జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం | Sakshi
Sakshi News home page

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం

Published Tue, Apr 23 2024 8:40 AM

అన్నవరంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న 
పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు  - Sakshi

చింతపల్లిరూరల్‌: జగనన్న ప్రభుత్వానికి పట్టం కట్టండి అని వైఎస్సార్‌సీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి మత్య్సరాస విశ్వేశ్వరరాజు అన్నారు.మండలంలో అన్నవరం పంచారయతీ కేంద్రంలో వారపు సంతలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్క దుకాణానికి వెళ్లి ఫ్యాన్‌ గుర్తుకే ఓటేసి జగనన్నను మళ్లీ గెలిపించి ముఖ్యమంత్రి చెసుకుందామని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు.గిరిజన ప్రాంతాభివృద్ధికి కోట్లాది రూపాయిలు మంజూరు చేయడం వలన గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నాయన్నారు. జగనన్న చేసిన అభివృద్ధిని, మంచిని గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కి లేని ప్రజాదరణ వైఎస్సార్‌సీపీకి ఉందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేసి అరకు ఎంపీ అభ్యర్థి తనూజరాణీ, ,పాడేరు అభ్యర్ధి అయిన తనను (మత్స్యరాస విశ్వ్శ్వేరరాజు) గెలిపించాలని కోరారు. గిరిజన ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానన్నారు. ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, మండల పార్టీ అధ్యక్షులు మోరి రవి, వైస్‌ ఎంపీపీలు శారద, వెంగళరావు,ట్రైకార్‌ డైరెక్టర్‌ లోవరాజు, సర్పంచ్‌లు లోతా పండయ్య, సలీమితీ లక్ష్మయ్య, కోర్ర రమేష్‌ నాయుడు, కో–అప్షన్‌ సభ్యులు నాజర్‌వలీ, జెసీఎస్‌ కన్వినర్‌ గణబాబు, ఎంపీటీసీలు జయలక్ష్మి, మీనాకుమారి, రూతు, మోహన్‌రావు, మాజీ వైస్‌ ఎంపీపీ బూసరి కృష్ణ, నాయకులు పరమేశ్వరరావు, సింహాచలం, రఘునాథ్‌, బెన్నిబాబు, గెమ్మిల సింహచలం, బాబూరావు, సుధాకర్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తున్న పార్టీ శ్రేణులు
1/1

జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తున్న పార్టీ శ్రేణులు

Advertisement
Advertisement