మారిన వేళల్లో స్పెషల్‌ రైళ్లు | Sakshi
Sakshi News home page

మారిన వేళల్లో స్పెషల్‌ రైళ్లు

Published Tue, Apr 23 2024 8:40 AM

-

తాటిచెట్లపాలెం : ఇటీవల ప్రయాణికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన విశాఖపట్నం – బెంగళూరు – విశాఖపట్నం మధ్య సమ్మర్‌ స్పెషల్‌ రైళ్ల వేళలు మారాయని, ప్రయాణికులు మార్పులు గమనించాలని వాల్తేర్‌ డివిజన్‌, సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం – ఎస్‌ఎంవీ బెంగళూరు (08549) ప్రతీ శనివారం విశాఖపట్నంలో మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 29 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఎస్‌ఎంవీ బెంగళూరు – విశాఖపట్నం (08550) ప్రతీ ఆదివారం ఉదయం 8.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు జూన్‌ 30 వరకు నడుస్తుంది. ఈ రైళ్లు ఇరు మార్గాల్లో దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడ్‌, జోలార్‌పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతాయి.

Advertisement
Advertisement