భారత్‌లో యాపిల్‌ జోరు | Sakshi
Sakshi News home page

భారత్‌లో యాపిల్‌ జోరు

Published Sat, May 4 2024 6:30 AM

Apple logs strong double-digit growth in India

మార్చిలో రెండంకెల వృద్ధి నమోదు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ భారత్‌ మార్కెట్లో జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 90.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించింది. 

గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 4% తగ్గినప్పటికీ భారత్‌లో మాత్రం బలమైన రెండంకెల వృద్ధితో సరికొత్త రికార్డు నమోదు చేయడం విశేషం.  అంతర్జాతీయంగా మార్చి త్రైమాసికంలో ఐఫోన్ల విక్రయాలు 10.4 % క్షీణించి 45.9 బిలియన్‌ డాలర్లకు వచ్చి చేరాయి.  

Advertisement
Advertisement