-
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు. -
ఇజ్రాయెల్ ప్రతీకార దాడి లక్ష్యాలపై ఐరాస ఆందోళన!
ఇజ్రాయెల్పై ఇరాన్ 300లకు పైగా డ్రోన్లు, మిసైల్స్లతో శనివారం దాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. అయితే ఈ దాడులను ఇజ్రాయెల్ 99 శాతం మిత్ర దేశాల సహకారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్న ఇజ్రాయెల్.. ప్రాంతీయ సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఉండేందుకు సంయమనం పాటించాలని మిత్రదేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్లోని అణ కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవటం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి నిఘా విభాగం చీఫ్ రాఫెల్ గ్రాస్సీ పేర్కొన్నారు. గత రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వార్ కేబినెట్లో ప్రతీకార దాడులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రతీకాక దాడి చేయడికి సిద్ధంగా ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్పై ప్రతీకార దాడులతో పరిస్థితులను తీవ్రతరం చేయవద్దని ఇజ్రాయెల్ను కోరుతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి స్పందిస్తూ.. ఇరాన్పై ప్రతీకార దాడి చేయడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే దాడికి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నుంచి ఆమోదం ఇంకా లభించలేదని అన్నారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తాము సెకండ్లలోనే శనివారం కంటే అతిభీకరమైన దాడులు చేయడానికి కూడా వెనకాడబోమని ఇరాన్ హెచ్చరిస్తోంది. -
ఇరాన్ మిసైల్ దాడులు: తొలిసారి స్పందించిన నెతన్యాహు
జెరూసలెం: తమ దేశం మీద డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం(ఏప్రిల్14) స్పందించారు. ఇరాన్ దాడులకు ఎలా స్పందించాలనేదానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు.‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’అని ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను అమెరికా,బ్రిటన్ సహకారంతో కూల్చివేయడంపై స్పందించారు. కాగా శనివారం(ఏప్రిల్13)అర్ధరాత్రి ఇరాన్,ఇజ్రాయెల్పై వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ‘ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ ఇంకా ముగియలేదు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం’అని ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి యోవ్ గల్లాంట్ అన్నారు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్కు పోప్ కీలక సూచన -
ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్కు పోప్ కీలక సూచన
వాటికన్సిటీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ స్పందించారు. ఇరాన్ డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ స్పందించవద్దని లేదంటే హింస పెరుగుతుందని పోప్ అన్నారు. ‘యుద్ధం చాలు, దాడులు చాలు, హింస చాలు. శాంతి కావాలి. చర్చలు కావాలి’అని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద సందర్శకులను ఉద్దేశించి పోప్ ప్రసంగించారు. కాగా, ఇజ్రాయెల్పై శనివారం(ఏప్రిల్ 13) రాత్రి వందల కొద్దీ డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. ఈ డ్రోన్లు, మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ కూల్చి వేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు పోప్ సూచన కీలకంగా మారింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఆ దేశ ఆర్మీ ఉన్నతాధికారులను ఇజ్రాయెల్ చంపినందుకే ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు అమెరికా వ్యూహం ఫలించిందా -
ఇజ్రాయెల్ వణుకుతోంది: మళ్లీ హెచ్చరించిన ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్- ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ‘ఇరాన్ ఏం చేయబోతోందో ఇజ్రాయెల్కు తెలియదు. తమ దేశంపై ఎక్కడ దాడి జరుగుతుందోనని వణుకుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్లో చాలామంది షెల్టర్లలోకి పారిపోయారు. అసలైన యుద్ధం కంటే ఈ మానసిక, మీడియా, రాజకీయ యుద్ధమే వారిని మరింత భయపెడుతోంది’అని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సలహాదారుడు యాహ్యా రహీం సఫావీ పేర్కొన్నారు. మరోవైపు.. హార్ముజ్ జలసంధి సమీపంలో ఓ వాణిజ్య నౌకపై దాడికి దిగిన ఇరాన్ కమాండోలు దాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. నౌకలో 17 మంది భారతీయులు ఉండడంతో వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి బదులు తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించినప్పటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి..ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు -
ఇజ్రాయెల్ నౌకపై ఇరాన్ దాడి.. నౌకలో 17 మంది భారతీయులు
దుబాయ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ బిలియనీర్కు చెందిన ఎమ్ఎస్సి ఎరిస్ కంటెయినర్ షిప్ను గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఇరాన్ నేవీ ఆధీనంలోకి తీసుకుంది. పోర్చుగల్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 17 మంది భారతీయులుండటం కలవర పరుస్తోంది. వీరి విడుదల కోసం భారత ప్రభుత్వం ఇరాన్తో ఇప్పటికే సందప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. నౌకను ఇరాన్ తీసుకెళుతున్నట్లు ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌక డెక్పై ఇరాన్ కమాండోలు కూర్చున్న వీడియో బయటికి వచ్చింది. ఇజ్రాయెల్ బిలియనీర్ వ్యాపారవేత్తకు చెందిన జోడియాక్ మారిటైమ్ గ్రూపు ఈ నౌకను నిర్వహిస్తోంది. హెలికాప్టర్ ద్వారా ఇరాన్నేవీ సిబ్బంది నౌకపై దాడి చేసి లోపలికి ప్రవేశించారు. హర్మూజ్ జలసంధివైపు వెళుతుండగా చివరిసారిగా ఎంఎస్సి ఎయిరిస్ను గుర్తించారు. ఘటన తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇరాన్ గార్డ్స్ను ఉగ్రవాదులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలను కోరారు. ఇరాన్లో ప్రస్తుతం క్రిమినల్స్ పాలన కొనసాగుతోందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి పైరేట్ ఆపరేషన్లను ఆ దేశం నిర్వహిస్తోందని ఫైర్ అయ్యారు. హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కూడా ఇరాన్ మద్దతిస్తోందని మండిపడ్డారు. కాగా, ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఏడుగురు ఇరాన్ ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారు. ఘటనతో ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి.. అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం -
యుద్ధరంగంలో సాంకేతికత – కొన్ని ప్రశ్నలు
యుద్ధం వల్ల సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుందా? ఆ యా దేశాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్క రణలకు సిద్ధం కావటం అనేది ప్రయోజనకరమైనఅంశమా? లేదా అది యుద్ధనీతిని తప్పటం, అనైతి కతను ప్రోత్సహించటం అవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పడు తలెత్తుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశించని రంగం అంటూ లేదు. యుద్ధరంగంలోకి అది తన బాహువులను చాస్తోంది. ఇజ్రాయెల్ రణ క్షేత్రంలోకి ఏఐ ప్రవేశించటం తాజాగా చర్చనీ యాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేపట్టటానికి ఇంతవరకూ పరిచయం లేని కృత్రిమమేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించింది. హమాస్కు సంబంధించి దాదాపు 37 వేలకు పైగా లక్ష్యాలను గుర్తించటానికి దీనిని ఉపయోగించారు. అలాగే దీని ఆధారంగానే పాలస్తీనియన్ పౌరులను కొందరిని గుర్తించి హతమార్చారు. ‘మిషన్ లెర్నింగ్ విధానాల ద్వారా యుద్ధ వ్యూహాలను అమలు చేశారు. ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమమేధ వ్యవస్థకు ‘లావెండర్’ అని పేరు పెట్టారు. ఇక్కడ మనిషి పాత్ర పరిమితం. దానిని అమలు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవటమే. ‘ఊ’ అనుకున్న తర్వాత కొన్ని సెకండ్లలో పని పూర్తయిపోతుంది. ఇజ్రాయెల్ జర్నలిస్టు ఒకరు బాహ్య ప్రపంచానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్లో ఆరుగురు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారని ప్రకటించారు.అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ దాడులకు నిరసనగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేష న్లో ఇంత వరకు 33 వేలమందికి పైగా పాలస్తీని యన్లు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రా యెల్కి యుద్ధ సహాయాన్ని నిలిపివేయాలన్నడిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్కు సహకారం అందిస్తున్న యూఎస్, బ్రిటన్లపై ఒత్తిడి పెరుగుతోంది. పాలస్తీనా పౌరుల మరణాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూనే, బిలియన్ డాలర్ల విలు వైన బాంబులు, ఫైటర్ జెట్ల అందచేతను యూఎస్ సమర్థించుకుంటోంది. మరో వైపు బ్రిటిష్ ప్రధాని రుషి సునాక్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో ఛారిటీ వరల్డ్ కిచెన్సెంటర్లో ఏడుగురు బ్రిటిష్ పనివాళ్లు చనిపోవటంతో ఈఅంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రష్యా – ఉక్రెయిన్ల యుద్ధంలో ఉక్రె యిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి మానవ ప్రమేయం లేకుండా వాటంతటికవే లక్ష్యాలను గుర్తించటం, దాడులు చేయటం వంటివి చేస్తాయి. కృత్రిమ మేధ ద్వారా శాటిలైట్ చిత్రాలను, డ్రోన్ వీడియో ఫీడ్లను పొందటం వల్ల యుద్ధ భూమిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసు కోవచ్చు. చకచకా నిర్ణయాలు తీసుకోవటానికి వీల వుతుంది. శత్రువును వేగంగా, కచ్చితంగా ఎదుర్కోవ టానికి వీలవుతుంది. పూర్తిగా స్వయంచాలిత ఆయుధాలను విని యోగించటం అనే అంశంపైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒకరు ఒకరకమైన సాంకేతికత ఉపయో గిస్తే, దానిని ఎదుర్కోవటానికి మరో సాంకేతికత ముందుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ‘ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్’ వస్తున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటర్ పైన దాడులకు ఉపయోగపడతాయి. ఇది మరీ కొత్తది అని కూడా చెప్పలేం. ఐసిస్ కొన్నేళ్ల క్రితం అధునాతమైన డ్రోన్ సైన్యాన్ని వినియోగించేది. ఇరాకీ బృందాలపై దాడులు నిర్వహించింది. ఒక ఎయిర్క్రాఫ్ట్ను కొన్నట్టు ఏఐని కొనటం సాధ్యం కాదు. స్వయం చాలిత ఆయుధాలతో యుద్ధనియమాలు అంటి పెట్టుకుని యుద్ధాలు చేయాలి. అమెరికా, రష్యాతో పాటు దాదాపు 30 దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. యుద్ధాల విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధం (1914–1918)లో మెషిన్ గన్లు, గ్రెనేడ్లు ఇతర ఆయుధాలు... సబ్ మెరైన్లు, పాయిజనస్ గ్యాస్, వార్ ప్లేన్లు, ట్యాంకులు ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం (1939–1945) వచ్చేనాటికి రాడార్ టెక్నాలజీ ప్రవేశించింది. కొంత మంది చరిత్రకారులు ఈ సాంకేతికతే అణుబాంబు కంటే విజయానికి కీలకపాత్ర పోషించేదని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధానికి తెరవేయటానికి తొలి అణుబాంబును అభివృద్ధి చేశారు. రెండు దశాబ్దాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయటానికి అవసర మైనన్ని బాంబులు సిద్ధమైపోయాయి. యుద్ధంలో అణుబాంబును ఉపయోగిస్తే వచ్చే నష్టాన్నిఅంచనా వేసుకుని ఏ దేశానికి ఆ దేశం దానిని ఉపయోగించటానికి వెనకడుగు వేసేలా తయా రయ్యింది పరిస్థితి. మీరు శత్రు దేశం పైన అణుబాంబు వేసి సర్వనాశనం చేస్తే, మరో నిమిషం అవతల దేశం కూడా అదే పని చేస్తుంది. అందుకే తర్వాత రోజుల్లో చిన్నవి, తక్కువ శక్తిమంతమైన బాంబులను తయారుచేయటం మొదలు పెట్టారు. అణుబాంబు రూపొందించటంలో కీలక భూమిక షోషించిన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హైమర్ తర్వాత రోజుల్లో తాను చేసిన పనికి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా, ముందుగా మిలిటరీలోనే దానికి బీజాలు పడ్డాయనేది చారిత్రక సత్యం. – డాక్టర్ పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065' -
ఉత్తర కొరియా కిమ్ సంచలన వ్యాఖ్యలు
నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో నెలకొన్న అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం తప్పదని అన్నారు. యుద్ధాన్నికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దేశంలోనే కీలకమైన కిమ్ జోంగ్-ఇల్ మిలిటరీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ యూనివర్సిటీ కిమ్ తండ్రి పేరు మీద 2011లో స్థాపించారు. దేశంలో మిలిటరీ విద్యలో అత్యధికంగా సీట్లు ఉన్న యూనివర్సిటీ ఇది. యూనివర్సిటీ సందర్శన సమయంలో విద్యార్థులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడారు. ‘ఉత్తర కొరియా చుట్టూ.. అంతర్జాతీయంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో దేశంలో నెలకొన్న అస్థిరమైన పరిస్థితుల నడుమ యుద్ధం తప్పదు. శత్రు దేశాలు యుద్ధ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. ఎలాంటి సంకోచం లేకుండా యుద్ధం చేయడానికి నార్త్ కొరియా సిద్ధంగా ఉంది’ అని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇప్పటికే నార్త్ కొరియా రాజకీయంగా, ఆయుధ తయారీలో రష్యాతో సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యూహాత్మక మిలిటరీ ప్రాజెక్టుల్లో నార్త్ కొరియా సాయం అందిస్తోంది. ఇటీవల కొరియా ఘన ఇందనంతో మధ్యశ్రేణి సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఇది ద్రవ ఇందనంతో పోల్చితే చాలా శక్తివంతమైందని నిపుణులు పేర్కొన్నారు. తరచూ అమెరికా, దక్షిణ కొరియా తమ సైనిక విన్యాసాలతో ఉత్తర కొరియాను కవ్విస్త్ను విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. -
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు -
యుద్ధం నీడలో ‘వైద్యం’ పూర్తి!
దేశంకాని దేశంలో ఎంబీబీఎస్ కోర్సు చదివేందుకు రెక్కలు కట్టుకొని వెళ్లారు.. ఓ కాలేజీలో తొలి సెమిస్టర్ పూర్తి చేసి రెండో సెమిస్టర్లోకి అడుగుపెట్టారు. అంతలోనే ఒక్కసారిగా దేశమంతా బాంబుల మోత, కాల్పుల శబ్దాలతో విలవిల్లాడారు.. కేంద్రం చొరవతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశం చేరుకున్నా ఆగిన చదువును కొనసాగించాలన్న పట్టుదలతో తొలుత 2–3 నెలలు ఆన్లైన్ చదువులు చదివి.. ఆ తర్వాత కన్నవారిని, కేంద్రాన్ని ఒప్పించి మరో దేశంలోని కాలేజీలో కోర్సును పూర్తిచేసి స్వదేశానికి తిరిగొచ్చారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం తాలూకు మనోవేదనను అధిగమించి.. అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించిన 210 మంది వైద్య విద్యార్థుల విజయగాథ ఇది. లక్డీకాపూల్: ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేపట్టిన ఎంబీబీఎస్ కోర్సును.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉజ్బెకిస్తాన్లోని బుఖారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పూర్తిచేసిన 10 రాష్ట్రాలకు చెందిన 210 మంది విద్యార్థులకు మంగళవారం హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా పట్టాల పంపిణీ జరిగింది. 86 మంది విద్యార్థినులు సహా మొత్తం 210 మంది ఉజ్బెకిస్తాన్ వెళ్లి కోర్సు పూర్తిచేశారు. అయితే జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) సూచనల మేరకు మొత్తం 210 మంది విద్యార్థులకు.. వారు ఎంబీబీఎస్ కోర్సు మొదలుపెట్టిన ఉక్రెయిన్లోని జపోరిఝియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచే పట్టాలు రావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్ పాసైన విద్యార్థుల్లో 110 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) రాయగా 81 మంది తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యారు. వారిలోనూ 34 మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ విద్యార్థులది అపార కృషి: ఉజ్బెకిస్తాన్ రాయబారి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత్లో ఉజ్బెకిస్తాన్ రాయబారి సర్దోర్ రుస్తంబేవ్ మాట్లాడుతూ విద్యార్థులంతా అపార కృషితోపాటు అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని మరీ విజయం సాధించారన్నారు. వాళ్ల విజయంలో తమ దేశం పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పారు. యుద్ధ కాలంలో విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేలా చొరవ చూపడంతోపాటు తిరిగి వారిని ఉబ్జెకిస్తాన్ పంపడంలో కీలకపాత్ర పోషించిన నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖలో భారతీయ ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్రెడ్డిని అభినందించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తగిన అనుమతులు ఇచ్చిన కేంద్రానికి, జాతీయ మెడికల్ కౌన్సిల్కు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా సంఘం చైర్మన్ పి. విజయబాబు, డాక్టర్ దివ్యారాజ్రెడ్డి, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీ ఎస్. సుయరొవ్, ఉజ్బెకిస్తాన్ ఎంబసీ కౌన్సిలర్ ఐ. సొలియెవ్, నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్, ఏఐజీ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ సందీప్ సాహూ తదితరులు పాల్గొన్నారు. -
భయపెడుతున్న వలస కథలు
దుర్భర కష్టాల నుంచి విముక్తి పొందాలన్న ఆకాంక్షతో అవకాశాలను అన్వేషిస్తూ ఎంత దూరమైనా పోవటానికి సిద్ధపడటం మనిషి నైజం. దీన్ని ఆసరాచేసుకుని మానవ వ్యాపారం చేస్తున్న మాయగాళ్ల ఆటకట్టించటం ప్రభుత్వాలకు అసాధ్యమా? గత కొన్ని నెలలుగా మీడియాలో వస్తున్న కథనాలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎక్కడో ఉద్యోగమని, ఏదో చదువని నమ్మి అప్పులు చేసి, ఏజెంట్లకు లక్షలకు లక్షలు పోసి విమానాలు ఎక్కుతున్న యువకులు చివరకు అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాల్లో తేలుతున్నారు. ఏ క్షిపణి దాడులకో, బాంబు పేలుళ్లకో బలవుతున్నారు. లేదా దుర్భ రమైన చాకిరీలో ఇరుక్కుని బయటపడే మార్గం దొరక్క అల్లాడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీనుంచి రష్యా వెళ్లిన యువకుడు కిరాయి సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటూ కన్ను మూశాడు. కేరళకు చెందిన మరో వ్యక్తి ఇజ్రాయెల్లో పనిచేస్తూ హమాస్ రాకెట్ దాడిలో చని పోయాడు. మరో ఏడెనిమిదిమంది యువకులు తమను కాపాడాలంటూ రష్యానుంచి వీడియో కాల్లో ప్రాధేయపడ్డారు. కిరాయి సైన్యాల్లో పనిచేసినవారు తిరిగొచ్చాక తగిన ఉపాధి చూపకపోతే సమస్యాత్మకంగా మారే ప్రమాదం కూడా వుంటుంది. నిరుడు డిసెంబర్లో ఫ్రాన్స్లో మన దేశంనుంచి నికరాగువా, సోమాలియా వంటి దేశాలకు వెళ్లే 300 మందిని అనుమానం వచ్చి నిలువరిస్తే ఏజెంట్ల మాయ బయటపడింది. వీరిలో చిన్న పిల్లలు సైతం వున్నారు. చట్టవిరుద్ధ మార్గాల్లోనైనా అమెరికా పోయి డాలర్ల పంట పండించుకోవాలని ప్రయత్నించేవారూ పెరిగారు. 2022 అక్టోబర్– 2023 సెప్టెంబర్ మధ్య 96,917 మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించటానికి విఫలయత్నం చేసి పట్టుబడ్డారు. ఇది అంతకుముందు సంవత్సరంకన్నా అయిదు రెట్లు అధికం. అమెరికా పోవా లంటే వీసా రావటం అంత తేలిక కాదు గనుక ఇతరేతర మార్గాలు వెదుక్కుంటున్నారు. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు టూరిస్టు వీసాలు లభించటం పెద్ద కష్టం కాదు. అక్కణ్ణించి వేర్వేరు చోట్లకు వెళ్తున్నారు. ఇలాంటివారు వెనకబడిన రాష్ట్రాలనుంచి కాదు, సంపన్న రాష్ట్రాలనుంచే అధికంగా వుండటం ఆందోళన కలిగించే అంశం. ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారు. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సీబీఐ సాగిస్తున్న దాడుల్లో ఢిల్లీ చుట్టుపక్కలా, దేశంలోని వివిధ నగరాల్లో దర్జాగాబ్రాంచీలు పెట్టుకుని మనుషుల్ని రవాణా చేస్తున్న ముఠాల ఆచూకీ బట్టబయలైంది. సామాజిక మాధ్యమాల ద్వారా, స్థానిక ఏజెంట్ల ద్వారా యువకులకు వలవేసి ఈ ముఠాలు తీసుకు పోతున్నాయి. రష్యా వెళ్లేవారికి మంచి ఉద్యోగాలంటూ నమ్మించి తీరా ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రానికి బలవంతంగా తరలిస్తూ వారి ప్రాణాలను పణం పెడుతున్నారు. అనేకులు యుద్ధంలో తీవ్రంగా గాయపడి సాయం చేసే దిక్కులేక ఆసుపత్రుల్లో విలవిల్లాడుతున్నారు. ఇలా యువకులను తీసుకెళ్లిన ఉదంతాలు 35 వరకూ బయటపడ్డాయని సీబీఐ అంటున్నది. మరెందరు వీరివల్ల మోసపోయారో తేలాలి. హమాస్ నుంచి, హిజ్బుల్లా నుంచి నిరంతరం రాకెట్ దాడులు సాగుతున్న ఇజ్రాయెల్లో నిర్మాణరంగంలో తాత్కాలిక అవకాశాలున్నాయంటూ రిక్రూట్మెంట్ మొదలెడితే హిందీ భాషా రాష్ట్రాలనుంచి అత్యధికులు క్యూ కట్టారు. ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన ఈ రిక్రూట్మెంట్ కోసం వచ్చినవారిని మీడియా కదిలిస్తే ఆకలితో చచ్చేకన్నా పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవటం నయమన్న జవాబొచ్చింది. తమ ప్రాణాలు పోయినా కుటుంబాలకు ఎంతో కొంత అందుతుందన్న ధీమా వారిది. ఎంత విషాదకర స్థితి! మరో ఆరేళ్లలో మన దేశం ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రభుత్వఅంచనాలు చెబుతున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న చైనాను అధిగమించటం మరెంతో దూరంలో లేదని ఆర్థికరంగ నిపుణులు ఊరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వున్న 6.1 శాతం వృద్ధి రేటు ఈ ఏడాది చివరికల్లా 6.8 శాతానికి ఎగబాకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. నిరుద్యోగిత తగ్గిందని, కొనుగోలు శక్తి బాగా పెరిగిందని, తయారీ రంగం పుంజుకుందని గణాంకాలు అంటున్నాయి. అయినా ఇంతమంది ఎందుకు వలసబాట పడుతు న్నారు? ఇబ్బందులుంటాయని తెలిసినా తప్పుడు మార్గాల్లో అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆర్థికవ్యవస్థ వెలుగులీనటం నిజమే అయినా అందులో సామాన్యులకు వాటా లేకపోతే సాధించిన అభివృద్ధికి అర్థమేముంటుంది? యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నామంటే లోపం ఎక్కడుందో ఆత్మపరిశీలన చేసు కోవాల్సిన అవసరం లేదా? యుద్ధ క్షేత్రాలవైపు పోయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని మన విదేశాంగ శాఖ ఈమధ్య ఒక ప్రకటన చేసింది. మంచిదే. కానీ అదొక్కటే సరిపోతుందా?తమ విధానాలను విమర్శిస్తారనుకున్నవారిని దేశంలో అడుగుపెట్టకుండా విమానాశ్రయాల నుంచే వెనక్కిపంపుతున్నారు. పరాయిగడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారన్న శంకతో కొంద రిని బయటికి వెళ్లకుండా నిరోధిస్తున్నారు. కానీ మనుషుల్ని మోసపుచ్చి వారిని అక్రమంగా తరలి స్తున్న మాయదారి ముఠాలకు కళ్లెం వేయటం ఎందుకు సాధ్యపడదు? ఇది ఎన్నికల నామ సంవ త్సరం గనుక కనీసం ఇప్పుడైనా ఉపాధి కల్పనకూ, తయారీరంగ పరిశ్రమలు పుంజుకోవటానికీ, వ్యవసాయ అనుబంధరంగాల్లో పనులు పుష్కలంగా లభించటానికీ చర్యలు తీసుకోవాలి. గణాంకాలు కళ్లు చెదిరేలావుండొచ్చు. కానీ అవి కడుపు నింపవు. -
యూరప్ దేశాల వ్యవసాయ సంక్షోభం వెనక...
సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడి దారీ విధానం వలన ఆ యా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందో ళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశా లతో పాటు, ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గుర య్యారు. నేటి ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వలన రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈయూ దేశాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి – పంటలకు న్యాయమైన ధరలూ, వాటి విక్ర యాలూ! రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయిన సందర్భంలో అమెరికా సూచనల మేరకు యూరప్ దేశాలు ఉక్రెయిన్ నుంచి పెద్దయెత్తున చౌకగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక రైతాంగం వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి నష్టాలను ఎదుర్కొంటు న్నాయి. ఆహార దిగుమతులతో పాటు ఈయూ పర్యావరణ నిబంధనలు రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4 శాతం సాగు భూమిని శాశ్వతంగా ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఇంతే కాకుండా ప్రతి ఏడాదీ పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. సాగు అవసరాలకు విని యోగిస్తున్న పెట్రోల్, డీజిళ్లపై ఇస్తున్న సబ్సిడీ ఎత్తి వేయాలని ఈయూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందు తున్నారు. యూరప్లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతాంగం తమ పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమ పుట్టి ముంచుతాయని స్పెయిన్ రైతాంగం భయపడుతున్నది. కొద్ది సంవత్సరాలుగా ఈయూ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటిమట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతాంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్స్లో ‘వాల్’ నది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన ‘గ్వాదల్ క్విలిర్’ నదిలో సాధారణ నీటిమట్టంలో నాలుగవ వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్లో వ్యవసాయం విస్తృతంగా ఉండటంతో నీటి అవసరాలు ఎక్కు వగా ఉన్నాయి. ఇటలీ లోనూ నీటి లభ్యత తగ్గింది. ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి పాలకులు దిగుమతులు పెంచడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఫ్రాన్స్లో 10 నుంచి 15 శాతం పొలాలపై ఒక బిలియన్ యూరోలకు మించి రుణాలు ఉండటంతో రైతులు దివాళా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రే అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఈయూ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిర సిస్తూ ఈక్రింది డిమాండ్లకై రైతాంగం ఆందోళన బాట పట్టారు. ఆహారోత్పత్తుల దిగుమతులను ఈయూ అరికట్టాలి. ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్లించేలా చేయాలి. ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపి వేయాలి. సాగుపై ప్రభుత్వ పరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. 4 శాతం భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలి. పర్యావరణ నిబంధనలు సడలించాలి. పెట్రోల్, డీజిళ్లపై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదు. నష్టపోయిన రైతులకు పరి హారం చెల్లించాలి వంటి అనేక డిమాండ్లతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, రుమేనియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు. జర్మనీలో అధిక ఇంధన ధరలకు వ్యతిరేకంగా వారం రోజుల నిరసన కార్యక్రమంలో తమ ట్రాక్టర్లతో 10వేల మంది రైతులు సెంట్రల్ బెర్లిన్ వీధుల్లోకి వచ్చి ఆర్థిక మంత్రి క్రిష్టియన్ విండన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 2న ఉక్రెయిన్కు తాజాగా నిధులు మంజూరు చేయడానికి ఈయూ నాయకులు సమావేశం నిర్వహించగా బెల్జియం పార్లమెంట్ ఆవరణ వెలుపల వందలాది మంది రైతులు నిరసన తెలియ చేశారు. గ్రీస్లో రెండవ అతిపెద్ద నగరమైన థెస్సులోనికి రైతులు ట్రాక్టర్లతో కవాతు తొక్కారు. ఫ్రాన్స్లో నిరసన తెలుపు తున్న రైతులు ప్యారిస్ వెలుపల, లియోన్, టౌలేస్ నగరాల్లో రోడ్లను బ్లాక్ చేశారు. యూరప్ దేశాల పాలకులకు వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు మద్దతుగా 73 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కూ ఇతర దేశాల పాలకులకూ తీవ్ర ఆందోళన కలిగించింది. ఫలి తంగా యూరప్ వ్యవసాయ సంక్షోభ నివారణ కోసమంటూ ఈయూ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది. యుద్ధాలకు, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ సంక్షోభాలకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానమే కారణం. రెండు ప్రపంచ యుద్ధాలు దీన్నే రుజువు చేశాయి. పెట్టుబడిదారీ వ్యవ సాయం కూడా సంక్షోభానికి మినహాయింపు కాదనీ, అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యూహాత్మక విధానం వలన పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షోభానికి గురౌతున్నాయనీ గ్రహించాలి. - వ్యాసకర్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతుకూలీ సంఘం (ఏపీ) ‘ 98859 83526 - బొల్లిముంతసాంబశివరావు -
Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే
మాస్కో: ఉక్రెయిన్లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది. ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు. మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం. యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది. వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. -
ఉక్రెయిన్ పోరు దారెటు?!
‘ఇక్కడ బతుకు దుర్భరంగా వుంది. స్వీయానుభవంలోకి రాకుండా దీన్నర్థం చేసుకోవటం పూర్తిగా అసాధ్యం’ అని తన సన్నిహితుడికి రాసిన లేఖలో రష్యాలోని అతి శీతలమైన ఆర్కిటిక్ ప్రాంత కారాగారంలో ఇటీవల కన్నుమూసిన అసమ్మతివాది అలెక్సీ నవాల్నీ అన్నారట. రెండేళ్లు పూర్తయి మూడో యేట ప్రవేశించిన ఉక్రెయిన్ యుద్ధం కూడా అటువంటి పరిస్థితుల్నే సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన ఈ దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా అటు రష్యా సైనికులూ... ఇటు ఉక్రెయిన్ సైనికులూ, పౌరులూ కూడా చెప్పనలవికాని యాతనలు పడు తున్నారు. ఈ యుద్ధం నిరుడు రెండో ఏడాదిలో ప్రవేశించే సమయానికి ఉక్రెయిన్ పౌరుల్లో కాస్తయినా విశ్వాసం వుండేది. వచ్చే వేసవిలో రష్యా సైనికులను తరిమేయగలమని నమ్మేవారు. ఇప్పుడు అదంతా ఆవిరైంది. 2025 నాటికి మెరుగైన ఫలితాలొస్తాయని తాజాగా పాశ్చాత్య మీడియా నమ్మబలుకుతోంది. అమెరికా అండదండలతో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు దండిగా ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు అందించటంతోపాటు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి. 1945 తర్వాత యూరోప్ దేశాలన్నీ చిక్కుకున్న ఈ భారీ యుద్ధం ఎటుపోతుందో, చివరికేమవుతుందో ఎవరి అవగాహనకూ అందటం లేదు. ఈమధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో కూటమి దేశాలను హెచ్చరించారు. తమ తమ జీడీపీల్లో రక్షణకు 2 శాతంకన్నా తక్కువ వ్యయం చేసే యూరోప్ దేశాలకు తాను గద్దెనెక్కిన తర్వాత సహకరించబోనని ప్రకటించారు. పైగా యూరోప్ను ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండ’ని రష్యాకు చెబుతానన్నారు. ఆయన మళ్లీ అ«ధ్యక్షుడు కావటం ఖాయమని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి. ఈనాటికీ 18 శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో వుంది. అక్కడా, ఇతరచోట్లా ఉక్రెయిన్ పౌరులు భయంతో బతుకులీడుస్తున్నారు. అంతేకాదు... రష్యా క్షిపణి దాడులు జరిగిన ప్రతిసారీ సమీప బంధువులనూ, స్నేహితులనూ కూడా అనుమాన దృక్కులతో చూసే ధోరణి మొదలైంది. కొందరు రష్యాకు అమ్ముడుపోయి క్షిపణి దాడులకు కారణమవుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇరాన్, ఉత్తర కొరియాలు రష్యాకు అవసరమైన డ్రోన్లు, క్షిపణులు అందిస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సామగ్రిని తుర్కియే సరఫరా చేస్తోంది. చైనానుంచి పేలుడు పదార్థాల్లో వినియోగించే రసాయనాలు వస్తున్నాయి. 2022 ఫిబ్రవరి మొదలుకొని ఇంతవరకూ రష్యా ఆదాయాన్ని 433 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 35,500 కోట్లు) గండికొట్టగలిగామని పాశ్చాత్య దేశాలు సంబరపడుతున్నా రష్యా దూకుడు తగ్గలేదు. యుద్ధరంగంలో రష్యా వినియోగిస్తున్న ఆయుధాల్లోని 95 శాతం విడిభాగాలు అమెరికా, పాశ్చాత్య దేశాల్లో తయారైనవేనన్నది కియూవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యయన సారాంశం. సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ చెప్తున్న ప్రకారం ఇంతవరకూ 3,15,000 మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించటమో, గాయపడటమో జరిగింది. మూడింట రెండువంతుల శతఘ్నులుధ్వంసమయ్యాయి. రక్షణ కేటాయింపులు పెంచే విధానానికి స్వస్తిచెప్పి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని యుద్ధకాల ఆర్థిక వ్యవస్థగా (వార్ ఎకానమీ) రష్యా మార్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థతగల నాయకుడనీ, యుద్ధ హీరో అని పాశ్చాత్య మీడియా కీర్తించటంవల్ల ఒరిగేదేమిటో అర్థంకాదు. గతంతో పోలిస్తే ఆయన రేటింగ్స్ పడిపోయాయన్నది వాస్తవం. ముఖ్యంగా కమాండర్ ఇన్ చీఫ్ జలూజినీని తొలగించటం, కియూవ్ నగర మేయర్తో విభేదాలు జెలెన్స్కీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఉక్రెయిన్కు మరో ఆరువేల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి అమెరికా సెనేట్ గతవారం అంగీకారం తెలిపినా రిపబ్లికన్లకు ఆధిక్యతవున్న ప్రతినిధుల సభలో ఏమవుతుందో తెలియదు. కొత్త ఆయుధాల సరఫరాకు ఇప్పటికే రిపబ్లికన్లు బ్రేక్ వేశారు. ఉక్రెయిన్కు అందించదలచుకున్న సాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాలన్న సూచనలు రావటం అమెరికా అధ్యక్షుడు బైడెన్కు సమస్యాత్మకమే. ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించి, యుద్ధ నేరాలకు మూల్యం చెల్లించేలా రష్యాపై అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిళ్లు పెంచటమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఈ బాధ్యతను అమెరికా, పాశ్చాత్య దేశాలు విస్మరిస్తున్నాయి. ఉక్రెయిన్కు ఆయుధాలందిస్తూ పోతే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల ఆయుధ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయితప్ప ఒరిగేదేమీ వుండదు. ఉక్రెయిన్ గెలుపు గురించీ, రష్యాపై తీసుకునే చర్యల గురించీ ఆర్భాటంగా మాట్లాడుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు యుద్ధం మొదలై రెండేళ్లవుతున్నా తమ దేశాల్లోని రష్యా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటంలో వెనకడుగేస్తున్నాయి. వివిధ ఫైనాన్షియల్ కంపెనీల్లో వున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తుల్ని యుద్ధం మొదలైన రోజుల్లోనే స్తంభింపజేశారు. కానీ వాటì స్వాధీన ప్రక్రియను ప్రారంభిస్తే డాలర్ల రూపంలో నిధులు డిపాజిట్ చేసే విధానానికి చాలా దేశాలు స్వస్తి చెబుతాయన్న భయం అమెరికాకు ఉంది. ఇలా తమ ఆర్థిక వ్యవస్థల గురించీ, భవిష్యత్తు గురించీ ఆచి తూచి అడుగు లేస్తున్న సంపన్న దేశాలు ఈ యుద్ధాన్ని ఆపటంపై మాత్రం దృష్టి సారించటం లేదు. ఉక్రెయిన్ పోరునూ, గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దారుణ మారణకాండనూ ఇకనైనా నిలువరించకపోతే అన్ని దేశాలూ పెను సంక్షోభంలో కూరుకుపోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడటం అందరి కర్తవ్యం కావాలి. -
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
పక్కనున్న ఇల్లు తగలబడుతుంటే మనది కాదు కదా అని వదిలేస్తే ఆ మంటలు మన ఇంటినీ కాల్చివేస్తాయి. ఇప్పుడు హమాస్–ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఈ వాస్తవాన్నే నొక్కి చెబుతోంది. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్లో రష్యా మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం ఇంకా చల్లార నే లేదు. ఇంతలో హమాస్ రాజేసిన యుద్ధ జ్వాలలు లెబనాన్ మొదలుకొని జోర్డాన్, సిరియా, ఇరాక్ల వరకూ మొత్తం పశ్చిమాసియాను చుట్టుముట్టాయి. ఇదే సమయంలో ఎర్రసముద్రంలో మాటుగాసిన హౌతీ మిలిటెంట్లు అటుగా వచ్చిపోయే భారీ వాణిజ్య నౌకలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయడం ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. గత నవంబర్లో అయిదువేల కార్లను మోసుకుపోగల ‘గెలాక్సీ లీడర్’ అనే నౌకపై హెలికాప్టర్తో దాడిచేసి, ఆ తర్వాత దాన్ని హైజాక్ చేశారు హౌతీలు. నౌకకు బహమాస్ జెండాయే ఉన్నా అది ఇజ్రాయెల్ కోటీశ్వరుడి షిప్పింగ్ కంపెనీదని హౌతీలు పసిగట్టారు. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ యుద్ధనౌక, ఒక గ్రీక్ నౌక, నార్వే జెండాతో పోతున్న కెమికల్ ట్యాంకర్లున్న నౌక వీరి దాడులకు లక్ష్యంగా మారాయి. మధ్యలో రెండు చైనా, రష్యాల నౌకలపైనా దాడులు జరిగాయి. కానీ పొరపాటైందని హౌతీలు ప్రకటించారు. జనవరి 15న వారు నేరుగా అమెరికా కార్గో నౌకపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో ఇంచు మించు 17 శాతం ఎర్రసముద్రం మీదుగా జరుగుతుందని అంచనా. పర్షియా జలసంధి నుంచి యూరప్కు తరలిపోయే చమురు, సహజవాయు ట్యాంకులన్నీ ఎర్రసముద్రం గుండా పోవాల్సిందే. కానీ ఈ దాడుల తర్వాత అందులో చాలా భాగం తగ్గిపోయింది. అనేక సంస్థలు ఆఫ్రికా చుట్టూ తిరిగి నౌకల్ని నడపాలని నిర్ణయించాయి. ఇందువల్ల సరుకు రవాణా వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇరాన్ పెంచి పోషిస్తున్న హౌతీల ఆగడాలు అరికడతామని అమెరికా, బ్రిటన్లు రంగంలోకి దిగాయి. అందుకు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటివి సహకారం అందిస్తున్నాయి. హౌతీ మిలి టెంట్లు క్షిపణులతో, డ్రోన్లతో గత ఏడాది అక్టోబర్ 31న ఎర్రసముద్రంలోని ఇజ్రాయెల్ టూరిస్టు రిసార్ట్పై బాంబు దాడులు చేశారు. అయితే వాటిని ఇంటర్సెప్టర్ల సాయంతో ఇజ్రాయెల్ జయప్రదంగా అడ్డుకోగలిగింది. దాంతో రెండు ఈజిప్టు పట్టణాల్లో పేలుళ్లు సంభవించాయి. ఆ తర్వాత వారు అమెరికా ఎమ్క్యూ–9 రీపర్ డ్రోన్ను కూల్చారు. సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సాయంతో హౌతీలు ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను అమెరికా, ఇజ్రా యెల్ అడ్డుకోగలుగుతున్నాయి. కానీ ఎక్కడో తేడా కొట్టి అడపా దడపా నౌకలు బుగ్గిపాలవుతున్నాయి. గత నెల 10న అసంఖ్యా కంగా ఒకేసారి వదిలిన డ్రోన్లలో కొన్ని రక్షణ వ్యవస్థల్ని తప్పించుకెళ్లి అమెరికా యుద్ధ నౌకలోని ముగ్గురు నౌకాదళ సభ్యుల ప్రాణాలు తీశాయి. అమెరికా కూటమి దేశాలు సాగిస్తున్న దాడులు వృథా ప్రయాసగా మిగలటమే కాదు... చివరకు ప్రపంచయుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం వుంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగేదాకా ఎర్రసముద్రం ప్రశాంతంగా ఉండబోదని హౌతీలు చేసిన ప్రకటనను ప్రపంచదేశాలు సకాలంలో పట్టించుకోవాలి. 2004 మొదలుకొని గత రెండు దశాబ్దాలుగా నిత్యమూ యుద్ధరంగంలో నిలిచిన హౌతీలను తక్కువ అంచనా వేస్తే చేజేతులా వారిని హీరోలను చేసినట్టే! యెమెన్లో ఇరాన్–సౌదీ అరేబియాలు సాగించిన ఆధిపత్య పోరు నుంచి పుట్టుకొచ్చిన సంస్థ ‘హౌతీ’. మొదట్లో ఒక ముఠా నాయకుడి జేబుసంస్థగా మొదలైన ఈ సంస్థ షియాల్లోని ‘జైదీ’ తెగ పరిరక్షకురాలిగా అవతరించింది. దక్షిణ, తూర్పు యెమెన్ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న సున్నీలపై ఎడ తెగని దాడులు చేసి రాజధాని సానాను చేజిక్కించుకున్నారు. ఈలోగా ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు, అందుకు అమెరికా వత్తాసుగా నిలిచిన వైనాలను హౌతీలు స్వీయ ఎదుగుదలకు వాడుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నాశనమే తమ ధ్యేయ మనీ, వారివల్ల అన్యాయానికి గురవుతున్న ముస్లింలు ఏ వర్గంవారైనా అండగా ఉంటామని హౌతీలు తమ చర్యల ద్వారా ప్రకటిస్తున్నారు. పాలస్తీనాలో సున్నీలు, షియాలు, క్రిస్టియన్లతో సహా భిన్న వర్గాలున్నా అక్కడ సున్నీలదే మెజారిటీ. హౌతీల ఎత్తుగడలను అమెరికా సరిగానే గ్రహించింది. అందుకే జనవరి నెలనుంచి ఇజ్రాయెల్కు సామరస్యత, శాంతి ప్రబోధిస్తోంది. కానీ ఆ దేశం వింటే కదా! హౌతీలు ప్రపంచంలో ఒంటరివారు కారు. వారికి ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అలాగని వారు ఇరాన్ చెప్పుచేతల్లో ఉండే అవకాశం లేదు. ఎవరైనా తమ ఎదుగు దలకు తోడ్పడే వరకే వారికి మిత్రులు. నచ్చనిది చెప్పిన మరు క్షణం వారు శత్రువుతో సమానం. ఇరాన్పై ఎన్ని రకాల ఆంక్షలు విధించినా నానావిధ ఎత్తుగడలతో తనకంటూ మిత్రుల్ని పోగేసుకుంటోంది. హౌతీలకు అది అండదండలు అందివ్వటం వెనక రష్యా, చైనాలు లేకపోలేదు. అందుకే ఆ రెండు దేశాలూ చోద్యం చూస్తూ నిలబడ్డాయి. ఇప్పుడు హౌతీల దుందుడుకు తనాన్ని కట్టడి చేయాలన్నా, కనీసం వారి చర్యల తీవ్రతను తగ్గించాలన్నా ఇరాన్ సాయం అవసరం. రష్యా, చైనాల జోక్యం తప్పనిసరి. ఈ దశలో ప్రతిష్ఠకు పోతే మున్ముందు మరిన్ని పరాభవాలు తప్పవనీ, ఇది మరో ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందనీ అమెరికా, మిత్రదేశాలు గుర్తించాలి. బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్వాతి మలివాల్ వర్సెస్ రేఖాశర్మ.. సోషల్ మీడియాలో డైలాగ్ వార్
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతిమలివాల్ ప్రమాణస్వీకారంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఆమెపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ట్రోల్ చేస్తూ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. ‘స్వాతిమలివాల్ ఆందోళనల్లో నుంచి పుట్టిన ప్రోడక్టు. ఆమెకు నినాదాలు మాత్రమే తెలుసు. ఆమె తన చిన్న మెదడును అసలే వాడదు. బడ్జెట్ అంటే ఆమెకు ఏం తెలియదు. అయినా బడ్జెట్పై ఆమె నిపుణురాలు అనుకుంటోంది’ అని పోస్టులో రేఖాశర్మ వ్యంగ్యాస్రాలు సంధించింది.రేఖాశర్మ పోస్టుపై స్వాతిమలివాల్ అంతే ఘాటుగా స్పందించారు. ‘నేను ఆందోళనల్లో నుంచి పుట్టానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా జీవితం సామాజిక సేవకు అంకితం చేశాను.మహిళా కమిషన్ చైర్మన్గా మీరు ఫెయిల్ అయ్యారు. వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేసి ట్రోలింగ్ చేసుకోండి’అని రేఖాశర్మపై స్వాతి ఫైర్ అయ్యారు. జనవరి 31న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతిమలివాల్ చివర్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలిసారి చేసిన ప్రమాణస్వీకారాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. స్వాతిమలివాల్ గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేయడం గమనార్హం. -
ఎవరికి వారే..'బాపట్ల' తీరే !
బాపట్ల తెలుగుదేశం పార్టీలో ఐక్యత కొరవడింది. వర్గపోరుతో అట్టుడికిపోతోంది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి చోటా తమ్ముళ్ల తగవులాటే కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలనే కార్యకర్తలు చింపేయడం... ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగడం... అధిష్టానానికి మింగుడుపడటం లేదు. చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం... వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ముకాయడం... బాపట్ల ఇన్చార్జి రోజుకో నాయకుడ్ని వెనకేసుకు రావడం... అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు. రేపల్లె... అద్దంకిలో ఇంటిపోరు తీవ్రరూపం దాల్చడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల వేళ పచ్చపార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే మరొకరికి గిట్టక వెన్నుపోట్లకు సిద్ధపడుతున్నారు. ఆధిపత్యపోరుతో అమీతువీుకి సిద్ధపడుతున్నారు. రేపల్లెలో సొంత పార్టీనేతనే ఏకంగా హత్య చేసిన ఘటన జరగ్గా మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు ముదిరి ఘర్షణలకు దిగిన ఘటనలు కోకొల్లలు. ‘ఏలూరి’ తీరుపై కేడర్ విసుగు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసిగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంతపార్టీ ఫ్లెక్సీలనే చింపేసి, ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. పోపూరి శ్రీనివాసరావు, ద్రోణాల దరశి, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావాలని ఈయన తిరుపతి వరకూ వెనక్కు నడిచారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొండయ్యా... ఏందయ్యా ఇది? చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎం.ఎం.కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని చంద్రబాబు, లోకేశ్లకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, చీరాలకు చెందిన డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కొండయ్యను వ్యతిరేకిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు తమ వర్గానికి కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని యాదవ సామాజికవర్గం తేల్చి చెబుతోంది. ‘నక్కా’నూ... పక్కన పెట్టేస్తారా? వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వేమూరు మండల టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలున్నాయి. కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ మైనేని మురళి, మధుసూదనరావుకు, అమృతలూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ జెడ్పీటీసీ చరణ్గిరి, భట్టిప్రోలులో మాజీ ఎంపీపీ తూనుగుంట్ల సాయిబాబు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరణ శ్రీనివాసరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ మండలాలన్నింట్లో ఓ వర్గానికి ఆనందబాబు కొమ్ముకాయడంతో రెండో వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది. ‘వేగేశన’తో వేగలేం ! బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన హయాంలో పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తానికొండ దయాబాబును తొలగించి వడ్లమూడి వెంకటేశ్వరరావును నియమించడం, తర్వాత ఆయన్నూ తొలగించి గోలపల శ్రీనివాసరావును నియమించడం, సతీష్ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కావూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి ముక్కాముల శివను నియమించడంపై కేడర్ గుర్రుగా ఉంది. వీరే గాకుండా బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కాముల శివ, గొలపల శ్రీను, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కర్లపాలెం మండలంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ గుంపులకన్నయ్య, మైనారిటీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మహ్మద్ హజీజుల్లాబేగ్, పార్టీ అధ్యక్షుడు వసంతారెడ్డితో కూడిన ఒక వర్గం వర్మను వ్యతిరేకిస్తోంది. కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నక్కల వెంకటస్వామిని తొలగించి ఏపూరి భూపతిరావును నియమించడం, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోకరాజు శ్రీధర్వర్మ స్థానంలో కనుమూరి సాంబమూర్తిరాజును నియమించడం, కొన్నాళ్ళ తర్వాత మహ్మద్ అబ్జల్ను నియమించడంతో అక్కడ అసంతృప్తి నెలకొంది. ‘అన్నే’ మరణం.. ‘అనగాని’కి శరాఘాతం.. రేపల్లె పట్టణానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణను సొంత పార్టీలోని పరిటాల యువసేన నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్పై వ్యతిరేకత చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టం కానుంది. ఈ సారి ‘గొట్టిపాటి’కి గట్టిదెబ్బే.. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొందరికే ప్రాధాన్యమిస్తుండటం,ప్రధానంగా సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి తదితర మండలాల్లో విభేదాలు అధికంగా ఉన్నాయి. సంతమాగులూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగబోతు రామాంజనేయులు, కొరిశపాడు మాజీ జెడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య మరికొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరం, అద్దంకి మండలం మోదేపల్లి, జె.పంగులూరు మండలాల పరిధిలో వందలాది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
గాజా యూనివర్సిటీలో పేలుడు.. వివరణ కోరిన అమెరికా
గాజా: నాలుగు నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 7న తమపై హమాస్ చేసిన మెరుపు దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గాజాలోని అల్ ఇసారా యూనివర్సిటీ భవనాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ పేల్చివేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్ ఇసారా యూనివర్సిటీ ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్మీ ఆధీనంలోనే ఉంది. అయితే బయటి నుంచి వేసిన బాంబుల వల్ల కాకుండా ఆ భవనంలో దాచి ఉంచిన పేలుడు పదార్థాల వల్లే పేలుడు జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది. దీంతో ఈ విషయమై ఇజ్రాయెల్ను అమెరికా వివరణ కోరింది. యూనివర్సిటీ భవనం పేలుడుకు సంబంధించి అమెరికా ఎలాంటి ప్రకటన చేయలేదు. తమకు ఈ పేలుడుపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేనందున కామెంట్ చేయలేమని అమెరికా తెలిపింది. తాజాగా దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ ప్రాంతంలో హమాస్ లీడర్లున్నారనే సమాచారంతోనే ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. Birzeit University condemns the brutal assault and bombing of @Al-Israa University campus by the Israeli occupation south of #Gaza city, this occurred after seventy days of the occupation occupying the campus; turning it into their base, and military barracks for their forces pic.twitter.com/vot9s1z3tz — Birzeit University (@BirzeitU) January 18, 2024 ఇదీచదవండి.. హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు -
సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్
ప్యాంగ్యాంగ్ : కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఆజ్యం పోస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల వల్లే కిమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘దక్షిణ కొరియాతో కలవడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు. మనం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. యుద్ధం వస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోలేం. మన రాజ్యాంగాన్ని మార్చాల్సి ఉంది. దక్షిణ కొరియా మన ప్రధాన శత్రువని రాబోయే తరాలకు తెలియజేయాలి. దక్షిణ కొరియాను ఆక్రమించుకునేందుకు మనం ప్రణాళిక రచించాలి. రెండు దేశాల మధ్య ఇక ఎలాంటి సమాచార పంపిణీ ఉండకూడదు. ప్యాంగ్యాంగ్లో ఉన్న కొరియా పునరేకీకరణ ఐకాన్ను ధ్వంసం చేయండి. కొరియా దేశాల పునరేకీకరణ కోసం పని చేస్తున్న సంస్థను మూసేయండి. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని వెంటనే ఆపండి’ అని నార్త్ కొరియా పార్లమెంట్లో కిమ్ ప్రసంగించారు. ఇదీచదవండి.. నౌకలపై దాడులతో ఇంధన సరఫరాపై ప్రభావం -
తైవాన్పై చైనా యుద్ధం ప్రకటిస్తే .. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
తైవాన్ దేశం తమ భూభాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది. తైవాన్ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్ గగనతంపై మీదకు యుద్ధ విమానాలు, నౌకలను పంపి డ్రాగన్ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే తైవాన్కు అగ్రరాజ్యం అమెరికా మద్దతుగా ఉండటంతో చైనా అడుగులకు బ్రేక్లు పడుతున్నాయి. ఒకవేళ చైనా తైవాన్ మీద దాడి చేస్తే మాత్రం భారీ యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. అంతకంతకూ పెరుగుతున్న చైనా ఆర్థిక, సైనిక శక్తి.. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం చేస్తున్న తైవాన్ పోరాటం, అమెరికా, బీజింగ్ మధ్య విభేదాలు రోజురోజుకీ ప్రమాదకరంగా మారనున్నాయి. తాజాగా చైనా ఇప్పటికిప్పుడు తైవాన్పై యుద్ధం ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతుందో బ్లూంబెర్గ్ ఎకనామిక్స్ వెల్లడించింది. తైవాన్పై చైనా దండయాత్ర చేస్తేలక్షల కోట్ల నష్టం తప్పదని వెల్లడించింది. సుమారు రూ.830 లక్షల కోట్ల(పది ట్రిలియన్ డాలర్ల) మేర నష్టం వాటిల్లనున్నట్లు అంచనా వేసింది. ఇది ప్రపంచ జీడీపీలో 10 శాతం అని తెలిపింది. తైవాన్ను చైనా ఆక్రమించేందుకు సిద్ధమైతే... కొవిడ్, సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను మించిన సంక్షోభం తలెత్తుతుందని పేర్కొంది. తైవాన్ను తమ దేశంలో విలీనం చేసి తీరుతామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయ తెలిసిందే. తైవాన్ తన మాతృభూమితో కలవక తప్పదని.. చైనాతో విలీనం కావడం అనివార్యమని చెప్పారు. కాగా జనవరి 13న తైవాన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జిన్పింగ్ వ్యాఖ్యలు, తైవాన్ను చైనా ఆక్రమణ వార్తలు చర్చనీయాంశంగా మారియి చదవండి: సికాడాల దండయాత్ర.. వణుకుతున్న అమెరికా! -
రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే
మాస్కో: ఉక్రెయిన్తో 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో వరుసగా సంభవిస్తున్న ప్రముఖుల మరణాలు సంచనం కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో వరుసగా జర్నలిస్టులు మృతి చెందుతుండడంపైనా చర్చ జరుగుతోంది. తాజాగా రష్యా అధికారిక టీవీ చానల్కు చెందిన ఇంటర్నెట్ గ్రూపు హెడ్ కుబాన్ జోయా(48) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఆమెపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నొవోస్తీ వెల్లడించింది. ఇటీవలే మరో రష్యా జర్నలిస్టు అలెగ్జాండర్ రైబిన్ కూడా ఓ హైవేపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అలెగ్జాండర్ మరణానికి కారణాలు తెలియవని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. గత నెలలో ఓ న్యూస్ పేపర్ డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న అన్యా సరేవా రాజధాని మాస్కో నగరంలోని తన అపార్ట్మెంట్లో మృతి చెందడం సంచలనం కలిగించింది. ఇదీచదవండి..ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం భారత్ కీలక వ్యాఖ్యలు -
Israel Hamas war: భారత్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండడంపై ఐక్యరాజ్యసమితి(యూఎన్) జనరల్ అసెంబ్లీలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కంబోజ్ స్పందించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఒక ప్రమాదకరమైన మానవతా సంక్షోభంగా ఆమె అభివర్ణించారు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం చర్చల ద్వారానే సాధ్యమన్నారు. ‘ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో చిన్న పిల్లలు, మహిళలు మరణించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఎంత మాత్రం అంగీకారం కాదు. అయితే ఈ యుద్ధానికి అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన దాడి కారణమని కూడా మాకు తెలుసు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ క్షమించదు. యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు భారత్ తరపున ఇప్పటికే 70 టన్నుల వివిధ రకాల సహాయ సామాగ్రిని పంపించాం. వీటిలో 16.5 టన్నుల మందులున్నాయి’ అని కంబోజ్ వివరించారు. ఇదీచదవండి.. సౌత్కొరియాకు కిమ్ మళ్లీ వార్నింగ్ -
Israel-Hamas War: ఫౌదా సిరీస్ నటుడికి తీవ్ర గాయాలు
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ గాయకుడు, నటుడు ఇదాన్ అమేదీ తీవ్రంగా గాయపడ్డారు. గాజాలో నిర్వహిస్తున్న భూతల దాడుల్లో ఆయన తీవ్రంగా గాయాలపాలైనట్లు ఇజ్రాయెల్ దౌత్యవేత్త అవియా లెవీ వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే ఇదాన్ అమేదీ సైన్యంలో చేరారు. అప్పట్లో ఓ పోస్టు కూడా పెట్టాడు. ఫౌదాలో ఇది దృశ్యం కాదు.. నిజ జీవితం అని రాసుకొచ్చాడు. ఇజ్రాయెల్ సైన్యం ఎదుర్కొంటున్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకుని ఫౌదా సిరీస్ను కూడా నిర్మించారు. నెట్ఫ్లిక్స్లో ఇది మంచి ప్రజాధరణ పొందింది. గత ఏడాది అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైంది. ఇరుపక్షాలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధంలో ఇప్పటికే హమాస్ వైపు 22 వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఇజ్రాయెల్ వైపు 1100లకు పైగా మరణించారు. యుద్ధం ప్రారంభంలోనే ఇజ్రాయెల్ మూడు లక్షల రిజర్వు సైన్యాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇదాన్ అమేదీతో పాటు ఈ ఫౌదా సిరీస్లో నటించిన లియర్ రాజ్ కూడా యుద్ధంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: India-Maldives Controversy: భారత్-మాల్దీవుల వివాదం.. దుష్టబుద్ధిని బయటపెట్టిన చైనా -
Russia Ukrain War: మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం !
కీవ్: ఉక్రెయిన్పై రష్యా తాజాగా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడులు నివాసాలతో పాటు పరిశ్రమల భవనాలు లక్ష్యంగా సాగాయి. ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. ‘శత్రువు ప్రశాంత ప్రదేశాలను కూడా వదిలిపెట్టడం లేదు’అని దేశంలోని ప్రధాన పట్టణం కీవ్ మేయర్ తెలిపారు. ‘రష్యన్లు దేనిని టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఈ దాడుల్లో పారిశ్రామిక వాడలు లక్ష్యంగా మిసైళ్లు పేల్చారు’అని కార్కివ్ మేయర్ తెలిపారు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడుల కారణంగా తమ తమ దేశంలోని బెల్గార్డ్ పట్టణంలోని 300 మంది స్థానికులను అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించినట్లు రష్యాలోని బెల్గార్డ్ గవర్నర్ తెలిపారు. బెల్గార్డ్ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దులోనే ఉండటం గమనార్హం. 2022 ఫిబ్రవరి 14న ప్రారంభమైన రెండవ దశ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి కొనసాగుతోంది. నిజానికి ఉక్రెయిన్ భూ భాగంపై వెళుతున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని కూల్చివేసిన తర్వాత 2014లోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య తొలిదశ యుద్ధం ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశంపై సుదీర్ఘ దాడి జరగడం ఇదే తొలిసారని పరిశీలకులు చెబుతున్నారు. ఇదీచదవండి..అమెరికాలో రోడ్డు ప్రమాదం ఖమ్మం యువకుడు మృతి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement