు తరలివచ్చారని, ప్రజల మద్దతుతో 175 స్థానాల్లోనూ గెలుస్తామన్నారు. ఉత్తరాంధ్రలో క్లీన్స్వీప్ చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వైజాగ్ విజన్ పేరిట ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డాక్యుమెంట్ విడుదల చేశారని, ఆ డాక్యుమెంట్ ప్రకారం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధే గెలిపిస్తుందని, ప్రజలంతా వైఎస్సార్ సీపీ వెంటే ఉన్నారన్నారు. -
No Headline
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్రాజ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పెందుర్తి రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి పి.శేషశైలజకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ముందుగా ఇంటి వద్ద తల్లిదండ్రులు సత్యనారాయణ, రామలక్ష్మి ఆశీర్వచనం తీసుకున్న అదీప్రాజ్ రాంపురం నుంచి కార్యకర్తలు, నాయకులు కార్ల ర్యాలీ నడుమ పెందుర్తి చేరుకున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. రాంపురం నుంచి పెందుర్తి రైల్వే ఓవర్ వంతెన నుంచి వెలంపేట, పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి, పెందుర్తి పాత ప్రభుత్వ ఆస్పత్రి కూడలి మీదుగా జూనియర్ కళాశాల వరకు బీఆర్టీఎస్ రహదారిపై కార్లుతో ర్యాలీ వెల్లువలా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బయిలపూడి భగవాన్ జయరామ్, సీఈసీ సభ్యుడు పైలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ముమ్మన దేముడు, బట్టు సూర్యకుమారి, ఎంపీపీ మధుపాడ నాగమణి, జెడ్పీటీసీ సభ్యులు ఉప్పిలి దేవి, రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబ, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్టీ నేతలు గండి రవికుమార్, చుక్కా రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ తన పేరిట రూ.2 కోట్ల వరకు స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా పెందుర్తి రైల్వేస్టేషన్ వద్ద రైల్రోకో నిరసనపై అదీప్రాజ్పై కేసు నమోదైంది. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం 2015లో చేపట్టిన నిరాహార దీక్షపై మరో కేసు అదీప్రాజ్పై నమోదు కాగా.. అవి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. -
ఎన్నికల ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా
మహరాణిపేట: ఎన్నికల సమయంలో అభ్యర్థులతోపాటు ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సి ఉందని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్ వ్యయ పరిశీలకులు రంగ రాజన్, భీమిలి, తూర్పు, దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు సౌమ్య పాండేజైన్, ఉత్తర, పశ్చిమ, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు అక్తా జైన్తో కలిసి శుక్రవారం జిల్లాలో నీనా నిగం పర్యటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువుల తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అధికారులందరితో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. సమాచార లోపం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో సంప్రదింపులు చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పార్టీలు గానీ, అభ్యర్థులు గానీ అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలులేదని, వారు చేసే ఆర్థిక లావాదేవీలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీనా నిగం చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కమిటీ ద్వారా సాధారణ పౌరుల నుంచి జప్తు చేసిన నగదును ఆధారాలు పరిశీలించి త్వరితగతిన వెనక్కి ఇచ్చేయాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్, ఎంసీసీ నోడల్ అధికారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్.విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్కుమార్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆయా విభాగాల ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి ఆమెకు వివరించారు. క్షేత్రస్థాయిలో చర్యలు, సేవలు కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ 11 చోట్ల చెక్ పోస్టులు పెట్టామని, ఇప్పటి వరకు వస్తు, ధన రూపంలో రూ.4.92 కోట్ల నగదును సీజ్ చేశామని తెలిపారు. మొత్తం 110 రకాల బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, నగదు తరలింపు, మద్యం రవాణాపై నిఘా ఉంచుతున్నాయని వివరించారు. 24/7 పనిచేసేలా కంట్రోల్ రూమ్ నుంచి సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 16 మంది నోడల్ అధికారులను నియమించామని, 502 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, 1,457 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సీ–విజిల్ ద్వారా 388 వినతులు రాగా.. 285 వినతులను నిర్ణీత సమయంలో పరిష్కరించామని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన ఘటనల్లో 59 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. బాధ్యతగా ఎన్నికల విధులు జిల్లా అధికారులతో రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం నియోజకవర్గాల వారీగా సమీక్షలు -
ఎన్నికల నియమావళికి గంటా తూట్లు
మధురవాడ: భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల నియమావళికి తూ ట్లు పొడిచారు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్సార్ కాలనీ, గాయత్రీ మెడికల్ కళాశాల సమీపంలోని పవన్ మిత్ర అపార్ట్మెంట్ వద్ద రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాలనీలో టీడీపీ నాయకులు రాత్రి 10 గంటలకు బాణసంచా కాల్చారు. తర్వాత రోడ్డు మధ్యలోనే ఫొటోలు దిగుతూ గంటా అభివాదం చేశారు. రాత్రి 10.15 గంటలకు పక్కనే ఉన్న పవన్ మిత్ర అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రచారం చేశారు. 10.25 గంటలకు వైఎస్సార్ కాలనీలో మహిళలతో ముచ్చటించి గ్రూప్ ఫొటో దిగారు. అర గంట పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గంటా ప్రచారం నిర్వహించినా అధికారులు, పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. -
No Headline
గోపాలపట్నం: వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ నామినేషన్ ర్యాలీతో రహదారులు జనసంద్రంగా మారాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడి నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఆడారి ఆనంద్కుమార్పై పూలవర్షం కురిపించారు. ముందుగా వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ గోపాలపట్నం నూకాలమ్మ ఆలయంలో అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనాలు, కార్లతో ర్యాలీగా బయలు దేరారు. జన ప్రభంజనం మధ్య ఎన్ఏడీ జంక్షన్, కరాసా, కంచరపాలెం మెట్టు మీదుగా జ్ఞానాపురం ఎర్నిమాంబకు ఆలయానికి చేరుకుని అక్కడ పూజలు చేశారు. తర్వాత జ్ఞానాపురం జోన్–5 కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హుస్సేన్ సాహెబ్కు ఆడారి ఆనంద్కుమార్ అందించారు. ఆయన వెంట డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, కో–ఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, ఆనంద్కుమార్ అక్క పీలా రమాకుమారి, కార్పొరేటర్ పి.వి.సురేష్ ఉన్నారు. కార్యక్రమంలో పశ్చిమ ఎన్నికల పరిశీలకుడు ఎస్.ఎ.రెహమాన్, పీలా ఉమారాణి, పేడాడ రమణి కుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీఎస్ కృష్ణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కంచరపాలెం: వైఎస్సార్ సీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ తన పేరిట చర, స్థిరాస్తులు రూ.15,93,61,699 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆనంద్కుమార్పై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. ఆనంద్ కుమార్ భార్య మాలతి పేరు మీద వివిధ బ్యాంకుల్లో రూ.23,20,277 నగదు డిపాజిట్లు, వివిధ సంస్థల్లో రూ.2,87,87,544 పెట్టుబడులు, రూ.39,26,412 బంగారం, ఇతర విలువైన వస్తువులు, రూ.22,44,087 భూములు, వ్యక్తిగత లోన్లు ఉన్నాయి. -
జయహో..జగనన్న
సాక్షి, అనకాపల్లి, నక్కపల్లి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా రాష్ట్ర అభ్యుదయ రథా న్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టింది. రాత్రి 9 గంటలకు సీఎం బస్సు యాత్ర జిల్లా సరిహద్దు పాయకరావుపేటకు చేరుకుంది. వేలాది మంది పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపైకి వచ్చి సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. తనను చూడడానికి వేలాదిగా తరలివచ్చిన జన సందోహానికి సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడులను ప్రజలకు బస్సుపై నుంచే పరిచయం చేస్తూ రెండు చేతులు జోడించి ముందుకు సాగారు. వై జంక్షన్లో మహిళలు హారతులివ్వడంతో పాటు గుమ్మడికాయలపై దీపాలు వెలిగించి దిష్టి తీసి జగనన్న బస్సుయాత్ర ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని, మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని దీవించారు. రాత్రి 9 గంటల సమయంలో కూడా పాయకరావుపేట పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది తరలిరావడంతో హైవే జన సంద్రమైంది. జై జగన్.. జైజై జగన్, మళ్లీ నువ్వే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. బస్సుయాత్రకు స్వాగతం పలికిన వారిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ గొల్ల బాబూరావు, అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంఎస్ఎంఈ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు తదితరులు ఉన్నారు. గొడిచర్ల వద్ద రాత్రి బస పాయకరావుపేట నుంచి నక్కపల్లి మండలం గొడి చర్ల హైవే పక్కన ఏర్పాటు చేసిన వసతి వద్ద సీఎం జగన్ రాత్రి బస చేశారు. గొడిచర్ల వద్ద రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మాడుగుల ఎమ్మె ల్యే అభ్యర్థి ఈర్లె అనూరాధ, సర్పంచ్ అల్లు రమణ తదితరులు సీఎం జగన్కు స్వాగతం పలికారు. మోగనున్న సమర శంఖం సీఎం బస్సుయాత్ర జిల్లాలో శనివారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం దొడ్డిగల్లు నుంచి ప్రారంభమై నాలుగు నియోజకవర్గాల్లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. సీఎం పర్యటన ఇలా... సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్యుతాపురంలో గల లంచ్ పాయింట్ క్యాంప్కు చేరుకుంటారు. అనంతరం కశింకోట మండలం నరసింగపల్లి సమీపంలోని చింతలపాలెం వద్ద బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో సీఎం వై.ఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్, బయ్యవరం, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి జంక్షన్–1, జంక్షన్–2, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్గేట్, దేవీపురం, అస్కపల్లి మీదుగా రాత్రి 8.30 గంటలకు సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెంలో గల టెర్రకాన్ రాయల్ వెంచర్ వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు. -
No Headline
నాడు.. ఒక్క అడుగు... రాష్ట్రంలో సంక్షేమ చరిత్రను లిఖించింది.. అవ్వాతాతల మోముల్లో చిరునవ్వు విరబూయించింది.. అక్కా చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చింది... చిన్నారులను అమ్మ ఒడిలా లాలించి విద్యాదీవెనలు అందించింది.. ప్రతి గుండెకు ఆరోగ్య సురక్షగా నిలిచింది ప్రతి రైతుకు భరోసా ఇచ్చింది లక్షలాది మందికి నీడనిచ్చింది... ఆ మహాపథికుడు, జన హృదయాధినేత, సంక్షేమ రథసారథి నేడు కోట్లాది మంది ఆశీస్సులతో మళ్లీ మనముందుకొచ్చాడు.. ఎన్నికల సమరానికి శంఖం పూరించి... బస్సు యాత్రతో సిద్ధమై వచ్చాడు.. మండువేసవిలో చిరునవ్వుల వెన్నైలె వచ్చాడు... ఆ వెన్నెలలో తడిసి ముద్దయిన వేలాది జనం జేజేలతో సాదర స్వాగతం పలికారు... జయహో...జగనన్న అంటూ నీరాజనాలు పలికారు... -
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బెదిరించారు
ఆనందపురం: అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తన ఇంటికి టీ తాగడానికి వచ్చి పార్టీ మారాలని బలవంతం చేశారని పందలపాక సర్పంచ్ ధవళ నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహించడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని పార్టీ మారాలని తనను బలవంతం చేశారని, కుదరదని తేల్చి చెప్పేశానన్నారు. నాయకులను లొంగదీసుకోవడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వివరించారు. తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి గెలుపునకు కృషి చేస్తానన్నారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు లొంగనని చెప్పారు. పందలపాక సర్పంచ్ ధవళ నాగేశ్వరరావు -
ఎంపీకి 6, అసెంబ్లీకి 22
మహరాణిపేట: జిల్లా పరిధిలో ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు జోరందుకున్నాయి. విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి రెండో రోజు శుక్రవారం ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. జిల్లా పరిధిలోని ఏడు స్థానాలకు గానూ 5 అసెంబ్లీ స్థానాల్లో శుక్రవారం 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాల్లో అభ్యర్థులు మొత్తం 27 సెట్ల నామినేషన్లు సమర్పించారు. రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. విశాఖ దక్షిణ, గాజువాక నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. భీమిలి నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బుగత రాము, నాగామి నాగోతు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు గా వెలగపూడి రామకృష్ణ బాబు, వెలగపూడి సుజన రెండేసి సెట్లు నామినేషన్లు వేయగా, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి హైమావతి నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కేకే రాజు రెండు సెట్లు, కాంగ్రెస్ నుంచి గొంప గోవిందరాజు ఓ సెట్, స్వతంత్ర అభ్యర్థులుగా బి.రమేష్, కమ్మిల సుమ, రోణంకి చలపతిరావు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ రెండు సెట్లు, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి జె. వెంకట గణేశ్ ఓ సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పెందుర్తి నియోజకవర్గం స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్రాజ్, జనసేన నుంచి పంచకర్ల మహాలక్ష్మి, పంచకర్ల రమేష్బాబు, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా కె.మహదేవ్ కల్యాణ్ శ్రీకాంత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఈత రోజా, సమాజ్ వాదీ పార్టీ నుంచి బోళెం వెంకట మురళీమోహన్, స్వతంత్ర అభ్యర్థులుగా ఆడారి నాగరాజు, గుంటూరు వెంకట నరసింహరావు, గుంటూరు సాయిప్రియ, కూండ్రపు సన్యాసిరావు ఒక్కో సెట్ సమర్పించారు. ఇక విశాఖ ఎంపీ స్థానానికి బీఎస్పీ నుంచి పెదపెంకి శివప్రసాద్, దళిత బహుజన పార్టీ నుంచి బన్న రమేష్, స్వతంత్ర అభ్యర్థులుగా సొండి కృష్ణ, మొహమ్మద్ గౌస్ ముద్దీన్ ఖాన్, చప్పిడి రాము జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు అందించారు. నవ భారత నిర్మాణ సేవా పార్టీ నుంచి చింతాడ సూర్యం రెండు సెట్లు సమర్పించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. రెండోరోజూ నామినేషన్ల జోరు -
రె‘బెల్స్’
● టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ ● మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ ● మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన ● పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు ● టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం ● అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం ● అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
No Headline
సీతంపేట: వైఎస్సార్ సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.కె.రాజు నామినేషన్ అట్టహాసంగా సాగింది. ముందుగా కె.కె.రాజు సతీసమేతంగా బెల్లం వినాయకుడికి పూజలు చేశారు. అనంతరం కనకమహాలక్ష్మి అమ్మవారు, లలితానగర్లోని లలిత అమ్మవారు, తాటిచెట్లపాలెంలో పరదేశమ్మ, సింహచలంలో వరహా లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆర్అండ్బీ వద్ద పైడితల్లి అమ్మవారికి పూజలు చేశారు. ఎన్జీజీవోస్కాలనీలోని వైభవ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రచార రథంపై వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వీఎంఆర్డీఏ చైర్మన్ సనపల చంద్రమౌళితో కలిసి అభిమానుల భారీ బైకు ర్యాలీ నడుమ సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్, డీఎల్బీ గ్రౌండ్స్, పోర్టు హాస్పిటల్, పోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఉత్తర పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా అభయాంజనేయస్వామి, ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అల్లూరి విగ్రహం మీదుగా సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ డి.అఖిలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, కె.కె.రాజు సతీమణి సుమ, ఉత్తర ఎన్నికల పరిశీలకులు బానా ల శ్రీనివాసరావు, చొక్కాకుల వెంకటరావు, సీనియర్ నాయకుడు బి.కాశీవిశ్వనాథం ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. సీతమ్మధార: వైఎస్సార్ సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు తన పేరు మీద రూ.42,27,75,132 స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల నుంచి రూ.20,36,48,977 మేర రుణాలు ఉన్నట్లు తెలిపారు. అతని భార్య సుమ పేరు మీద రూ.2,02,08,386 చరాస్తులు, రూ.5,17,87,000 స్థిరాస్తులు ఉన్నాయి. నిరసనల నేపథ్యంలో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి.ఉత్తరలో జెండా ఎగరాలి -
గంటాకు ఓటేస్తే నోటాకు వేసినట్టే..
● ఆయనకు ఓటేస్తే భూ మాఫియాను ప్రోత్సహించినట్టే.. ● వైఎస్సార్ సీపీ కార్యకర్తలనుఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ● ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆనందపురం : టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు ఓటు వేసే కన్నా.. నోటాకు వేయడమే ఉత్తమమని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గంటా భీమిలిని భ్రష్టు పట్టించారని... మరలా పొరపాటున అతనికి ఓటేస్తే భూ మాఫియాను ప్రోత్సహించిన వారవుతారన్నారు. ఆనందపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల వద్ద భూములు కొట్టేసే వారు గంటా శ్రీనివాసరావు సాయం తీసుకుంటున్నారంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ప్రోత్సహిస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నాడన్నారు. వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను టీడీపీలో చేర్చుకోవడానికి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భీమిలిని ఐదేళ్లు పాలించిన గంటా శ్రీనివాసరావుకు కనీసం 10 గ్రామాల ప్రజలైనా తెలుసా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఏడాదికి ఒకసారైనా కార్యకర్తలను, నాయకులను పలకరించని ఆయన మళ్లీ భీమిలిలో భూ దోపిడీకి పాల్పడడానికే వస్తున్నాడని, అందరూ జాగ్రత్తపడాలన్నారు. టీడీపీ నాయకులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం చేయించారని, ఇంకా మరిన్ని సంఘటనలు చేయించడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం... అనంతరం ప్రజలకు పంగనామాలు పెట్టడం టీడీపీ నాయకుల నైజమన్నారు. టీడీపీ అభ్యర్థి గ్రామాల్లోకి వస్తే ప్రజలకు ఏం చేశారని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బంక సత్యం, జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మజ్జి వెంకటరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. పక్షపాత వైఖరితో ఈనాడు రాతలు భీమిలి నియోజకవర్గంలో 66 మంది సర్పంచ్లు ఉండగా 54 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారేనని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వారిలో ఒకరో ఇద్దరో తాయిళాలకు ఆశపడి పార్టీ మారితే భీమిలిలో వైఎస్సార్సీపీ ఖాళీ అని ఈనాడులో రోత రాతలు రాశారని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఈనాడు కరపత్రంగా మారిందని, అవాస్తవాలు రాస్తోందని ఆరోపించారు. టీడీపీ నాయకులు కక్షగట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారని, అలాంటి వాటిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. -
హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు
విశాఖ లీగల్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ నగరంలోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇన్చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు డోలా సాయి (23) నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొబ్బరితోట నివాసి. రౌడీ షీటర్గా స్థానికంగా పెత్తనం చెలాయించేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి... ఆ బంధానికి సదరు మహిళ భర్త అడ్డం వస్తున్నాడని పలుమార్లు అతడిని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో 2018 అక్టోబర్ 20న అతని మెడపై కత్తితో సాయి బలంగా గాయపరిచాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు డోలా సాయిపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. -
ఎన్నికల ప్రచారంలో స్టీల్ప్లాంట్ ఉద్యోగులు
విశాఖపట్నం: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కొంత మంది స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. స్టీల్ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ కూడలి వద్ద టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్టీల్ప్లాంట్ ఉద్యోగులు కోగంటి లెనిన్బాబు, కొల్లి నాగేశ్వరరావు, గుమ్మడి నరేంద్రకుమార్, చీపురుపల్లి శ్రీనివాసరావు, ఎం.మహాలక్ష్మినాయుడు, ఎ.మణికుమార్ పాల్గొన్నారు. వారి తీరుపై సహ ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలు పట్టించుకోకుండా ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నయన మనోహరం .. నృసింహ కల్యాణం
సింహాచలం: సింహగిరి కల్యాణ సిరిని సంతరించుకుంది. చైత్రశుద్ధ ఏకాదశి వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా దర్శించిన భక్తులు తన్మయులయ్యారు. కొట్నాల ఉత్సవంతో శ్రీకారం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కల్యాణోత్సవ ఘట్టాలను ఆలయ అర్చకులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. తదుపరి ముక్కోటి దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని పలు కుతూ అలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు గరుడాళ్వార్ చిత్రపటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ నిర్వహించారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం స్వామి వారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారురంగు పల్లకీలో.. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకీలో కొలువుదీర్చారు. ఈ పల్లకీలను సింహగిరి మాడవీధుల్లో చెరొకవైపు తీసుకెళ్లి పశ్చిమ మాడ వీధిలో జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఏర్పాటు చేసిన వేదికలపై అధిష్టింపజేశారు. స్వామివారు, అమ్మవార్ల వైభవాన్ని, గొప్పతనాన్ని చాటిచెబుతూ జరిగిన ఎదురు సన్నాహోత్సవం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఆలయ అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఎదురు సన్నాహోత్సవాన్ని రక్తి కట్టించారు. వ్యాఖ్యాతలుగా రావులపాలే నికి చెందిన కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, కందుకూరి సత్య సూర్యనారాయణమూర్తి వ్యవహరించారు. నేత్రపర్వం..రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహించారు. రథంలో ఉన్న స్వామివారిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా నిలిచి రథ కదలికలను సూచిస్తుండగా, లక్ష్మీదేవి అమ్మవారి బంధువులుగా జాలర్లు రథం నడిపే బాధ్యతలు చేపట్టారు. అశేష భక్తజన సందోహం రథాన్ని తాళ్లతో లాగి పరవశించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యులు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్రాజ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణోత్సవం జరిపించారు. స్వామివారిని, అమ్మవార్లను నృసింహ మండపంలోకి తీసుకొచ్చి, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కొలువుదీర్చి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తదుపరి భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీసీపీ సత్తిబాబు, నార్త్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన దాసరి రాము ట్రూప్ పులివేషాలు, విజయనగరం జిల్లా వేపాడకు చెందిన సింహాద్రి అప్పన్న గరిడి నృత్యం, విశాఖలోని దువ్వాడకు చెందిన నూకాంబిక ట్రూప్ కోలాటం, వడ్లపూడికి చెందిన వెంకట పరమేశ్వరి అన్నమయ్య సంఘం మహిళల కోలాటం, కూర్మాన్నపాలేనికి చెందిన శ్రీ బాలాజీ త్రిశక్తి కోలాటం సంఘం మహిళలు చేసిన నృత్యం, మాధవధారకు చెందిన లలిత వైభవ కోలాటం, విజయనగరానికి చెందిన పులివేషాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కనువిందుగా ఎదురు సన్నాహోత్సవం వైభవంగా రథోత్సవం పరవశించిన భక్తజనం సింహగిరికి కల్యాణ సిరి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులుమహిళల సాంస్కృతిక ప్రదర్శన -
వీఎన్సీ, ఎంఎఫ్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
మహారాణిపేట: కేంద్రీయ మత్స్య నావిక, ఇంజినీరింగ్ శిక్షణా విభాగం ఆధ్వర్యంలో వెస్సెల్ నేవిగేటర్(వీఎన్సీ), మైరెన్ ఫిట్టర్(ఎంఎఫ్సీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల కాల పరిమితి గల ఈ కోర్సులకు విశాఖ, కొచ్చి, చైన్నె ఏరియాల్లో శిక్షణ ఉంటుంది. పదో తరగతిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు నాటికి 15 నుంచి 20 సంవత్సరాల్లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది. అఖిల భారత స్థాయిలో కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తులను www.cifnet.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడు చేసుకుని, జూన్ 14వ తేదీలోగా ది డైరెక్టర్, cifnet, fine arts avenue, cochin-682 016 చిరునామాకు పంపాలి. -
మండుటెండలు, వడగాడ్పుల్లో..
కొద్దిరోజులుగా మాడు పగిలే మండుటెండలు, వడగాడ్పులు జనానికి దడ పుట్టిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఎన్నికలు రావడం అభ్యర్థులతో పాటు వారి అనుచరగణానికి పరీక్షా కాలంగా మారింది. అయినప్పటికీ ఉష్ణతాపాన్ని లెక్క చేయకుండా ప్రచారాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి. వడగాడ్పులకు జడిసి వెనకడుగు వేస్తే ప్రత్యర్థి ఎక్కడ దూసుకుపోతాడోనన్న భయం అభ్యర్థులను వెంటాడుతోంది. సాధారణంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖలో తక్కువ ఉష్ణోగ్రతలతో ఒకింత చల్లదనం పరచుకుంటుంది. అలాంటిది ప్రస్తుతం 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరగనున్నాయి. పోలింగ్కు ఇంకా మూడు వారాలకు పైగా సమయం ఉండడంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం వీరికి ఓ సాహసమే అవుతుంది. -
వైఎస్సార్ సీపీలో భారీగా చేరికలు
పెదగంట్యాడ: జీవీఎంసీ 75వ వార్డుకు చెందిన జనసేన నాయకుడు ధర్మాల రాజారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఆ పార్టీ కార్యకర్తలు, మహిళలు గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎమ్మె ల్యే తిప్పల నాగిరెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజారెడ్డిలాంటి సీనియర్ జనసేన నాయకుడు వైఎస్సార్ సీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాజారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు మెచ్చి పార్టీలో చేరామన్నారు. అమర్నాథ్ విజయం కోసం కష్టపడి పని చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక వైఎస్సార్ సీపీ అదనపు పరిశీలకుడు తిప్పల దేవన్రెడ్డి, గొందేశి సత్యారావు, మద్ది శంకర్రెడ్డి పాల్గొన్నారు. తాటిచెట్లపాలెం: జీవీఎంసీ 55వ వార్డు నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. తాటిచెట్లపాలెం 80 ఫీట్ రోడ్డులోని ఎన్నికల ప్రచార కార్యాలయంలో గురువారం వైఎస్సార్ సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా బీసీ సెల్ చైర్మన్ నూనెల పోలారావు, బోరా నర్సింగరెడ్డి, బోర వెంకటరమణారెడ్డి, బోర వరశంకరరెడ్డి, జీరు శ్రీనివాసరెడ్డి, తీరపు అచ్చియ్యమ్మ, ఏలూరు సత్యవతి, బోరా రమ్య, నంబారు మహేష్, బోట్టా శంకర్, బొట్ట గిరీష్, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఆంటోని, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శశికళ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
నేరుగా ఎదుర్కోలేక టీడీపీ తప్పుడు ప్రచారం
మధురవాడ: భీమిలిలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని తట్టులేక, తనను నేరుగా ఎదుర్కోలేక గంటా శ్రీనివాసరావు, అతని అనుచరులు తాను నియోజకవర్గం మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ 5వ వార్డు సాయిరాం కాలనీలో గురువారం ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ రోజుకో కుట్రలు పన్ని తానపై దుష్ప్రచారం చేస్తోందని, తాజాగా అనకాపల్లి ఎంపీగా వెళ్తున్నట్లు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ప్రజలు నమ్మవద్దని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో భీమిలి నుంచే పోటీ చేస్తానన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిచి సీఎం జగన్కు ఈ సీటును బహుమతిగా ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధిస్తా.. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి -
బొగ్గు సంక్షోభం నివారణకు వేగంగా చర్యలు
ఉక్కునగరం: బొగ్గు సంక్షోభం నివారణకు వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు స్టీల్ప్లాంట్ యాజమాన్యం గురువారం ప్రకటించింది. అదానీ గంగవరం పోర్ట్ కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఏర్పడిన బొగ్గు కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలను స్టీల్ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వివరించారు. పోర్టులో కొంత బొగ్గుతో పాటు అదానీ పోర్టు వద్దకు చేరిన లక్షన్నర టన్నుల కోకింగ్ కోల్ ఉన్న నౌకలు బెర్తింగ్ కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. పోర్టులో ఉన్న దాదాపు 2.2 లక్షల టన్నుల బొగ్గును తీసుకురావడం కోసం జిల్లా పరిపాలన వ్యవస్థ సహాయాన్ని కోరామన్నారు. అదానీ పోర్టు బయట ఉన్న రెండు నౌకలను వైజాగ్ పోర్టుకు మళ్లించడం, ప్రత్యామ్నాయ ఓడరేవుల నుంచి 50 వేల టన్నుల బొగ్గును రుణం తీసుకోవడం, లక్షన్నర టన్నుల బొగ్గు అత్యవసర సేకరణ కోసం గ్లోబల్ టెండర్కు వెళ్లడం వంటి చర్యలను తీసుకుంటున్నట్లు వివరించారు. తాజా పరిస్థితిని అధిగమించడానికి, పరిష్కారాల కోసం స్టీల్ప్లాంట్ దృఢసంకల్పంతో కృషి చేస్తోందన్నారు. -
ప్చ్.. ముంచేసినట్టున్నారు
● ఎక్కడో తేడా కొట్టిందే..! ● భీమిలి టీడీపీ శ్రేణుల నిట్టూర్పు ● గంటా నామినేషన్కు తరలిరాని క్యాడర్ ● డబ్బులిచ్చినా జాడలేని జనాలు తగరపువలస: ప్చ్.. డబ్బులు పోయాయి... పరువూ పోయింది. మొత్తానికి భీమిలి ప్రజలు టీడీపీని ముంచేసినట్టున్నారు... ఇదీ.. భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బుధవారం నామినేషన్ వేసిన సందర్భంగా సగటు టీడీపీ గ్రామీణ ఓటర్ మనోగతం. లచ్చల్లో కాకపోయినా వార్డుకు 2 వేల మంది, మండలానికి మరో 2 వేల మంది చొప్పున 24 వేల మందిని నామినేషన్కు తరలించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కొక్కరికి దారి ఖర్చులు, భోజనం, మందుకు రూ. 400 వంతున నాయకులు లెక్కలేసి పట్టుకుపోయారు. దీనికే రూ.కోటి వదిలింది. ఇవి కాక ఎలా లేదన్నా ఇతర ఖర్చులు అన్నీ కలిపి పాతిక లచ్చలు అయి ఉంటాయి. కానీ భీమిలిలో ఏ మూల చూసినా అంతమంది కనిపించలేదు. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకోవడం విశేషం. వేలాది మంది అనుకుంటే వందలాది మించలేదేనే నిట్టూర్పు కనిపించింది. జనసేన, బీజేపీ కలిసొచ్చినా టీడీపీని నమ్మలేదా? పోనీ వచ్చినోళ్లంతా టీడీపీకే ఓటేస్తారంటే ఆ నమ్మకమూ లేదు... రేపు మరోపార్టీ అభ్యర్థి నామినేషన్ వేసినా ఇందులోని సగం మంది వస్తారు.. ఎందుకు ఇంతటి అవమానం జరిగిందని ద్వితీ య శ్రేణి నాయకులు లెక్కలేసుకుంటున్నారు. ఎలక్షన్కో నియోజకవర్గం మార్చే గంటా అందుబాటులో ఉంటాడన్న నమ్మకం లేదు. గీతం భరత్ను కలవాలంటే నాయకులకే దిక్కు ఉండదు. అందుకేనా కూటమి అభ్యర్థులను జనం నమ్మడం లేదనే చర్చ మొదలైంది. మనోభావాలు ఉండవా.. సొంత ప్రయోజనాల కోసం కొంతమంది మళ్లీ మళ్లీ పార్టీలు మారితే తామెందుకు మారాలి. తమకు మాత్రం ఆత్మసాక్షి, మనోభావాలు ఉండవా? ఇప్పుడు పార్టీ మారినోళ్లకు జగన్ పార్టీలో ఏవైనా తక్కువ జరిగిందా? నాయకుడు మారిపోయినంత మాత్రాన ఓటర్లు మారిపోతారనుకుంటే అది వారి పిచ్చే. ఈ రోజు నామినేషన్ సమయంలో అది స్పష్టమైందని అసలు టీడీపీ నాయకులు ఆలోచనలో పడ్డారు. ఉసూరు పెట్టిన కూటమి నాయకులు గంటా నామినేషన్ పర్వం ద్వితీయ, తృతీయ శ్రేణి కూటమి నాయకులకు కాసులు కురిపించింది. గంటా అనుచరులు ఒక్కొక్కరికి రవాణా, భోజనం, మద్యానికి కలిపి రూ.400 వంతున లెక్కించి ఇచ్చారు. ముందుగానే డబ్బులు అందుకున్న కొందరు నాయకులు సొంతానికి వాడేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని మద్యం దుకాణాల వద్ద ఖుషీ ఖుషీగా గడిపారు. నామినేషన్కు ముగిసిన తరువాత మహిళలు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి మధ్యాహ్నం 3 గంటల వరకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఉసూరుమన్నారు. భోజనాలు కూడా పెట్టకుండా ఇబ్బందులకు గురిచేశారు. -
ఆప్యాయంగా పలకరిస్తూ..
● ఆర్కే బీచ్లో వాకర్స్తో మమేకమైన బొత్స ఝాన్సీలక్ష్మి ● విశాఖ సమగ్ర అభివృద్ధిలో భాగమవుతానని వెల్లడి ● చిరువ్యాపారులతో మాటామంతీ ● వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి బీచ్రోడ్డు: ఆర్కే బీచ్.. గురువారం ఉదయం 6 గంటలు.. కోటేశ్వరరావు అనే వ్యక్తి టీ షాపు నిర్వహణలో బిజీగా ఉన్నారు. వైఎస్సార్ సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి అక్కడకు వచ్చి అన్నా ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా పలకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం వస్తోందా అని అడగ్గా.. గౌరవప్రదంగా కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో వస్తోందని ఆయన జవాబిచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మీకు ఏమైనా లబ్ధి జరిగిందా? అని ఆమె ప్రశ్నించగా... ఇల్లు మంజూరు చేశారని, సొంతంగా ఇల్లు కట్టుకోలేమని చెబితే ప్రభుత్వమే కట్టిస్తోందని, ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని కోటేశ్వరరావు వివరించారు. మంచి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆమె అభ్యర్థించారు ● మిల్లెట్స్, రాగిమాల్ట్ వంటి ఆహార పదార్థాలను విక్రయిస్తున్న బంగార్రాజు అనే చిరువ్యాపారితో మాటామంతీ కలిపారు. రాగిమాల్ట్ను రుచి చూసి.. మిల్లెట్స్, తులసి టీ తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. బంగార్రాజు తనకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సీఎం జగన్కు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ● వాకింగ్ చేసి కాసేపు సేద తీరుతున్న వృద్ధులకు బొత్స ఝాన్సీ తనను తానుగా పరిచయం చేసుకున్నారు. ‘నేను విశాఖ ఆడబిడ్డను. ఎంపీగా రెండుసార్లు పనిచేశాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సారి విశాఖకు సేవ చేసే అవకాశం కల్పించారు. ఎంపీగా నన్ను గెలిపిస్తే.. విశాఖ సమగ్ర అభివృద్ధిలో భాగమవుతా.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వండి.’అంటూ వారికి విజ్ఞప్తి చేశారు. ● విశాఖలో స్థిరపడ్డ ఉత్తర భారతదేశ ప్రజలతో కాసేపు కలిసి నడిచారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విశాఖ అభివృద్ధి చెందిన తీరును వివరించారు. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. దేశంలో విశాఖ ప్రముఖ నగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాలని కోరారు. ఇలా గురువారం ఉదయం ఆర్కే బీచ్లో వైఎస్సార్ సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మి ఎన్నికల ప్రచారం సాగింది. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిని కలిసి వారితో మమేకమయ్యారు. చిరు వ్యాపారులతోనూ ముచ్చటిస్తూ.. ప్రభుత్వ పథకాలు అందాయా? లేదా? అనే విషయాన్ని వాకబు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే విశాఖ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని వివరించారు. ఉత్తరాంధ్ర పురోభివృద్ధికి, యువతకు మరిన్ని అవకాశాలు రావాలంటే వైఎస్సార్ సీపీని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని ఆమె వాకర్స్కు వివరించారు. బీచ్లో భారీ జాతీయ పతాకం ఏర్పాటు చేయాలి బీచ్లో మార్నింగ్ వాకర్స్ కోసం అవసరమైన సదుపాయాలు కల్పించడానికి.. విశాఖపట్నం సమగ్ర – మిగతా 8లో -
తొలి రోజు పార్లమెంట్కు 3, అసెంబ్లీకి 7
మహారాణిపేట: నామినేషన్లు ఘట్టం గురువారం ప్రారంభమైంది. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి రోజు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం తన చాంబర్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. స్వతంత్ర అభ్యర్థిగా వడ్డీ హరి గణేష్ తొలి నామినేషన్ చేయగా.. తరువాత ప్రజాశాంతి పార్టీ నుంచి కె.ఎ.పాల్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పొలమరశెట్టి సత్యవతి నామినేషన్లు దాఖలు చేశారు. వీరు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. 4 శాసనసభ నియోజకవర్గాల్లో.. జిల్లాలోని 4 శాసనసభ నియోజక వర్గాల్లో ఏడు నామి నేషన్లు దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు, గంటా రవితేజ తెలుగుదేశం పార్టీ తరపున రెండేసి సెట్లను భీమిలి రిటర్నింగ్ అధికారి యస్.భాస్కర్ రెడ్డికి అందజేశారు. విశాఖ ఉత్తర నుంచి నవభారత్ నిర్మాణ సేవా పార్టీ తరఫున చింతాడ సూర్యం, జాతీయ జనసేన పార్టీ తరపున పి.జగదీష్ ఒక్కో నామినేషన్ను రిటర్నింగ్ అధికారి డి.అఖిలకు అందజేశారు. గాజువాక నుంచి జాతీయ జనసేన పార్టీ తరపున పల్లి శ్రీనివాసరావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున పెబ్బిలి సత్యనారాయణమూర్తి, పెందుర్తి నియోజక వర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ తరపున బంగారి రమణ ఒక్కో నామినేషన్ను దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. -
వాహనాలు, ప్రచార రథాలు సిద్ధం
మే 13వ తేదీన రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అంటే పోలింగ్కు ఇంకా 24 రోజుల మాత్రమే సమయం ఉంది. అందువల్ల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి పదుల సంఖ్యలో ప్రచార రథాలు, వాహనాలను సమకూర్చుకున్నారు. ప్రచారానికి అవసరమైన మైకులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అభ్యర్థుల కటౌట్లతో పాటు తమ అధినేతల ఫొటోలు వంటివన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనాలకు ఎన్నికల ప్రచార అనుమతులు కూడా తీసుకున్నారు. గురువారం నుంచి వీటిని రోడ్డెక్కించి ఊరూ వాడా తిప్పుతూ హోరెత్తించనున్నారు. ఆ నియోజకవర్గానికి పాత అభ్యర్థి అయితే గతంలో తాను చేసిన అభివృద్ధితో పాటు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రత్యర్థుల బలహీనతలు, అవినీతి అరోపణలను ఏకరువు పెట్టనున్నారు. తొలిసారి బరిలో దిగుతున్న వారైతే తమను గెలిపిస్తే చేయబోయే అభివృద్ధిని, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను వివరించనున్నారు. ఒక్కసారి తనను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించనున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
చీరలో ప్రేమలు బ్యూటీ హుయలు
వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
జగన్ కి ఓటు వేస్తే ఇంటింటి అభివృద్ధి, కూటమికి ఓటు వేస్తే పథకాలు ముగింపు
గ్లామర్తోనే 'హార్ట్ ఎటాక్' ! అదా శర్మ' అరుదైన ఫోటోలు
మదర్స్ డే స్పెషల్: మీ అమ్మని ఇలా సర్ ప్రైజ్ చేయండి..!
దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉండడు: సీఎం జగన్
ప్రధాని మోదీ వయస్సుపై.. అమిత్ షా క్లారిటీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement