పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోయిన, సాగు నీరు అందక దిగుబడి రాని రై తుకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం అందించాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దబొంకూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మ నోహర్రెడ్డితో కలిసి పరిశీలించారు. నాయకులు మ ర్కు లక్ష్మణ్, రాములు, సంపత్, మిట్టపల్లి శ్రీనివా స్, నవీన్కుమార్, లక్ష్మీరాజం, రవి, రాజేశం, పోచమల్లు, అనిల్, తిరుపతి, నరేశ్, రాకేశ్ పాల్గొన్నారు.ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టండి
కోల్సిటీ(రామగుండం): ప్రజాసమస్యలపై గొంతెత్తాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తాలో నగరపాలక పారిశుధ్య కార్మికులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో కలిసి ఈశ్వర్ ఓట్లు అభ్యర్థించారు.