ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలి | Sakshi
Sakshi News home page

ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలి

Published Tue, Apr 23 2024 8:40 AM

-

పాడేరు : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మేన్లు తప్పనిసరిగా ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలని ఎస్‌ఈబీ జిల్లా అధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక డీఎస్‌ఈవో కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఎంఏ ఖదీర్‌తో కలిసి ఎకై ్సజ్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌, ఎస్‌ఈబీ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. గైడ్‌లైన్స్‌లో సూచించిన నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ అమ్మకాలు జరిపితే సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జీఆర్వో సిబ్బందిని తరచుగా కౌన్సెలింగ్‌ చేయాలని సూచించారు. రెండు శాఖలు సమన్వయం చేసుకొని పని చేయాలని, ప్రతి నెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement
Advertisement