వైభవంగా తిరువీధి | Sakshi
Sakshi News home page

వైభవంగా తిరువీధి

Published Tue, Apr 23 2024 8:40 AM

కోలాటం ఆడుతున్న మహిళలు 
 - Sakshi

సింహాచలం: సింహగిరిపై వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగోరోజు సోమవారం స్వామివారికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి విశేషంగా జరిగింది. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామితో పాటు శ్రీదేవి, భూదేవిలను అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిష్టంపజేసి సాయంత్రం సింహగిరి మాడ వీధుల్లో తిరువీధిని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామిని సూర్యప్రభ వాహనంపై తిలకించి పులకించిపోయారు. అర్చకులు రాజీవ్‌, శ్రావణ్‌ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుంచి పూర్ణాహుతి, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం , రాత్రికి మృగయోత్సవం(దొంగలదోపు ఉత్సవం) నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement