మావోయిస్టులకు సహకరించొద్దు | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు సహకరించొద్దు

Published Tue, Apr 23 2024 8:40 AM

మాట్లాడుతున్న సీఐ వెంకటరమణ,ఎస్‌ఐ లోకేష్‌కుమార్‌  - Sakshi

కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, కన్నవరం, పోకలపాలెం, గోదుమలంక, బాలరేవుల గ్రామాల్లో సీఐ వెంకటరమణ, మంప ఎస్‌ఐ లోకేష్‌ కుమార్‌ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు జరగకుండా చేసేందుకు మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికైనా పాల్పడే అవకాశం ఉందన్నారు. మావోయిస్టులకు ఎవరు సహకరించొద్దన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు. గంజాయి రవాణా, సాగు, సారా తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. యువత ఉన్నత విద్యపై దృష్టి సారించాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. యువత ఉపాధి కోసం ప్రభుత్వం స్కిల్‌ డవలప్‌మెంట్‌ ద్వారా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement