-
చరిత్ర సృష్టించిన సికందర్ రజా.. కోహ్లి రికార్డు సమం
టీ20 వరల్డ్కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు. ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది. కాగా, రువాండతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
T20 WC Qualifier: థ్రిల్లింగ్ మ్యాచ్.. ఇసుకేస్తే రాలనంత జనం.. ఊహించని ఫలితం
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా జరిగిన భారత్-సౌతాఫ్రికా మ్యాచ్తో క్రికెట్ ప్రపంచం మొత్తం బిజీగా ఉంటే.. నేపాల్లోని ఖాట్మండులో ఓ అద్భుతం జరిగింది. 2024 టీ20 వరల్డ్కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్లో ఒమన్.. తమకంటే పటిష్టమైన నేపాల్ను సూపర్ ఓవర్లో మట్టికరిపించింది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి సమానమైన స్కోర్లు (184 పరుగులు) చేయడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేయగా.. నేపాల్ కేవలం 10 పరుగులకు (వికెట్ కోల్పోయి) మాత్రమే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో ఒమన్ 2024 టీ20 వరల్డ్కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇరు జట్లు ఇదివరకే 2024 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించాయి. కిక్కిరిసిపోయిన స్టేడియం.. ఇసుకేస్తే రాలనంత జనం నేపాల్లో క్రికెట్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా వేల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. సొంత జట్టు మ్యాచ్ అయితే అభిమానులను కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. స్టేడియంలో నిలబడేందుకు కూడా ప్లేస్ దొరక్క జనాలు చెట్లు, టవర్లు ఎక్కుతున్నారు. ఇక్కడ క్రికెట్ క్రేజ్ ప్రమాదకర స్థాయికి చేరింది. నిన్న కిరిటీపూర్లో జరిగిన నేపాల్-ఒమన్ 2024 టీ20 వరల్డ్కప్ ఆసియా క్వాలిఫయర్స్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు జనాలు తండోపతండాలుగా స్టేడియంకు వచ్చారు. స్టేడియంలో వాతావరణం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. A cacophony of noise and a full house again here well before the start of play in Kathmandu as Nepal's anthem provides the goosebumps with the 30,000 or so in & around the TU singing in unison It's Nepal🇳🇵 v Oman🇴🇲 for the title with both teams guaranteed to the #T20WorldCup pic.twitter.com/CWDIQYLfMh — Andrew Leonard (@CricketBadge) November 5, 2023 ఇది చాలదనట్లు జనాలు స్టేడియం బయట ఉన్న చెట్లు, ఎత్తైన హోర్డింగ్లు ఎక్కి మ్యాచ్ వీక్షించారు. క్రికెట్ మ్యాచ్ల కోసం జనాలు స్టేడియానికి రావడం మంచిగానే అనిపిస్తున్నప్పటికీ, జరగరానిది ఏదైన జరిగితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. It's an electrifying atmosphere here at T.U Ground as always.#NEPvOMAN pic.twitter.com/5BJv1RAQud — Samraat Maharjan (@MaharjanSamraat) November 5, 2023 ఇదిలా ఉంటే, నేపాల్ ఫ్యాన్స్ తమ జట్టు టైటిల్ సాధిస్తుందేమోనని కిరీటీపూర్ స్టేడియానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ జట్టు అనూహ్యంగా సూపర్ ఓవర్లో ఓటమిపాలై, వారిని నిరాశపరిచింది. -
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం.. ఓ బౌలర్కు 7 వికెట్లు, అన్ని క్లీన్బౌల్డ్లే..!
అంతర్జాతీయ టీ20ల్లో మహాద్భుతం చోటు చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ ఆసియా క్వాలిఫయర్-బి పోటీల్లో భాగంగా చైనాతో ఇవాళ (జులై 26) జరిగిన మ్యాచ్లో మలేసియా బౌలర్ శ్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) ఏకంగా 7 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఇద్రుస్ పడగొట్టిన 7 వికెట్లు క్లీన్బౌల్డ్లే కావడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ ఇప్పటివరకు 7 వికెట్ల ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో ఓ మొయిడిన్ వేసి 8 పరుగులకు 7 వికెట్లు పడగొట్టిన ఇద్రుస్.. టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన 32 ఏళ్ల ఇద్రుస్.. తన స్వింగ్ మాయాజాలంతో పేట్రేగిపోవడంతో చైనా 11.2 ఓవర్లలో 23 పరుగులకే కుప్పకూలింది. ఇద్రుస్తో పాటు పవన్దీప్ సింగ్ (4-0-9-2), విజయ్ ఉన్ని (1.2-1-1-1) కూడా రాణించారు. చైనా ఇన్నింగ్స్లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోగా.. ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. చైనా ఇన్నింగ్స్లో వై గులే చేసిన 7 పరుగులే అత్యధికం. అనంతరం 24 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్వల్ప ఛేదనలో మలేసియా బ్యాటర్లు సైతం ఆరంభంలో తడబడ్డారు. ఓపెనర్లిద్దరూ డకౌట్లు అయ్యారు. వన్డౌన్ బ్యాటర్ షార్వీన్ సురేంద్రన్ (4 నాటౌట్), విరన్దీప్ సింగ్ (19 నాటౌట్) మలేసియాను విజయతీరాలకు చేర్చారు. చైనా బౌలర్లలో టియాన్ సెన్క్వన్, కెప్టెన్ వాంగ్ కీ తలో వికెట్ పడగొట్టారు. అంతర్జాతీయ టీ20ల్లో టాప్ 10 అత్యుత్తమ గణాంకాలు.. శ్యాజ్రుల్ ఇద్రుస్ (మలేసియా) (4-1-8-7) పీటర్ అహో (నైజీరియా) (3.4-1-5-6) దీపక్ చాహర్ (భారత్) (3.2-0-7-6) నక్రాని (ఉగాండ) (4-1-7-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-2-8-6) జెజె స్మిట్ (నమీబియా) (4-1-10-6) అజంతా మెండిస్ (శ్రీలంక) (4-1-16-6) ఓబెడ్ మెక్కాయ్ (వెస్టిండీస్) (4-1-17-6) లాంగట్ (కెన్యా) (4-1-17-6) ఫెన్నెల్ (అర్జెంటీనా) (4-0-18-6) -
క్వాలిఫయర్స్ టీమ్ ఆఫ్ ది టోర్నీ ప్రకటన.. విండీస్ నుంచి ఒక్కరు కూడా లేరు
క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023 టీమ్ ఆఫ్ ది టోర్నీని ఐసీసీ కొద్ది సేపటి కిందట ప్రకటించింది. ఈ జట్టులో టోర్నీ విజేత శ్రీలంక నుంచి ముగ్గురు, రన్నరప్ నెదర్లాండ్స్ నుంచి ముగ్గురు, టోర్నీ ఆధ్యాంతం సూపర్గా రాణించిన జింబాబ్వే నుంచి ముగ్గురు, సంచలన విజయాలు నమోదు చేసిన స్కాట్లాండ్ నుంచి ఇద్దరు చొప్పున ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ నుంచి ఒక్కరికి కూడా చోటు లభించలేదు. సూపర్ సిక్స్ దశలో విండీస్ ఐదో స్థానానికి పరిమితం కావడంతో ఐసీసీ ఆ జట్టును పరిగణలోకి తీసుకోలేదు. బ్యాటింగ్లో నికోలస్ పూరన్ (7 మ్యాచ్ల్లో 350 పరుగులు, 2 సెంచరీలు), షాయ్ హోప్ (7 మ్యాచ్ల్లో 341 పరుగులు, సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) సత్తా చాటినా, వీరిని సైతం ఐసీసీ విస్మరించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (శ్రీలంక, 417 పరుగులు, 2 సెంచరీలు), విక్రమ్జీత్ సింగ్ (నెదర్లాండ్స్, 326, సెంచరీ)లను ఎంపిక చేసిన ఐసీసీ.. వన్డౌన్లో బ్రాండెన్ మెక్ముల్లెన్ (స్కాట్లాండ్, 364, 2 సెంచరీలు, 13 వికెట్లు), నాలుగో స్థానంలో క్వాలిఫయర్స్ టాప్ స్కోరర్ సీన్ విలియమ్స్ (జింబాబ్వే, 600, 3 సెంచరీలు), ఐదో స్థానంలో యువ ఆల్రౌండర్ బాస్ డి లీడ్ (నెదర్లాండ్స్, 285, సెంచరీ, 15 వికెట్లు), ఆరో ప్లేస్లో సికందర్ రజా (జింబాబ్వే, 325, సెంచరీ, 9 వికెట్లు), ఏడో స్థానంలో స్కాట్ ఎడ్వర్డ్స్ (నెదర్లాండ్స్, 314, 4 అర్ధసెంచరీలు), స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా క్వాలిఫయర్స్ లీడింగ్ వికెట్ టేకర్లు హసరంగ (22 వికెట్లు), తీక్షణ (21) (శ్రీలంక), ఫాస్ట్ బౌలర్లుగా క్రిస్ సోల్ (స్కాట్లాండ్, 11 వికెట్లు), రిచర్డ్ నగరవ (జింబాబ్వే, 14 వికెట్లు)లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్ కమ్ వికెట్కీపర్గా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ను ఎంపిక చేసింది. -
అజేయ లంక.. క్వాలిఫయర్స్ ఫైనల్లో జయకేతనం
వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్ విజేతగా నిలిచింది. 🇦🇪 ✅ 🇴🇲 ✅ 🍀 ✅ 🏴 ✅ 🇳🇱 ✅ 🇿🇼 ✅ 🌴 ✅ 🏆 ✅ 🙏 Namaste India ✅#LionsRoar #CWC23 pic.twitter.com/nO7U14F9ky — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించారు. 🔥 Another fiery spell of fast bowling by Dilshan Madushanka! 💪🏏#LionsRoar #CWC23 pic.twitter.com/tCwDdA6ojw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. He is unstoppable! 💪 Another match-winning spell by Maheesh Theekshana! 🏏🎉🔥#LionsRoar pic.twitter.com/FY0YwfMAwg — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో మ్యాక్స్ ఓడౌడ్ (33), వాన్ బీక్ (20 నాటౌట్), విక్రమ్జీత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకను వణికించిన నెదర్లాండ్స్ బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే కట్టడి
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023 ఫైనల్లో నెదర్లాండ్స్ బౌలర్లు లంకేయులను కట్టడి చేశారు. డచ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో లంక జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు శ్రీలంకను ఆలౌట్ చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓ దశలో (35.3 ఓవర్లలో 180/3) పటిష్ట స్థితిలో ఉండింది. అయితే ఆ జట్టు 10 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. లంక ఇన్నింగ్స్లో కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఇదివరకే వరల్డ్కప్కు అర్హత సాదించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఇదివరకే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించాయి. భారత్ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్లో ఈ రెండు జట్లు.. భారత్ సహా 8 జట్లతో తలపడతాయి. క్వాలిఫయర్స్లో రెండో బెర్తు కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ల నుంచి తీవ్రపోటీ ఎదుర్కొన్న నెదర్లాండ్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరి, ఇక్కడ ఓటమి ఎదరుగని శ్రీలంకకు చుక్కలు చూపించింది. లంక నిర్ధేశించిన 234 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ఛేదించగలిగితే చరిత్ర సృష్టించినట్లవుతుంది. -
#BasDeLeede: తండ్రికి తగ్గ తనయుడు..
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వన్డే ప్రపంచకప్కు నెదర్లాండ్స్ జట్టు ఐదోసారి అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 1996, 2003, 2007, 2011లో నాలుగుసార్లు డచ్ జట్టు వన్డే వరల్డ్కప్ ఆడింది. ఈ నాలుగు సందర్భాల్లో మూడుసార్లు తన జట్టును వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అతనే టిమ్ డీ లీడే.. ఈ పేరు మీకు ఎక్కువగా పరిచయం లేకపోవచ్చు. కానీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా శుక్రవారం సూపర్ సిక్స్లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఒకడి పేరు బాగా మార్మోగిపోయింది. అతనే బాస్ డీ లీడే. బౌలింగ్లో ఐదు వికెట్లు.. బ్యాటింగ్లో 123 పరుగులు వీరోచిత సెంచరీ.. వెరసి ఆల్రౌండ్ ప్రదర్శనతో తన జట్టును వన్డే వరల్డ్కప్ ఆడే అర్హతను సాధించిపెట్టాడు. 278 పరుగులు లక్ష్యాన్ని కేవలం 42.5 ఓవర్లలోనే చేధించిన డచ్ జట్టు క్వాలిఫయర్-2గా.. పదో జట్టుగా వన్డే వరల్డ్కప్లోకి అడుగుపెట్టింది. మరి ఒంటిచేత్తో నెదర్లాండ్స్ను వన్డే వరల్డ్కప్లో పాల్గొనేలా చేసిన బాస్ డీ లీడే.. ఎవరో కాదు.. పైన మనం చెప్పుకున్న టిమ్ డీ లీడే కుమారుడే. బాస్ డీ లీడే తన వీరోచిత పోరాటంతో 12 ఏళ్ల తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ వన్డే వరల్డ్కప్ ఆడేందుకు అర్హత సాధించిపెట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక టిమ్ డీ లీడే 1996లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 11 ఏళ్ల కెరీర్లో కేవలం వన్డే వరల్డ్కప్ మ్యాచ్లు మాత్రమే ఆడిన టిమ్ డీ లీడే 29 మ్యాచ్ల్లో 400 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 29 వికెట్లు పడగొట్టి బౌలింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. 2018లో నేపాల్తో మ్యాచ్లో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బాస్ డీ లీడే అనతికాలంలోనే మంచి పేరు సంపాదించాడు. మిడిలార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్కు వచ్చే బాస్ డీ లీడే మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు 30 వన్డేల్లో 765 పరుగులతో పాటు 24 వికెట్లు, 31 టి20ల్లో 610 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 27 వికెట్లు పడగొట్టాడు. కాగా స్కాట్లాండ్తో మ్యాచ్లో విజయం అనంతరం ఐసీసీ నెదర్లాండ్స్కు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసిది. ఆ ఫోటోలో బాస్ డీ లీడే.. తన తండ్రి టిమ్ డీ లీడేను గుర్తుచేస్తూ సేమ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్గా నిలిచింది. ఇదే విషయాన్ని ఐసీసీ వివరిస్తూ తండ్రికి తగ్గ తనయుడు.. బాస్ డీ లీడే సన్నాఫ్ టిమ్ డీ లీడే అంటూ క్యాప్షన్ జత చేసింది. Tim de Leede, Bas de Leede 🏏 Like father, like son 🇳🇱 #CWC23 More: https://t.co/qguNPPA8ai pic.twitter.com/KGECQ1yt5s — ICC (@ICC) July 7, 2023 చదవండి: #NED Vs SCO: ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్కప్కు నెదర్లాండ్స్ అర్హత Bas De Leede: సెంచరీ హీరో ప్రపంచ రికార్డు.. వాళ్లెవరికీ సాధ్యం కాలేదు! దిగ్గజం సరసన.. -
థ్రిల్లర్ను తలపించిన వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచ్
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో తొమ్మిదో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ థ్రిల్లర్ను తలపించింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో యూఏఈ ఆఖరి బంతికి పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో యూఎస్ఏ చివరి బంతికి కనీసం ఒక్క పరుగు చేసినా మ్యాచ్ టై అయ్యేది. అయితే సంచిత్ శర్మ బౌలింగ్లో అరవింద్కు క్యాచ్ ఇచ్చి అలీ ఖాన్ ఔట్ కావడంతో యూఏఈ పరుగు తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆఖరి ఓవర్లో యూఎస్ఏ గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా, చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. తొలి 3 బంతులకే 7 పరుగులు రావడంతో యూఎస్ఏ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. అయితే యూఏఈ బౌలర్ సంచిత్ శర్మ అనూహ్యంగా పుంజుకుని నాలుగో బంతికి, ఆఖరి బంతికి వికెట్లు సాధించి, తన జట్టును గెలిపించాడు. అప్రధానమైన ఈ మ్యాచ్లో గెలుపొందడం ద్వారా యూఏఈ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆసిఫ్ ఖాన్ 151 నాటౌట్.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్ ఆసిఫ్ ఖాన్ (145 బంతుల్లో 151 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈ ఇన్నింగ్స్లో ఆసిఫ్ ఖాన్ చెలరేగగా.. ఆర్యాన్ష్ శర్మ (57), బాసిల్ హమీద్ (44) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్ 2, నోష్తుష్ కెంజిగే, నేత్రావాల్కర్ తలో వికెట్ పడట్టారు. రాణించిన జోన్స్, మోనాంక్ పటేల్, గజానంద్.. 309 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏస్ఏ సైతం అద్భుతంగా పోరాడింది. ఆరోన్ జోన్స్ (75), మోనాంక్ పటేల్ (61), గజానంద్ సింగ్ (69) అర్ధసెంచరీలతో రాణించడంతో యూఏస్ఏ విజయతీరాల వరకు చేరింది. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయలేక ఆ జట్టు ఓటమిపాలై, క్వాలిఫయర్స్లో చివరి స్థానంలో నిలిచింది. యూఏఈ బౌలర్లలో సంచిత్ శర్మ 3, సిద్దిఖీ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, జవాదుల్లా, అఫ్జల్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. -
వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. భారత షెడ్యూల్ ఇలా..!
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే పదో జట్టుగా నెదర్లాండ్స్ నిన్ననే (జులై 6) తమ బెర్తును ఖరారు చేసుకుంది. క్వాలిఫయర్స్ పోటీల్లో నిన్న స్కాట్లాండ్పై విజయం సాధించడం ద్వారా డచ్ టీమ్ మెగా టోర్నీలో పాల్గొనే సువర్ణావకాశాన్ని దక్కించుకుంది. దీనికి ముందు ఇదే క్వాలిఫయర్స్లో సత్తా చాటడం ద్వారా శ్రీలంక కూడా వరల్డ్కప్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. మొత్తంగా క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్కప్కు అర్హత సాధించాయి. క్వాలిఫయర్-1గా శ్రీలంక, క్వాలిఫయర్-2గా నెదర్లాండ్స్ నిలిచాయి. క్వాలిఫయర్స్ ఫైనల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఈ రెండు జట్లు ప్రపంచకప్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఈ జట్ల చేరిక తర్వాత వరల్డ్కప్ షెడ్యూల్కు తుది రూపు వచ్చింది. మెగా టోర్నీలో భారత్ ఆడబోయే మ్యాచ్లపై కూడా ఓ క్లారిటీ వచ్చింది. 7 మ్యాచ్లు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యధాతథంగా జరుగనుండగా.. నవంబర్ 2న ముంబై వేదికగా భారత్తో తలపడబోయే ప్రత్యర్ధిగా నెదర్లాండ్స్, నవంబర్ 11న బెంగళూరు వేదికగా జరుగబోయే మ్యాచ్లో భారత ప్రత్యర్ధిగా శ్రీలంక జట్లు నిలువనున్నాయి. ఇక హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్ల్లోనూ ఏయే జట్లు తలపడునున్నది కూడా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తంగా క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 జట్లు ఖరారు కావడంతో వరల్డ్కప్ షెడ్యూల్ తుది రూపు సంతరించుకుంది. భారత్ ఆడబోయే మ్యాచ్ల వివరాలు.. అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై) అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (ముంబై) నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్కతా) నవంబర్ 11: ఇండియా వర్సెస్ శ్రీలంక (బెంగళూరు) ఉప్పల్ స్టేడియంలో జరుగబోయే మ్యాచ్ల వివరాలు.. అక్టోబర్ 6 (శుక్రవారం): పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక అక్టోబర్ 9 (సోమవారం): న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక అక్టోబర్ 12 (గురువారం): పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ -
ఐదు వికెట్లు, వీరోచిత శతకం.. వన్డే వరల్డ్కప్కు నెదర్లాండ్స్ అర్హత
అక్టోబర్లో జరగనున్న వన్డే వరల్డ్కప్కు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన వరల్డ్కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్ మ్యాచ్లో డచ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో(బౌలింగ్లో ఐదు వికెట్లు, బ్యాటింగ్లో సెంచరీ) మెరిసిన బాస్ డీ లీడే హైలెట్గా నిలిచాడు. దీంతో క్వాలిఫయర్-2 హోదాలో నెదర్లాండ్స్ వరల్డ్కప్కు పదో జట్టుగా అర్హత సాధించింది. ఇక క్వాలిఫయర్-1గా శ్రీలంక ఇప్పటికే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించగా.. తాజాగా డచ్ జట్టు క్వాలిఫయర్-2 హోదాలో వన్డే వరల్డ్కప్కు వెళ్లనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్కప్ జరగనుంది. భారత్ గడ్డపై ఈ మెగా సంగ్రామం జరగనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లన్ 110 బంతుల్లో 106 పరుగులు సెంచరీ చేయగా.. కెప్టెన్ రిచీ బెరింగ్టన్ 64, థామస్ మెకింటోష్ 38 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే ఐదు వికెట్లు తీయగా.. రెయాన్ క్లీన్ రెండు, వాన్బీక్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. నెదర్లాండ్స్ మిడిలార్డర్ బ్యాటర్ బాస్ డీ లీడే(92 బంతుల్లో 123 పరుగులు) సంచలన శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్ విక్రమ్జిత్ సింగ్ 40 పరుగులు, ఆఖర్లో సకీబ్ జుల్పికర్ 33 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలిగ్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వీరోచిత శతకంతో మెరిసిన బాస్ డీ లీడేను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు వరించింది. 90 (82) 👉 123 (92) Bas de Leede went berserk in the last 10 balls he faced to seal Netherlands' #CWC23 qualification 💪#SCOvNED pic.twitter.com/gJMrkhm3aU — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 A stunning heist! 😱 Netherlands have booked their #CWC23 tickets 🎫✈#SCOvNED pic.twitter.com/HtdyRvTWo0 — ICC Cricket World Cup (@cricketworldcup) July 6, 2023 చదవండి: #MitchellMarsh: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ -
విండీస్ విజయం; చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం
క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా వెస్టిండీస్ జట్టు సూపర్ సిక్స్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరల్డ్కప్ అర్హత అవకాశాన్ని కోల్పోయిన వెస్టిండీస్కు ఈ విజయం ఊరట మాత్రమే. బుధవారం సూపర్ సిక్స్లో భాగంగా వెస్టిండీస్, ఒమన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. సూరజ్ కుమార్ 53 పరుగులు నాటౌట్, షోయబ్ ఖాన్ 50 పరుగులతో రాణించగా.. అయాన్ ఖాన్ 30, కశ్యప్ 31 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ మూడు వికెట్లు తీయగా.. కైల్ మేయర్స్ రెండు, కెవిన్ సింక్లెయిర్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 39.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 100 పరుగులు) శతకంతో మెరవగా.. కెప్టెన్ షెయ్ హోప్ 63 నాటౌట్, పూరన్ 19 పరుగులు నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. -
వన్డే వరల్డ్కప్కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..!
ఐర్లాండ్ వన్డే వరల్డ్కప్-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్లో నేపాల్పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) పాల్ స్టిర్లింగ్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించింది. 32 ఏళ్ల బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్ల్లో ఐర్లాండ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. బల్బిర్నీ 2019లో ఈ బాధ్యతలు చేపట్టాడు. బల్బిర్నీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గెలుపుతో ముగింపు పలకడం విశేషం. కాగా, జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్కప్-2023 క్వాలిఫయర్స్లో ఐర్లాండ్ కనీసం సూపర్ సిక్స్ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న శ్రీలంక ఇదివరకే వన్డే వరల్డ్కప్-2023కు అర్హత సాధించగా.. మరో బెర్త్ కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొంది. నిన్న జరిగిన కీలక సూపర్ సిక్స్ మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓటమితో జింబాబ్వే వరల్డ్కప్ రేసు నుంచి నిష్క్రమించింది. -
వరల్డ్కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్.. స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ
బులవాయో: తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో తడబడటంతో... జింబాబ్వే జట్టు వరుసగా రెండోసారి వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్కు అర్హత సాధించలేకపోయింది. వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన తమ ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 234 పరుగులు సాధించింది. మైకేల్ లీస్క్ (48; 3 ఫోర్లు, 2 సిక్స్లు), మాథ్యూ క్రాస్ (38; 2 ఫోర్లు), బ్రెండన్ మెక్ములెన్ (34; 6 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు, చటారా రెండు వికెట్లు తీశారు. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. రియాన్ బర్ల్ (83; 8 ఫోర్లు, 1 సిక్స్), సికందర్ రజా (34; 2 ఫోర్లు, 1 సిక్స్), మధెవెరె (40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ సోల్ (3/33) జింబాబ్వేను దెబ్బ కొట్టాడు. మెక్ములెన్, లీస్క్ రెండు వికెట్ల చొప్పున తీశారు. 2019లోనూ జింబాబ్వే క్వాలిఫయింగ్ టోర్నీలోనే వెనుదిరిగింది. జింబాబ్వేపై విజయంతో స్కాట్లాండ్ దాదాపుగా ప్రపంచకప్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈనెల 6న నెదర్లాండ్స్తో జరిగే తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మెగా ఈవెంట్కు అర్హత పొందుతుంది. ఒకవేళ ఓడిపోయినా నెదర్లాండ్స్ కంటే రన్రేట్ తక్కువ కాకుండా చేసుకుంటే స్కాట్లాండ్కే ప్రపంచకప్ బెర్త్ ఖరారవుతుంది. నెదర్లాండ్స్ ప్రపంచకప్కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా, క్వాలిఫయర్స్లో అజేయంగా ఉన్న శ్రీలంక, భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్కు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్
జింబాబ్వే జట్టును దురదృష్టం వెంటాడింది.వరల్డ్కప్కు అర్హత సాధించాలన్న కల చెదిరింది. సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో గ్రూప్ దశలో వరుస విజయాలతో చెలరేగింది. సీన్ విలియమ్స్ వరుస సెంచరీలకు తోడుగా సికందర్ రజా ఆల్రౌండ్ ప్రదర్శన చేస్తుండడంతో జింబాబ్వే ఈసారి వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తుందని అంతా భావించారు. అయితే సూపర్ సిక్స్ దశకు వచ్చేసరికి చతికిలపడింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయంతో జింబాబ్వే అవమాన భారంతో వరల్డ్కప్ అర్హత రేసు నుంచి నిష్క్రమించింది. క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ రేసులో భాగంగా మంగళవారం స్కాట్లాండ్తో జరిగిన సూపర్ సిక్స్ ఆరో మ్యాచ్లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 235 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. రియాన్ బర్ల్ 84 బంతుల్లో 83 పరుగులు వీరోచిత పోరాటం వృథాగా మిగిలిపోయింది. మెస్లీ మెద్వెర్ 40, సికందర్ రజా 34 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ సోల్ మూడు వికెట్లు తీయగా, బ్రాండన్ మెక్ముల్లన్ రెండు, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మైకెల్ లీస్క్ 48, మాథ్యూ క్రాస్ 38, బ్రాండన్ మెక్ముల్లన్ 34, మున్సే 31, మార్క్ వాట్ 21 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ మూడు వికెట్లు తీయగా.. చటారా రెండు, నగరవా ఒక వికెట్ పడగొట్టాడు. సూపర్ సిక్స్లో వరుస రెండు ఓటములు జింబాబ్వే కొంపముంచితే.. తొలి మ్యాచ్లో ఓడినా వరుసగా రెండు విజయాలతో ప్లస్ రన్రేట్తో ఉన్న స్కాట్లాండ్ ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. దీంతో ఆ జట్టుకు వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించే చాన్స్ ఉంది. స్కాట్లాండ్ తమ చివరి మ్యాచ్ నెదర్లాండ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ గెలిస్తే నేరుగా వరల్డ్కప్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడినా స్కాట్లాండ్కు అవకాశం ఉంటుంది. కాకపోతే నెదర్లాండ్స్ చేతిలో భారీ ఓటమి పాలవ్వకుండా జాగ్రత్తపడాలి. స్కాట్లాండ్తో మ్యాచ్లో నెదర్లాండ్స్ 30 కంటే ఎక్కువ పరుగులతో గెలవాలి లేదంటే చేజింగ్లో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకోవాలి. అప్పుడే నెదర్లాండ్స్ వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం డచ్ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. స్కాట్లాండ్ను ఓడించినా ఆ జట్టు ఆరు పాయింట్లకు చేరుకుంటుంది. అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. Final World Cup 2023 spot qualification scenario: Scotland - win and grab their tickets for India. Netherlands - win by 30+ runs or chase the target with 6 overs to spare. pic.twitter.com/R0HzIljTSl — Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2023 చదవండి: #AlexCarey: 'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి' -
క్రికెట్ చచ్చిపోతుంది.. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా ఉండాలి..!
వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఘోర పరాజయాలు ఎదుర్కొని, తొలిసారి వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో క్రికెట్ సర్కిల్స్లో ప్రపంచకప్ అర్హతలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రపంచకప్ అంటే పేరుకు తగ్గట్టుగా కనీసం 16 దేశాలతో పోటీలు నిర్వహించాలని, అలా కాకుండా 4 ఏళ్లకు ఓ సారి జరిగే మెగా టోర్నీని 10 జట్లకే పరిమితం చేసి, విండీస్లా మేలైన జట్లకు అన్యాయం చేయడం సమంజసం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ మైబుర్గ్ సైతం చెప్పుకొచ్చాడు. వాస్తవ విషయం ఏంటంటే.. పరిమిత జట్లతో ప్రపంచకప్ నిర్వహించడం వల్ల క్రికెట్ చచ్చిపోతుంది. ప్రపంచకప్ పేరుకు తగ్గట్టుగా ప్రపంచం నలుమూలల నుంచి జట్లకు ప్రాతినిధ్యం లభించాలి. మెగా టోర్నీలో కనీసం 16 జట్లైనా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. అన్ని క్రీడల మెగా టోర్నీల్లో జట్ల సంఖ్య పెరుగుతుంటే క్రికెట్లో మాత్రం జట్లను తగ్గించుకుంటూ వస్తున్నారు. వెస్టిండీస్ లాంటి జట్టు వరల్డ్కప్ ఆడటం లేదన్న విషయం తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అంటూ స్టీఫెన్ మైబుర్గ్ అన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. Spare your thoughts on 10 teams at the ODI World Cup main event✍️ 📸: ICC#ICCWorldCupQualifier #WestIndies pic.twitter.com/WRAaBfXQJI — CricTracker (@Cricketracker) July 3, 2023 కాగా, ప్రస్తుతానికి (జులై 3) వరల్డ్కప్ క్వాలిఫయర్స్ పోటీల ద్వారా శ్రీలంక వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య పోటీ నెలకొని ఉంది. రేపు ఈ ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్తో రెండో బెర్త్పై కూడా దాదాపుగా క్లారిటీ రానుంది. సూపర్ సిక్స్లో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు క్వాలిఫయర్స్ ఫైనల్కు చేరడంతో పాటు ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. వన్డే వరల్డ్కప్కు భారత్ సహా 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఇటీవలే వరల్డ్కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. -
కొనసాగుతున్న సీన్ విలియమ్స్ భీకర ఫామ్.. వదిలితే రన్మెషీన్ను మించిపోయేలా ఉన్నాడు..!
వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 3 సెంచరీలు (102*, 174, 142), ఓ భారీ హాఫ్ సెంచరీ (91) సాయంతో 532 పరుగులు చేసిన విలియమ్స్.. ఇవాళ (జులై 2) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో మరో అర్ధసెంచరీ (56) సాధించి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని మరిపించాడు. విరాట్ 5 వరుస వన్డే ఇన్నింగ్స్ల్లో 4 శతకాల సాయంతో 596 పరుగులు చేస్తే.. విలియమ్స్ ఇంచుమించు విరాట్ రికార్డును సమం చేసినంత పని చేశాడు. సీన్ విలియమ్స్ ఫామ్ వన్డేల వరకే పరిమితమైందనుకుంటే పొరపాటే. ఈ వెటరన్ ఆల్రౌండర్ టెస్ట్ల్లోనూ భీకర ఫామ్లో ఉన్నాడు. విలియమ్స్ చివరిగా ఆడిన 5 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, విలియమ్స్ పరుగుల ప్రవాహం కొనసాగుతుండటంతో వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో జింబాబ్వే విజయ యాత్ర కొనసాగుతుంది. ఆ జట్టు సూపర్ సిక్స్లో శ్రీలంకతో సమానంగా 6 పాయింట్లు సాధించి , వన్డే వరల్డ్కప్-2023 బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే, శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న కీలక మ్యాచ్లో మాత్రం జింబాబ్వే చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు 32.2 ఓవర్లలో 165 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. సీన్ విలియమ్స్ (56) టాప్ స్కోరర్గా నిలిచాడు. సికందర్ రజా (31) కాస్త పర్వాలేదనిపించాడు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ (4/25), మధుశంక (3/15), పతిరణ (2/18), షనక (1/30) చెలరేగిపోయారు. -
42 మ్యాచ్ల వరకు ఒక్కసారి కూడా లేదు.. ఆతర్వాత వరుసగా 3 సార్లు 'ఆ ఘనత'
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఇటీవలికాలంలో బంతితో పేట్రేగిపోతున్నాడు. వికెట్లకు మినిమం గ్యారెంటీగా మారిపోయాడు. మ్యాచ్లో కనీసం 2 వికెట్లయినా పడగొడుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు. గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న హసరంగ.. ఇటీవల వరుసగా 3 మ్యాచ్ల్లో ఐదు వికెట్ల ఘనత సాధించి, దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ రికార్డు సమం చేశాడు. ఈ క్రమంలో హసరంగ వన్డే కెరీర్కు సంబంధించిన బౌలింగ్ గణంకాలు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కెరీర్లో ఇప్పటివరకు 46 వన్డేలు ఆడిన హసరంగ.. తొలి 39 మ్యాచ్ల్లో కేవలం 39 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అప్పటివరకు సాధారణ బౌలర్లా ఉన్న హసరంగ ఒక్కసారిగా ప్రపంచ స్థాయి బౌలర్గా మారిపోయాడు. తదుపరి ఆడిన 7 మ్యాచ్ల్లో ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 ఐదు వికెట్లు ఘనతలు, ఆతర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో 3 వికెట్లు, అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్ల్లో 2 వికెట్లు పడగొట్టాడు. హసరంగ చెలరేగుతుండటంతో వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక వరుసగా విజయాలు సాధిస్తూ.. వరల్డ్కప్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో హసరంగ 5 మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టాడు. గత 7 మ్యాచ్ల్లో హసరంగ గణాంకాలు.. నెదర్లాండ్స్పై 9-2-42-3 స్కాట్లాండ్పై 4.2-1-7-3 ఐర్లాండ్పై 8-1-24-6 ఒమన్పై 7.2-2-13-5 యూఏఈపై 10-0-79-5 ఆఫ్ఘనిస్తాన్పై 6-0-42-2 ఆఫ్ఘనిస్తాన్పై 10-0-53-2 -
అజేయ శ్రీలంక.. పూర్వ వైభవం దిశగా అడుగులు
1990 దశకం మధ్యలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు జెంటిల్మెన్ గేమ్పై ఏకఛత్రాధిపత్యం చలాయించి, ఈ మధ్యలో రెండుసార్లు (1996 వన్డే వరల్డ్కప్, 2014 టీ20 వరల్డ్కప్) జగజ్జేతగా నిలిచిన శ్రీలంక క్రికెట్ జట్టు.. స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా నిష్క్రమించడంతో గత కొద్దికాలంగా అతి సాధారణ జట్టుగా మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ జట్టు తిరిగి గాడిలో పడుతున్నట్లు కనిపిస్తుంది. టెస్ట్లను, టీ20లను పక్కన పెడితే ఆ జట్టు ఇటీవలికాలంలో వన్డేల్లో వరుస విజయాలు సాధిస్తూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంది. నిన్నటి వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023 సూపర్ సిక్స్ మ్యాచ్లో నెదర్లాండ్స్పై గెలుపుతో కలిపుకుని ఇటీవలికాలంలో ఆ జట్టు వరుసగా 7 విజయాలు సాధించింది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్పై రెండో వన్డే మొదలైన ఆ జట్టు గెలుపు ప్రస్థానం.. నిన్నటి నెదర్లాండ్స్ మ్యాచ్ వరకు నిరాటంకంగా సాగింది. ఫలితంగా 2023 వన్డే ప్రపంచకప్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంక సాధిస్తున్న వరస విజయాల్లో స్పిన్నర్ వనిందు హసరంగ, వెరటన్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా హపరంగ ప్రతి మ్యాచ్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్దులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. క్వాలిఫయర్స్లో ఇప్పటివరకు ఆతను 5 మ్యాచ్ల్లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ ఫైఫర్లు (5 వికెట్ల ఘనత) ఉన్నాయి. క్వాలిఫయర్స్లో సూపర్ సిక్స్ విషయానికొస్తే.. ఈ దశలో శ్రీలంక (6 పాయింట్లు) అని జట్ల కంటే టాప్లో ఉంది. జింబాబ్వే కూడా సమానమైన పాయింట్లే కలిగి ఉన్నప్పటికీ.. ఆ జట్టు నెట్ రన్రేట్ శ్రీలంకతో పోలిస్తే తక్కువగా ఉంది. ఈ దశలో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ 3,4 స్థానాల్లో ఉండగా.. వెస్టిండీస్ 0 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి, 2023 వరల్డ్కప్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. -
ఓడినా వణికించింది.. వరల్డ్కప్ అర్హతకు చేరువలో లంక
వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించే అంశంలో శ్రీలంక మరింత దగ్గరైంది. క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో సూపర్ సిక్స్లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్, శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ అయింద. ఒక దశలో నెదర్లాండ్స్ విజయం దిశగా నడిచి శ్రీలంకను వణికించింది. అయితే లంక బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో నెదర్లాండ్స్ను నిలువరించారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 బంతుల్లో 67 పరుగులు చేయగా.. వెస్లీ బార్సీ 52 పరుగులు, బాస్ డీ లీడే 41 పరుగుల చేశారు. లంక బౌలర్లలో మహీషా తీక్షణ మూడు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమారా, మధుషనక, షనకలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డిసిల్వా 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్లు తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక వరల్డ్కప్ అర్హతకు మరింత చేరువైంది. ప్రస్తుతం లంక ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్ ఓటమితో ఇబ్బందుల్లో పడింది. డచ్ తమకు మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇతర జట్ల ఓటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Back on 🔝 Sri Lanka reclaim the No.1 spot in the Super Six Standings and are on the verge of booking their #CWC23 berth 🤩 pic.twitter.com/peX1Jfxmq4 — ICC Cricket World Cup (@cricketworldcup) June 30, 2023 చదవండి: #Ashes2023: స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు! దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు -
దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు
క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా నెదర్లాండ్స్తో జరుగుతున్న సూపర్ సిక్స్లో శుక్రవారం రెండో మ్యాచ్లో లంక తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: రంపం మెషిన్తో ఆత్మహత్యకు పాల్పడ్డ స్టార్ స్నూకర్ 'ఇదేం పాడు పని'.. వైరలవుతున్న లబుషేన్ చర్య -
ఒమన్పై విజయం.. వరల్డ్కప్ అర్హత దిశగా జింబాబ్వే
సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. గురువారం మొదలైన సూపర్ సిక్స్ పోటీల్లో జింబాబ్వే, ఒమన్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్సన్(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్ రజా 49 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 333 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఒమన్ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అకీబ్ ఇల్యాస్ 45, జీషన్ మక్సూద్ 37, ఆయానా ఖాన్ 47 పరుగులు చేశాడు. ఒక దశలో 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులతో గెలిపించేలా అనిపించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొహమ్మద్ నదీమ్ 18 బంతుల్లోనే 30 పరుగులు నాటౌట్ ఆశలు రేపినా మిగతావారు సహకరించడంలో విఫలమయ్యారు. దీంతో ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, తెందయి చతారాలు చెరో మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా రెండు,సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్ సిక్స్లో రెండో టాపర్గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తుంది. A hard-fought win! 🇿🇼 beat Oman by 1⃣4⃣ runs in the first match of the Super Six 🙌 📝: https://t.co/wBKKKFmDjo #ZIMvOMA | #CWC23 pic.twitter.com/aTn5aruPjo — Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2023 చదవండి: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్చేస్తే Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
హ్యాట్రిక్ సెంచరీ.. జట్టును వరల్డ్కప్కు చేర్చడమే ధ్యేయంగా!
జింబాబ్వే సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్స్ తన జట్టును వరల్డ్కప్కు క్వాలిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. తన కెరీర్లోనే పీక్ ఫామ్ కనబరుస్తున్న సీన్ విలియమ్స్ మరో సెంచరీతో మెరిశాడు. క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా గురువారం సూపర్ సిక్స్లో ఒమన్తో మ్యాచ్లో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో సీన్ విలియమ్స్కు ఇది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. గ్రూప్ దశలో అమెరికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 175 పరుగుల ఇన్నింగ్స్తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ తన జోరును సూపర్ సిక్స్లోనూ చూపిస్తున్నాడు. 81 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న విలియమ్సన్ ఖాతాలో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విలిమయమ్సన్ ధాటికి జింబాబ్వే మరోసారి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జింబాబ్వే 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విలియమ్సన్ 119 పరుగులతో అజేయంగా ఆడుతుండగా.. రియాన్ బర్ల్ 2 పరుగులతో సహకరిస్తున్నాడు. కాగా వలర్డ్కప్ క్వాలిఫయర్ టోర్నీలో ప్రస్తుతం విలియమ్సన్ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ రెండు అర్థసెంచరీలు, మూడు సెంచరీల సాయంతో 506 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో నికోలస్ పూరన్ 296 పరుగులతో ఉన్నాడు. టాప్-2 స్కోరర్స్కు చాలా తేడా ఉంది. దీంతో అతని దూకుడు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. The third hundred in the tournament 💯 A batting average of over 100 in ODIs in 2023 ✅ Sean Williams is UNSTOPPABLE! 💥#ZIMvOMA | #CWC23 pic.twitter.com/R89inyV9KT — ICC (@ICC) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాక్ రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్.. వెస్టిండీస్ కీలక నిర్ణయం!
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్-2023లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసింది. వరుసగా రెండు మ్యాచ్లు ఆడి వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. విండీస్ సూపర్ సిక్స్కు క్వాలిఫై అయినప్పటికి.. ప్రపంచకప్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాలంటే అద్భుతాలు జరగాల్సిందే. ఇక సూపర్ సిక్స్ రౌండ్ ప్రారంభానికి ముందు వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మధ్యలో తప్పుకున్న స్పిన్నర్ యాన్నిక్ కారియా స్థానంలో మరో స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ విండీస్ క్రికెట్ భర్తీ చేసింది. ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో యాన్నిక్ కారియాకు గాయమైంది. బంతి అతడి ముక్కుకు బలంగా తాకడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సూపర్ సిక్స్లో భాగంగా వెస్టిండీస్ తమ తొలి మ్యాచ్లో జులై 1న స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు కెవిన్ సింక్లైర్ విండీస్ జట్టుతో కలవనున్నాడు. ఇక కెవిన్ సింక్లైర్ రీప్లేస్మెంట్ను ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. చదవండి: #ICCWorldCup2023: విండీస్కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం! -
విండీస్కు చివరి చాన్స్; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్కు ఘోర అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. అక్టోబర్-నవంబర్లో జరగనున్న వన్డే వరల్డ్కప్ మెగా సమరానికి అర్హత సాధించని విండీస్ జట్టు క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లోనూ దారుణ ఆటతీరు కనబరిచి వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. సూపర్ సిక్స్కు క్వాలిఫై అయినప్పటికి.. జింబాబ్వే, నెదర్లాండ్స్ చేతిలో ఓడిన విండీస్కు సూపర్ సిక్స్లో సున్నా పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో లీగ్ దశలో నెదర్లాండ్స్, వెస్టిండీస్(సూపర్ సిక్స్కు క్వాలిఫై అయిన జట్లు)లపై విజయాలు సాధించిన జింబాబ్వే నాలుగు పాయింట్లతో టాపర్గా ఉంది. ఇక నెదర్లాండ్స్ విండీస్పై సూపర్ ఓవర్లో విజయం సాధించి రెండు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ దశలో వెస్టిండీస్ వరల్డ్కప్కు అర్హత సాధించడం అసాధ్యమని తెలుసు. కానీ వెస్టిండీస్కు వరల్డ్కప్కు అర్హత సాధించేందుకు ఇప్పటికి ఒక అవకాశం మిగిలి ఉంది. కష్టసాధ్యమైనప్పటికి అదృష్టం కూడా కలిసివస్తే మాత్రం విండీస్ మెగా సమరానికి వెళ్లే అవకాశముంటుంది.అదెలా అంటే.. ఒకే గ్రూప్లో ఉన్న జింబాబ్వే వద్ద ప్రస్తుతం 4 పాయింట్లు ఉన్నాయి. మరో గ్రూప్లో ఉన్న శ్రీలంక ఖాతాలోనూ 4 పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు వరల్డ్కప్కు అర్హత సాధించే విషయంలో ముందు వరుసలో ఉన్నాయి. అన్ని మ్యాచ్లు గెలవాల్సిందే.. ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్లో వెస్టిండీస్ శ్రీలంక, ఒమన్, స్కాట్లాండ్లతో ఆడుతుంది. తొలుత ఈ మూడు మ్యాచ్ల్లోనూ విండీస్ కచ్చితంగా గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా విండీస్ ఇంటిబాట పట్టాల్సిందే. ఒకవేళ విండీస్ మూడు మ్యాచ్లు గెలిస్తే ఆరు పాయింట్లు తన ఖాతాలో ఉంటాయి. ఇక జింబాబ్వే, శ్రీలంకలు తాము ఆడబోయే మూడు మ్యాచ్ల్లో రెండింటిలో ఓటమి పాలవ్వాలి. అలా జరిగితేనే వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వేలు ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఒకవేళ శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు విజయాలు సాధిస్తే అప్పుడు రెండు జట్లు 8 పాయింట్లతో వన్డే వరల్డ్కప్కు అర్హత సాధిస్తే.. విండీస్ ఇంటిబాట పడుతుంది. నెట్ రన్రేట్ పెంచుకోవాల్సిందే.. ఒకవేళ మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి.. శ్రీలంక, జింబాబ్వేలు చెరో రెండు మ్యాచ్లు ఓడినా విండీస్కు అవకాశాలు అంతంతే. ఎందుకంటే ఆ సమయంలో నెట్రన్రేట్ కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం విండీస్ రన్రేట్ (-0.350)గా ఉంది. మూడు మ్యాచ్ల్లోనూ గెలవడంతో పాటు భారీ విజయాలతో విండీస్ రన్రేట్ను గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. ఇప్పటికైతే విండీస్కు, శ్రీలంక(+2.698)కు నెట్రన్రేట్ విషయంలో చాలా తేడా ఉంది. ఒమన్పై 99 పరుగుల టార్గెట్ను 35 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించడం లంక రన్రేట్ను బాగా మెరుగుపరిచింది. ఇక జింబాబ్వే నెట్ రన్రేట్ కూడా +0.982గా ఉంది. ఇది కూడా విండీస్కు ఒక దెబ్బ అని చెప్పొచ్చు జింబాబ్వే అన్ని మ్యాచ్లు ఓడిపోతే.. అయితే విండీస్కు నెట్ రన్రేట్ పెంచుకోవడంలో విఫలమైనా ఆఖరిగా ఒక చాన్స్ ఉంది. అదేంటంటే.. జింబాబ్వే సూపర్ సిక్స్లో తాను ఆడబోయే మూడు మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూడాలి.. అదే సమయంలో విండీస్ అన్ని మ్యాచ్ల్లో గెలవాలి. అప్పుడు జింబాబ్వే ఖాతాలో నాలుగు పాయింట్లు ఉంటే.. విండీస్ ఆరు పాయింట్లు సాధించి వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో శ్రీలంక విండీస్ చేతిలో ఓడి.. మిగతా రెండు మ్యాచ్ల్లో గెలవాలి. ఇక ఒమన్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్లు తలా ఒక విజయం సాధించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్కు ఇది అంత సులువు కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఫామ్ దృశ్యా శ్రీలంక, జింబాబ్వేలను ఓడగొట్టడం మిగతా జట్లకు పెద్ద సవాల్. అందునా మరీ రెండు మ్యాచ్లు ఓడిపోయే దుస్థితిలో ఈ రెండు జట్లు ఎంతమాత్రం లేవు. ఇన్ని ఇబ్బందుల మధ్య విండీస్ వరల్డ్కప్కు అర్హత సాధిస్తుందని ఆశించడం వ్యర్థం.. కానీ ఏ మూలనో ఆ జట్టుకు అదృష్టం రాసి ఉంటే తప్ప. చదవండి: వరల్డ్కప్ వేదికలపై వివాదం.. బీసీసీఐ వివరణ 2011 టోర్నీ మొత్తం ధోని అదే తిన్నాడు: సెహ్వాగ్.. రోహిత్ ఆ వడాపావ్ మానేసి..
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తినే ఆహారంలో వెరైటీలు ఉండేలా చూసుకోవాలి..! లేదంటే?
అంతరిక్షంలోకి వెళ్లిన తెలుగోడు
షుగర్ కంట్రోల్ కావడం లేదా? .అద్భుతమైన ప్రొటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్
హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్..
ప్రతి భారతీయుడికి ఓ గర్వకారణం.. ఎన్నికల పోలింగ్పై ఆర్బీఐ గవర్నర్
హెలికాప్టర్ ప్రమాదం.. ఇరాన్ అధ్యక్షుడి చివరి వీడియో వైరల్
ఓటింగ్ను బహిష్కరించిన గ్రామస్తులు
సత్తెనపల్లిలో సిట్ టీమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
- హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Jr NTR Birthday: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..?
- రాత్రైతే నా భార్య రాక్షసిలా ప్రవర్తిస్తోంది
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
Advertisement