-
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
చింతూరు: మలేరియా జ్వరాల అదుపులో భాగంగా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా దోమలమందు పిచికారీ చేయాలని, ఈ కార్యక్రమానికి ఇతర శాఖల అధికారులు సహకారం అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పీవో ఆదేశించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరాజు మాట్లాడుతూ దోమల మందు పిచికారీకి సంబంధించి వాడే విధానం, మెలకువలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. చింతూరు డివిజన్లోని 157 గ్రామాల్లో మొదటి విడతలో భాగంగా వచ్చేనెల 15 వరకు, రెండో విడత కింద జూలై నుంచి ఆగస్టు వరకు దోమలమందు పిచికారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, నాలుగు మండలాలకు చెందిన వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
యజమానిని ఏమార్చి.. బంగారు నగల చోరీ
చింతూరు: గుర్తు తెలియని ముగ్గురు మహిళలు సినీఫక్కీలో బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన చింతూరులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వీరు బంగారు ఆభరణాల కొనుగోలు కోసమంటూ స్థానిక మెయిన్రోడ్లో నీలిమా జ్యూయలర్స్ షాపునకు వచ్చారు. అక్కడ బంగారు ఆభరణాలు చూస్తున్నట్లుగా నటిస్తూ రెండు జతల చెవిదిద్దులు చాకచక్యంగా కాజేశారు. అనంతరం చోరీ చేసిన ఆభరణాల స్థానంలో షాపు యజమానికి అనుమానం రాకుండా చిన్నసైజులో నకిలీ ఆభరణాలు ఉంచి ఏమీ కొనకుండా అక్కడి నుంచి ఉడాయించారు. వారు వెళ్లిన పిదప షాపు యజమానికి అనుమానం వచ్చి నకిలీ ఆభరణాలు పరిశీలించగా రూ.50 వేల విలువచేసే రెండు జతల చెవిదిద్దులు మాయమైనట్లు గుర్తించారు. అనంతరం షాపులో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ముగ్గురు మహిళలు చోరీ చేసిన వైనం బయటపడింది. ఈ ఘటనపై షాపు యజమాని సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.ఆభరణాలతో ఉడాయించిన గుర్తుతెలియని ముగ్గురు మహిళలు -
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం
చింతపల్లిరూరల్: జగనన్న ప్రభుత్వానికి పట్టం కట్టండి అని వైఎస్సార్సీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్య్సరాస విశ్వేశ్వరరాజు అన్నారు.మండలంలో అన్నవరం పంచారయతీ కేంద్రంలో వారపు సంతలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్క దుకాణానికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్నను మళ్లీ గెలిపించి ముఖ్యమంత్రి చెసుకుందామని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు.గిరిజన ప్రాంతాభివృద్ధికి కోట్లాది రూపాయిలు మంజూరు చేయడం వలన గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయన్నారు. జగనన్న చేసిన అభివృద్ధిని, మంచిని గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కి లేని ప్రజాదరణ వైఎస్సార్సీపీకి ఉందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజరాణీ, ,పాడేరు అభ్యర్ధి అయిన తనను (మత్స్యరాస విశ్వ్శ్వేరరాజు) గెలిపించాలని కోరారు. గిరిజన ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానన్నారు. ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు,ట్రైకార్ డైరెక్టర్ లోవరాజు, సర్పంచ్లు లోతా పండయ్య, సలీమితీ లక్ష్మయ్య, కోర్ర రమేష్ నాయుడు, కో–అప్షన్ సభ్యులు నాజర్వలీ, జెసీఎస్ కన్వినర్ గణబాబు, ఎంపీటీసీలు జయలక్ష్మి, మీనాకుమారి, రూతు, మోహన్రావు, మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణ, నాయకులు పరమేశ్వరరావు, సింహాచలం, రఘునాథ్, బెన్నిబాబు, గెమ్మిల సింహచలం, బాబూరావు, సుధాకర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టండి
అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో అక్రమ మద్యం పంపిణీ నిర్మూలనకు దిగువస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎడిషనల్ ఎస్పీ, జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ, జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడికక్కడ మద్యం పంపిణీని అరికట్టడానికి అధికారులతో పాటు దిగువ స్థాయి సిబ్బంది తనిఖీలను నిర్వహించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై దృష్టి సారించాలని, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే మద్యం డిపో నుంచి ప్రభుత్వ బార్లకు సరఫరా అయ్యే మద్యం నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. -
గ్రామాల్లో దాహార్తికి చెక్
జి.మాడుగుల: గిరిజన ప్రాంతాల్లో మహిళలు టీడీపీ ప్రభుత్వ హయాంలో బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్లు కొలది కాలినడక వెళ్లి ఊటగెడ్డలు, పారుగెడ్డలను ఆశ్రయించే వారు. కలుషితమైన నీటితో అవసరాలు తీర్చుకొని రోగాల బారిన పడుతుండేవారు. దీంతో గిరిజనులు రోగాల మంచాన్న పడి పరిస్థితి విషమించి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. బావుల్లో, ఊటగెడ్డలో భూగర్భజలాలు ఇంకిపోయి గిరిజనులు తాగునీటి కోసం అల్లాడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మన్యంలోని ఏ గ్రామంలో ఒక్క వాటర్ ట్యాంకు నిర్మించిన దాఖలాలు లేవు. ఏళ్ల తరబడి తాగునీటి కోసం గిరిజనులు నానా అవస్థలు పడ్డారు. అదంతా గతం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన్య ప్రాంతాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఏళ్ల తరబడి ఉన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది. గతంలో మాదిరిగా నీటి కోసం మండుటెండంలో కిలోమీటర్లు దూరం వెళ్లాల్సిన దుస్థితికి చెక్ చెప్పింది. ఇంటింటికీ కుళాయి అందజేయడంతో గిరిజనులు జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటే అండగా జీవితాంతం ఉంటామని చెబుతున్నారు. కోట్ల రూపాయల నిధులు జి.మాడుగుల మండలంలో విడతల వారీగా తాగునీటి పథకాలు, ఇంటింటికీ కుళాయి పనులు జరిగాయి. ఇందులో భాగంగా మొదటి విడుతలో 327 పనులకు రూ. రూ.10.56కోట్లు మంజూరు కాగా అన్ని పనులు పూర్తయ్యాయి. రెండో విడుతగా 194పనులకు రూ.13.60కోట్లు మంజూరు కాగా, ఇందులో 105 పనులు పూర్తికాగా, రూ.6.26కోట్లు చెల్లింపులయ్యాయి. మరో విడతగా రూ.3.60 కోట్లు మంజూరు కాగా ఆయా పనులకు టెండర్లు పూర్తి కావడంతో పనులు చేపట్టాల్సి ఉంది. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. 234 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండటంతో 93 గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మాణాలను జగనన్న ప్రభుత్వం చేపట్టింది. ఇంటింటికి తాగునీటి సదుపాయం కల్పించింది. మిగతా గ్రామాల్లో తాగునీటి పథకాలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.మంచినీటి పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోని రానున్నాయి. వేసవిలో ఏ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పీవీటీజీ గ్రామాలు అన్నిటికీ తాగునీటి సౌకర్యం అందుబాటులోనికి వచ్చింది. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ క్రాస్ ప్రొగ్రామ్–2024టూర్ షెడ్యూల్ నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో బోర్లు మరమ్మతు పనులు చేపడుతారు. లక్షలాది రూపాయలతో తాగునీటి పథకాలు నిర్మాణం ఇంటింటికీ కుళాయి తీరిన తాగునీటి కష్టాలు ఆనందంలో గిరిజనులు -
మావోయిస్టులకు సహకరించొద్దు
కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, కన్నవరం, పోకలపాలెం, గోదుమలంక, బాలరేవుల గ్రామాల్లో సీఐ వెంకటరమణ, మంప ఎస్ఐ లోకేష్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు జరగకుండా చేసేందుకు మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికైనా పాల్పడే అవకాశం ఉందన్నారు. మావోయిస్టులకు ఎవరు సహకరించొద్దన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు. గంజాయి రవాణా, సాగు, సారా తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. యువత ఉన్నత విద్యపై దృష్టి సారించాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. యువత ఉపాధి కోసం ప్రభుత్వం స్కిల్ డవలప్మెంట్ ద్వారా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలి
పాడేరు : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మేన్లు తప్పనిసరిగా ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలని ఎస్ఈబీ జిల్లా అధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక డీఎస్ఈవో కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎంఏ ఖదీర్తో కలిసి ఎకై ్సజ్ ఎన్పోర్స్మెంట్, ఎస్ఈబీ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. గైడ్లైన్స్లో సూచించిన నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ అమ్మకాలు జరిపితే సూపర్వైజర్లు, సేల్స్మన్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జీఆర్వో సిబ్బందిని తరచుగా కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. రెండు శాఖలు సమన్వయం చేసుకొని పని చేయాలని, ప్రతి నెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
కశింకోట: మండలంలోని విసన్నపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందాడు. సీఐ వినోద్బాబు అందించిన వివరాల ప్రకారం..యలమంచిలిలోని చిన్న గొల్లలపాలెంకు చెందిన మువ్వల సన్యాసినాయుడు (45) బయ్యవరం నుంచి విసన్నపేటకు బైక్పై వెళుతుండగా అదుపు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సన్యాసినాయుడు ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లి కూలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎప్పటిలాగే కూలి పనికి వెళుతుండగా జరిగిన ప్రమాదంలోమృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు. -
మారిన వేళల్లో స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం : ఇటీవల ప్రయాణికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన విశాఖపట్నం – బెంగళూరు – విశాఖపట్నం మధ్య సమ్మర్ స్పెషల్ రైళ్ల వేళలు మారాయని, ప్రయాణికులు మార్పులు గమనించాలని వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – ఎస్ఎంవీ బెంగళూరు (08549) ప్రతీ శనివారం విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 29 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఎస్ఎంవీ బెంగళూరు – విశాఖపట్నం (08550) ప్రతీ ఆదివారం ఉదయం 8.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 30 వరకు నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడ్, జోలార్పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి. -
వ్యాన్ బోల్తా పడి యువకుడి మృతి
సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసిన మన్యం నేతలు సాక్షి, పాడేరు: విశాఖలో పర్యటించిన వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఆదివారం రాత్రి జిల్లాలోని పలువురు నేతలు కలిశారు.జిల్లా పార్టీ అధ్యక్షురాలు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆమె భర్త డాక్టర్ తమర్భ నరసింగరావు,అ రకు ఎంపీ అభ్యర్ధి డాక్టర్ గుమ్మా తనూజరాణి,ఆమె భర్త చెట్టి వినయ్,ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు అసెంబ్లీ అభ్యర్ధి మత్స్యరాస విశ్వేశ్వరరాజులు వేర్వేరుగా కలిశారు.అరకు పార్లమెంట్తో పాటు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై అధినేతకు వారు సమగ్రంగా వివరించారు.మాడుగుల రూరల్: మండలంలోని కొండయ్యపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోతనపూడి గ్రామానికి చెందిన వడ్డాది పవన్కుమార్(24) అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ పి.దామోదర్నాయుడు కథనం ప్రకారం వివరాలు... పోతనపూడిలో గల ఎం.వరహాలుబాబు టెంట్ హౌస్లో పవన్కుమార్ పనిచేస్తున్నాడు. రావికమతం మండలం పోన్నవోలులో ఆదివారం జరిగిన వివాహానికి టెంట్ హౌస్ నుంచి జనరేటర్, ఇతర సామగ్రిని తీసుకెళ్లారు. అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత సోమవారం ఉదయం సామగ్రి, లైటింగ్, జనరేటర్ను బొలేరో వాహనంలో పోన్నవోలు నుంచి పోతనపూడి తీసుకొస్తుండగా కొండయ్యపాలెం వద్ద వ్యాన్ అదుపుతప్పి పక్కనున్న పంటపొలాల్లో బోల్తాపడింది. వాహనం వెనుక భాగంలో కూర్చున్న పవన్కుమార్ మీద వాహనం, వాహనంలోని ఉన్న జనరేటర్ పడ్డాయి. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దామోదర్ నాయుడు తెలిపారు. మృతదేహానికి అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ చెప్పారు. -
ఆధునిక వ్యవసాయ విధానంతో మెరుగైన ఫలితాలు
మహారాణిపేట : అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ విధానాలను ఉపయోగించుకుని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని ఆచార్య ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు ఎల్. ప్రశాంతి అన్నారు. ఉత్తర కోస్తా మండల పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఉత్తర కోస్తా మండలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లితో పాటు నాలుగు వ్యవసాయ పరిశోధనా స్థానాలు, నాలుగు విస్తరణ కేంద్రాలు రైతులకు సేవలందిస్తున్నాయన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పి.వి.కె. జగన్నాథరావు ఉత్తర కోస్తా మండలంలో 2023– 24 సంవత్సరంలో జరిగిన పరిశోధన, విస్తరణ ప్రగతి గురించి వివరించారు. విస్తరణ సంచాలకులు కె.ఎస్.ఎస్. నాయక్ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రాలు డ్రోన్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రతినిధి బాలునాయక్ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందజేసే సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయుక్తమన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ పీవీకే జగన్నాథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఎఫ్ఆర్ఏ డైరెక్టర్ డాక్టర్ జో కిజకుడన్, ఉత్తర కోస్తా మండలంలోని వ్యవసాయ శాఖ డీఏవోలు, ఉద్యానవన శాఖ అధికారులు, నాబార్డ్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఆత్మ అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా తిరువీధి
సింహాచలం: సింహగిరిపై వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగోరోజు సోమవారం స్వామివారికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి విశేషంగా జరిగింది. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామితో పాటు శ్రీదేవి, భూదేవిలను అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టంపజేసి సాయంత్రం సింహగిరి మాడ వీధుల్లో తిరువీధిని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామిని సూర్యప్రభ వాహనంపై తిలకించి పులకించిపోయారు. అర్చకులు రాజీవ్, శ్రావణ్ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుంచి పూర్ణాహుతి, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం , రాత్రికి మృగయోత్సవం(దొంగలదోపు ఉత్సవం) నిర్వహించనున్నారు. -
పాడేరు టీడీపీలో గందరగోళం
పాడేరు: నియోజకవర్గ టీడీపీలో బంతాట మొదలైంది. చంద్రబాబు క్షుద్రరాజకీయాలకు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విసిగిపోతున్నారు. ప్రకటించిన అభ్యర్థులను తరచూ మార్చేయడం వల్ల వారికి ఏంచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పాడేరు అసెంబ్లీ టికెట్ను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ జీసీసీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్, బొ ర్రా నాగరాజు, కొట్ట గుళ్లి సుబ్బారావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ ఆశించడం తెలి సిందే. వీరికి కాకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన కిల్లు రమేష్నాయుడు అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించడంతో వారంతా కంగుతిన్నారు. అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధపడ్డారు. వీరిలో గిడ్డి ఈశ్వరి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తానని అధిష్టానాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రమేష్నాయుడు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ప్రకటన మేరకు శుక్రవారం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరు తెరపైకి వచ్చింది. అధిష్టానం హామీ మేరకు ఈనెల 22న టీడీపీ బి ఫారంతో నామినేషన్ వేస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ సమాచారంతో రమేష్నాయుడు నిరాశపడినట్టు తెలిసింది. చంద్రబాబు ‘కూటమి’ డ్రామాలతో టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ‘మిరియాల’ నామినేషన్కు ముఖ్య నేతల డుమ్మా రంపచోడవరం: రంపచోడవరం టీడీపీ అభ్యర్థిగా మిరియాల శిరీష దేవి శుక్రవారం నామినేషన్ వేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలంతా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన శిరీషదేవికి కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారిలో ఎవరికై నా టికెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేయడం తెలిసిందే. భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయాలని భావించిన మిరియాల శిరీషదేవికి అనుకున్న స్థాయిలో రాకపోవడం నిరాశ మిగిల్చింది. రంపచోడవరంలో కీలకమైన టీడీపీ నేతలెవ్వరూ హాజరు కాలేదు. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, శీతంశెట్టి వెంకటేశ్వరరావు నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మండలాల నుంచి కూడా పార్టీ శ్రేణులు హాజరు కాలేదు. అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి పేరు తెరపైకి.. ఇప్పటికే నామినేషన్ వేసిన కిల్లు రమేష్నాయుడు అయోమయంలో పార్టీ శ్రేణులు -
అట్టహాసంగా విశ్వేశ్వరరాజు నామినేషన్
సాక్షి,పాడేరు: పాడేరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ సమర్పించారు. నియోజకవర్గంలో ఐదు మండలాల నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, నేతలతో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిఅందజేశారు. భారీగా శేణ్రులు తరలిరావడంతో పార్టీ జెండాలు రెపరెపలాడాయి. జయహో జగనన్న.. జయహో వైఎస్సార్సీపీ నినాదాలు హోరెత్తాయి. ముందుగా విశ్వేశ్వరరాజు, శివారత్నం దంపతులు పట్టణంలో మోదకొండమ్మ ఆలయంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి, పాడేరు, చింతపల్లి జెడ్పీటీఈసలు కిముడు గాయత్రి, పోతురాజు బాలయ్య, పాడేరు పరిశీలకులు కె.శ్రీకాంత్రాజు, పీలా వెంకటలక్ష్మి తదితరులతో కలిసి పూజలు చేశారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాల వద్ద ఉంచి కుంకుమార్చన జరిపించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నరసింగరావు విశ్వేశ్వరరాజుకు అభినందనలు తెలిపారు. పార్టీ శేణ్రులు ఆయనను శాలువాలతో సత్కరించారు. అనంతరం వారితో కలిసి విశ్వేశ్వరరాజు ప్రచార రథంపై పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తీన్మార్ డప్పులు, థింసా నృత్యాలు, కార్యకర్తలు డ్యాన్సులతో హోరెత్తించారు. పాడేరు పాత బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ సాగింది. జగన్మోహన్రెడ్డి ఫొటోలతో ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరకు ఎంపీ మాధవి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విశ్వేశ్వరరాజు తన నామినేషన్ పత్రాలు, అపిడవిట్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ భావన వశిష్టకు అందజేశారు. భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి సమర్పణ పాడేరులో హోరెత్తిన జై జగన్ నినాదాలు -
టీడీపీకి రె‘బెల్స్’ గుబులు
సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం -
108లో ప్రసవం
ఎటపాక: మండల పరిధిలోని గుండాల గ్రామ సమీపంలో 108 వాహనంలో ఓ మహిళ ప్రసవించింది.ఎం.జలంతి అనే మహిళ రెండవ కాన్పుకు చింతూరు ఆస్పత్రికి వచ్చింది. అయితే అక్కడి వైద్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడంతో 108 వాహనంలో ఆమెను అక్కడికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మార్గ మధ్యలో ఆమెకు పురిటినొప్పులు అధికమవడంతో వాహనాన్ని గుండాల సమీపంలో నిలిపి ఆశ కార్యకర్త సాయంతో జలంతికి ప్రసవ సేవలు చేశారు. మగ బిడ్డను జన్మనిచ్చింది. పైలల్ రవితేజ, ఈఎంటీ లక్ష్మణ్ సేవలందించారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వారు చెప్పారు. -
అంబులెన్సుకు దారివ్వని కూటమి శ్రేణులు
అరకులోయ రూరల్: కూటమి అభ్యర్థి పాంగి రాజారావు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన శ్రేణుల వల్ల అంబులెన్సుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శుక్రవారం పాడేరు ఐటీడీఏలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేసేందుకు ఆయన కూటమి నేతలతో ర్యాలీగా రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.అదే సమయంలో పాడేరు వైపు నుంచి వస్తున్న 108 అంబులెన్సుకు గడుగుపల్లి వద్ద దారివ్వకపోవడంతో కొంతసేపు నిలిచిపోయింది. దీనివల్ల వాహన సిబ్బందితోపాటు రోగి తరపు బంధువులు ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఈవిషయాన్ని అభ్యర్థి, కూటమి శ్రేణులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
పాత కక్షలతోనే చంపేశారు
ఎటపాక: పాత కక్షలే కన్నాయిగూడెం వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ వర్సా బాలకృష్ణ (40) హత్యకు దారితీసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన రమేష్, అతని స్నేహితుడు సాయిరాం కలిసి బాలకృష్ణకు ఫోన్చేసి వారు ఉన్నచోటకు రప్పించి దాడికి పాల్పడ్డారు. అతను కిందపడిపోవడంతో తలపై బండరాయి పడేసి హతమార్చారు. రంగంలోకి దిగిన చింతూరు ఏఎస్పీ రాహుల్మీనా నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. రెండేళ్ల నుంచి తగాదాలు.. మృతుడు ఎంపీటీసీ బాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన సీపీఐ నేత రమేష్కు మధ్య రెండేళ్లుగా తగాదాలు జరుగుతున్నాయి. గిరిజనేతరుడైన రమే ష్పై ఎటపాక, భద్రాచలం పోలీసుస్టేషన్లలో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో బాలకృష్ణను అంతం చేద్దామన్న పథకంతో రమేష్ వ్యూహం రూపొందించాడు. గురువారం రాత్రి గ్రామంలోని వివాహ కార్యక్రమానికి వెళ్లిన బాలకృష్ణకు తామున్న చోటకు రమ్మని స్నేహితుడు సాయిరాంతో కలిసి రమేష్ ఫోన్ చేశాడు. వారితో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న బాలకృష్ణ తమ్ముడు శివరామకృష్ణ విషయం తెలుసుకున్నాడు. రమేష్తో మాట్లాడవద్దని బాలకృష్ణకు అతను సూచించాడు. అక్కడ భోజనం అనంతరం అన్న బాలకృష్ణను ఇద్దరు యువకుల సాయంతో ఆటోలో ఇంటికని పంపించాడు. అక్కడినుంచి తాను ఉంటున్న భద్రాచలం వెళ్లిపోయాడు. తమ్ముడు వారించినా.. ఇద్దరు యువకులతో ఆటోలో ఇంటికి బయలుదేరిన బాలకృష్ణ మళ్లీ వెనక్కి వచ్చి గ్రామ శివారులో రమేష్, సాయిరాం ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఈ ఇద్దరు బాలకృష్ణతో గొడవకు దిగి దాడి చేశాారు. దీంతో కిందపడిపోయిన అతన్ని కదలకుండా కాళ్లను సాయిరాం పట్టుకోగా తలపై రమేష్ బండరాయి వేయడంతో తీవ్ర రక్తస్రావంతో సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బాలకృష్ణతో వచ్చిన ఇద్దరు యువకులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రమే ష్కు చేతికి గాయం కావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వెళ్లాడు. సంఘటన సమాచారం తెలుసుకున్న సీఐ రామారావు అర్ధరాత్రి గ్రామానికి వెళ్లి దర్యాప్తు వేగవంతం చేశారు. సెల్ సంకేతాలు ఆధారంగా అతను ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించి ఏఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో రమే ష్ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు సాయిరాంను కూడా పోలీసులు పట్టుకున్నారు. బాలకృష్ణ మృతదేహానికి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన తెలంగాణలోని దుమ్ముగూడెం మండలం మారేడుబాక తరలించారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అక్కడికివెళ్లి నివాళులర్పించారు. ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో కన్నాయిగూడెంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీఎస్టీ కేసుల నమోదుతో.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా బాలకృష్ణ ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అతనిపై ప్రత్యర్థి పార్టీ నేతలు పగబట్టి తరచూ గొడవలు పడుతుండే వారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2022లో బాలకృష్ణ, రమేష్ కుటుంబాల మధ్య జరిగిన గొడవలు కేసులు వరకు దారితీశాయి. దీనిలో భాగంగానే రమేష్పై ఎటపాక, భద్రాచలం పోలీసుస్టేషన్లలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ కక్షతోనే బాలకృష్ణను రమేష్ పథకం ప్రకారం హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి ఎంపీటీసీ బాలకృష్ణను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో కూటమి నేతల ప్రమేయం ఉందని వారు ఆరోపిస్తూ ధర్నా చేశారు. వారిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హత్యను ఆదివాసీ సంఘాల నేతలు ఖండించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. సంచలనమైన వైఎస్సార్సీపీ కన్నాయిగూడెం ఎంపీటీసీ దారుణ హత్య దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న చింతూరు ఏఎస్పీ మృతదేహానికి భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నివాళులర్పించిన రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి -
ఇటుకల పండగ సందడి
హుకుంపేట: ఇటుకల పండగ సందడి నెలకొంది. డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలతో ఉత్సాహంగా గడుపుతున్నారు. నాడు.. ఒక్క అడుగు... రాష్ట్రంలో సంక్షేమ చరిత్రను లిఖించింది.. అవ్వాతాతల మోముల్లో చిరునవ్వువిరబూయించింది.. అక్కా చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చింది... చిన్నారులను అమ్మ ఒడిలా లాలించి విద్యాదీవెనలు అందించింది.. ప్రతి గుండెకు ఆరోగ్య సురక్షగా నిలిచింది ప్రతి రైతుకు భరోసా ఇచ్చింది లక్షలాది మందికి నీడనిచ్చింది... ఆ మహాపథికుడు, జన హృదయాధినేత,సంక్షేమ రథసారథి -
ఎన్నికల నిబంధనలుపక్కాగా అమలు
● వ్యయ పరిశీలకుడు పంకజ్సింగ్ సాక్షి,పాడేరు: సార్వత్రిక ఎన్నికల్లో నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు పంకజ్సింగ్ ఆదేశించారు.శుక్రవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి,క లెక్టర్ విజయసునీత,జ ఎస్పీ తుహిన్సిన్హా, పాడేరు, అరకు ఆర్వోలు భావన వశిష్ట, అభిషేక్తోపాటు వ్యయ పరిశీలన బృందంతో ఆయన సమావేశమయ్యారు. రంపచోడవరం నుంచి వర్చువల్ విధానంలో ఆర్వో ప్రశాంత్కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా పంకజ్సింగ్ మాట్లాడుతూ అన్ని సవాళ్లను అధిగమిస్తూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల వ్యయ నివేదికలను ఎప్పటికప్పడు సిద్ధం చేయాలన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే కలెక్టరేట్లోని జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. మీడియా మానటరింగ్, సోషల్ మీడియా,సి–విజిల్, కాల్సెంటర్, ఎంసీసీ, బోర్డర్ చెక్పోస్టుల వెబ్ నిర్వహణను పరిశీలించారు. డీఆర్వో పద్మావతి, నోడల్ అధికారులు సువర్ణ ఫణి, గోవిందరాజులు, రాములు, సాయినవీన్, రమేష్కుమార్రావు, పూర్ణయ్య, రామకృష్ణరాజు పాల్గొన్నారు. -
జయహో...జగనన్న
● సీఎం బస్సు యాత్రకు బ్రహ్మరథం ● పాయకరావుపేటలో ఘనంగా స్వాగతం ● హారతులిచ్చి దీవించిన మహిళలు ● జగనన్నను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు నక్కపల్లి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా రాష్ట్ర అభ్యుదయ రథాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర శుక్రవారం రాత్రి అనకాపల్లి జిల్లాలో అడుగుపెట్టింది. రాత్రి 9 గంటలకు సీఎం బస్సు యాత్ర జిల్లా సరిహద్దు పాయకరావుపేటకు చేరుకుంది. వేలాది మంది పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపైకి వచ్చి సీఎం జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కనోసా పాఠశాల నుంచి పోలీస్స్టేషన్ వరకు అర కిలోమీటరు దూరంలో ఉన్న జాతీయరహదారి పైకి చేరుకుని ఇరువైపులా నిలుచుని పార్టీ శ్రేణులు, యువకులు, మహిళలు, జగకార్యకర్తలు, అభిమానులు జగనన్నకు ఘన స్వాగతం పలికారు. తనను చూడడానికి వేలాదిగా తరలివచ్చిన జన సందోహానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడులను ప్రజలకు బస్సుపై నుంచే పరిచయం చేస్తూ రెండు చేతులు జోడించి ముందుకు సాగారు. వై జంక్షన్లో మహిళలు హారతులివ్వడంతో పాటు గుమ్మడికాయలపై దీపాలు వెలిగించి దిష్టి తీసి జగనన్న బస్సుయాత్ర ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని, మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని దీవించారు. రాత్రి 9 గంటల సమయంలో కూడా పాయకరావుపేట పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి వేలాది మంది తరలిరావడంతో జాతీయ రహదారి జన సంద్రమైంది. జై జగన్.. జైజై జగన్, మళ్లీ నువ్వే సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేశారు. పాయకరావుపేటలో బస్సుయాత్రకు స్వాగతం పలికినవారిలో పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంఎస్ఎంఈ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, జిల్లా పబ్లిక్ వింగ్ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ సభ్యుడు లంక సూరిబాబు, ఎస్.రాయవరం మండల అధ్యక్షుడు బోలిశెట్టి గోవింద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దత్తుడు సీత బాబు తదితరులు ఉన్నారు. గొడిచర్ల వద్ద రాత్రి బస.. పాయకరావుపేట నుంచి నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయరహదారి పక్కన ఏర్పాటు చేసిన వసతి వద్ద సీఎం జగన్మెహన్రెడ్డి రాత్రి బస చేశారు. గొడిచర్ల వద్ద రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లె అనూరాధ, సర్పంచ్ అల్లు రమణ, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు పాపారావు, మణిరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు గొర్ల బాబూరావు, సర్పంచ్లు భార్గవ్, సురేష్ వర్మ, సాదిరెడ్డి శ్రీను, ఎంపీటీసీ తిరుపతిరావు, గోవిందు ఆధ్వర్యంలో వందలాది మంది సీఎం బస్సు యాత్రకు స్వాగతం పలికారు. పాయకరావుపేటలో జగన్ రాకకోసం రోడ్డుకు ఇరువైపులా వేచి ఉన్న జనం -
విధుల్లో నిబంధనలు పాటించాలి
ముంచంగిపుట్టు: ఉద్యోగులు విధుల్లో నిబంధనలు పాటించడం ముఖ్యమని మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఎస్ఈ ఎ.వి.సుబ్రహ్మణేశ్వరరావు అన్నారు.ఆంధ్ర –ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకడిల్లీలోని సివిల్ ఇంజనీర్ కార్యాలయంలో ఏపీ జెన్కో శిక్షణ ఇన్స్టిట్యూట్ విజయవాడకు చెందిన ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో జోలాపుట్టు, మాచ్ఖండ్, ఒనకడిల్లీ క్యాంప్ల ఓఅండ్ఎం(ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్) ఉద్యోగులకు రెండు రోజులు శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. శిక్షణ తరగతులను ప్రాజెక్టు ఎస్ఈ సుబ్రమణ్వేశ్వరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్సనల్ డెవలప్మెంట్, టీం వర్కు, ఆరోగ్య పరిరక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించే ఆంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తరగతులను సద్వివినియోగం చేసుకోవాలని, విధుల పట్ల అకింతభావంతో పనిచేయాలని, విద్యుత్ కేంద్రంలో పని చేసే ప్రతి ఒక్కరూ నిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఎస్ఈ సుబ్రమణ్వేశ్వరావు అన్నారు.అనంతరం జెన్కో శిక్షణ కేంద్రం జనరల్ మేనేజర్ యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణ వల్ల ఉద్యోగులకు సర్వీసు, లీవ్ రూల్స్, రాయితీలు ఎలా పొందాలి వంటిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పరిధిలో 150 మందికి రెండు రోజులు శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటి వరకు శ్రీశైలం, సీలేరు, అప్పర్సీలేర్, నాగర్జునసాగర్ వంటి ప్రాజెక్టులలో1500 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. 2023 సంవత్సరం నుంచి ప్రాజెక్టులలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంపాక్ట్ సంస్థ మోటివేటర్ సోనుశ్రీనివాస్,మాచ్ఖండ్ ఈఈలు గోవిందరాజులు,కురుష్ప్రధాన్,డిప్యూటీ ఈఈ శ్రీనివాస్,విజయవాడ డిప్యూటీ ఈఈలు రాజ్కుమార్,సత్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాచ్ఖండ్ ప్రాజెక్టు ఎస్ఈసుబ్రమణ్వేశ్వరావు ఉద్యోగులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం -
జగనన్న ప్రభుత్వాన్ని గెలిపిద్దాం
ముంచంగిపుట్టు: ఎన్నడూలేని విధంగా సంక్షేమం, అభివృద్ధి చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిద్దామని అరకు నియోజకవర్గ పార్టీ ఎన్నికల పరిశీలకులు జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీలో పలు గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పద్మరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ పరిశీలకులు సుభద్ర పాల్గొని ప్రచారం చేశారు. సీఎం జగనన్న పాలనలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గ్రామాల్లో గ్రామస్తులకు వివరించారు. ఇందులో భాగంగా ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులతో మాట్లాడుతూ అరకు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. అన్ని వర్గాలు జగనన్న సంక్షేమ పథకాల ఫలాలు అందుకున్నారన్నారు.గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని అమలుచేయలేదని, మోసపూరిత హామీలు, మాటలను నమ్మవద్దని, ప్రతిపక్ష కూటములకు ఓట్లు వేయవద్దన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. మరింత సంక్షేమం, అభివృద్ధి ఫలాలు పొందేందుకు వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చి, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజరాణి, అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచులు నరసింగరావు, బాబూరావు, ఎంపీటీసీ సభ్యురాలు సుబ్బలక్ష్మీ, నాయకులు జయదేవ్, రాంప్రసాద్, జగన్నాథంపడాల్, జోగారావు తదితరులు పాల్గొన్నారు. -
మోగనున్న సమర శంఖం
సాక్షి, అనకాపల్లి : సీఎం బస్సుయాత్ర జిల్లాలో శనివారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం దొడ్డిగల్లు నుంచి ప్రారంభమై నాలుగు నియోజకవర్గాల్లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. సీఎం పర్యటన ఇలా... సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్యుతాపురంలో గల లంచ్ పాయింట్ క్యాంప్కు చేరుకుంటారు. అనంతరం కశింకోట మండలం నరసింగపల్లి సమీపంలోని చింతలపాలెం వద్ద బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో సీఎం వై.ఎస్ జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్, బయ్యవరం, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి జంక్షన్–1, జంక్షన్–2, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్గేట్, దేవీపురం, అస్కపల్లి మీదుగా రాత్రి 8.30 గంటలకు సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెంలో గల టెర్రకాన్ రాయల్ వెంచర్ వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు. నేడు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్ యాత్ర 70 కిలోమీటర్ల మేర రోడ్ షో కశింకోట మండలం చింతలపాలెం వద్ద భారీ బహిరంగ సభ చిన్నయ్యపాలెం వద్ద సీఎం రాత్రి బస -
గ్రామ వలంటీర్ల రాజీనామా
రాజవొమ్మంగి: మండలంలోని చికిలింత, వాతంగి సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న 11 మంది వలంటీర్లు శుక్రవారం రాజీనామా పత్రాలను ఆయా పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఇప్పటికే జడ్డంగి, వాతంగి, చికిలింత, వంచంగి సచివాలయల్లో రాజీనామాలు చేసిన వారి సంఖ్య 78 కి చేరిందని ఎంపీడీవో ఎల్. యాదగిరీశ్వరరావు విలేకరులకు తెలిపారు. వై.రామవరం: మండలంలోని దేవరమడుగులు గ్రామ సచివాలయానికి చెందిన ఇద్దరు గ్రామ సచివాలయ వలంటీర్లు శుక్రవారం విధులకు రాజీనామ చేశారు. ఆగ్రామానికి చెందిన బట్ట వెంకటలక్ష్మి, పొత్తూరి బాలరాజు కలిసి రాజీనామా పత్రాలను సచివాలయ మహిళా పోలీసు డి.చిన్నయమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు చంద్రబాబు గ్రామ వలంటీర్లపై చేసిన దారుణమైన వ్యాఖ్యలు భరించలేకే రాజీనామ చేశామన్నారు. ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన తాము జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement