కూనవరం: ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను సంపూర్ణంగా అమలుచేసి దేశానికి ఆదర్శకంగా నిలిచిన ఏకై క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. పేదల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యమన్నారు. మండలంలోని పోలిపాక పంచాయతీ పరిధిలోని పోలిపాక, గుండువారిగూడెం, దూగుట్ట, కూళ్లపాడు గ్రామాల్లో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని వాటిని ప్రతి నెలా వడ్డీల రూపంలో పెరిగిపోతున్న అప్పులను కట్టలేక గతంలో మహిళలు ఇబ్బందులు పడే వారన్నారు. అప్పట్లో చంద్రబాబు మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయకుండా మహిళలను మోసం చేశారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. గత ఎన్నికల ముందు జగనన్న చేపట్టిన పాదయాత్రలో మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక బ్యాంకు ఖాతాల్లో రుణం లేకుండా మాఫీ చేసి డ్వాక్రా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు, ఈ విషయాన్ని మహిళలు గుర్తుపెట్టుకుని వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకొని రుణం తీర్చుకుందామన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజరాణి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగులపల్లి ధనలక్ష్మి అయిన తనను గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామస్తులంతా జగన్కే తమ మద్దతు అని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. జేసీఎస్ మండల ఇన్చార్జ్ ఆవుల మరియాదాస్, పార్టీ మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు, సర్పంచ్ సోందె ముత్తమ్మ, నాయకులు బాబు, గంగాధర్, భరతమూర్తి, రమేష్, పూర్ణానందం, వీర్రాజు, సునీత, శ్రీను పాల్గొన్నారు.
జగనన్న పాలనలోనే పేదల అభ్యున్నతి
Published Sat, Apr 20 2024 2:05 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement