-
IPL 2024: గంభీర్ గుడ్బై.. లక్నో మెంటార్గా రాహుల్ ద్రవిడ్?
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా టీ20 వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్ను తమ మెంటార్గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్ఎస్జీ యాజమాన్యం ఆలోచిస్తోందట. కాగా లక్నో మెంటార్గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్కతా నైట్రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్దత్ పడిక్కల్ను దక్కించుకుంది. కోచ్గా ఆస్ట్రేలియా మాజీ హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ను నియమించుకుంది. -
కాంట్రాక్ట్ పొడిగింపునకు నో చెప్పిన ద్రవిడ్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ అతడే..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. 2021 నవంబర్లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాడు. వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ భారత జట్టు కోచింగ్ పదవికి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ద్రవిడ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సన్నిహితులతో స్పష్టం చేశాడని సమాచారం. వరల్డ్కప్ ఫైనల్ ముగిసిన అనంతరం కోచ్గా కొనసాగడంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ద్రవిడ్ తాజాగా బీసీసీఐ పెద్దల వద్ద నో చెప్పాడని తెలుస్తుంది. ద్రవిడ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ప్రస్తుత ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తారని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు పూర్తి క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. లక్ష్మణ్కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం లక్ష్మణ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ తాత్కాలిక హెడ్ కోచ్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ పలు సిరీస్ల్లో టీమిండియా కోచ్గా వ్యవహరించాడు. లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్రవిడ్ ఎన్సీఏ చీఫ్గా ట్రాన్స్ఫర్ అవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ ఓ ఐపీఎల్ జట్టుతో జత కట్టనున్నాడని టాక్ కూడా నడుస్తుంది. మొత్తానికి ద్రవిడ్ దిగిపోతే టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు పట్టం కట్టేందుకు సర్వం సిద్దమైందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా వైజాగ్లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
లక్ష్మణ్ హెడ్కోచ్గా సూర్య కెప్టెన్సీలో! షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమి బాధను మర్చిపోకముందే.. భారత జట్టు తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమైంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను మొదలుపెట్టనుంది. వైజాగ్ వేదికగా గురువారం ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు అక్కడి చేరుకుని ప్రాక్టీస్లో తలమునకలయ్యాయి. కాగా ఆసీస్తో టీ20 సిరీస్కు ఎప్పటిమాదిరే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నారు. ఇక వీరితో పాటు వన్డే వరల్డ్కప్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా, షమీ తదితరులు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరంగా.. సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టీమిండియా సారథిగా ఈ సిరీస్తో పగ్గాలు చేపట్టనున్నాడు. ఇక హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు మార్గదర్శనం చేయనున్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్ నేతృత్వంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి టీ20- నవంబరు 23- గురువారం- వైజాగ్ ►రెండో టీ20- నవంబరు 26- ఆదివారం- తిరువనంతపురం ►మూడో టీ20- నవంబరు 28- మంగళవారం- గువాహటి ►నాలుగో టీ20- డిసెంబరు 1- శుక్రవారం- రాయ్పూర్ ►ఐదో టీ20- డిసెంబరు 3- ఆదివారం- బెంగళూరు ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఆరంభం కానున్నాయి. టీవీలో.. స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా డిజిటల్ మీడియాలో జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఆసీస్తో టీ20 సిరీస్కు టీమిండియా సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా. చదవండి: అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన -
విశాఖలో భారత్ VS ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement