‘పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగనే రావాలి’ | Sakshi
Sakshi News home page

‘పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగనే రావాలి’

Published Thu, May 9 2024 4:15 AM

‘పథకాలు అమలు కావాలంటే మళ్లీ జగనే రావాలి’

కాశీబుగ్గ:

శిష్టకరణాలతో పాటు పేదలందరికీ అన్ని పథకాలు అందాలంటే మళ్లీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే రావాలని శిష్టకరణ నాయకులు కోరారు. వారు బుధవారం పలాసలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శిష్టకరణ కుల పెద్దలను కలిశారు. నాయకులు పోలుమహంతి ఉమామహేశ్వరరావు, సదాశివుని కృష్ణ, డబ్బీరు భవానిశంకర్‌లు పలాస అభ్యర్థి సీదిరి అప్పలరాజు సతీమణి సీదిరి శ్రీదేవితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌, ఎమ్మెల్యే అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అంపలాం వసంతకుమార్‌, జీఆర్‌జీ నాయుడు, కో ఆప్షన్‌ సభ్యులు సురేంధ్రనారాయణ త్యాడి పాల్గొన్నారు.

Advertisement
Advertisement