-
బరువు తగ్గించుకోవాలని ఆసుపత్రికెళితే ప్రాణమే పోయింది!
ఆరోగ్యంగా జీవించాలని ఆరాట పడిన యువకుడు అర్థాంతరంగా తనువు చాలించిన ఘటన కలకలం రేపింది. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్ (26) బరువు తగ్గించుకునేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కొన్ని నిమిషాలకే అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన వివాదం రేపింది. 150 కిలోల అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న హేమ చంద్రన్. బరువు తగ్గాలనే కోరికతో మెటబాలిక్ బేరియాట్రిక్ సర్జరీ కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆపరేషన్ టేబుల్పై గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే మరో ఆస్పత్రికి తరలించి రెండు రోజులు ఐసీయూలో ఉంచారు. చివరికి మంగళవారం మృతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. అయితు వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని హేమచంద్రన్ తండ్రి ఆరోపించారు. తన కుమారుడు ఐటీ ఉద్యోగి అని, శస్త్రచికిత్స గురించి యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుసుకున్నాడని బాధితుడు తండ్రి దురై సెల్వనాథన్ తెలిపారు. తొలుత క్రోమ్పేట్లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ గురించి ఆరా తీశాడు. ఆ తరువాత దాని గురించి మర్చిపోయాడు. కానీ ఆసుపత్రి నుండి పదే పదే కాల్స్ వస్తూ ఉండటంతో ఫిబ్రవరిలో వారిని మళ్లీ కలిసాడు. మొత్తం ఖర్చు 8 లక్షలు రూపాయలు చెల్లించలేనని చెప్పడంతో ఎస్కే జైన్ ఆస్పత్రిలో రూ.5 లక్షలకే చేస్తామని అసిస్టెంట్ చెప్పాడని సెల్వనాథన్ వెల్లడించారు. అయితే హేమచంద్రన్ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటంతో సర్జరీ వాయిదా పడింది. తిరిగి ఏప్రిల్ 21న ఎస్కే జైన్ ఆసుపత్రిలో చేర్చామనీ, మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు శస్త్రచికిత్స కోసం తీసుకెళ్లారని సెల్వనాథన్ చెప్పారు. 40 నిమిషాల తర్వాత, కొన్ని సమస్యలొచ్చాయని చెప్పి తన కుమారుడ్ని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారని సెల్వ నాథన్ ఆవేదనకు గురయ్యారు.హేమచంద్రన్ను 48 గంటల పాటు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO)లో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆయన పరిస్థితిలో స్వల్ప మెరుగుదల ఉందన్నారు. కానీ తానీ ఐసీయూలోకి వెళ్లేటప్పటికే తన కొడుకు నిర్జీవంగా ఉన్నాడని సెల్వనాథన్ పేర్కొన్నాడు. దీంతో ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్కు వెళ్లానని, అపుడు తన కొడుకు చనిపోయాడని ఆసుపత్రి అధికారులు ప్రకటించారన్నాడు. పోస్ట్మార్టం చేయకుండానే మృతదేహాన్ని తీసుకెళ్లారని సెల్వనాథన్ ఆరోపించాడు. గురువారం హేమచంద్ర అంత్యక్రియలు ముగిసాయంటూ ఆయన కన్నీరుమున్నీరయ్యాడు.మరోవైపు హేమచంద్రన్ మృతి చెందినట్లు దీనిపై స్పందించిన తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. రెండు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.వైద్యుల నిర్లక్ష్యం రుజువైతే మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంటుంది. అతని కుటుంబం ఫిర్యాదు చేయనప్పటికీ, మీడియా నివేదికల ఆధారంగా ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టిందని అధికారి తెలిపారు. -
ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్ప్యాక్
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. 2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్స్టా పోస్ట్తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్. కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్గా స్వీకరించి చేసి చూపించాడు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo)రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్నెస్ను, 6 ప్యాక్ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు. -
అక్షయ్ కుమార్ నుంచి కత్రినా వరకు.. డైట్ సీక్రెట్స్ ఇవే..
బాలీవుడ్ టీవీ నటుడు, ప్రముఖ కమిడియన్, ప్రోడ్యూసర్, సింగర్ అయిన కపిల్ శర్మ సెటబ్రిటీలతో చేసిన 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోతో మంచి పేరు సంపాదించికున్నాడు. ఇటీవల ఆ షో ఫస్ట్ ఎపిసోడ్ నెట్పిక్స్లో విడుదల అయ్యింది అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ షోలో సెలబ్రిటీలు రణబీర్ కపూర్, నీతూ కపూర్ మరియు రిద్ధిమా కపూర్ సహానితో షేర్ చేసుకున్న ఆసక్తికర విషయాల తోపాటు హాస్యంతో కూడిన చిందులు అన్నింటిని ప్రేక్షక్షులు అలరించాయి. ఆ ఐదు షోల్లో ప్రముఖ సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్ సీక్రెట్స్ కూడా కపిల్ వెల్లడించడం జరిగింది. స్రీన్పై మంచి అందంతో, పిట్నెస్తో కనిపించే హీరో/హీరోయిన్ల బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకోవాలన్న కుతుహలం అందరికీ ఉంటుంది. అది కపిల్ శర్మ షో ద్వారా ప్రేక్షకులు తెలుసకునే అరుదైన అవకాశం లభించింది. అవేంటీ, ఎవరెవరు? ఎలాంటి డైట్స్ ఫాలో అవుతారో సవివరంగా చూద్దామా..! జాన్ అబ్రహం బాలీవుడ్ నటుడు, మోడల్, నిర్మాత అయిన జాన్అబ్రహం ఫిజిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆరడుగుల ఆజానుబాహుడు అంటే అతడేనేమో అన్నట్లు ఉంటుంది అతడి ఆహార్యం. చక్కటి బాడీని మెయింటెయిన్ చేస్తూ మంచి ఫిట్నెస్తో కనిపిస్తాడు. 2021లో తన మూవీ 'సత్యమేవ జయతే2' ప్రమోషన్ సందర్భంగా కపిల్ శర్మ షోకి వచ్చినప్పుడూ తన ఫిట్నెస్ సీక్రెట్స్ని పంచుకున్నాడు. మంచి బాడీ మెయింటెయిన్ చేయాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం అని చెప్పాడు. అలాగే ఆహారంపై నియంత్రణ ఉండాలని అన్నారు. ప్రోటీన్ కోసం నాన్వెజ్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. చాలామంది శాకాహారంతో ప్రోటీన్లు అందుతాయని చెబుతారు గానీ అందులో నిజం లేదని జాన్ చెప్పడం జరిగింది. ఇక్కడ జాన్ కండల దేహ సౌష్టవాన్ని చూస్తే.. పోషకాల తోకూడిన ఆహారం తినాల్సిందేనని స్పష్టమవుతుంది. అక్షయ్ కుమార్ ఇక అక్షయ్ కుమార్ తన 'హౌస్ఫుల్ 3' చిత్రం ప్రమోట్ చేసేందుకు కపిల్ శర్మ షోకి రావడం జరిగింది. ఆ షోలో ఆ మూవీ నటులంతా రావడం జరిగింది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ఆ షోలో అక్షయ్ కుమార్ ఫాలో అయ్యే స్ట్రీట్ డైట్ గురించి వెల్లడించారు. "తాను రితేష్ చక్కగా వ్యాయామం చేసి అలసిపోయి ఉన్నాం. అందువల్ల చాలా ఆకలిగా అనిపించి బటర్ చికెన్ తినాలని అనుకున్నాం. అయితే ఆ టైంలో అక్షయ్ వారికి ఉడకబెట్టిన క్యారెట్లు, బచ్చలి కూర ఇచ్చాడని, కనీసం అన్నం గానీ రోటీ గానీ లేదు. ఇంత స్ట్రీట్గా డైట్ ఫాలో అవుతాడని,అందువల్లే అక్షయ్ ఇప్పటికీ యంగ్ లుక్లోనే కనిపస్తాడని". అమితాబ్ అన్నారు. కేక్ అంటే చాలా ఇష్టం: కత్రినా కైఫ్.. కపిల్ శర్మ షోకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కత్రినా తన డైట్ గురించి మాట్లాడింది. "నిజంగా ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కేక్లంటే మహా ఇష్టం కానీ దాన్ని తింటే జిమ్లో ఎక్కువసేపు గడపక తప్పదు. అందుకని ప్రతి ఆదివారం మనం కలుసుకుందామని కేక్తో సర్ది చెప్పుకుని నోటిని కంట్రోల్ చేసేందుకు కష్టపడతానని అంటోంది." కత్రినా. ఇక్కడ సెలబ్రిటీలు కూడా మనలానే ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు. ఐతే తినాలనుకుంటే మాత్రం కంట్రోల్గానో లేక ఏదో ఒక రోజు కేటాయించుకుని పరిమితంగా తిని ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. గులాబ్ జామూన్లు, సమోసాలు తినాల్సిందే: రాజ్కుమార్ రావ్ కపిల్ శర్మ షో 2020లో రాజ్కుమార్ రావ్ సందడి చేశారు. అయితే రాజ్ కుమార్ తనకు తినడమంటే ఇష్టమని చెప్పాడు. ఐతే రాజ్ ఫిటనెస్ చూస్తే.. ఆయన చెబుతుంది నమ్మశక్యంగా లేదని కపిల్ ఆ షోలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో తన డైట్ గరించి క్లియర్గా చెప్పారు. "తనకు గులాబ్ జామూన్లు, సమోసాలంటే ఎంతో ఇష్టమో ఎలా తినేసేవాడో చెప్పారు. టీనేజ్లో ఉండగా వర్కౌట్స్ అయ్యాక తిన్నగా స్వీట్ షాక్కివెళ్లి ఏకంగా ఆరు గులాబ్ జామూన్లు, రెండు సమోసాలు తినాల్సిందే. అయితే సినీ పరిశ్రమలో ప్రవేశించాక డైట్ మీద దృష్టికేంద్రీకరించడంతో అలా తినడం మానేశానని, స్వీట్ తినాలనుకుంటే మాత్రం లిమిట్గా తింటానని అన్నారు." ఆదిత్య రాయ్: అరకేజీ ఐస్క్రీమ్ ఉండాల్సిందే.. ఇక ఆదిత్య రాయ్ మృణాల్ ఠాకూర్తో కలిసి కపిల్ శర్మ షోకి వచ్చి డైట్కి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. తాను రాత్రిపూట ఏకంగా అరకేజీ ఐసీక్రీం తినేవాడినని అన్నారు. చాల సమయం డైట్లోనే ఉంటాను కాబట్టి సడెన్గా నాలోపల ఉన్నవాడికి తినాలనే కోరిక మొదలవ్వగానే వెంటనే వెళ్లి ఏదో ఒకటి రెండు ఐస్క్రీమ్లు కాదు ఏకంగా 1/2 కేజీ ఐస్క్రీం లాగించేస్తాను. ఆ తర్వాత రోజు పూర్తిగా డైట్లో ఉండి, కసరత్తు చేస్తుంటానని అన్నారు. బరువు తగ్గే యత్నంలో ఉన్నప్పుడూ రోజుకి 1700 కేలరీలు ఉండే పిండి పదార్థాలు, కొవ్వు తక్కువుగా ఉన్నా ఆహారం, అలాగే 15 నుంచి 20 నిమిషాలు కార్డియో సెషన్లు చేయండి చాలు. మంచి ఫిట్నెస్గా ఉంటారు. ఇలా చేసే క్రమంలో ఒక్కోసారి డైట్ స్కిప్ అవుతుంది. అంతమాత్రాన వదిలేయకుండా మరసటి రోజు నార్మల్గా డైట్ ఫాలో అయిపోవాలంతే అన్నారు ఆదిత్య రాయ్. ఈ సెలబ్రిటీల డైట్ సీక్రెట్స్ అన్ని చూశాక కచ్చితంగా ఎవ్వరైనా అంతలా నోరు కట్టేసుకుని ఉండటం ఈజీ కాదు. అలా అని నోరు కట్టేసుకుని ఇబ్బంది పడక.. తినాలనిపించిన ఐటెమ్స్ హాయిగా తినేసి కాస్త వర్కౌట్ డోస్ పెంచడం తోపాటు డైట్లో కేలరీల తక్కువగా ఉన్నవి తీసుకుంటే చాలు. ఒక్కరోజుని డైట్ని స్కిప్ చేసినంత మాత్రన పూర్తిగా వదిలేయకూడదన్నది క్లియర్గా అర్థమవుతుంది. సో..! మీరు కూడా మీ వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సాయంతో మంచి ఆరోగ్యకరమైన డైట్ని ఫాలో అవ్వండి, మంచి ఫిట్ నెస్తో బరువుని అదుపులో ఉంచుకోండి. -
మూవీ కోసం స్పీడ్గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
అంత సులభం కాదు.. రెండున్నరేళ్లు పట్టింది: టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్లో నువ్వు -నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం రీ ఎంట్రీకి అనితా సిద్ధమవుతోంది. టాలీవుడ్ సినీ ప్రియులను త్వరలోనే అలరించనుంది. అయితే ఇటీవల తన వెయిట్ లాస్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. గతంలో బాబు పుట్టినప్పుడు 76 కిలోలు ఉన్న అనితా ప్రస్తుతం 58 కిలోలకు తగ్గింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. 'ఇలా మారడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. మరో ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నా లక్ష్యం చాలా దూరంగా అనిపించడం లేదు. అంతా మనకు అనుకూలంగానే ఉందంటూ రాసుకొచ్చింది. కానీ ఇదంతా సులభం కాదని అనితా చెబుతోంది. అనితా మాట్లాడుతూ.. 'ఇది కచ్చితంగా కష్టమే. కానీ నేను మాత్రం తొందరపడలేదు. వెయిట్ లాస్ కోసం ఇంత సమయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నా. నేను నా లక్ష్యానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నా. నటులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గతంలో నేను నా ప్రెగ్నెన్సీని ఆస్వాదించా. మనం అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకసారి బిడ్డ పుట్టాక శరీరం, హార్మోన్ల మార్పులు, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయని' వివరించింది. సోషల్ మీడియాలో మీరు చాలా బరువు పెరిగారంటూ మేసేజులు పంపేవారని తెలిపింది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది. కాగా. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
స్టైయిలిష్ లుక్లో స్లిమ్గా కనిపిస్తున్న బోనీ కపూర్! ఎలా తగ్గారంటే..?
చిత్ర నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోని కపూరు స్లిమ్గా కనిపిస్తున్నారు. చాలా బరువు ఉండే ఆయన మంచి ఫిట్నెస్ లుక్లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తాను బరువుత తగ్గేందుకు ఎలాంటి కసరత్తులు చేశారో వెల్లడించారు. అంతేగాదు తనలా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఇంతకీ బోనీ కపూర్ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే.. గతంలో 2004లో శ్రీదేవితో కలిసి ఉన్న ఫోటోల్లో బోనీ కపూర్ చాలా లావుగా, ఏజ్డ్ పర్సన్లా కనిపించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి చనిపోయిన తర్వాత పలు సందర్భాల్లో కెమరాకు చిక్కిన పోటోల్లో కూడా లావుగానే ఉన్నారు. అలాంటి ఆయాన అనూహ్యంగా 12 కిలోలలకు పైగా బరువు తగ్గడమే గాక న్యూలుక్లో కనిపిస్తున్నారు. బోనీ కపూరేనా అనిపించలా కొత్త స్టయిలిష్ లుక్లో దర్శనమిచ్చారు. 20 ఏళ్ల క్రితం ఉన్న బోనీకపూర్కి ఈ న్యూలుక్లో ఉన్న బోనీ కపూర్కి ఎంత తేడా అని షాకయ్యేలా విజయవంతంగా బరువుతగ్గి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ మేరకు బోనీకపూర్ మాట్లాడుతూ.."బరువు తగ్గేందుకు తాను చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారే తొందరగా బరువు తగ్గగలరని అన్నారు. అందుకోసం క్రమశిక్షణతో కూడిని జీవనశైలిని అవలంభించాల్సి ఉంటుందన్నారు. తాను బరువు తగ్గే క్రమంలో నటి జాన్వీ కపూర్ ఉత్సహాపరిచేలా ప్రోత్సహించిన విషయాన్ని కూడా పంచుకున్నారు. జాన్వీ సోషల్ మీడియాలో "నా పాపా బరువు తగ్గడంలో విజంయ సాధించినందుకు గర్వంగా ఉంది." అని పోస్ట్ చేసింది. ఇలా తన పిల్లలు ఇచ్చిన ప్రోత్సాహమే తనను తొందరగా బరువు తగ్గేలా చేసేందుకు దోహదపడిందన్నారు. అలాగే తన మొదటి భార్య కుమార్తె అన్షులా కపూర్ కూడా బరువు తగ్గే ప్రయత్నంలో కష్టాలను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఆమెకి ప్రేరణ కలిగించేలా తాను బరువు తగ్గేందుకు ఉపక్రమించినట్లు తెలిపారు. అయితే తన కూతురు కూడా చక్కగా బరువు తగ్గి న్యూలుక్ మంచి ఫిట్నెస్తో అందంగా ఉందని చెప్పడమే గాకా ఆమె ఫోటోలను కూడా షేర్ చేశారు. తనలా బరువు తగ్గాలనుకునేవారు తగ్గలేకపోతున్నాననే నిరాశకు లోనవ్వకూడదు. చివరి నిమిషం వరకు ఆశను కోల్పోకుండా ఉత్సాహభరితంగా కసరత్తులు చేస్తే దెబ్బకు బరువు తగ్గడం ఖాయ అని అన్నారు. అందుకు తానే నిదర్శనమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నారు." బోనీ కపూర్. View this post on Instagram A post shared by Boney.kapoor (@boney.kapoor) (చదవండి: సెలబ్రెటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!) -
వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో!
బరువు తగ్గడం అనుకున్నంత ఈజీ కాదు. దీనికి తగ్గ ఆహార నియమాలు, కమిట్మెంట్ చాలా అవసరం. ఎలా పడితే అలా డైటింగ్ చేయడం కాకుండా బాడీ తీరును అర్థం చేసుకుని, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బరువు తగ్గించే ప్రణాళికలకు సరైన ఆహార విధానం, జీవనశైలి పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, జాగ్రత్తగా తినడం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని స్థిరమైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో చేరుకోవడం అత్యవసరం. మీబాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉన్నదీ లెక్కించుకొని, దానిని బట్ట ప్రణాళిక వేసుకోవాలి. నో జంక్ ఫుడ్, నో సుగర్ పోషకాహారం, సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్డ్ఫుడ్ సుగర్ పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. తక్కువ కేలరీలు ఎక్కువ శక్తినిచ్చే పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలను తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలంటే కాఫీ, టీలు పూర్తిగా మానేయ్యాలి. దీని బదులు, గ్రీన్ టీ, హెర్బల్ టీ తీసుకోవాలి. రాత్రి 7 గంటల తరువాత భోజనం వద్దు రాత్రి 7 గంటలకే భోజనం చేయాలి. ఒక పూట భోజనంలోపూర్తిగా ఉడికించిన కూరగాయలు తీసుకుంటే ఇంకా మంచి ఫలితం . కంప్యూటర్, టీవీ ముందు కూర్చుని చిరు తిండ్లు (చిప్స్ కానీ, ఇంట్లో చేసుకున్నవైనా) మన తిండి మర ఆడుతూనే ఉంటుందనేది గుర్తు పెట్టుకోండి. వ్యాయామం బరువు ఎంత తొందరగా అంత వ్యవధిని వ్యాయామాన్ని పెంచాలి. యోగా, నడక, ఏరోబిక్, సైక్లింగ్ వంటివి ఎక్కువ కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి బరువు తగ్గే ప్రక్రియలో నీరు చాలా కీలక పాత్ర. రోజంతా బాగా హైడ్రేటెడ్గా ఉండటంతోపాటు, పరగడుపున,రాత్రి నిద్రపోయేముందు నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు, చర్మానికి మంచిది. నిద్ర తప్పనిసరి మీరు తగినంత మంచి నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రతి రాత్రి 7 నుండి 9 గంటల నిద్రను లక్ష్యంగా పెట్టుకోవాలి. Exercises with weights to lose weight fast: pic.twitter.com/Bm2RcZxUru — Health & Fitness (@FitnessF0rWomen) March 26, 2024 -
రెండేళ్లలో 71 కిలలో బరువు తగ్గిన సీఈవో! ఎలా తగ్గారంటే..!
కొందరూ మనకళ్ల ముందే అధిక బరువుతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడినవాళ్లు అద్భుతం చేసినట్లు స్లిమ్గా అయ్యిపోతారు. వాళ్లను చూడగానే భలే బరువు తగ్గారనిపిస్తుంది. అచ్చం అలానే హౌసింగ్ డాట్ కమ్ సీఈవో జస్ట్ రెండేళ్లలోనే చాలా బరువు తగ్గి తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన వెయిట్ లాస్ జర్నీ ఎలా మొదలయ్యిందంటే.. హౌసింగ్ డాట్ కామ్ సీఈవో ధ్రవ్ అగర్వాలా 2021 నుంచి గుండోపోటు, గుండెల్లో మంట వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇబ్బందులకు గురిచేసిన ఆ అనారోగ్య సమస్యలే అతడిని బరువు తగ్గేందుకు ప్రేరేపించాయి. ఆ గుండె జబ్బు కారణంగా ఆయన ఫేస్ చేసిన సమస్యలే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేశాయి. అప్పుడు ఆయన దాదాపు 151 కిలోలు బరువు ఉన్నాడు. ఆ టైంలో ప్రీ డయాబెటిక్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. వీటితోపాటు స్లీప్ ఆప్నీయా కూడా వచ్చింది. దీంతో ధ్రువ్ ఎలాగైన బరువు తగ్గాల్సిందే అని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాడు. అందుకని మంచి ఫిట్నెస్ర్ని నియమించుకున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఆస్పత్రులకు లేదంటే బెడ్లకే పరిమితమవ్వడం తనను బాగా బాధించిందని అంటాడు ధ్రువ్. ఇక ఫిట్నెస్ నిపుణుడు సమక్షంలో రోజుకు రెండుసార్లు వ్యాయామ కసరత్తులు చేసేలా దృష్టి పెట్టారు. కిలోమీటర్లు చొప్పున నడక, కేలరీలు తక్కువుగా ఉన్నా ఆహారం తీసుకోవడం వంటివి చేశారు. ముఖ్యంగా రోజువారి దాదాపు 17 వందల కేలరీలను తగ్గించాడు. నోటిని కంట్రోల్ చేసుకునేలా ఏదైనా వర్కౌట్లలో బిజీగా ఉండేవాడు. వాటి తోపాటు ఆల్కహాల్, ప్రాసెస్ చేసి, వేయించిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వండిన కూరగాయాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు. రాత్రిపూట కాల్చిన చికెన్ లేదా చేపలతో సెలెరీ లేదా ఆస్పరాగస్ సూప్ వంటివి తీసుకునేవాడు. అలాగే చక్కటి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, దోసకాయలు, క్యారెట్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకునేవాడు. దీంతో ధ్రువ్ అనూహ్యంగా తన బరువులో సగానికి పైగా తగ్గిపోయాడు. పైగా తనకు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంటే ఇష్టమని, ఆయనంత బరువే ఉండాలని గట్టిగా కోరుకోవడంతోనే ఇది సాధ్యమయ్యిందని ఆనందగా చెబుతున్నారు ధ్రువ్. తాను మరింతగా బరువు తగ్గేలా స్విమ్మింగ్, రన్నింగ్ వంటి వాటిపై కూడా దృష్టిపెట్టానని చెప్పాడు. తన వార్డ్బోర్డ్లో దుస్తులను మార్చి ఇష్టమైన ఫ్యాషన్ దుస్తులను ధరించడం చాలా అద్భుతంగా అనిపించని అన్నాడు ధ్రువ్. నిజానికి ధ్రువ్ చిన్నతనంలో కోల్కతాలో పెరిగారు. ఆయన బాల్యంలో ఎక్కువగా క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడేవారు. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం వంటివి చేయకపోవడంతో ఆయన విపరీతంగా బరువు పెరిగిపోవడం జరిగింది. ఏదీఏమైతేనేం అనారోగ్యం సమస్య ఆరోగ్యంపపై స్ప్రుహ కలిగించి, స్లిమ్గా అయ్యేలా చేసింది. అధిక బరువు కాదు సమస్య తగ్గాలనే స్పిరిట్ ఉండాలి. అది ఉంటే ఈజీగా తగ్గిపోవచ్చని ధ్రువ్ చేసి చూపించారు. (చదవండి: సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!) -
ఏకంగా 26 కిలోల బరువు తగ్గి షాకిచ్చిన ‘మిస్టర్ పెర్ఫెక్ట్’!
నటించే పాత్రకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయడం నటుల ప్రాథమిక లక్షణం. కట్టూ బొట్టు, ఆహార్యం ఇలా అన్నింటిలోనూ ఆ పాత్రకు న్యాయం చేసేందుకు నటీనటులు చాలా కష్టపడతారు. ప్రేక్షకులని అలరించేందుకు ఎంతో రిస్క్ చేసి మరీ తమ బాడీని మలచుకుంటారు. అలాంటి వారిలో తాజాగా రణదీప్ హుడా మరోసారి ప్రత్యేకంగా నిలిచాడు. 'స్వతంత్ర వీర్ సావర్కర్' బయోపిక్ కోసం విపరీతంగా బరువు తగ్గి తన లుక్తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాత్రకు తగ్గట్టు శరీరాన్ని, ఆహార్యాన్నిమార్చుకోవడంలో రణదీప్ ప్రత్యేకతే వేరు.అందుకే రణదీప్ హుడాను హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బాలేతో పోల్చుతారు. 2016లో సరబ్జిత్ సినిమా కోసం 20 కిలోలు, అదే ఏడాది దో లఫ్జోన్ కి కహానీ సినిమా కోసం తన బరువును 77 కిలోల నుంచి 94 కిలోలకు చేరేలా కష్టపడ్డాడు. విలక్షణ శైలితో విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడాయన. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' నుంచి సరబ్జిత్ సింగ్, ఇపుడు వీర సావర్కర్ దాకా పాత్రల్లో జీవించే ప్రతిభావంతుడైన నటుడు. సోదరి డా. అంజలి సాయం తాజాగా స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకోసం రణదీప్ ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 'కాలా పానీ' పాత్ర సజీవంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రణదీప్ హుడా సోదరి, డాక్టర్ అంజలి సాయం తీసుకున్నాడట. ఆమె రూపొందించిన పాలియో డైట్తో బక్క చిక్కిన దేహంతో ఫ్యాన్స్ను షాక్కు గురి చేశాడు. నిపుణుల సమక్షంలో పాలియో డైట్ సోదరి డాక్టర్ అంజలి హుడా వృత్తిరీత్యా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని,తన కోసం పాలియో డైట్ను రూపొందించిందని స్వయంగా రణదీప్ హుడా వెల్లడించాడు. వివిధ దశలలో గుడ్లు, నట్స్, ఖర్జూరాలు , డార్క్ చాక్లెట్లు డైట్ చేర్చుకున్నానని తెలిపాడు. దీంతోపాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఐదు రోజుల వ్యవధిలో 6-7 కిలోల బరువు తగ్గాననీ, ఈ జర్నీలో విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నానని చెప్పాడు. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. పెర్ఫెక్ట్గా ఉండటమే తనకిష్టమని తెలిపాడు. ఖర్జూరం, పాలుతో బరువు తగ్గుతారు అనేది ఫేక్ న్యూస్ అని కూడా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడిగా రణదీప్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మార్చి 22 న ఈ మూవీ విడుదలైంది. -
నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ మంచి గృహిణిగా, వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేశారు. కేవలం ముఖేశ్ అంబానీ భార్య అనే ఐడెంటిటీ కంటే తనను తానుగా గుర్తించే ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నారు. రిలయన్స్ బోర్డు మెంబర్గా, ఐపీఎల్లో ముంబై ప్రాంచైజ్ ఓనర్గా మంచి విజయాలను అందుకున్నారు. ఆ సక్సెస్ ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకునేలా చేశాయి కూడా. ఇటీవల చిన్న కొడుకు నీతా అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో హడావిడి అంత ఆమెదే. ఏ డ్రెస్లు వేసుకోవాలి..? ఈవెంట్ ఎలా చేయాలి..? వంటివన్నీ తన అమ్మే దగ్గరుండి మరీ చూసుకున్నారని స్వయంగా అనంత్ అంబానీనే చెప్పారు కూడా. 54 ఏళ్ల నీతా అంబానీ తన కోడళ్లకు, కూతురుకి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. చూడటానికి ఓ హిరోయిన్ మాదిరిగా మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఆమె అందం, ఫిట్నెస్ ముందు సినీ సెలబ్రెటీలు కూడా సరిపోరని చెప్పొచ్చు. ఇంతలా చలాకీగా ఫిట్నెస్గా ఉండటానికి ఆమె ఎలాంటి డైట్ ఫాలో అవుతారు?. ఆమె ఫిట్నెస్ రహస్యం తదితరాలు గురించి చూద్దామా!. నీతా అంబానీ మొదట్లో 90 కిలోల బరువు ఉండేవారు. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ఆస్మా, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల కారణంగా విపరీతమైన బరవు పెరిగిపోయాడు. దీని కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాడు కూడా. తన కొడుకు బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విజయవంతం కాకపోవడంతో ఆమెనే స్వయంగా తగ్గి కొడుకుకి స్ఫూర్తినిచ్చారు. పైగా నీతా కొడుకు తగ్గేందుకు ఉపక్రమించేలా చేశారు. అలా అనంత్ కూడా ఆ టైంలో బరువు తగ్గడం జరిగింది కూడా. అదీగాక నీతా మంచి శాస్త్రీయ నృత్యకారిణి కావడంతో ఆమె రోజువారీ దినచర్యలో భాగంగా నృత్యం చేస్తుంటారు. ఇదే ఆమెను మంచి ఫిట్నెస్గా ఉండేందుకు ఉపకరించిందని చెప్పొచ్చు. అలాగే ఈ డ్యాన్స్ కదిలికలు, శరీరానికి ఓ మంచి వ్యాయామంలా ఉండి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే నీతా క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తగ్గుతారు. పోషకాలు అధికంగా ఉండే ఈ జ్యూస్లో అద్భుతమైన డిటాక్స్లు ఉంటాయి. అవి అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా చేసి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. ఇది నిధానంగా బరువు తగ్గడంలో తోడ్పాడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫ్క్ట్లు తలెత్తకుండా ఉండేలా చేసి బరువుని అదుపులో ఉంచుతుంది. పైగా మంచి మానసికొల్లాసం కలిగించి మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, చికాకులు, టెన్షలు వంటి వాటిని తట్టుకునేలా చేస్తుంది. ఇదే ఆమె ఫిటనెస్ రహస్యం. అందువల్లే నీతా ఇంత అందంగా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నారని చెప్పొచ్చు. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి కారణంగానే ఆమె శక్తిమంతమైన బిజినెస్ విమెన్గా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారని కూడా అనొచ్చు. (చదవండి: ట్రెండీ షార్ట్ బాబ్ హెయిర్ స్టయిల్..ఎక్కడి నుంచి వచ్చిందంటే..) -
ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!
ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధిక బరువు. పెద్దగా తినకపోయినా కూర్చొని గంటలు, గంటలు పనిచేయడం వల్ల వచ్చేస్తుంటుంది. మరికొందరికీ తిండి కంట్రోల్ లేకపోవడం వల్లే వచ్చేస్తుంటుంది. దీంతో జిమ్మ్ల్లో గంట తరబడి వర్కౌట్లతో మునిగిపోతుంటారు. తొందరగా బరువు తగ్గాలన్న భావనతో చాలా తక్కువ తినేలా డైట్ ప్లాన్ చేస్తుంటారు. కానీ బరువు తగ్గుతారా అంటే? లేదనే చెప్పాలి. పైగా బాబోయ్ మావల్ల కాదంటూ మధ్యలో వదిలేస్తుంటారు. మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోవడం షరా మాములైపోతుంది. అయితే ఇలాంటి సమస్యకు ప్రముఖ విమెన్ వెయిట్ లాస్ ఫిట్నెస్ కొచ్చ్ తాను చెప్పే ఆ మూడే పద్ధతులతో చెక్ పెట్టొచ్చు అంటోంది. అవేంటో చూద్దామా!. జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్ జెన్నా రిజ్జో వేసవి సమీపించేలోపు బరువు తగ్గాలనుకుంటే ఈ మూడింటిని ఫాలో అయితే చాలని చెబుతుంది. అలాగే తొందరగా తగ్గాలన్న తాపత్రయం కంటే నిధానంగా తగ్గడమే మేలని చెబుతోంది రిజ్జో. అంతేగాదు జిమ్లో ఎక్కువ వర్కౌట్లతో గడపాల్సిన పనిలేదంటోంది. ముఖ్యంగా ఆహ్లాదభరితంగా చేయాలనే సన్నద్ధంతో ఉండమని చెబుతోంది. జస్ట్ 30 నిమిషాలు తాను చేయగలిగే సింపుల్ వ్యాయామాలు జోష్ఫుల్గా చేయమని చెబుతుంది. అదేలా ఉండాలంటే.. అబ్బా రేపు ఈ వ్యాయామం చేయాలి అనే ఉత్సుకతను రేకెత్తించేలా చేస్తే చాలట. దశల వారిగా ఒక్కో వ్యాయామాన్ని పెంచండి. మనసుకి ఇష్టం లేకపోతే కొద్దిగా చేసి స్కిప్ చేయమంటోంది. ఏదో భారంగా లేదా దాన్నో పెద్ద పనిలా చేస్తే.. ఎప్పుడూ మానేద్దామా? అనే ఫీల్ ఆటోమేటిగ్గా మనలో వస్తే మాత్రం చేసిందంతా.. వేస్ట్ అని ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పేస్తోంది. ముఖ్యంగా డైట్ విషయంలో కూడా మరీ నోటిని కుట్టేసుకునేలా కాకుండా నచ్చినవన్నీ ఆస్వాదిస్తూ కొంచెం అంటూ మనసుకు చెప్పుకునేలా రెడీ అవ్వాలి. అలాగే ఆ డైట్లో ఒక్కో ఫ్రూట్ వెరైటీని యాడ్ చేసుకుంటూ పోతూ తినే భోజనం పరిమాణం తగ్గేలా చేయాలి. చివరిగా అతి ముఖ్యమైనది నిద్ర. ఇది కంటి నిండా ఉండాలని చెబుతోంది. కనీసం ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోతేనే ఎన్ని వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉండేదని బల్లగుద్ది మరీ చెబుతోంది రిజ్జో. ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఫాలో అయితే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటోంది. ఈ మూడింటి కారణంగా మంచి ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. పైగా శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవ్వవు, మంచి యాక్టివ్గా ఉంటారని చెబుతోంది రిజ్జో. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. పైగా స్పీడ్గా బరువు తగ్గడం అనేది అనారోగ్య సమస్యలకు మూలం అవుతుందని హెచ్చరిస్తోంది. సో..! మీరు కూడా సింపుల్గా ఈజీగా ఉండే ఈ మూడు మార్గాలను అనుసరించి బరువు తగ్గిపోండి మరీ..! View this post on Instagram A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee) (చదవండి: ఆ ఒక్క ఎక్క్ర్సైజుతో..అధిక బరువుకి చెక్ పెట్టిన నర్సు!) -
ఆ ఒక్క ఎక్స్ర్సైజ్తో.. అధిక బరువుకి చెక్పెట్టిన నర్సు!
ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు దగ్గర నుంచి పురుషుల వరకు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. దీన్ని తగ్గించుకునేందుకు జిమ్ సెంటర్ల్, డైటింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అయినా బరువు అదుపులోకి రాకపోవడంతో ఎలా తగ్గాలో తెలియక చాలా సతమవుతున్నారు. కానీ కొందరూ మాత్రం కొద్దిపాటి వ్యాయామాలతో అధిక బరువుకి చెక్పెట్టి ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ నర్సు. అందరిక తెలిసిన సాధారణ వ్యాయామంతో అధిక బరువుకి చెక్పెట్టి ఆశ్చర్యపరచింది ఈ నర్సు. ఆ ఎక్స్ర్సైజుతో అంత పవర్ఫులా ఈజీగా బరువుత తగ్గిపోవచ్చా అంటే.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 25 ఏళ్ల నర్సు సమంతా అబ్రూ బరువుతో పలు సమస్యలు ఎదుర్కొంది. సుదీర్ఘ నర్సు షిప్ట్లతో శరీరం అలసిపోవడంతో తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకునేది. అమె ఏ మాత్ర కదలడానికి ఇష్టపడేది కాదు. దీంతో ఆమె ఏకంగా 119 కిలోల బరువుకి చేరుకుంది. ఆస్పత్రుల్లో అధిక బరువుతో ఎదుర్కొంటున్న సమస్యలు చూశాక ఈమెలో అనూహ్యంగా మార్పు వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి ఏ మాత్రం శరీరాన్ని కష్టపెట్టడానికి ఇష్టపడేది కాదు. చిన్నప్పుడూ తన తల్లిదండ్రులు పనిపై బయటికివెళ్తే..ఇదే అదనుగా పిజ్జాలు, బర్గ్లు వంటివి ఆర్డర్ చేసుకుని హాయిగా తినేసిది. చెప్పాలంటే ఆమె మంచి ఫుడ్ లవర్. తినకుండా ఉండలేదు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారం అంటే మరింత ఇష్టం. ఇలాంటి ఆమె బరువు తగ్గాలను అనుకుంది. అయితే అప్పుడే కోవిడ్ టైం, లాక్డౌన్ ఆంక్షలు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆమె మానసికంగా ధైర్యంగా ఉండేందుకు వాకింగ్ ప్రారంభించింది. ఇది ఆమె బరువు తగ్గడంలో కీలకంగా పనిచేసింది. శరీరాన్ని కష్టపెట్టడం అంటే బయపడే సమంతా అబ్రూ ఈ వాకింగ్ తనకి సులభంగా ఉండే ఈజీ వ్యాయామంగా తోచింది. దీంతో క్రమ తప్పకుండా సుమారు 5 మైళ్లు వాకింగ్ చేసేది. ఆ తర్వాత నెమ్మదిగా వారానికి నాలుగుసార్లు జిమ్లో గడపడం మొదలు పెట్టింది అప్పుడప్పుడూ మూడ్ బాగుంటే పరుగు కూడా పెట్టేది. ఇవి ఆమె దినచర్యలో భాగమయ్యాయి. ఫలితంగా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 42 కిలోల మేర బరువు అనుహ్యంగా తగ్గిపోయింది. రోజువారీ వాకింగ్, మంచి ఆహారపు అలవాట్లు అనుసరిస్తే బరువు తగ్గడం సులభమేనని ధీమాగా చెబుతోంది నర్సు సమంతా అబ్రు. అంతేగాదు ఇప్పుడూ తన శరీరం తనకు మంచి సౌకర్యవంతంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. (చదవండి: మనదేశంలోని టాప్ మహిళా చెఫ్లు వీరే! కిచెన్ క్వీన్స్గా సత్తా చాటుతున్నారు) -
ఫాస్టింగ్తో బరువు తగ్గడానికి మించిన ఆరోగ్య ప్రయోజనాలు!
బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉపవాసం. తర తరాలుగా భారతీయుల్లో ఉపవాసం కొత్తేమీకాదు. బరువు తగ్గాల నుకునే వారు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వారు ఫాస్టింగ్ చేయడం కూడా చాలా కామన్. అయితే ఎక్కువ కాలం మన దేహాన్ని పస్తు పెట్టడం వల్ల వెయిట్లాస్ కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటోంది తాజా అధ్యయనం. ఆ వివరాలు మీకోసం. ఉపవాసంతో శరీరంలో ఏమి జరుగుతుంది? ఉపవాస సమయంలో, మన శరీరం దాని ఇంధన మూలాన్ని స్వీకరిస్తుంది. సులభంగా యాక్సెస్ చేసే చక్కెరల నుండి బాడీలోని నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. అయితే ఆహారం లేకుండా ఎక్కువ కాలం పాటు ఉంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఇదే ఈ స్టడిలోని కీలక అంశం. నేచర్ మెటబాలిజం జర్నల్లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్ పరిశోధకులు 12 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరశోధన చేశాడు. వారు ఏడు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే తీసుకునేలా చేశారు. అలా వారి రక్తంలో వివిధ ప్రోటీన్ మార్కర్ల స్థాయిలలో మార్పులను నిశితంగా పరిశీలించారు. మూడు రోజుల తర్వాతే మంచి ప్రయోజనం ఊహించినట్లుగానే తొలి రెండు, మూడు రోజుల్లో గ్లూకోజ్ నుండి కొవ్వు ప్రధాన ఇంధన వనరుగా మారడాన్ని పరిశోధకులు గమనించారు. దీంతో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతూ వస్తుంది. మొత్తంగా, వాలంటీర్లు సగటున 5.7 కిలోగ్రాముల కొవ్వు ,లీన్ మాస్ రెండూ తగ్గాయి. అయితే మూడు రోజుల ఉపవాసం తర్వాత వాలంటీర్ల రక్త బయోమార్కర్లలో విభిన్న మార్పులను పరిశోధకులు గమనించారు. మొత్తం బాడీలో కూడా మార్పులొచ్చాయి. ముఖ్యంగా మెదడు కణాల నిర్మాణ ప్రోటీన్లలో మార్పులు ఆసక్తికరంగా నిలిచాయి. దీంతో మూడు రోజుల తరువాత చేసే ఉపవాసంలో మాత్రమే బరువు తగ్గడాన్ని మించి, మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు. క్వీన్ మేరీస్ ప్రెసిషన్ హెల్త్ యూనివర్శిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PHURI) డైరెక్టర్ క్లాడియా లాంగెన్బర్గ్ మాట్లాడుతూ, ‘తొలిసారి ఉపవాసం ద్వారా శరీరం అంతా కూడా అతి చిన్న స్థాయిలో కూడా ఏమి జరుగుతుందో చూడగలుగుతున్నామన్నామని ప్రకటించారు. సురక్షితమైన పద్ధతులో ఫాస్టింగ్ చేసినప్పుడు, బరువు తగ్గడం అనేది ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానం కూడా బరువు తగ్గడ కంటే అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అయితే చాలాకొద్దిమందిపై చేసిన తమ ప్రయోగంలో అందరిలోనూ ఫలితాలు ఒకేలా ఉన్నాయని, మరి ఎక్కువమందిపై ఈ ప్రయోగం చేసినపుడు ఫలితాలు ఎంటా ఉంటాయనేది పరిశీలించాల్సి ఉందన్నారు. -
అధికబరువు : చియా సీడ్స్, లెమన్ వాటర్ మ్యాజిక్ తెలుసా?
బరువు తగ్గే ఆలోచనలో ఉన్నారా? యోగా, ఇతర వ్యాయామంతోపాటు, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార జాగ్రత్తలు, చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు. వాటిల్లో ముఖ్యమైన ఒక చిట్కా గురించి తెలుసుకుందాం రండి..! అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నాన బెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగూ కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి మరింత ఉపయోగంగా ఉంటుంది. బరువుని నియంత్రణలోఉంచడంతోపాటు శరీరంలోని మలినాల్ని బైటికి పంపడంలో నిమ్మరసం ముఖ్యమైన హోం రెమెడీ. విటమిన్ సీ సిట్రిక్ యాసిడ్, కాల్షియం , యాంటీ ఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాల పవర్హౌస్ నిమ్మకాయ. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోమెడికల్ అనాలిసిస్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మ కాయల్లోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఫైబర్, విటమిన్ బీ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి తాగం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ చియా సీడ్స్ నానబెట్టాలి. చియా సీడ్స్ చక్కగా ఉబ్బుతాయి.ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వేసి బాగా కలపాలి. కావాలంటే రుచికి పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ను 20 30 నిమిషాల తర్వాత మరోసారి హాయిగా తాగేయడమే. భారీ భోజనం తర్వాత లేదా ఉదయాన్నే కూడా త్రాగవచ్చు. సులభంగా జీర్ణం కావడానికి , వ్యర్థాలను తొలగించేందుకు దీన్ని మించిన డ్రింక్ లేదు. -
త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న ఇతన్ని గుర్తుపట్టారా?
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ), రాధికా మర్చంట్ల ( Radhika Merchant ) వివాహం త్వరలో జరగబోతోంది. మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు గుజరాత్లోని జామ్నగర్లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అనంత్ అంబానీ కొన్ని నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గగలిగారు అని అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటారు. అప్పట్లో ఆయన అంతలా బరువు తగ్గడానికి ప్రధాన కారణం ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. ఎవరీ వినోద్ చన్నా? దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన వినోద్ చన్నా, ఒకప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పర్సనల్ ట్రైనర్. కఠినమైన ఆహారం, వ్యాయామ నియమావళి ద్వారా కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి అతను సహాయం చేశాడు. వినోద్ చన్నాది స్వయంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అతను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కృషి చేశాడు. అతను ఒకప్పుడు చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒక ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తాను పెరిగే సమయంలో పోషకాహార లోపంతో బాధపడేవాడినని చెప్పాడు. ఫిట్నెస్ ట్రైనర్గా విజయం సాధించడానికి ముందు వినోద్ చన్నా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు వంటి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. వినోద్ చన్నా పెరిగేకొద్దీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను గ్రహించి జిమ్లో చేరాడు. ఇదే అతని ప్రయాణాన్ని మలుపు తిప్పింది. అనంత్ అంబానీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో వినోద్ చన్నా మాట్లాడుతూ.. బరువు తగ్గడంలో అనంత్ అంబానీ నిబద్ధతను తెలియజేశారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, హై ఫైబర్, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించినట్లు వినోద్ చన్నా తెలిపారు. ఆయన ఫీజు ఎంతంటే.. అనంత్ అంబానీతో పాటు నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వినోద్ చన్నా పర్సనల్ ట్రైనర్గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదు కదా.. 12 ట్రైనింగ్ సెషన్ల ప్యాకేజీకి వినోద్ చన్నా రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. -
వెయిట్ లాస్ జర్నీలో.. ఈ డ్రైఫ్రూట్స్ పని అద్భుతం!
బరువు తగ్గడం అనే ప్రక్రియలో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వెయిట్లాస్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్లో చేర్చుకుంటారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గే పనిని వేగవంతం చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం! తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలుంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఎముకల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు, చర్మం ఆరోగ్యంతోపాటు, కేన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి.క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. మెదడును పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం: ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టిన తరువాత తీసుకుంటే శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఎండు ద్రాక్ష: ఇది తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంజీర్: ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులకు, క్యాన్సర్కు, వెయిట్ లాస్కు ఇది బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా ఆడవారికి చాలామంచిది. ఖర్జూరం(మితంగా): వీటినే డేట్స్ అంటారు. వీటి ద్వారా తక్షణ శక్తి వస్తుంది. అన్ని రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఎండు ఖర్జూరంతో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకానికి మంచి మందు. వీటిని నానబెట్టి తింటే ఇంకా మంచిది. ఆప్రికాట్లు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని నియంత్రించి అతిగా తినడానికి చెక్ చెబుతాయి. చియాసీడ్స్: వీటినీ నానబెట్టి తినాలి. ఇవి నీళ్లో వేయగానే చక్కగా ఉబ్బి, ట్రాన్సపరెంట్గా మారిపోతాయి. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. బరువు తగ్గించే విషయంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సీవీడ్ స్నాక్స్: తక్కువ కేలరీలు ,పోషకాలు అధికంగా ఉంటాయి, సీవీడ్ స్నాక్స్ అవసరమైన ఖనిజాలను అందించడంతోపాటు, బరువు నిర్వహణకు బాగా హెల్ప్ చేస్తాయి. జీడిపప్పు (మితంగా): జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్. నోట్: ఏదైనా మితంగా తినడం ఉత్తమం. అందులోనూ షుగర్,బీపీ ఇతర జబ్బులు ఉన్న వాళ్లు వెయిట్ తగ్గాలి అనుకున్నపుడు నిపుణుల సలహా మేరకు కేలరీలు, పోషకాలను అంచనా వేసుకుని మన డైట్లో చేర్చుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుంది. -
సో బ్యూటిఫుల్..సో ఎలిగెంట్: నటి ఫిట్నెస్ జర్నీ , ఫ్యాన్స్ ఫిదా
చాలామంది మహిళల్లో ప్రెగ్నెన్సీలో బాగా బరువు పెరుగుదల కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే గర్భధారణకు ముందు ఆ తరువాత అన్నట్టు తయారవుతుంది మహిళల ఫిట్నెస్ పరిస్థితి. ప్రసవం తరువాత సహజంగా బరువు తగ్గడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. మళ్లీ మునుపటి స్థాయికి చేరాలంటే అంత సులభం కాదు. చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది ఒకవైపు బిడ్డకు తల్లిపాలు, ఆలన పాలనా చూసుకుంటూనే తమ ఫిట్నెస్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా ఆరు నెలలనుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చు. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మూడు నెలల్లో 20 కేజీలు బరువు అందర్నీ ఆశ్చర్యపరిచ్చింది. 2022లో మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రసవానంతర బరువు తగ్గే క్రమంలోన్నానంటూ ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఇన్స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఈ నటి “వావ్.. 20 కిలోలు తగ్గాను ... ఇంకా 6 కిలోలు తగ్గాలి అంటూ చెప్పుకొచ్చింది.మళ్లీ తనలా మారడానికి 16 నెలలు పట్టిందనే విషయాన్ని చెబుతూ లెహంగాలో అమేజింగ్లుక్లో ఉన్న కొన్ని చిత్రాలను ఫ్యాన్స్కు షేర్ చేసింది.ఎటువంటి క్రాష్ డైట్లు , క్రేజీ వర్కౌట్లు లేకుండానే తనని తాను, కొడుకును చూసుకుంటూ నిదానంగా ఈ స్థాయికి వచ్చానంటూ తన జర్నీ గురంచి పోస్ట్ చేసింది.దీంతో ఫ్యాన్స్ వావ్.. అద్భుతం అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) కాగా వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లొ వివాహం చేసుకుందిసోనమ్.నటి చివరిగా 'బ్లైండ్ మూవీలో కనిపించిన ఈమె మంచి స్క్రిప్ట్తో ఉంటే OTT ప్లాట్ఫారమ్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల ప్రకటించింది.మంచి కంటెంట్ ,మంచి సినిమాలో భాగం కావడం తనకు ముఖ్యమని తెలిపింది. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..!
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో సీనియర్ డైటీషియన్నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్. వెయిట్ లాస్కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం. ABC జ్యూస్ అంటే ఏమిటి? ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్) నిజానికి మూడింటి రసాల మిశ్రమం. యాపిల్(A) బీట్రూట్(B) క్యారెట్ (C) అలా టోటల్గా ఇది ABC జ్యూస్ అయిందన్నట్టు. వీటిని ప్రయోజనాలను విడివిడిగా చూస్తే. యాపిల్స్ అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ శక్తివంతమైన ,రుచికరమైన వెజిటబుల్. శరీరంలోని టాక్సిన్స్ను తొలగించే లక్షణం ఇందులో ఉంది. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది. క్యారెట్ పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ పుల్కంగా ఉన్నాయి. క్యారెట్లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు. ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా? ఈ జ్యూస్లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి, ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్ సుగర్ ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ABC జ్యూస్ దుష్ప్రభావాలు పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్లో ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్కు దూరంగా ఉండాలి. ఎలా చేసుకోవాలి రెండు యాపిల్స్, చిన్న క్యారెట్లు, ఒక బీట్ రూట్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసర్లో బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి. దీన్ని వడపోసుకుని తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. -
శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా?
మిగతా అన్నీ సీజన్లలో కంటే శీతాకాలం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. ఓ పక్క ముసుగుతన్ని పడుకోమనేలా చలి గజగజలాడిస్తుంది. దీంతో ఎలాంటి వ్యాయామాలు, వర్క్ అవుట్లు కుదరవు. ఓ రెండు రోజులు సీరియస్గా చేసినా..చలికి లేవలేక నానా పాట్లు. అందులోనూ ఈ శీతాకాలం శరీరం బద్ధకంగా తయారయ్యి కొవ్వుకూడా పొట్ట, తొడల్లోకి చేరిపోతుంది. బరువు తగ్గడం అటుంచి పెరిగే సూచనలే ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడూ ఈ స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే శీతాకాలంలో సులభంగా బరువు తగ్గొచ్చు. శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడంలో సహాయడపతాయి. ఒకరకంగా చెప్పాలంటే శీతాకాలంలో ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యాకి చాలా ప్రత్యేకమైన పండ్లు అని చెప్పొచ్చు. వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం!. కేలరీలు తక్కువ ఫైబర్ అధికం: స్ల్రాబెర్రీల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దాదాపు వంద గ్రాముల స్ట్రాబెర్రీల్లో కేవలం 32 కేలరీలే ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వచ్చి అతిగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గుతుంది. అధిక నీటి కంటెంట్: వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీన్ని ఆహారంగా తీసుకుంటే తిన్న సంతృప్టికలిగి ఎక్కువ కేలరీల ఉన్న ఆహారం తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధి: కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, స్ట్రాబెర్రీల్లో కావల్సినన్నీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి, ఐరన్ శోషణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి స్ట్రాబెర్రీలు తగిన పోషకాహారాన్ని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్: స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారిస్తుంది, బరువుని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ స్ట్రాబెర్రీల్లో ఉండే సహజమైన తీపి, సంతృప్తికరమైన రుచిని అందిస్తాయి. ప్రాసెస్ చేసిన స్వీట్ల కంటే ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మీ రోజువారి ఆహారంలో వీటిని చేర్చడం వల్ల అవసరమైన పోషకాల తోపాటు తీపి తినేలనే కోరికను తగ్గిస్తుంది. ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గేందుకు ఉపయోగపడటమే గాక కేలరీల లోటుని భర్తిచేసేలా శరీరానికి అవసరమైన సమతుల్య ఆహారాన్ని కూడా అందిస్తాయి. (చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!) -
బరువు తగ్గడం కోసం కార్బోహైడ్రేట్లను తగ్గించేస్తున్నారా?
చాలామంది బరువు తగ్గాలంటే కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తీసుకోవడమే మంచిదని గట్టిగా విశ్వసిస్తారు. అయితే వైద్యులు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటున్నారు. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే కార్బోహైడ్రేట్ దూరం చేసినంత మాత్రం శరీరంలోని కొలస్ట్రాల్ ఎంతమాత్రం తగ్గిపోదని అంటున్నారు. దీని వల్లే బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మేలని అంటున్నారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తక్కువుగా ఉండే తృణ ధాన్యాలు, మొక్కల ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టిపెడితే సులభంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఈ లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అధిక బరువు సమస్యకు చెక్పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహారాలు అంటే.. చక్కెరకు సంబందించిన పదార్థాలు, పాస్తాలు, రొట్టెలు కాకుండా తీసుకుంటే బరువు తగ్గడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా సమ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ఈ మేరకు హార్వర్ యూనివర్సిటీ పరిశోధకులు సుమారు లక్షకు పైగా పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. కొందరికి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మిగతావారికి పూర్తిగా కార్బోహ్రైడేట్ లేని శుద్ధి చేసిన పదార్థాలు, మాంసం వంటివి ఇచ్చారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వారి ఆరోగ్యం గురించి డేటా ట్రాక్ చేశారు. దానిలో తక్కవ కార్బోహైడ్రేట్ ఉన్న హెల్తీ ఆహారాన్ని తీసుకున్నవారు బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు కనిపించాయని, మిగతా వారిలో పెద్దగా మార్పులు కనిపించలేదని అన్నారు. పైగా ఇలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న ఆహార తీసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు కూడా తక్కువగానే ఉన్నాయని అన్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు... బరువు తగ్గుతారు మధుమేహం అదుపులో ఉంటుంది రక్తపోటు నార్మల్గా ఉంటుంది గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా?
బరువు తగ్గడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటాం. అందుకోసం చాలా రకాల కసరత్తులు కూడా చేసేస్తుంటాం. ఫిట్నెస్ కోసం ఇష్టమైన ఆహారం కూడా దూరం పెట్టేస్తా. కొందరైతే భోజనమే తినడం మానేస్తారు. లావుగా ఉన్నామన్నా ఫీల్తో ఇంతలా కష్టపడుతుంటారు చాలామంది. అయితే నిపుణులు బరువు తగ్గాలనుకుంటే ఫిట్నెస్ ఎంత ముఖ్యమో! సరైన డైట్ ఫాలో అవ్వడం అనేది అన్నింటికంటే ప్రధానం అని చెబుతున్నారు. నచ్చిన ఆహారం తినకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ అందుకోసం మరీ నోటిని కట్టేసినట్లు ఉంచుకోనక్కర్లేదంటున్నారు. నచ్చినవి మితంగా తింటూ డైట్ ఫాలో అవ్వండి. పాటిస్తున్న డైట్ని మన మనసు కూడా ఇష్టంగా ఆస్వాదించేలా ఉండటం అనేది కూడా ముఖ్యమే. అయితే ఆరోగ్య నిపుణులు పనీర్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి పనీర్ డైట్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గొచ్చని సూచిస్తున్నారు. ఏంటీ..? పనీర్తో బరువు తగ్గగలమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ఎలా తగ్గొచంటే.. పనీర్ పోషకాలు అధికంగా ఉండే ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ బీ12, సెలీనియ, ఫాస్పరస్, ఫోలేట్ ఉన్నాయి. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడంలో ఉపకరిస్తాయని అంటున్నారు నిపుణులు. ఆరోగ్య మార్గంలో బరువు తగ్గేందుకు ఈ పనీర్ ఎంతగానో ఉపకరిస్తుందని చెబుతున్నారు. పనీర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇతర పాల ఉత్పత్తులు కంటే మెరుగైన ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చు. కాటేజ్ చీజ్ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే పనీర్ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. అతిగా తినడం నివారించొచ్చు. (చదవండి: భారత రెస్టారెంట్కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్గా అరోరా) -
మీ డైట్లో ఇవి చేర్చుకుంటే నాజుగ్గా కనిపించొచ్చు
బరువు పెరగడం అనేది చాలా సాధారణ విషయం. మారుతున్న జీవనశైలిలో బరువు తగ్గడం అనేది సవాలుగా మారింది. చాలామంది మహిళలు 35-40 దాటాక వేగంగా బరువు పెరుగుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది.దీనికి అనేక కారణాలు ఉంటాయి. మరి బరువును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఫిట్గా, నాజుగ్గా కనిపించాలంటే ఎలాంటి డైట్ పాటించాలన్నది ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలంటే ముఖ్యంగా తినే తిండిపై దృష్టి పెట్టాలి. అనారోగ్యమైన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినిడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. దీంతో పాటు జీవక్రియ రేటు కూడా మందగిస్తుంది.అందుకే మీ డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోగలిగితే 40లోనూ పాతికేళ్ల అమ్మాయిలా కనిపించొచ్చు. దీనికోసం ప్రతిరోజూ మీ ఆహారంలో ఆకుకూరలు, సాల్మన్ చేపలు, బెర్రీలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని న్యూట్రీషనిస్ట్ కేథరీన్ గెర్వాసియో తెలిపారు. చాలామంది మహిళలు పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక సమస్యల కారణంగా బరువు పెరుగుతారు. హార్మోన్ల అసమతుల్యత కూడా ఇందుకు కారణం. ఓ అధ్యయనం ప్రకారం.. 44 ఏళ్లు దాటాక ప్రతి మహిళ ఏడాదికి అరకిలో బరవు పెరుగుతుందట. అందుకే మోనోపాజ్ దాటాక పక్కా డైట్ ప్లాన్ పాటించాలి. ఆకుకూరలు బరువు తగ్గాలనుకునేవారికి ఆకుకూరలు బెస్ట్ ఛాయిస్. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవడంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆకుకూరల్లో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్, కాల్షియం, విటమిన్-కె మెండుగా ఉండటంతో పాటు కాలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ మీ డైట్లో ఆకుకూరలను చేర్చుకోవాలి. అంతేకాకుండా ఎముకల దృడత్వానికి అవసరమైన విటమిన్-కె కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. బెర్రీలు బెర్రీలు చూడటానికి చిన్నగా కనిపించినా ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, రాస్ బెర్రీస్ వంటి పలు రకాలు ఉంటాయి. బెర్రీల్లో గ్లూకోజ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. చేపలు సాల్మన్ చేపల్లో ప్రొటీన్, కొవ్వు, విటమిన్ బి12, బి6, సెలీనియం, నైసిన్, ఫాస్పరస్, థైయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు సాల్మన్ చేపల్లో ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వ్యాయామం బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేయడం మంచిది. చాలామంది కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసి తర్వాత మానేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మరింత బరువు కంట్రోల్లో ఉండదు. అలాగని అతిగా వ్యాయామం చేసినా మొదటికే మోసం వస్తుంది. అందుకే శరీరానికి ఎంత అవసరమో, అంత మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. -
డైట్లో అవి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు
అధిక బరువు నుంచి విముక్తి పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు. వాకింగ్, డైటింగ్, వ్యాయామం ... ఇలా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామంతో పాటు డైట్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేట్టు చూసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు కూరగాయలు చక్కగా సాయం చేస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. స్థూలకాయాన్ని నియంత్రణలో ఉంచకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వెంటాడుతాయి. శరీరాన్ని డొల్లగా మార్చేస్తాయి. రోజూ తగినంత నిద్ర, నీళ్లు, సరైన డైట్ వల్ల స్థూలకాయం రాకుండా ఉంటుంది. -
ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్! జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు..
అమెరికన్ ఫిట్నెస్ ఇన్ప్లుయెన్సర్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్ల వయసులోనే అనూహ్యంగా మరణించింది. ఎలాంటి కారణాలు లేకుండానే చనిపోయింది. ఓ రెస్టారెంట్కి భోజనానికి వెళ్లినప్పుడూ ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయగా చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. బరువు తగ్గాలనుకోవడమే ఆమెకు శాపమైందా? త్వరిగతిన బరువు తగ్గితే ప్రాణాలు కోల్పోతామా? తదితరాల గురించే ఈ కథనం.! అమెరికాలోని 40 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ బ్రాందీ మల్లోరీ 2014లో ఏబీసీ వెయిట్ లాస్ రియాలటీ షోతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో మారుమ్రోగిపోయింది. ఎందుకంటే? అక్కడ ఆ వెయిట్లాస్ షోలో ఏకంగా మల్లోరి 70 కిలోల బరువు తగ్గింది. విపరీతమైన బరువుతో బాధపడుతున్నవారికి ఆమె ఆదర్శంగా నిలిచింది. ఆమెలా బరువు తగొచ్చనే ఆలోచనను రేకెత్తించింది. అయితే ఆమె ఓ రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసి తెచ్చుకుని కార్ వద్దకు వచ్చింది. అంతే ఆ తర్వాత ఆమె ఏమయ్యిందో ఏమో!..ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేయగా కారణాలు ఏమి తెలియలేదు. చివరకి బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న విధానమే కారణమా? అనే సందేహలు తలెత్తాయి. దీంతో ఆ దిశగా విచారణ చేయగా.. బరువు తగ్గడం కోసం చేసే విపరీతమైన వ్యాయామాలు కారణంగానే చాలామంది చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అందుకోసం వారి అనుసరించే కట్టుదిట్టమైన డైటే.. ప్రధాన కారణం అని అన్నారు. "సడెన్గా కేలరీలు పరిమితంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, వల్ల బరువు తొందరగా తగ్గొచ్చు గానీ అది మీ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే? పోషకాహార లోపం, అలసట, కండరాల నష్టానికి దారితీస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియలకు ప్రభావితం చేసి ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే సప్లిమెంట్స్ కూడా ప్రమాదమే. అవి మధుమేహం వంటి ఇతరత్ర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకం కావొచ్చు. కొందరూ బారియాట్రిక్ సర్జరీలతో గణనీయమైన బరువు తగ్గేలా లక్ష్యం పెట్టుకుంటున్నారు. దీని వల్ల స్పీడ్గా బరువు తగ్గినప్పటికీ జీవితాంతం ఆహార నియమాలు పాటించాల్సిందే. ఏదిపడితే అది తినకూడదు. అందువల్ల త్వరితగతినే బరువు తగ్గేందుకు అనుసరించే పద్ధతులకు మన శరీరం వెంటనే సహకరించలేదు. మనం సడెన్గా మొదలు పెట్టే డైట్కి మన శరీర వ్యవస్థ అడ్జెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి నిధానంగా ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గే యత్నాలు చేయండి అని హితువు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇలానే హఠాన్మరణాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. (చదవండి: పచ్చి మిర్చిని పచ్చిగా తినడమా? అనుకోవద్దు!.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి
సాక్షి, అమరావతి: అవినీతికి పాల్పడి సాక్ష్యాధారాలతో సీఐడీకి దొరికిపోయిన మాజీ సీఎం చంద్రబాబు బయటపడే మార్గం కానరాకపోవడంతో అనారోగ్యమంటూ సానుభూతి నాటకానికి తెర తీశారు! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణకు సహకరించకుండా అసలు కేసునే కొట్టివేయాలని ఒకవైపు వాదిస్తూ మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం సరికొత్త ఎత్తుగడ వేశారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాజేసింది కాకుండా తప్పులనుకప్పిపుచ్చుకునేందుకు ఆయన చేస్తున్న యత్నాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. డీ హైడ్రేషన్.. స్కిన్ అలర్జీ.. బరువు తగ్గిపోయారంటూ రకరకాల అంశాలను ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు తెరపైకి తెచ్చి హడావుడి చేశారు. దీనిపై జైళ్ల శాఖ అధికారులు సత్వరమే స్పందించి వాస్తవాలను బహిర్గతం చేయడం ద్వారా దుష్ప్రచారానికి తెర దించారు. వాస్తవానికి జైలుకు వచ్చినప్పటి కంటే ప్రస్తుతం చంద్రబాబు బరువు మరో కిలో పెరగడం గమనార్హం. చంద్రబాబు తీసుకునే ఆహారం ఇంటి నుంచే వస్తోంది. ఆయనకు ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బయట తిరగడం లాంటి శారీరక శ్రమ ఏమాత్రం లేదు. అలాంటప్పుడు బరువు ఎందుకు తగ్గుతారనే స్పృహ లేకుండా నిస్సిగ్గుగా ఆరోపణలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు యథేచ్ఛగా పాల్పడ్డ కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటంతో టీడీపీ బెంబేలెత్తుతోంది. చంద్రబాబు 34 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు కాడి వదిలేశారు. మరోవైపు లోకేశ్ రాజకీయ కార్యక్షేత్రం కాడి వదిలేసి ఢిల్లీలో తలదాచుకోవడంతో భవిష్యత్పై టీడీపీ ఆశలు వదిలేసుకుంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏమాత్రం సానుభూతి కలసి రావడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. గత్యంతరం లేక ఏదో ఒక ఆందోళన నిర్వహిస్తున్నా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కనిపిస్తున్నారని, సామాన్యులు ఎవరూ ఇందులో పాలు పంచుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దింపుడు కళ్లెం ఆశతో టీడీపీ చివరి అస్త్రంగా చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదనే అవాస్తవ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. వైద్యుల నివేదికలు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారుల ప్రకటనతో ఆ యత్నం కూడా బెడిసికొట్టింది. మొన్ననే బాగున్నారన్న పయ్యావుల.. మూడు రోజులుగా చంద్రబాబుకు అరోగ్యం బాగా లేదంటూ వ్యూహాత్మకంగా ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది. గతవారం రెండో ములాకత్తో చంద్రబాబును కలిసిన లోకేశ్, పయ్యావుల కేశశ్ మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని, చంద్రబాబు పార్టీ కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం హఠాత్తుగా చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదంటూ ప్రచారానికి దిగారు. ఎంత పకడ్బందీగా దీన్ని వ్యాప్తిలోకి తెచ్చారంటే.. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదంటూ నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి వరుసగా ట్వీట్లు పెట్టారు. ఆ వెంటనే యనమల రామకృష్ణుడు అందుకున్నారు. అచ్చెన్నాయుడుతోపాటు పార్టీ సీనియర్ నేతలు సమావేశమై చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదంటూ ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఏకంగా ఐదు కిలోల బరువు తగ్గారని, కిడ్నీలు దెబ్బ తింటాయంటూ తామే వైద్యులమనే తరహాలో హడావుడి చేశారు. బాబు శరీరంపై దద్దుర్లు వచ్చాయని, ఏసీ లేకపోవడంతో ఈ సమస్య వచ్చిందని నిర్ధారించేయడం విస్మయ పరుస్తోంది. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తేవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుపై గుర్తు తెలియని డ్రోన్లు తిరిగాయని ఆరోపిస్తూ చంద్రబాబు భద్రతపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికిగానీ ఏదైనా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికిగానీ తరలించాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆసుపత్రి నుంచి రాజకీయం నెరపవచ్చన్నది టీడీపీ ఉద్దేశం. అందుకోసమే అనారోగ్యం, భద్రతకు ప్రమాదం అంటూ అసత్య ఆరోపణలు ప్రచారంలోకి తెచ్చారు. మాన్యువల్ ప్రకారం సదుపాయాలు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ కుట్రపూరితంగా చేసిన అసత్య ఆరోపణలను జైళ్ల శాఖ సమర్థంగా తిప్పికొట్టింది. జైలు మాన్యువల్లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని వివరించింది. జైళ్ల శాఖ మాన్యువల్లోని 1037, 385, 386 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం వీఐపీ ఖైదీలకు నిర్దేశించిన అన్ని సదుపాయాలను ఆయనకు కల్పిస్తున్నట్లు తెలిపింది. జైలు గదిలో ఫర్నిచర్, ఇతర వసతులను కూడా ఆమేరకు సమకూర్చినట్లు పేర్కొంది. జైళ్ల శాఖ మాన్యువల్ ప్రకారం జైలులో ఏసీగానీ ఎయిర్ కూలర్గానీ కల్పించే వెసులుబాటు లేదని వెల్లడించింది. మాన్యువల్కు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. చంద్రబాబు ఉన్న జైలు గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు చేశామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతిస్తున్నామని తెలిపింది. రోజూ జైలు వైద్య అధికారులు, సిబ్బంది చంద్రబాబును పరీక్షిస్తున్నారని, ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని వెల్లడించింది. సెకండ్ ఓపీనియన్ కోసం జీజీహెచ్ వైద్యులను కూడా పిలిపించి పరీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యుల నివేదిక కూడా వెల్లడించింది. ఇక జైలుకు వచ్చినప్పటి కంటే ప్రస్తుతం చంద్రబాబు ఒక కేజీ బరువు పెరిగి ప్రస్తుతం 67 కిలోల బరువు ఉండటం గమనార్హం. ఈమేరకు పూర్తి ఆధారాలు, వైద్య పరీక్షల నివేదికలను న్యాయస్థానానికి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జైళ్ల శాఖ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. బాలయ్య దూకుడుతో.. పూర్తి ఆధారాలతో చంద్రబాబు అవినీతిని వెలికి తీసిన సీఐడీ పకడ్బందీగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలులో ఉండగా ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ల అల్లర్ల కేసులు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు కూడా ఉంది. సీఆర్పీసీ, అవినీతి నిరోధక చట్టాల్లోని సెక్షన్లకు వక్రభాష్యం చెబుతూ ఢిల్లీ నుంచి రప్పించిన న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ రావడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పోనీ చినబాబును పట్టుకుని రాజకీయ గోదారి ఈదుదామనుకుంటే ఆయనేమో కేసుల భయంతో దేశ రాజధానిలో దాక్కున్నారు. ఇదే అవకాశంగా టీడీపీలో ఆధిపత్యం కోసం నందమూరి బాలకృష్ణ దూకుడుగా వ్యవహరించడం నారా కుటుంబాన్ని బెంబేలెత్తించింది. దాంతో తెలంగాణ ఎన్నికల సాకుతో బాలయ్యను ఆ రాష్ట్రానికే పరిమితం చేశారు. కిలో బరువు పెరిగారు: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, జిల్లా ఎస్పీ పి.జగదీష్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హై ప్రొఫైల్ ఖైదీ అయినందున తొలి రోజే ఆయనకు స్నేహ బ్యారక్ను కేటాయించామని గుర్తు చేశారు. ఆయన వద్ద 24 గంటలూ ఒక హెడ్ వార్డర్, ఆరుగురు వార్డర్లుంటారని, ఒక జైలర్ స్థాయి అధికారి విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆయనకు వచ్చే ఆహారం, ఇతరత్రా అన్నీ ఆయనే తనిఖీ చేసి చంద్రబాబుకు అందిస్తారని తెలిపారు. ములాఖత్కు చంద్రబాబు బయటకు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ఖైదీలు, ఇతరులు ఆ ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీతో వారానికోసారి భద్రతపై చర్చిస్తున్నామన్నారు. చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటున్నారని స్పష్టం చేశారు. ఖైదీలతో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. రోజుకు మూడుసార్లు పరీక్షలు.. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం, మందుల వివరాలను సేకరించామని డీఐజీ తెలిపారు. జైలులో వైద్యాధికారులు చంద్రబాబుతో మాట్లాడమే కాకుండా ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యుడితోనూ సంప్రదించినట్లు చెప్పారు. ఆయన మందులు వేసుకుంటున్నారా లేదా? అనేది జైలు వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. జైలుకు వచ్చినప్పుడు చంద్రబాబు 66 కేజీల బరువు ఉండగా ప్రస్తుతం 67 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. బరువు తగ్గిపోయారంటూ వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. రెండు రోజుల క్రితం డీహైడ్రేషన్ అని తెలియజేయగానే వైద్యాధికారులతో మాట్లాడి తగిన లిక్విడ్లు ఇచ్చినట్లు చెప్పారు. చర్మంపై దద్దుర్లకు సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య పరీక్షలు చేశారని, అవేమీ ప్రమాదరకర స్థాయిలో లేవన్నారు. చంద్రబాబు గదిలో 8 ఫ్యానులతో పాటు దోమ తెర కూడా ఏర్పాటు చేశామన్నారు. జైల్లోకి వచ్చినప్పుడు వెంట తెచ్చుకున్న మందులను ఆయన కొనసాగిస్తున్నారని వివరించారు. తప్పుడు వార్తలపై చర్యలు చంద్రబాబుకు ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్కు సంబంధించి కోర్టు సీలు, న్యాయమూర్తి సంతకం లేనందున వివరణ కోరినట్లు డీఐజీ తెలిపారు. సెంట్రల్ జైల్లో 2,039 మంది ఖైదీలున్నారని, వారిలో చంద్రబాబు ఒకరని, రిమాండ్ ఖైదీ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలానే తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోరిక మేరకు ఆయనను ప్రత్యేకంగా ఆస్పత్రికి పంపలేమన్నారు. తమపై ఒత్తిళ్లు ఉన్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సోషల్ మీడియా, పత్రికల్లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకుంటామని రవికిరణ్ హెచ్చరించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
ఫ్యాన్స్లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement